అన్వేషించండి

TDP Vs Ysrcp : గుంటూరు ఘటనపై సోషల్ మీడియాలో తొక్కిసలాట, వైసీపీ వర్సెస్ టీడీపీ ట్వీట్ల వార్

TDP Vs Ysrcp : గుంటూరు తొక్కిసలాటపై సోషల్ మీడియా వేదికగా టీడీపీ, వైసీపీ నేతలు పరస్పర విమర్శలు చేసుకుంటున్నారు. చంద్రబాబు సభలకు అనుమతి ఇవ్వకూడదని మంత్రులు డిమాండ్ చేస్తున్నారు.

TDP Vs Ysrcp : గుంటూరు తొక్కిసలాటపై టీడీపీ, వైసీపీ మధ్య సోషల్ మీడియాలో వార్ జరుగుతోంది. ఈ ఘటనపై మీరే బాధ్యులంటూ ఒకరిపై ఒకరు దుమ్మెత్తిపోసుకున్నారు. గుంటూరు ఘనటపై చంద్రబాబుపై వైసీపీ మంత్రులు మండిపడ్డారు. ఇకపై చంద్రబాబు సభలకు అనుమతి ఇవ్వకూడదన్నారు. పనిలో పనిగా పవన్ కల్యాణ్ పై కూడా విమర్శలు చేశారు. తొక్కిసలాటలో చనిపోయిన వారి కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని మంత్రుల హామీ ఇచ్చారు. ఇప్పటం అభివృద్ధిలో భాగంగా గోడ కూల్చితే కారెక్కి వచ్చిన పవన్ కల్యాణ్ తొక్కిసలాటలో జనం చనిపోతే పత్తా లేకుండా పోయారని మంత్రి గుడివాడ అమర్నాథ్ ట్విట్టర్లో పంచ్ పేల్చారు. చంద్రబాబు సభలో కందుకూరులో 8 మంది, గుంటూరులో ముగ్గురు చనిపోతే ఎక్కడ దాక్కున్నావ్ అంటూ కౌంటర్ వేశారు. మాజీ మంత్రి, గుడివాడ ఎమ్మెల్యే కొడాలని నాని తనదైన స్టైల్లో ట్వీట్ చేశారు. రాష్ట్రంలో రాజకీయ రావణుడెవారో ప్రజలకు తెలుసన్నారు. వెన్నుపోటు ఎవరి మార్క్ రాజకీయం? శవాల ముందు పొత్తుల చర్చలు ఎవరి మార్క్ రాజకీయం? ప్రచారం కోసం పుష్కరాల్లో, పదవి కోసం సభల్లో జనాలను తొక్కించి చంపడం ఎవరి మార్క్ రాజకీయం అంటూ ట్వీట్టర్ వేదికగా ప్రశ్నల వర్షం కురిపించారు కొడాలి నాని. 

చంద్రబాబు రక్త చరిత్రకు సాక్షాలు 

అధికార దాహంతో ప్రాణాలు తీయడం చంద్రబాబుకు మొదటి నుంచి అలవాటని మాజీ మంత్రి, ఎమ్మెల్యే మేకతోటి సుచరిత ట్విట్టర్లో ఫైరయ్యారు.  నాడు ఎన్టీఆర్ నుంచి నేడు గుంటూరు సభలో మహిళల దాకా చంద్రబాబు రక్త చరిత్రకు సాక్షాలుగా నిలిచారన్నారు. పదవి కోసం సొంత మామకే వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు, ఓట్లు వేయకపోతే ప్రజలనే బెదిరించిన వ్యక్తి, అధికారం కోసం ఎంతకైనా దిగజారతారని  చంద్రబాబుపై  ఎమ్మెల్యేలు పాముల పుష్ప శ్రీవాణి, బాలినేని శ్రీనివాస రెడ్డి ట్వీట్ చేశారు. జరిగిన తప్పుకు పశ్చాత్తాప పడకుండా ఆ తప్పులను వైఎస్ఆర్సీపీపై నెట్టేందుకు ప్రయత్నించడం సిగ్గుచేటని మండిపడ్డారు. 

