అన్వేషించండి

YSRCP : కార్యకర్తలు ఆదేశిస్తే అనేక మార్గాలు - ఎమ్మెల్యేగానే పోటీ చేస్తానంటున్న మంత్రి జయరామ్

Alur : కార్యకర్తలు ఆదేశిస్తే ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి అనేక మార్గాలు ఉన్నాయని గమ్మనూరు జయరాం వ్యాఖ్యానించారు. ఎంపీ టిక్కెట్ కేటాయించిన తర్వాత ఆయన కార్యకర్తలతో సమావేశం అయ్యారు.


Gummanur Jayaram : కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గం ఎమ్మెల్యే, మంత్రి జయరామ్ కు ఈ సారి ఎమ్మెల్యే టిక్కెట్ కాకుండా ఎంపీ టిక్కెట్ ఆఫర్ చేశారు సీఎం వైఎస్ జగన్. ఈ మేరకు ఇంచార్జ్‌గా ప్రకటించారు. ఆలూరు నుంచి జడ్పీటీసీగా ఉన్న విరూపాక్షిని ఇంచార్జుగా ప్రకటించారు. కానీ జయరామ్ మాత్రం తన నియోజకవర్గంలో విరూపాక్షిని అంగీకరించేందుకు సిద్ధంగా లేరు. ఆయన వర్గం అంతా ఎమ్మెల్యేగానే పోటీ చేయాలని డిమాండ్ చేస్తోంది.  

కర్నూలు ఎంపీగా పోటీ చేసేందుకు మంత్రి గుమ్మనూరు జయరాం ఆసక్తిగా లేరు. మూడో జాబితాలో ఆయన పేరు ఎంపీ స్థానానికి ఇంచార్జుగా ఉండటంతో..  ఆలూరు చేరుకుని  కార్యకర్తలు, అభిమానులతో సమావేశం అయ్యారు గుమ్మనూరు జయరాం.  వైసీపీ ఇంఛార్జిల మార్పులు చేర్పుల్లో భాగంగా నిన్న మూడో జాబితా విడుదల చేశారు సీఎం జగన్. అందులో ఆలూరు సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న మంత్రి జయరామ్ ను కర్నూలు ఎంపీ అభ్యర్థిగా ఖరారు చేశారు జగన్. అయితే, ఎంపీగా పోటీ చేయడం తనకు ఇష్టం లేదని, ఆలూరు ఎమ్మెల్యేగానే పోటీ చేస్తానని జయరాం అంటున్నారు. తనకు ఆలూరు ఎమ్మల్యే అభ్యర్థి టికెట్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ఎంపీగా వెళ్లాలా? లేదా? అన్నది కార్యకర్తలే తేల్చాలని కోరారు.  అభ్యర్థులను ఖరారు చేసినంత మాత్రాన ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ఇంకా రెండు నెలల సమయం ఉందంటూ హాట్ కామెంట్స్ చేశారు గుమ్మనూరు జయరామ్.                                 

”15 ఏళ్ళుగా నాకు సహకరించిన కార్యకర్తలకు ఎంతో రుణపడి ఉంటా. మంత్రిగా మనం రూలింగ్ లో ఉన్నా ఎక్కడా కూడా దౌర్జన్యం చేయలేదు. మంత్రిగా నేను ఏనాడూ గొడవలను ప్రోత్సహించలేదు. వ్యక్తిగత కక్షలు లేకుండా ఉన్నాము. నేను కర్నూలు ఎంపీ టిక్కెట్ జేబులో పెట్టుకుని వచ్చాను. కార్యకర్తలు అభీష్టం మేరకే నడుచుకుంటానని ప్రకటించారు.   మీ నిర్ణయం పైనే నా రాజకీయ భవిష్యత్ కార్యాచరణ ఉంటుంది. ఇంకా 2 నెలలు సమయం ఉంది. అభ్యర్థులను ఖరారు చేసినంత మాత్రాన ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. నామినేషన్ వేసిన తర్వాత సైతం అభ్యర్థులను మార్చిన సంఘటనలు అనేకం చూశాము. నన్ను ఎంపీగా వెళ్లమంటారా లేదా అనేది మీరే తేల్చండి.                                   

కార్యకర్తలు అదేశిస్తే అనేక దారులు ఉన్నాయి. మీ నిర్ణయానికి కట్టుబడి ఉంటా” అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు మంత్రి గుమ్మనూరు జయరాం. జయరాం వ్యాఖ్యలు చూస్తూంటే ఆయన ఆలూరు నుంచే ఏ పార్టీ తరపున అయినా సరే పోటీ చేయడానికి రెడీగా ఉన్నారని తెలుస్తోంది. ఈ అంశంపై కాంగ్రెస్ హైకమాండ్ దృష్టి సారిస్తుందా లేకపోతే.. జయరాం ఎలాంటి నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటుందా అన్నది తేలాల్సి ఉంది. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

ONGC Gas Blowout:కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
Malikipuram Gas Fire : కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
Telangana Gurukul Admissions: తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల
తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల

వీడియోలు

History Behind Peppé Buddha Relics | భారత్‌కు తిరిగి వచ్చిన బుద్ధుని అస్థికలు! | ABP Desam
అగార్కర్‌పై మహ్మద్ షమి కోచ్ సంచలన కామెంట్స్
రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్‌గా రవీంద్ర జడేజా!
ఫార్మ్ లో లేడని తెలుసు  కానీ ఇలా చేస్తారని అనుకోలేదు: రికీ పాంటింగ్
ఇంకా అందని ఆసియా కప్ ట్రోఫీ.. నఖ్వీ షాకింగ్ కామెంట్స్..

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
ONGC Gas Blowout:కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
Malikipuram Gas Fire : కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
Telangana Gurukul Admissions: తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల
తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల
Maoists Latest News: మావోయిస్టుల్లో మిగిలింది 17 మందే! తెలంగాణ డీజీపీ సంచలన ప్రకటన 
మావోయిస్టుల్లో మిగిలింది 17 మందే! తెలంగాణ డీజీపీ సంచలన ప్రకటన 
Supreme Court: కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
MLC Kavitha: బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
Electric vehicles : ఎలక్ట్రిక్ వెహికల్ వాడుతున్నారా? ఈ 80-20 రూల్ గురించి తప్పక తెలుసుకోవాల్సిందే
ఎలక్ట్రిక్ వెహికల్ వాడుతున్నారా? ఈ 80-20 రూల్ గురించి తప్పక తెలుసుకోవాల్సిందే
Embed widget