అన్వేషించండి

Tuni Train Case: తుని రైలు దహనం కేసుపై ప్రభుత్వం యూటర్న్ - అప్పీలుకు వెళ్లకూడదని నిర్ణయం - తెర వెనుక ఏం జరిగింది?

Andhra Pradesh: తుని రైలు దహనం కేసులో ప్రభుత్వం యూటర్న్ తీసుకుంది. తీర్పుపై అప్పీల్‌కు వెళ్లకూడదని నిర్ణయం తీసుకున్నారు. జీవో ఉపసంహరించుకున్నారు.

Tuni train burning case:  తుని రైలు దహనం కేసుపై దిగువ కోర్టు ఇచ్చిన తీర్పును ఎగువ కోర్టులో అప్పీల్ చేసే ఉద్దేశం లేదని ప్రభుత్వం ప్రకటించింది.  తుని కేసు కొట్టేస్తూ రైల్వే కోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై అప్పీల్ కు వెళ్లే ఆలోచన లేదని ... అప్పీల్ చేయాలనే ఉత్తర్వులను తక్షణమే రద్దు చేయాలని ఆదేశించింది. తుని కేసును పై కోర్టులో అప్పీల్ చేయాలని ఆదేశిస్తూ జారీ చేసిన ఉత్తర్వుల గురించి  ప్రభుత్వ పెద్దల దృష్టికి రాగానే అప్పీల్ ఆలోచనలను విరిమించుకోవాలని ఆదేశించారు.  ఏ స్థాయిలో ఆమోదంతో ఫైల్ నడిచింది అనే విషయంలో ప్రభుత్వం ఆరా తీసింది.  

ప్రభుత్వానికి తెలియకుండా ఆర్పీఎఫ్ ప్రతిపాదన ఆధారంగా యాంత్రికంగా ఉత్తర్వులు

రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్  సీనియర్ డివిజినల్ సెక్యూరిటీ కమిషనర్ చేసిన ప్రతిపాదనల ఆధారంగా ఉత్తర్వులు వెలువడినట్లు అధికారులు గుర్తించారు. సున్నితమైన ఇలాంటి అంశాలపై అలసత్వంలో జరిగే చర్యలను ఉపేక్షించేది లేదని అధికారులను హెచ్చరించారు. జీవో రద్దు చేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు.  సాధారణంగా కింది కోర్టు కొట్టి వేసిన కేసులను ఉన్నత న్యాయస్థానంలో వాటి తీవ్ర ఆధారంగా సవాల్ చేస్తారు. దానికి పర్మిషన్ అవసరం. పెండింగ్ లో ఉన్న ఈ విజ్ఞప్తికి తాజాగా అనుమతి ఇవ్వడం రాజకీయ కలకలానికి కారణం అయింది. 

2015లో తుని రైలు దహనం ఘటన         

2014లో  తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే కాపు రిజర్వేషన్ల  ఉద్యమాన్న ముద్రగడ పద్మనాభం నేతృత్వంలో చేపట్టారు.  తునిలో సమావేశం పెట్టారు. సభ జరిగిన తరవాత విధ్వంసం చోటు చేసుకుంది.  ప్రయాణికులతో వెళ్తున్న రైలును ప్లాన్ ప్రకారం తగులబెట్టించారు.  పోలీసులను,  పోలీస్ స్టేషన్ పైనా దాడి చేశారు. వ్యక్తిగత ఆస్తులనూ వదల్లేదు.  భారీ  విధ్వంసం చేయాలో అంతా చేశారు.  ఈ కేసులో ప్రదానంగా  ముద్రగడ పద్మనాభం,  దాడిశెట్టి రాజా,  కామన ప్రభాకరరావు, వంటి వారు ఉన్నారు.      

ఒక్క సాక్షినీ ప్రవేశ పెట్టలేదని కేసు కొట్టేసిన రైల్వే కోర్టు                                 

తుని రైలు దరహనం  కేసులను వైసీపీ ప్రభుత్వం రాగానే ఉపసంహరించుకుంది. రైల్వే పోలీసులు పెట్టిన కేసును   కోర్టు కొట్టి వేసింది.  ఒక్కటంటే ఒక్క సాక్ష్యం కూడా కోర్టు ముందు అధికారులు ప్రవేశ పెట్టలేదు.  ఐదేళ్లు కేసును సాగదీసి ఒక్క సాక్షిని మాత్రమే ప్రవేశ పెట్టారని ఒక్క సాక్ష్యం కూడా చూపించలేదని మండిపడి ముగ్గురు రైల్వే ఉన్నతాధికారులపై చర్యలు తీసుకోవాలని  తీర్పు సందర్భంగా కోర్టు ఆదేశించింది.  41 మందిపై పెట్టిన కేసుల్ని అక్రమ కేసులుగా పరిగణిస్తూ విజయవాడ రైల్వే కోర్టు న్యాయమూర్తి తీర్పు చెప్పారు. ఆ తీర్పుపై అప్పీలుకు వెళ్లాలని సోమవారం ప్రభుత్వం నిర్ణయించుకున్నట్లుగా ఉత్తర్వులు వచ్చాయి. తెల్లవారే సరికి సీన్ మారిపోయింది. తెర వెనుక ఆ కేసులో నిందితులు..ఒత్తిడి తేవడం వల్ల యూటర్న్ తీసుకున్నారన్న అభిప్రాయం వినిపిస్తోంది. 

