అన్వేషించండి

Gudivada Amarnadh : విశాఖ సదస్సుకు దిగ్గజాలను ఆహ్వానించాలనే దావోస్ వెళ్లలేదు - ఆహ్వానం అందలేదని దుష్ప్రచారం చేస్తున్నారన్న గుడివాడ అమర్నాథ్ !

దావోస్ పెట్టుబడుల సదస్సుకు ఎందుకు వెళ్లలేదో గుడివాడ అమర్నాథ్ వివరించారు. ఆహ్వానం రాలేదని తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు.

Gudivada Amarnadh :   దావోస్ లో జరిగే వరల్డ్ ఎకనమిక్ ఫోరం సదస్సుకు రాష్ట్ర ప్రభుత్వానికి ఆహ్వానం అందలేదంటూ తెలుగుదేశం పార్టీ నాయకులు చేస్తున్న ప్రచారాన్ని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఖండించారు. విశాఖలో   దావోస్ సదస్సులో పాల్గొనాలంటూ నవంబర్ 25వ తేదీనే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఆహ్వానం అందిందని అందుకు సంబంధించిన లేఖ ప్రతిని మీడియా ముందుంచారు. గత ఏడాది దావోస్ సదస్సుకు హాజరైన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో వైద్య రంగంలో తీసుకువస్తున్న సంస్కరణల గురించి ప్రపంచ దేశాలకు తెలిసేలా చేశారని అమర్నాథ్ చెప్పారు. రాష్ట్రంలో స్కిల్ డెవలప్మెంట్, గ్రీన్ ఎనర్జీ గురించి కూడా వరల్డ్ ఎకానమిక్ ఫోరంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వివరించిన తీరుకు ప్రపంచ దేశాల నుంచి వచ్చిన పలువురు పారిశ్రామికవేత్తలు అభినందించారని ఆయన చెప్పారు.

మార్చిలో విశాఖలో నిర్వహించనున్న గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సదస్సుకు ప్రపంచంలోని పారిశ్రామిక దిగ్గజాలను ఆహ్వానించాలన్న ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి ఉన్నారని, అందుకు తగిన ఏర్పాట్లు చేయాల్సి ఉన్నందునే  దావోస్ సదస్సుకు వెళ్లలేదని మంత్రి అమర్నాథ్ స్పష్టం చేశారు. దావోస్ వెళ్లి తాను చాలా ఘనత సాధించానని చెప్పుకుంటున్న చంద్రబాబు నాయుడును ఆ సదస్సులో మాట్లాడమని నిర్వాహకులు ఎప్పుడైనా ఆహ్వానించారా? అని అమర్నాథ్ ప్రశ్నించారు. మన రాష్ట్రం చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాల గురించి పక్క రాష్ట్రాలు, పక్క దేశాలు కూడా మాట్లాడుకోవాలన్నది ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆలోచన అన్నారు.  మన గురించి మనమే మాట్లాడుకోవాలన్నది చంద్రబాబు నాయుడు ఆలోచన అని విమర్శించారు. దావోస్ సదస్సులో మైక్రోసాఫ్ట్ అధినేతలను కలిశానని, ఆంధ్రప్రదేశ్ కు మైక్రోసాఫ్ట్ కంపెనీ వస్తోందని చంద్రబాబు నాయుడు  ప్రకటించిన మరుక్షణమే తాము ఆంధ్రప్రదేశ్ లో మైక్రోసాఫ్ట్ కంపెనీని ఏర్పాటు చేయడం లేదని ఆ సంస్థ అధినేతలు చెప్పటం ఎంత సిగ్గుచేటని అమర్నాథ్ ప్రశ్నించారు. 