చంద్రబాబు అరెస్టు చేయాలి- జోగి రమేష్ 

మొన్న కందుకూరులో 8 మందిని... నిన్న గుంటూరులో ముగ్గురి మృతికి కారణమైన చంద్రబాబును వెంటనే అరెస్ట్ చేయాలని మంత్రి జోగి రమేష్ డీజీపీకి ట్విట్టర్లో విజ్ఞప్తి చేశారు. 11 మందిని పొట్టన పెట్టుకున్న చంద్రబాబు సభలకు పర్మిషన్ ఇవ్వొద్దని కోరారు. అధికారదాహంతో చంద్రబాబు పేదప్రజలను చంపుతున్నారని మంత్రి ట్వీట్ చేశారు. పసుపు కుంకుమ అని.. చీరలు, కానుకలని మహిళలను వంచించి వారి ప్రాణాలను తీసిన వ్యక్తి చంద్రబాబు అంటూ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఘాటుగా స్పందించారు.  చంద్రబాబు పాపాల చిట్టాలో ఇంకెన్ని బాకీ ఉన్నాయో? వాటిని లెక్క కట్టి తగిన శిక్ష వేసేది మాత్రం వైసీపీనే అని ట్వీట్ చేశారు. జగన్ మోహన్ రెడ్డి రాజకీయం అంటే ధైర్యంగా ప్రజా క్షేత్రంలో పోరాడటమని.. చంద్రబాబు రాజకీయం అంటే వెన్నుపోట్లు, ఓటుకు నోట్లు, పొత్తులు, హత్యారాజకీయాలని ఎమ్మెల్యె చింతల రామచంద్రారెడ్డి ట్విట్టర్లో కౌంటర్ వేశారు. 

టీడీపీ కౌంటర్ 

అయితే మంత్రుల ట్వీట్లపై టీడీపీ నేతలు కూడా కౌంటర్ ఇస్తున్నారు.  తెలుగుదేశం పార్టీ మాత్రం వరుసగా జరుగుతున్న తొక్కిసలాట ఘటన వెనుక కుట్ర కోణం ఉందని సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తోంది. ఈ అంశంపై తెలుగుదేశం పార్టీ నేతలు ప్రభుత్వం తీరుపైనే విమర్శలు చేస్తున్నారు. గుంటూరు దుర్ఘటన జరిగిన 5 నిమిషాల్లో మంత్రులు అంతా కట్టగట్టుకొని మాట్లాడడం, సిద్ధంగా కూర్చొని ఉన్నట్లు సోషల్ మీడియాలో పోస్ట్ లు చేస్తూ ట్రెండ్ చేయడం చూస్తుంటే కచ్చితంగా పక్కా ఫ్లాన్ ప్రకారం అని అర్థమవుతుందని టీడీపీ నేతలు విమర్శిస్తున్నారు. 

 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Ind vs SA 5th T20 Highlights : తిలక్, హార్దిక్ తుపాను, వరుణ్ చక్రవర్తి వ్యూహంలో సౌతాఫ్రికా విలవిల- అహ్మదాబాద్‌లో భారత్ విజయం!
తిలక్, హార్దిక్ తుపాను, వరుణ్ చక్రవర్తి వ్యూహంలో సౌతాఫ్రికా విలవిల- అహ్మదాబాద్‌లో భారత్ విజయం!
Minister Komatireddy Rajagopal Reddy: మంత్రిని కాబోతున్నా - డిక్లేర్ చేసిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
మంత్రిని కాబోతున్నా - డిక్లేర్ చేసిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
Phone tapping case is SIT: ఫోన్ ట్యాపింగ్ కేసులో సజ్జనార్ నేతృత్వంలో సిట్ - ఇప్పటి వరకూ ఏం తేల్చలేకపోయారా?
ఫోన్ ట్యాపింగ్ కేసులో సజ్జనార్ నేతృత్వంలో సిట్ - ఇప్పటి వరకూ ఏం తేల్చలేకపోయారా?
Andhra intermediate exams: ఏపీలో ఇంటర్ పరీక్షల షెడ్యూల్‌లో మార్పుచేర్పులు - కొత్త షెడ్యూల్ ఫుల్ డీటైల్స్ ఇక్కడ
ఏపీలో ఇంటర్ పరీక్షల షెడ్యూల్‌లో మార్పుచేర్పులు - కొత్త షెడ్యూల్ ఫుల్ డీటైల్స్ ఇక్కడ