టాప్ హెడ్ లైన్స్

Breaking News: ఎల్‌నినో ప్రభావాన్ని అంచనా వేసి, తగిన చర్యల సూచనకు కమిటీ ఏర్పాటు
ఎల్‌నినో ప్రభావాన్ని అంచనా వేసి, తగిన చర్యల సూచనకు కమిటీ ఏర్పాటు
Bhogapuram International Airport: భోగాపురం ఎయిర్‌పోర్ట్ ప్రారంభానికి ముహూర్తం ఖరారు.. ప్రధాని మోదీ చేతుల మీదుగానే
భోగాపురం ఎయిర్‌పోర్ట్ ప్రారంభానికి ముహూర్తం ఖరారు.. ప్రధాని మోదీ చేతుల మీదుగానే
Vijayawada Airport ATC Tower: విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయానికి మహర్దశ - అత్యాధునిక ఏటీసీ టవర్ ప్రారంభించిన కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు!
విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయానికి మహర్దశ - అత్యాధునిక ఏటీసీ టవర్ ప్రారంభించిన కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు!
Tragedy in Polavaram: గోదావరిలో చేపల వేటకు వెళ్లి ఐదుగురి మృతి.. వారిలో ముగ్గురు మహిళలు- పోలవరం జిల్లాలో విషాదం
గోదావరిలో చేపల వేటకు వెళ్లి ఐదుగురి మృతి.. వారిలో ముగ్గురు మహిళలు- పోలవరం జిల్లాలో విషాదం

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Bhogapuram International Airport: భోగాపురం ఎయిర్‌పోర్ట్ ప్రారంభానికి ముహూర్తం ఖరారు.. ప్రధాని మోదీ చేతుల మీదుగానే
భోగాపురం ఎయిర్‌పోర్ట్ ప్రారంభానికి ముహూర్తం ఖరారు.. ప్రధాని మోదీ చేతుల మీదుగానే
CM Revanth Reddy: కేసీఆర్‌ను గజ్వేల్‌లోనే సమాధి చేస్తాం, నేనున్నంత వరకూ బీఆర్ఎస్ గెలవదు: సీఎం రేవంత్ రెడ్డి
కేసీఆర్‌ను గజ్వేల్‌లోనే సమాధి చేస్తాం, నేనున్నంత వరకూ బీఆర్ఎస్ గెలవదు: సీఎం రేవంత్ రెడ్డి
CBSE 10వ తరగతి ఫలితాలు విడుదల.. DigiLockerలో మీ స్కోర్‌కార్డ్‌ను చెక్ చేసుకోండి
CBSE 10వ తరగతి ఫలితాలు విడుదల.. DigiLockerలో మీ స్కోర్‌కార్డ్‌ను చెక్ చేసుకోండి
National Film Awards 2026 Winners List: నేషనల్ అవార్డ్స్ విన్నర్స్ ఫుల్ లిస్ట్... ఉత్తమ నటిగా యామి... నటుడిగా ఇద్దరికి అవార్డు... సత్తా చాటిన తెలుగు సినిమాలు కల్కి, పుష్ప 2
నేషనల్ అవార్డ్స్ విన్నర్స్ ఫుల్ లిస్ట్... ఉత్తమ నటిగా యామి... నటుడిగా ఇద్దరికి అవార్డు... సత్తా చాటిన తెలుగు సినిమాలు కల్కి, పుష్ప 2
Naked Woman Found Dead: అర్ధరాత్రి నగ్నంగా యువతి పరుగులు.. తెల్లారేసరికి చెరువులో శవమై తేలింది! పీర్జాదిగూడలో సంచలనం
అర్ధరాత్రి నగ్నంగా యువతి పరుగులు.. తెల్లారేసరికి చెరువులో శవమై తేలింది! పీర్జాదిగూడలో సంచలనం
Srikanth Best Hindi Film: ఉత్తమ హిందీ చిత్రంగా శ్రీకాంత్ బొల్లా బయోపిక్.. తెలుగు తేజం కథకు జాతీయ గౌరవం!
ఉత్తమ హిందీ చిత్రంగా శ్రీకాంత్ బొల్లా బయోపిక్.. తెలుగు తేజం కథకు జాతీయ గౌరవం!
Rohit Sharma News: లార్డ్స్ మైదానంలో చెమ‌టోడ్చిన‌ రోహిత్ .. ఫ్యాన్స్ హంగామా మధ్య గంభీర్ తో సీక్రెట్ మీటింగ్ 
లార్డ్స్ మైదానంలో చెమ‌టోడ్చిన‌ రోహిత్ .. ఫ్యాన్స్ హంగామా మధ్య గంభీర్ తో సీక్రెట్ మీటింగ్ 
Nara Lokesh Meets Pawan Kalyan: పవన్ కళ్యాణ్‌ను ఎంతో అప్యాయంగా పరామర్శించిన నారా లోకేష్.. త్వరగా కోలుకోవాలని ఆకాంక్ష
పవన్ కళ్యాణ్‌ను ఎంతో అప్యాయంగా పరామర్శించిన నారా లోకేష్.. త్వరగా కోలుకోవాలని ఆకాంక్ష
Embed widget