అన్వేషించండి

Mekapati Goutham Reddy : దూకుడైన పార్టీలో సంప్రదాయ నేత ! ఎవర్నీ అనని, అనిపించుకోని లీడర్ గౌతంరెడ్డి !

వైఎస్ఆర్‌సీపీ నేతల్లో భిన్నమైన వ్యక్తిత్వం గౌతం రెడ్డి సొంతం . రాజకీయాల్లో ఆయన మాట తూలడం ఎవరూ చూడలేదు. అలాగే ఆయనను కూడా ఎవరూ అసభ్యంగా విమర్శించలేదు. రాజకీయాలను రాజకీయాల్లాగే చేసిన నేత గౌతంరెడ్డి.

Mekapati Goutham Reddy :   50 ఏళ్లకే తనువు చాలించిన ఏపీ మంత్రి మేకపాటి గౌతం రెడ్డి ( Mekapat Gowtam Reddy ) రాజకీయాల్లో భిన్నమైన వ్యక్తి. ఆయన వ్యక్తిత్వం కూడా భిన్నమైనదే. ఏపీ రాజకీయాల్లో వైఎస్ఆర్‌సీపీ నేతలు, మంత్రులు అంటే ఓ రకమైన ఇమేజ్ ఉంది. ఆ ఇమేజ్ కంటే భిన్నంగా మేకపాటి వ్యవహరిస్తారు. రాజకీయాలను ఆయన రాజకీయంగానే చూస్తారు. ఎవర్నీ శత్రువులుగా చూడరు. ఇతర పార్టీల వారు కూడా గౌతంరెడ్డిని రాజకీయంగా విమర్శిస్తారు కానీ ఎక్కడా శత్రువుగా చూసిన  సందర్బాలు లేవంటే ఆయన ఎంత సాఫ్ట్‌గా రాజకీయాలు చేస్తారో అర్థం చేసుకోవచ్చు. 

ఏపీలో మంత్రులు ఉంటే దూకుడుగా ఉంటారు.. లేకపోతే సైలెంట్‌గా ఉంటారు. దూకుడుగా ఉండే మంత్రులు రాజకీయంగా ప్రత్యర్థులపై విరుచుకుపడుతూ ఉంటారు. ఇతర మంత్రులు అసలు అధికార సమీక్షలు చేస్తున్నట్లుగా కూడా ఉండరు. కానీ గౌతంరెడ్డి మాత్రం రాజకీయంగా నోటికి పని చెప్పరు కానీ మంత్రిగా మాత్రం తన బాధ్యతల విషయంలో వంద శాతం ఎఫర్ట్ పెడతారు. మంత్రిగా పని తీరు కూడా ఆయన ఇతరుల కంటే భిన్నం. పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రిగా ఆయనపై చాలా పెద్ద బాధ్యతలు ఉన్నాయి. పారిశ్రామికంగా వెనుకబడిన రాష్ట్రాన్ని ఆయన తన పనితీరుతో ముందుకు తీసుకెళ్లాలని అనుకున్నారు. తన పరిధిలో వీలైనంత ప్రయత్నం చేసేవారు. ప్రభుత్వ విధానాల ప్రకారం ఆయన ముందుకెళ్లారు. ఎన్ని పెట్టుబడులు సాధించారు.. ఎన్ని ఉద్యోగవకాశాలు తెచ్చారు అన్న లెక్కలు పెడితే ఆయన తన ప్రయత్నాలు అయితే సీరియస్‌గా చేశారని చెప్పుకోవచ్చు. 

పరిశ్రమలు, ఐటీ కంపెనీల కోసం ఆయన తరచూ విదేశీ పర్యటనలు చేస్తూంటారు. తన శాఖపై పూర్తిగా దృష్టి పెట్టి  సమీక్షలు చేసి అతి కొద్ది మంత్రుల్లో గౌతం రెడ్డి ( Goutam Reddy ) ఒకరని సచివాలయంలో చెప్పుకుంటూ ఉంటారు. తన శాఖకు సంబంధించి ప్రతీ విషయాన్ని దగ్గరుండి చూసుకుంటారు. పరిశ్రమల ఏర్పాటుకు ఎవరైనా ఆసక్తి చూపిస్తే వారిని ఏపీకి తీసుకు వచ్చే వరకూ ప్రయత్నిస్తూనే ఉంటారని చెబుతూంటారు. 

మేకపాటి గౌతంరెడ్డి వ్యక్తిత్వం కూడా భిన్నమైనదే. నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గంలో ఆయన ప్రభుత్వ పరమైన పథకాలు.. ఇతర ప్రయోజనాలను పార్టీలకు అతీతంగా అందరికీ అందేలా చేస్తారు.  తమ.. పర భేదాలు చూడరు. ప్రస్తుత రాజకీయాల్లో ఆయన తీరు చాలా మంది ఆశ్చర్యం కలిగిస్తూ ఉంటుంది. ఇలాంటి రాజకీయాలతో నెగ్గుకు రావడం కష్టమని అనుకుంటూ ఉంటారు. కానీ గౌతం రెడ్డి మాత్రం ఎప్పుడూ తన పంధా వీడి బయటకు రాలేదు. చివరికి అతి స్వల్పకాలమే అయినా రాష్ట్ర రాజకీయాల్లో తనదైన ముద్ర వేసి తుదిశ్వాస విడిచారు. 

