అన్వేషించండి

AP Capital: మూడు రాజధానుల అంశం సరికాదు : కేంద్రమంత్రి అథవాలే

ఏపీలో ఒక్క రాజధాని కూడా అభివృద్ధి కాలేదని కేంద్ర మంత్రి అథవాలే అన్నారు. మూడు రాజధానుల అంశం సరికాదని భావించారు. నిధులు లేకే అమరావతి అభివృద్ధి జరగలేదన్నారు.

ఆంధ్రప్రదేశ్ మూడు రాజధానులపై కేంద్రమంత్రి రాందాస్ అథవాలే(Ramdas Athawale) కీలక వ్యాఖ్యలు చేశారు. మూడు రాజధానులు(Three Capitals) సరికాదని భావిస్తున్నామన్నారు. ప్రస్తుతం ఏపీలో ఒక్క రాజధాని కూడా అభివృద్ధి కాలేదన్నారు. మూడు రాజధానులు పెడితే ఎక్కడకు రావాలన్నారు. అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయడం మంచిదే కానీ.. దేనికైనా నిధులు ముఖ్యమన్నారు. విభజన సమయంలోనే రాజధానికి నిధులు ఇవ్వాల్సిందని అథవాలే అన్నారు. నిధులు లేకే అమరావతి(Amaravati) అభివృద్ధి జరగలేదన్నారు. మూడు రాజధానుల కంటే అమరావతిని అభివృద్ధి చేయడమే మేలన్నారు. విజయవాడ పర్యటనకు వచ్చిన ఆయన రాష్ట్ర విభజన సమయంలోనే ఏపీ రాజధాని(AP Capital) అభివృద్ధి కోసం నిధులు కేటాయించాల్సిందన్నారు. యూపీఏ ప్రభుత్వం(UPA Government) ఈ అంశాలను విస్మరించిందన్నారు. ప్రధాని మోదీ(PM Modi) నాయకత్వంలోని కేంద్రం నిధులు ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తోందన్నారు. 

సీఎం జగన్ పాలన గుడ్

కేంద్ర మంత్రి రాందాస్ అథవాలే వైసీపీ, బీజేపీతో పొత్తుపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీ అభివృద్ధి కోసం బీజేపీతో చేతులు కలపాలని సీఎం కేసీఆర్ ను మరోసారి సూచించారు. ఏపీకి ప్రత్యేక హోదా(AP Special Category Status) కోసం సీఎం జగన్ ప్రధాని మోదీని కలిసి వివరించాలని కేంద్ర మంత్రి అథవాలే సూచించారు. కేంద్రం తీసుకోస్తున్న బిల్లులకు వైసీపీ పార్లమెంట్‌లో మద్దతు ఇస్తోందన్నారు. సీఎం జగన్‌ పరిపాలన బాగానే చేస్తున్నారన్న ఆయన... ఏపీకి కేంద్ర ప్రభుత్వం నుంచి ఆర్థిక సాయం కోసం తాను ప్రయత్నిస్తానన్నారు. వైఎస్‌ జగన్‌కు ఏపీని పాలించే అవకాశం రావటం టీడీపీ అధినేత చంద్రబాబుకు పెద్ద ఎదురుదెబ్బగా అథవాలే అభిప్రాయపడ్డారు. కర్ణాటకలో వివాదాస్పదమైన హిజాబ్‌(Hijab Issue) అంశంపై స్పందించిన అథవాలే హిజాబ్‌ అంశం కర్ణాటక ప్రభుత్వ నిర్ణయమన్నారు. విద్యాసంస్థల్లోకి మతం వెళ్లకూడదన్నదన్నారు. పాఠశాలల్లో బాలికలు హిజాబ్ ధరించాల్సిన అవసరం లేదన్నారు. 

గతంలోనూ వైసీపీ-బీజేపీ దోస్తీపై కామెంట్స్ 

సీఎం జగన్‌ తనకు మంచి మిత్రుడని ఆయన ఎన్డీఏలో చేరాలని గతంలో ఒకసారి రాందాస్ అథవాలే అన్నారు.  ఎన్డీఏలో చేరితే హైవేలు, నీటిపారుదల ప్రాజెక్టుల్లో మేలు జరుగుతుందని అభిప్రాయపడ్డారు. మరో 15 ఏళ్ల వరకు కాంగ్రెస్‌ పార్టీ(Congress Party) పుంజుకునే అవకాశం లేదని అథవాలే జోస్యం చెప్పారు. వైఎస్ఆర్సీపీ(Ysrcp) కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామ్యం అయితే ఆంధ్రప్రదేశ్ మరింత అభివృద్ధి చెందుతుందన్నారు. కేంద్రంలో భాగస్వామ్యం అయితే  ఏపీ అభివృద్ధి త్వరగా జరుగుతుందన్నారు. జాతీయ రహదారులు, టూరిజం ప్రాజెక్ట్ లు పూర్తి చేసుకునే అవకాశం ఉంటుందన్నారు. 

Also Read: ఉదయం "హోదా" సాయంత్రానికి తొలగింపు - విభజన సమస్యల చర్చల ఎజెండా మార్చేసిన కేంద్ర హోంశాఖ !