వీడియోలు

Atha Kodalu In Sarpanch Elections Heerapur | హోరాహోరీ పోరులో కోడలిపై గెలిచిన అత్త | ABP Desam
టీమిండియా, సౌతాఫ్రికా మధ్య నేడు ఆఖరి పోరు
సంజూ.. చుక్కలు చూపించాల!
కోహ్లీ రికార్డ్‌ బద్దలు కొట్టడానికి అడుగు దూరంలో అభిషేక్ శర్మ
టీమిండియా కోచ్ గౌతం గంభీర్‌పై షాకింగ్ కామెంట్స్ చేసిన కపిల్ దేవ్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Ind vs SA 5th T20 Highlights : తిలక్, హార్దిక్ తుపాను, వరుణ్ చక్రవర్తి వ్యూహంలో సౌతాఫ్రికా విలవిల- అహ్మదాబాద్‌లో భారత్ విజయం!
తిలక్, హార్దిక్ తుపాను, వరుణ్ చక్రవర్తి వ్యూహంలో సౌతాఫ్రికా విలవిల- అహ్మదాబాద్‌లో భారత్ విజయం!
Minister Komatireddy Rajagopal Reddy: మంత్రిని కాబోతున్నా - డిక్లేర్ చేసిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
మంత్రిని కాబోతున్నా - డిక్లేర్ చేసిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
Phone tapping case is SIT: ఫోన్ ట్యాపింగ్ కేసులో సజ్జనార్ నేతృత్వంలో సిట్ - ఇప్పటి వరకూ ఏం తేల్చలేకపోయారా?
ఫోన్ ట్యాపింగ్ కేసులో సజ్జనార్ నేతృత్వంలో సిట్ - ఇప్పటి వరకూ ఏం తేల్చలేకపోయారా?
Andhra intermediate exams: ఏపీలో ఇంటర్ పరీక్షల షెడ్యూల్‌లో మార్పుచేర్పులు - కొత్త షెడ్యూల్ ఫుల్ డీటైల్స్ ఇక్కడ
ఏపీలో ఇంటర్ పరీక్షల షెడ్యూల్‌లో మార్పుచేర్పులు - కొత్త షెడ్యూల్ ఫుల్ డీటైల్స్ ఇక్కడ
Pawan Kalyan: జనసేన ఎమ్మెల్యేలతో పవన్ కల్యాణ్ వన్ టు వన్ భేటీ - పనితీరుపై సమీక్ష - గట్టి వార్నింగ్ ఇస్తున్నారా?
జనసేన ఎమ్మెల్యేలతో పవన్ కల్యాణ్ వన్ టు వన్ భేటీ - పనితీరుపై సమీక్ష - గట్టి వార్నింగ్ ఇస్తున్నారా?
Delhi Crime: కుటుంబ గొడవల్లో కాల్పులు - ఒక్క బాడీలోకి 69 బుల్లెట్లు దింపేశారు - ఇంత కర్కశత్వమా?
కుటుంబ గొడవల్లో కాల్పులు - ఒక్క బాడీలోకి 69 బుల్లెట్లు దింపేశారు - ఇంత కర్కశత్వమా?
యువరాజ్ సింగ్,సోనూ సూద్ సహా పలువురి సెలబ్రిటీలకు షాక్, ఆస్తులు జప్తు చేసిన ఈడీ
యువరాజ్ సింగ్,సోనూ సూద్ సహా పలువురి సెలబ్రిటీలకు షాక్, ఆస్తులు జప్తు చేసిన ఈడీ
Bhartha Mahasayulaku Wignyapthi Teaser : 'భర్త మహాశయులకు విజ్ఞప్తి' టీజర్ వచ్చేసింది - మాస్ మహారాజ రవితేజ ఏం చేశారంటే?
'భర్త మహాశయులకు విజ్ఞప్తి' టీజర్ వచ్చేసింది - మాస్ మహారాజ రవితేజ ఏం చేశారంటే?
Embed widget