 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Vizag Economic Zone: విశాఖ ఎకనమిక్ రీజియన్ పై చంద్రబాబు సమీక్ష - 9 జిల్లాల పరిధిలో అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక
విశాఖ ఎకనమిక్ రీజియన్ పై చంద్రబాబు సమీక్ష - 9 జిల్లాల పరిధిలో అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక
Atal-Modi Good Governance Bus Tour: ఏపీలో కూటమి అటల్-మోదీ సుపరిపాలన బస్సు యాత్ర - భారతరత్న వాజ్‌పేయి శతజయంతి వేడుకలు ప్రారంభం
ఏపీలో కూటమి అటల్-మోదీ సుపరిపాలన బస్సు యాత్ర - భారతరత్న వాజ్‌పేయి శతజయంతి సందర్భంగా ప్రారంభం
Sandesara brothers: సుప్రీంకోర్టులో 5100 కోట్లు డిపాజిట్ చేసిన బ్రదర్స్ - మోసం చేసి డబుల్ చెల్లిస్తున్నారు !
సుప్రీంకోర్టులో 5100 కోట్లు డిపాజిట్ చేసిన బ్రదర్స్ - మోసం చేసి డబుల్ చెల్లిస్తున్నారు !
Census 2027: జన, కులగణనకు 11718 కోట్లు కేటాయింపు - పూర్తి డిజిటల్ పద్దతిలో 2027 ఫిబ్రవరి కల్లా ముగింపు
జన, కులగణనకు 11718 కోట్లు కేటాయింపు - పూర్తి డిజిటల్ పద్దతిలో 2027 ఫిబ్రవరి కల్లా ముగింపు

వీడియోలు

Ind vs SA T20 Suryakumar Press Meet | ఓటమిపై సూర్య కుమార్ యాదవ్ కామెంట్స్
Shubman Gill Golden Duck in Ind vs SA | రెండో టీ20లో గిల్ గోల్డెన్ డకౌట్
Arshdeep 7 Wides in Ind vs SA T20 | అర్షదీప్ సింగ్ చెత్త రికార్డు !
India vs South Africa 2nd T20 | టీమిండియాపై ప్రతీకారం తీర్చుకున్న దక్షిణాఫ్రికా!
Telangana Aviation Academy CEO Interview | ఇండిగో దెబ్బతో భారీ డిమాండ్.. 30వేల మంది పైలట్ లు కావాలి

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Vizag Economic Zone: విశాఖ ఎకనమిక్ రీజియన్ పై చంద్రబాబు సమీక్ష - 9 జిల్లాల పరిధిలో అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక
విశాఖ ఎకనమిక్ రీజియన్ పై చంద్రబాబు సమీక్ష - 9 జిల్లాల పరిధిలో అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక
Atal-Modi Good Governance Bus Tour: ఏపీలో కూటమి అటల్-మోదీ సుపరిపాలన బస్సు యాత్ర - భారతరత్న వాజ్‌పేయి శతజయంతి వేడుకలు ప్రారంభం
ఏపీలో కూటమి అటల్-మోదీ సుపరిపాలన బస్సు యాత్ర - భారతరత్న వాజ్‌పేయి శతజయంతి సందర్భంగా ప్రారంభం
Sandesara brothers: సుప్రీంకోర్టులో 5100 కోట్లు డిపాజిట్ చేసిన బ్రదర్స్ - మోసం చేసి డబుల్ చెల్లిస్తున్నారు !
సుప్రీంకోర్టులో 5100 కోట్లు డిపాజిట్ చేసిన బ్రదర్స్ - మోసం చేసి డబుల్ చెల్లిస్తున్నారు !
Census 2027: జన, కులగణనకు 11718 కోట్లు కేటాయింపు - పూర్తి డిజిటల్ పద్దతిలో 2027 ఫిబ్రవరి కల్లా ముగింపు
జన, కులగణనకు 11718 కోట్లు కేటాయింపు - పూర్తి డిజిటల్ పద్దతిలో 2027 ఫిబ్రవరి కల్లా ముగింపు
Divi Vadthya Bikini Pics: బికినీలో బిగ్ బాస్ దివి... ఇంటర్‌నెట్‌ను షేక్ చేస్తున్న ఫోటోలు
బికినీలో బిగ్ బాస్ దివి... ఇంటర్‌నెట్‌ను షేక్ చేస్తున్న ఫోటోలు
Akhanda 2 Premiere Show Collection: 'అఖండ 2' ప్రీమియర్స్... గురువారం రాత్రి బాలయ్య సినిమా కలెక్షన్స్ ఎంతంటే?
'అఖండ 2' ప్రీమియర్స్... గురువారం రాత్రి బాలయ్య సినిమా కలెక్షన్స్ ఎంతంటే?
Cognizants Campus in Visakhapatnam: ఏడాదిలోనే విశాఖకు కాగ్నిజెంట్.. తాత్కాలిక క్యాంపస్ ను ప్రారంభించిన మంత్రి లోకేష్ 
ఏడాదిలోనే విశాఖకు కాగ్నిజెంట్.. తాత్కాలిక క్యాంపస్ ను ప్రారంభించిన మంత్రి లోకేష్ 
Telangana Panchayat Election Results: తొలి గోల్ కొట్టిన రేవంత్ రెడ్డి.. పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ హవా, గట్టిపోటీ ఇచ్చిన బీఆర్ఎస్
తొలి గోల్ కొట్టిన రేవంత్ రెడ్డి.. పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ హవా, గట్టిపోటీ ఇచ్చిన బీఆర్ఎస్
Embed widget