దేశవ్యాప్తంగా ఐటీ రంగంలో సంస్కరణలు తీసుకువచ్చింది రాజీవ్ గాంధీ. హైదరాబాదులో హైటెక్ సిటీకి జనార్దన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు శంకుస్థాపన చేశారు. ఇవన్నీ మర్చిపోయిన చంద్రబాబు నాయుడు తానే హైటెక్ సిటీ నిర్మించానని, కంప్యూటర్ కూడా తానే కనిపెట్టానని చెప్పుకోవడాన్ని చూసి రాష్ట్ర ప్రజలందరూ నవ్వుకుంటున్నారని మంత్రి అమర్నాథ్ ఎద్దేవా చేశారు. చంద్రబాబు నాయుడుకి మ్యాటర్ వీక్.. పబ్లిసిటీ పీక్.. అంటూ అమర్నాథ్ సెటైర్ వేశారు. చంద్రబాబు నాయుడు పరిస్థితి ఇలా ఉంటే.. ఆయన క్యాబినెట్ లో పనిచేసిన మరో మంత్రి.. దావోస్ సదస్సుకు రాష్ట్ర ప్రభుత్వానికి ఆహ్వానం రాలేదని, రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధి జరగడం లేదని చేసిన వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయని అన్నారు. దావోస్ సదస్సు గురించి విజయవాడ దావూద్ ఇబ్రహీం మాట్లాడటం దురదృష్టకరమని ఆయన అన్నారు. అనేక రకాల కేసులతో సంబంధం ఉన్న మాజీ మంత్రి తమ ప్రభుత్వం గురించి మాట్లాడే హక్కు లేదని అమర్నాథ్ అన్నారు.

రాష్ట్రంలో పారిశ్రామిక ప్రగతిపై లోకేష్ శ్వేత పత్రం కోరడం దూరంగా విడ్డూరంగా మంత్రి అమర్నాథ్ అన్నారు. ఐదేళ్లపాటు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు తన హయాంలో ఏడాదికి 11 వేల కోట్ల రూపాయలు పెట్టుబడులు మాత్రమే తీసుకువచ్చారని, కరోనా పరిస్థితులను కూడా తట్టుకొని  జగన్మోహన్ రెడ్డి సంవత్సరానికి 15 వేల కోట్ల రూపాయల పెట్టుబడులు తీసుకువస్తున్నారని ఆయన వివరించారు. జగన్మోహన్ రెడ్డి కార్య దీక్ష, పట్టుదల  చూసి పారిశ్రామికవేత్తలు పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వస్తున్నారని ఆయన చెప్పారు. గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సదస్సుకు ముందే రాష్ట్ర నూతన పారిశ్రామిక విధానాన్ని అందుబాటులోకి తీసుకువస్తామని మంత్రి అమర్నాథ్ చెప్పారు.జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ వారాహి వాహనాన్ని ప్రారంభిస్తున్న విషయమై విలేకరులు మంత్రి అమర్నాథ్ ను ప్రశ్నించగా ఆ వాహనం మీద టీడీపీ, జనసేన ఉమ్మడి ప్రచారాలు ప్రారంభిస్తే మంచిదని సలహా ఇచచారు. 

 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Harish Rao: సజ్జనార్.. ఖాకీ దుస్తులు తీసేసి కాంగ్రెస్ కండువా కప్పుకో - హరీష్ రావు ఆగ్రహం
సజ్జనార్.. ఖాకీ దుస్తులు తీసేసి కాంగ్రెస్ కండువా కప్పుకో - హరీష్ రావు ఆగ్రహం
Chandrababu Sankranti Celebrations: నారావారిపల్లెలో సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్న ఏపీ సీఎం చంద్రబాబు
నారావారిపల్లెలో సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్న ఏపీ సీఎం చంద్రబాబు
Hyderabad CP Sajjanar: మహిళలను అవమానించడం క్రూరత్వమే, దుష్ప్రచారం చేస్తే చర్యలు తప్పవు: సజ్జనార్ వార్నింగ్
మహిళలను అవమానించడం క్రూరత్వమే, దుష్ప్రచారంపై చర్యలు తప్పవు: సజ్జనార్ వార్నింగ్
Telangana: జర్నలిస్టుల అరెస్టుపై భగ్గుమన్న బీఆర్ఎస్ - మొహబ్బత్‌కా దుకాణ్ ఇదేనా అని రాహుల్‌కు కేటీఆర్ ప్రశ్న
జర్నలిస్టుల అరెస్టుపై భగ్గుమన్న బీఆర్ఎస్ - మొహబ్బత్‌కా దుకాణ్ ఇదేనా అని రాహుల్‌కు కేటీఆర్ ప్రశ్న

