అన్వేషించండి

Guntur Shankar Vilas Bridge: గుంటూరు శంకర్ విలాస్ ఫ్లైఓవర్ కూల్చివేత - కొత్త ROB పనులు స్టార్ట్ - ట్రాఫిక్ ఇక్కట్లు కూడా !

Shankar Vilas Flyover:గుంటూరు శంకర్ విలాస్ ఫ్లైఓవర్ కూల్చివేత పనులు ప్రారంభించారు. ఆ వంతెనకు 70 ఏళ్ల చరిత్ర ఉంది.

Guntur Shankar Vilas Flyover demolition work begins:  గుంటూరు నగరంలోని 70 ఏళ్ల పురాతన శంకర్ విలాస్ ఫ్లైఓవర్ కూల్చివేత పనులు   ప్రారంభమయ్యాయి. 1958లో నిర్మించిన ఈ ఫ్లైఓవర్, గుంటూరు వెస్ట్,  గుంటూరు ఈస్ట్ శాసనసభ నియోజకవర్గాలను అనుసంధానించే కీలకమైన రైల్వే ఓవర్ బ్రిడ్జ్  . నగర విస్తరణ , పెరిగిన ట్రాఫిక్ ఒత్తిడి కారణంగా, ఈ పాత రెండు-లేన్ల బ్రిడ్జ్‌ను కూల్చివేసి, రూ. 98 కోట్లతో నాలుగు-లేన్ల కొత్త ROB నిర్మించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సన్నద్ధమయ్యాయి. ఈ ప్రాజెక్టు గత 20 ఏళ్లుగా స్థానికుల డిమాండ్‌గా ఉంది.  గుంటూరు ఎంపీ ,  కేంద్ర గ్రామీణాభివృద్ధి, సమాచార శాఖ సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ ఈ నిధులను రాబట్టడంలో కీలక పాత్ర పోషించారు.  

1958 ఆగస్టు 8న అప్పటి ముఖ్యమంత్రి నీలం సంజీవరెడ్డి ఈ ఫ్లైఓవర్‌కు శంకుస్థాపన చేశారు. ఇది గత 65 ఏళ్లకు పైగా సేవలు అందించింది. ఈ వంతెన  డిజైన్ లైఫ్‌టైమ్ 50 ఏళ్లు మాత్రమే.   రోజుకు 90,000 వాహనాలు ఈ బ్రిడ్జ్‌పై ప్రయాణిస్తాయని అంచనా. బ్రిడ్జ్ వయసు,  పెరిగిన ట్రాఫిక్ ఒత్తిడి కారణంగా నిర్మాణం బలహీనపడింది, ట్రాఫిక్ జామ్‌లు సర్వసాధారణమయ్యాయి. కేంద్ర ప్రభుత్వం రూ. 98 కోట్ల నిధులు మంజూరు చేసింది. మొదట ఆరు-లేన్ల ROB నిర్మించాలని ప్లాన్ చేశారు  కానీ ఆస్తుల నష్టాన్ని తగ్గించేందుకు నాలుగు-లేన్ల ROBగా డిజైన్ ఖరారు చేశారు. ఫ్లైఓవర్ ఎత్తు 8 మీటర్ల నుండి 11.5 మీటర్లకు పెంచారు.  పొడవు 1.5 కి.మీ నుండి 930 మీటర్లకు కుదించారు. డిజైన్‌లు ఏప్రిల్ 2025లో ఖరారయ్యాయి. ప్రాజెక్టు పూర్తికి 12-16 నెలలు   పట్టవచ్చని భావిస్తున్నారు.  మొదట ROB నిర్మాణం పూర్తి చేసి, తర్వాత రైల్వే అండర్ బ్రిడ్జ్ (RUB) నిర్మిస్తారు. 

కేంద్ర ప్రభుత్వం రూ. 98 కోట్లను సెంట్రల్ రోడ్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ కింద మంజూరు చేసింది, ఇది ఆంధ్రప్రదేశ్‌లో 13 రోడ్ ప్రాజెక్టుల కోసం మొత్తం రూ. 400 కోట్లలో భాగం.  ఫ్లైఓవర్ విస్తరణ కోసం 134 ఆస్తుల్లో కొంత భాగం సేకరించారు.  ఆస్తి యజమానులకు నష్టపరిహారంగా నాలుగు రెట్లు విలువైన ట్రాన్స్‌ఫరబుల్ డెవలప్‌మెంట్ రైట్స్ (TDR) బాండ్లు ఇస్తున్నారు. చాలా మంది యజమానులు సహకరించగా, కొందరు న్యాయస్థానాలను ఆశ్రయించారు. ఫ్లైఓవర్ కూల్చివేత కారణంగా గుంటూరు నగరంలో సమస్యలు తలెత్తకుండా ప్రత్యామ్నాయ మార్గాలను ట్రాఫిక్ పోలీసులు సూచించారు. 

గతంలో మూడు వంతెనల అండర్‌పాస్ విస్తరణ సమయంలో మూడు నెలల పాటు ట్రాఫిక్ సమస్యలు ఎదురయ్యాయి. వేగంగా బ్రిడ్జి నిర్మాణం పూర్తి చేయాలని కోరుతున్నారు. 70 ఏళ్లుగా గుంటూరు నగరంలో ఒక ఐకానిక్ నిర్మాణంగా ఉన్న శంకర్ విలాస్ ఫ్లైఓవర్ కూల్చివేతతో, స్థానికులు తమ జ్ఞాపకాలను నెమరువేసుకుంటున్నారు. ఈ బ్రిడ్జ్ నగర చరిత్రలో ఒక ముఖ్యమైన భాగంగా నిలిచింది.        

