By: ABP Desam | Updated at : 02 Mar 2023 01:40 PM (IST)
పెట్టుబడుల సదస్సుపై ప్రభుత్వానికి గంటా శ్రీనివాసరావు ప్రశ్నలు
Ganta Tweet On GIC : విశాఖలో పెట్టుబడుల సదస్సు నిర్వహిస్తున్న ఏపీ ప్రభుత్వానికి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ఓ లేఖ సంధించారు. గంటా శ్రీనిసరావు చేసిన ఓ ట్వీట్ వైరల్గ మారుతోంది. ఈ అంశంపై ఆయన తెలుగులో వైసీపీ ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నిస్తూ కొన్ని అంశాలను ప్రస్తావించారు. ఇరవై అంశాలపై సూటిగా ప్రశ్నించారు. అందులో రాజధాని లేకపోవడం దగ్గర్నుంచి జాకీ పరిశ్రమను తరిమి వేయడం వరక అనేక కీలక సందేహాలు ఉన్నాయి. వాటన్నింటికీ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
ప్రపంచ పెట్టుబడుల సమావేశానికి ముందు ప్రభుత్వానికి కొన్ని ప్రశ్నలు. pic.twitter.com/6V27SIwuYs
— Ganta Srinivasa Rao (@Ganta_Srinivasa) March 2, 2023
సూటిగా 20 ప్రశ్నలు అడిగిన గంటా శ్రీనివాసరావు
దావోస్ పెట్టుబడుల సదస్సుకు ఏపీ ప్రభుత్వం వెళ్లకపోవడానికి కారణం ఏమిటో చెప్పాలని గంటా శ్రీనివాసరావు ప్రశ్నించారు. దావోస్కు వెళ్లకపోవడం వల్ల జరిగిన నష్టం ఏమిటో ఇప్పటికైనా గుర్తించారా అని లేఖలో ప్రశ్నించారు. కియా అనుబంధ పరిశ్రమలు ఒక్క దానిని కూడా ఎందుకు ఏర్పాటు చేయించలేకపోయారు, లూలూ పరిశ్రమను వెళ్లగొట్టిన అంశం పెట్టుబడిదారుల సదస్సులో చెబుతారా ? బోగాపురం ఎయిర్ పోర్టును నాలుగేల్ల పాటు పట్టించుకోకుండా.. ఇప్పుడు శంకుస్థాపన పేరుతో హడావుడి చేయడం ఎందు్కు ?, లా అండ్ ఆర్డర్ లేదని చెప్పి పెట్టుబడులు ఆకర్షిస్తారా?, జీతాలు ఇవ్వలేని రాష్ట్రంలో ఎవరైనా పెట్టుబడులు పెట్టడానికి వస్తారా ? అదానీ డేటా సెంటర్కు గతంలోనే శంకుస్థాపన చేసినా ఇంత వరకూ పనులు మొదలు పెట్టలేదని ఇంకా ఎందుకు భూములు కేటాయించారో చెప్పాలని గంటా డిమాండ్ చేశారు.
విశాఖలో ఐటీ ఉద్యోగులు ఎందుకు తగ్గిపోయారు ?
టీడీపీ హయాంలో విశాఖలో 50వేల మంది ఐటీ ఉద్యోగులు ఉండేవారు .. ఇప్పుడు రెండు మూడు వేల మంది కూడా లేరు..ఐటీ కంపెనీైలను ఎందుకు తరిమేశారు ? హెచ్ఎస్బీసీ వెళ్లిపోకుండా ఎందుకు ఆపలేకపోయారు ? సరైన ఉపాధి అవకాశాలు లేని రాష్ట్రంలో సగటు పౌరుడి కొనుగోలు శక్తి దారుణంగా పడిపోయిందన్న విషయాన్ని గుర్తించారా ? నాలుగేళ్ల వరకూ పట్టించుకోకుండా.. ఎన్నికలకు ఏడాది ముందు పెట్టుబడుల సదస్సు పేరుతో హడావుడి చేయడానికి కారణం ఏమిటో చెప్పాలని గంటా శ్రీనివాసరావు డమాండ్ చేశారు. ఇవన్నీ రాజకీయ దురుద్దేశంతో రాస్తున్న ప్రశ్నలు కాదని ఏపీలో సగటు పౌరుడుకి ఉన్న సందేహాలని గంటా స్పష్టం చేశారు.
చంద్రబాబు రాసిన లేఖపై గంటా సంతకం పెట్టినట్లుగా ఉందన్న గుడివాడ అమర్నాథ్
గంటా శ్రీనివాసరావు లేఖపై పరిశ్రమల మంత్రి గుడివాడ అమర్నాథ్ స్పందించారు. దావోస్ వెళ్లి తెలుగుదేశం పార్టీ నేతలు ఎన్ని పెట్టుబడులు తెచ్చారని ప్రశ్నించారు. అసలు ఏపీకి రాజధాని లేకుండా చేసింది చంద్రబాబేనని ఆరోపించారు. చంద్రబాబు రాసిన లేఖపై గంటా శ్రీనివసరావు సంతకం పెట్టినట్లుగా ఉందన్నారు.
Visakha G20 Summit : ఈ నెల 28, 29న విశాఖలో జీ20 సదస్సు, హాజరుకానున్న 69 మంది విదేశీ ప్రతినిధులు
Covid19 Cases: కొవిడ్ కేసుల పెరుగుదలతో ఏపీ అలర్ట్ - తెలంగాణను భయపెడుతున్న H3N2 కేసులు
Mlc Dokka Vara Prasad : సస్పెండ్ చేయగానే టీడీపీ నినాదం, ఇంతకన్నా ఫ్రూప్ ఏంకావాలి- ఉండవల్లి శ్రీదేవికి డొక్కా కౌంటర్
MLA Maddali Giridhar: "క్రాస్ ఓటింగ్ కోసం టీడీపీ నేతలు నన్నూ సంప్రదించారు, కావాలంటే కాల్ డేటా చూడండి"
Divya Darshan Tickets : శ్రీవారి భక్తులకు టీటీడీ గుడ్ న్యూస్, కాలినడకన వచ్చే వారికి దివ్యదర్శనం టోకెన్లు జారీ!
Rahul Gandhi Notice: అధికారిక నివాసం ఖాళీ చేయండి - రాహుల్ గాంధీకి నోటీసులు
Polavaram Project: పోలవరం ప్రాజెక్టు ఎత్తు, సామర్థ్యంపై కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన
Movies Release in OTT: ఈ వారం ఓటీటీలదే హవా - ‘అవతార్ 2’తోపాటు 30 సినిమాలు రిలీజ్!
Nellore YSRCP: నెల్లూరు వైసీపీలో నాలుగో వికెట్ ? ప్రచారం మూమూలుగా లేదుగా !!