వీడియోలు

AA 23 Announcement Video Decode | Allu Arjun తో ఏం ప్లాన్ చేశావయ్యా Lokesh Kanagaraj | ABP Desam
Mumbai Indians vs Gujarat Giants WPL 2026 | హర్మన్‌ప్రీత్ కౌర్ విధ్వంసం!
Ind vs NZ Shreyas Iyer Records | రికార్డు సృష్టించనున్న శ్రేయస్ అయ్యర్!
Jitesh Sharma Being Dropped from T20 World Cup | వరల్డ్ కప్ జితేష్ సంచలన వ్యాఖ్యలు!
India vs New Zealand 2nd ODI | టీమిండియాలో భారీ మార్పులు ?

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Harish Rao: సజ్జనార్.. ఖాకీ దుస్తులు తీసేసి కాంగ్రెస్ కండువా కప్పుకో - హరీష్ రావు ఆగ్రహం
సజ్జనార్.. ఖాకీ దుస్తులు తీసేసి కాంగ్రెస్ కండువా కప్పుకో - హరీష్ రావు ఆగ్రహం
Chandrababu Sankranti Celebrations: నారావారిపల్లెలో సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్న ఏపీ సీఎం చంద్రబాబు
నారావారిపల్లెలో సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్న ఏపీ సీఎం చంద్రబాబు
Hyderabad CP Sajjanar: మహిళలను అవమానించడం క్రూరత్వమే, దుష్ప్రచారం చేస్తే చర్యలు తప్పవు: సజ్జనార్ వార్నింగ్
మహిళలను అవమానించడం క్రూరత్వమే, దుష్ప్రచారంపై చర్యలు తప్పవు: సజ్జనార్ వార్నింగ్
Telangana: జర్నలిస్టుల అరెస్టుపై భగ్గుమన్న బీఆర్ఎస్ - మొహబ్బత్‌కా దుకాణ్ ఇదేనా అని రాహుల్‌కు కేటీఆర్ ప్రశ్న
జర్నలిస్టుల అరెస్టుపై భగ్గుమన్న బీఆర్ఎస్ - మొహబ్బత్‌కా దుకాణ్ ఇదేనా అని రాహుల్‌కు కేటీఆర్ ప్రశ్న
Affordable Cars in India: భారత్‌లో అతి చవకైన 5 కార్లు ఇవే.. తక్కువ మెయింటనెన్స్ తో మీకు మరింత ప్రయోజనం
భారత్‌లో అతి చవకైన 5 కార్లు ఇవే.. తక్కువ మెయింటనెన్స్ తో మీకు మరింత ప్రయోజనం
KL Rahul Century: గిల్ హాఫ్ సెంచరీ, శతక్కొట్టిన కేఎల్ రాహుల్.. రాజ్‌కోట్‌లో కివీస్ టార్గెట్ ఎంతంటే
గిల్ హాఫ్ సెంచరీ, శతక్కొట్టిన కేఎల్ రాహుల్.. రాజ్‌కోట్‌లో కివీస్ టార్గెట్ ఎంతంటే
New scam: రీఫండ్ స్కామ్- రూ.5 కోట్లు కొల్లగొట్టిన టీనేజర్ - షాక్‌లో ఈ-కామర్స్ సంస్థలు
రీఫండ్ స్కామ్- రూ.5 కోట్లు కొల్లగొట్టిన టీనేజర్ - షాక్‌లో ఈ-కామర్స్ సంస్థలు
Chennai sanitation worker: జీవితాంతం రోడ్లు ఊడ్చినా రానంత సొమ్ము ఒకే సారి దొరికింది - కానీ ఆ పారిశుద్ధ్య కార్మికురాలు ఏం చేసిందో తెలుసా?
జీవితాంతం రోడ్లు ఊడ్చినా రానంత సొమ్ము ఒకే సారి దొరికింది - కానీ ఆ పారిశుద్ధ్య కార్మికురాలు ఏం చేసిందో తెలుసా?
Embed widget