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

CM Chandrababu: ఒక సామాన్యుడికి సీఎం చంద్రబాబు భరోసా.. చర్మకారుడి కుటుంబంలో సరికొత్త వెలుగులు
ఒక సామాన్యుడికి సీఎం చంద్రబాబు భరోసా.. చర్మకారుడి కుటుంబంలో సరికొత్త వెలుగులు
RTA Challan Link Scam: ఎమ్మెల్యేకే తప్పని సైబర్ షాక్.. చలాన్ పేరుతో లింక్, ఒక్క క్లిక్‌తో ₹12 లక్షలు మాయం
ఎమ్మెల్యేకే తప్పని సైబర్ షాక్.. చలాన్ పేరుతో లింక్, ఒక్క క్లిక్‌తో ₹12 లక్షలు మాయం
AP Ration Shops: ఏపీలో రేషన్ షాపుల్లో మళ్లీ కిరోసిన్ పంపిణీ.. గ్యాస్ కొరతతో ప్రభుత్వం నిర్ణయం
ఏపీలో రేషన్ షాపుల్లో మళ్లీ కిరోసిన్ పంపిణీ.. గ్యాస్ కొరతతో ప్రభుత్వం నిర్ణయం
ArcelorMittal Nippon Steel Plant: రేపే అనకాపల్లి స్టీల్ ప్లాంట్‌కి శంకుస్థాపన.. రూ.1.5 లక్షల కోట్లతో AM/NS ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్
రేపే అనకాపల్లి స్టీల్ ప్లాంట్‌కి శంకుస్థాపన.. 1.5 లక్షల కోట్లతో AM/NS ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్

వీడియోలు

Madhu Park Ridge Issue Updates | బండ్లగూడ కూల్చివేతలు గాంధీ సరోవర్ కోసం కాదు.!
Ashwin Predicts RCB to Win IPL 2026 | ఆర్‌సీబీపై అశ్విన్ ఆసక్తికర విశ్లేషణ
Tilak Varma about Mega Family | మెగాస్టార్ పై తిలక్ వర్మ ఎమోషనల్ కామెంట్స్
Mohammad Kaif Warns Gujarat Titans | గుజరాత్ టైటాన్స్‌కు మహమ్మద్ కైఫ్ వార్నింగ్
Ishan Kishan SRH Practice Match | ఇషాన్ కిషన్‌పై యువ బౌలర్ ఫైర్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Iran US War Updates: శత్రువులపై నిషేధం.. మిత్ర దేశాలపై హర్మూజ్‌లో ఆంక్షలు లేవు: ట్రంప్ హెచ్చరికపై ఇరాన్ అధ్యక్షుడు
శత్రువులపై నిషేధం.. మిత్ర దేశాలపై హర్మూజ్‌లో ఆంక్షలు లేవు: ట్రంప్ హెచ్చరికపై ఇరాన్ అధ్యక్షుడు
CM Chandrababu: ఒక సామాన్యుడికి సీఎం చంద్రబాబు భరోసా.. చర్మకారుడి కుటుంబంలో సరికొత్త వెలుగులు
ఒక సామాన్యుడికి సీఎం చంద్రబాబు భరోసా.. చర్మకారుడి కుటుంబంలో సరికొత్త వెలుగులు
ArcelorMittal Nippon Steel Plant: రేపే అనకాపల్లి స్టీల్ ప్లాంట్‌కి శంకుస్థాపన.. రూ.1.5 లక్షల కోట్లతో AM/NS ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్
రేపే అనకాపల్లి స్టీల్ ప్లాంట్‌కి శంకుస్థాపన.. 1.5 లక్షల కోట్లతో AM/NS ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్
Moinabad Farmhouse Case: మొయినాబాద్ ఫాంహౌస్ కేసులో కీలక పరిణామం.. వీకెండ్ పార్టీలకు 20 సార్లు డ్రగ్స్ సరఫరా!
మొయినాబాద్ ఫాంహౌస్ కేసులో కీలక పరిణామం.. వీకెండ్ పార్టీలకు 20 సార్లు డ్రగ్స్ సరఫరా!
Simhadri Express Train: సింహాద్రి ఎక్స్ ప్రెస్ ప్రయాణికులకు ఊరట.. ట్రైన్ లో మార్పులు చేసిన రైల్వే
సింహాద్రి ఎక్స్ ప్రెస్ ప్రయాణికులకు ఊరట.. ట్రైన్ లో మార్పులు చేసిన రైల్వే
SRH Playing 11: ట్రావిస్ హెడ్- అభిషేక్ శర్మ ఓపెనింగ్.. సన్‌రైజర్స్ ప్లేయింగ్ XI ఇలా ఉండవచ్చు
ట్రావిస్ హెడ్- అభిషేక్ శర్మ ఓపెనింగ్.. SRH ప్లేయింగ్ XI ఇలా ఉండవచ్చు
World Happiness Report : ఇండియాలో జనాలు సంతోషంగా లేరట.. తాజా రిపోర్ట్​లో ఇంట్రెస్టింగ్ విషయాలు, టాప్​లో ఉన్న దేశమిదే
ఇండియాలో జనాలు సంతోషంగా లేరట.. తాజా రిపోర్ట్​లో ఇంట్రెస్టింగ్ విషయాలు, టాప్​లో ఉన్న దేశమిదే
CM Revanth Reddy: సిద్దిపేట జిల్లాలో ఆయిల్ పాం ఫ్యాక్టరీ ప్రారంభం సహా 775 కోట్ల పనులకు సీఎం రేవంత్ రెడ్డి శ్రీకారం
సిద్దిపేట జిల్లాలో ఆయిల్ పాం ఫ్యాక్టరీ ప్రారంభం సహా 775 కోట్ల పనులకు సీఎం రేవంత్ రెడ్డి శ్రీకారం
Embed widget