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Ind vs Nz 3rd odi highlights: కోహ్లీ సెంచరీ చేసినా దక్కని విజయం.. వన్డే చరిత్రలో భారత్‌లో తొలి సిరీస్ నెగ్గిన న్యూజిలాండ్
కోహ్లీ సెంచరీ చేసినా దక్కని విజయం.. వన్డే చరిత్రలో భారత్‌లో తొలి సిరీస్ నెగ్గిన న్యూజిలాండ్
Bhatti Vikramarka: కట్టు కథలకు భయపడను, సంపాదన కోసం రాజకీయాల్లోకి రాలేదు: బొగ్గు ఆరోపణలపై భట్టి విక్రమార్క
కట్టు కథలకు భయపడను, సంపాదన కోసం రాజకీయాల్లోకి రాలేదు: బొగ్గు ఆరోపణలపై భట్టి విక్రమార్క
AR Rahman: భారతీయుడిగా ఉండటం గర్వకారణం... కాంట్రవర్సీకి చెక్ పెడుతూ క్లారిటీ ఇచ్చిన ఏఆర్ రెహమాన్
భారతీయుడిగా ఉండటం గర్వకారణం... కాంట్రవర్సీకి చెక్ పెడుతూ క్లారిటీ ఇచ్చిన ఏఆర్ రెహమాన్
Medaram Jatara 2026 : మేడారం జాతర నిర్వహణలో స్త్రీ శక్తి! ఉత్సవ కమిటీ పగ్గాలు మహిళలకే!
మేడారం జాతర నిర్వహణలో స్త్రీ శక్తి! ఉత్సవ కమిటీ పగ్గాలు మహిళలకే!

వీడియోలు

Medaram Jatara Kumkum Bharani Speciality | కుంకుమ భరిణెలను ఎందుకు కొలుస్తారు?
Bamboo Sticks are Idols in Medaram Jatara | వెదురు కర్రలే ఉత్సవ మూర్తులుగా ఎందుకు ?
Vaibhav Suryavanshi broke Virat Record | కోహ్లీ రికార్డ్ బ్రేక్ చేసిన వైభవ్
India vs Bangladesh Under-19 World Cup | బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన టీమిండియా
Nara Lokesh Tribute to NTR on Death Anniversary | ఎన్టీఆర్ కు నివాళి అర్పించిన లోకేష్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Ind vs Nz 3rd odi highlights: కోహ్లీ సెంచరీ చేసినా దక్కని విజయం.. వన్డే చరిత్రలో భారత్‌లో తొలి సిరీస్ నెగ్గిన న్యూజిలాండ్
కోహ్లీ సెంచరీ చేసినా దక్కని విజయం.. వన్డే చరిత్రలో భారత్‌లో తొలి సిరీస్ నెగ్గిన న్యూజిలాండ్
Bhatti Vikramarka: కట్టు కథలకు భయపడను, సంపాదన కోసం రాజకీయాల్లోకి రాలేదు: బొగ్గు ఆరోపణలపై భట్టి విక్రమార్క
కట్టు కథలకు భయపడను, సంపాదన కోసం రాజకీయాల్లోకి రాలేదు: బొగ్గు ఆరోపణలపై భట్టి విక్రమార్క
AR Rahman: భారతీయుడిగా ఉండటం గర్వకారణం... కాంట్రవర్సీకి చెక్ పెడుతూ క్లారిటీ ఇచ్చిన ఏఆర్ రెహమాన్
భారతీయుడిగా ఉండటం గర్వకారణం... కాంట్రవర్సీకి చెక్ పెడుతూ క్లారిటీ ఇచ్చిన ఏఆర్ రెహమాన్
Medaram Jatara 2026 : మేడారం జాతర నిర్వహణలో స్త్రీ శక్తి! ఉత్సవ కమిటీ పగ్గాలు మహిళలకే!
మేడారం జాతర నిర్వహణలో స్త్రీ శక్తి! ఉత్సవ కమిటీ పగ్గాలు మహిళలకే!
Virat Kohli Century: మూడో వన్డేలో విరాట్ కోహ్లీ సెంచరీ.. 54వ శతకంతో ఈ ఫీట్ సాధించిన తొలి బ్యాటర్‌గా రికార్డ్
మూడో వన్డేలో విరాట్ కోహ్లీ సెంచరీ.. 54వ శతకంతో ఈ ఫీట్ సాధించిన తొలి బ్యాటర్‌గా రికార్డ్
Harish Rao: రేవంత్ రెడ్డి దాడులను ప్రోత్సహిస్తుంటే డీజీపీ ఎందుకు మౌనం వహించారు: హరీష్ రావు ప్రశ్నలు
రేవంత్ రెడ్డి దాడులను ప్రోత్సహిస్తుంటే డీజీపీ ఎందుకు మౌనం వహించారు: హరీష్ రావు ప్రశ్నలు
NTR Vardhanti: ఎన్టీఆర్ 30వ వర్థంతి.. ఎన్టీఆర్ ఘాట్ వద్ద మంత్రి లోకేష్, కల్యాణ్ రామ్ నివాళులు
ఎన్టీఆర్ 30వ వర్థంతి.. ఎన్టీఆర్ ఘాట్ వద్ద మంత్రి లోకేష్, కల్యాణ్ రామ్ నివాళులు
Hyderabad Crime News: హైదరాబాద్‌లో సైబర్ మోసం.. 5 వేలు లాభం చూపించి, ఐటీ ఉద్యోగికి రూ. 2.9 కోట్లు ఎగనామం
హైదరాబాద్‌లో సైబర్ మోసం.. 5 వేలు లాభం చూపించి, ఐటీ ఉద్యోగికి రూ. 2.9 కోట్లు ఎగనామం
Embed widget