అన్వేషించండి

Undavalli On Jagan ; అలా చేయకుంటే రాజకీయ జీవితం ముగిసినట్లే - జగన్‌కు ఉండవల్లి అరుణ్‌కుమార్ హెచ్చరిక !

రాష్ట్రం కోసం పోరాడకపోతే జగన్ రాజకీయ జీవితం ముగిసినట్లేనని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ జోస్యం చెప్పారు. ఇంకా ఎం చెప్పారంటే ?

Undavalli On Jagan ;   ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాల కోసం పోరాడకపోతే సీఎం జగన్ రాజకీయ జీవితం ముగిసిపోయినట్లేనని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజమండ్రిలో మీడియాతో మాట్లాడిన ఆయన సుప్రీంకోర్టులో ఏపీ ప్రభుత్వం విభజన అంశం గురించి వదిలేయాలని అఫిడవిట్ వేసిందని మండిపడ్డారు.  ఎవరి ప్రయోజనాలు  కాపాడేందుకు  సి.ఎం జగన్  ఇలా వ్యవహరిస్తున్నారని ఉండవల్లి అరుణ్ కుమార్ ప్రశ్నించారు. విభజన అన్యాయం గురించి మాట్లాడటానికి  సి.ఎం జగన్ కు  భయం ఎందుకున్నారు.  జగన్ పోరాటం చేస్తారని  ప్రజల్లో  నమ్మకం పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. 

ఏపీకి జరిగిన అన్యాయంపై పోరాడకపోతే జగన్ రాజకీయ జీవితం ముగిసినట్లే ! 

ఎ.పికి అన్యాయంపై సి.ఎం జగన్ పోరాటం చేయాలని..  పోరాటం చేయకుంటే  జగన్  రాజకీయ జీవితానికి ఫుల్ స్టాప్ పడ్డట్టేనని హెచ్చరించారు. ఎ.పి.కి అన్యాయంపై పోరాటం చేయకపోవడం చంద్రబాబుకు 23సీట్లు రావడానికి ఒక కారణమని తెలిపారు.  మోదీ, జగన్ కు  మంచి  సంబంధాలు  ఉండొచ్చు  కానీ రాష్ట్ర ప్రయోజనాల గురించి రాజీ పడకూడదని స్పష్టం చేశారు.  వచ్చే  ఏడాది ఫిబ్రవరి 22న  సుప్రీంకోర్టులో తది  విచారణ జరగనుందిని... ఆ రోజుకైనా  ఎ.పి ప్రభుత్వం  అన్యాయం  వివరిస్తూ  అఫిడవిట్  వెయ్యాలని ఉండవల్లి సూచించారు. పిబ్రవరి 22న సుప్రీం కోర్టులో రాష్ట్ర ప్రభుత్వంత తరపున వాదనలు విపించాలని జగన్మోహన్ రెడ్డిని వేడుకుంటున్నానని ఉండవల్లి వ్యాఖ్యానించారు. 

ఎవరికి భయపడి విభజనపై సుప్రీంకోర్టులో ఏపీ ప్రభుత్వం వాదించడం లేదు ?

 విభజన బిల్లు పాస్ చేసే సమయంలో  రాజ్యసభలో టెలీ కాస్టింగ్‌ ఆపివేశారు..రాజ్యసభలో ఓటింగ్‌ పెట్టకుండా ఏకపక్షంగా తీర్మానించారు. ఆనాడు రిస్క్‌ తీసుకోవడం ఇష్టంలేక డివిజన్‌ చేశామని రాజ్యసభ సభ్యుడిగా ఉన్న వెంకయ్య నాయుడు ఓ సందర్భంలో అన్నారని ఉండవల్లి గుర్తు చేశారు.  జనవరి 30, 2012లో ఏం జరిగిందో తన దగ్దర అన్ని ఆధారాలున్నాయి. ఆర్టికల్  100 ను తుంగలో తొక్కి రాష్ట్ర విభజన చేశారని ఆరోపించారు. ఇన్నాళ్లకు ఏకపక్ష రాష్ట్ర విభజనపై కోర్టులో మాట్లాడగలిగే అవకాశం వచ్చిందని.. ఎనిమిదేళ్లు అయ్యింది కానీ కేంద్ర ప్రభుత్వం ఇంతవరకు కౌంటర్‌ వేయలేదన్నారు. పిబ్రవరి 22 వ తేదీన రాష్ట్ర విభజన కేసును విచారించాలా.. లేదా వదలివేయాలన్నది చూద్దామని, ముందుకు కేంద్ర ప్రభుత్వం కౌంటర్‌ వేయాలని ధర్మాసనం తెలిపిందన్నారు. కానీ ఏపీ ప్రభుత్వం వదిలేయమని అఫిడవిట్ వేసిందని అసంతృప్తి వ్యక్తం చేశారు. 

తెలంగాణ నుంచి ఏపీకి లక్ష కోట్ల వరకూ రావాల్సి ఉంది! 

 రెండు రాష్ట్రాలను ఇప్పుడు కలపమని తాను కోరడం లేదని.. ఆనాడు జరిగింది అన్యాయం జరిగిందని అయినా చెప్పమంటున్నానని సీఎం జగన్‌కు ఉండవల్లి చెప్పారు.  అన్ని పార్టీలు వ్యతిరేకిస్తున్నా.. మేము కాంగ్రెస్‌ పార్టీకు మద్దతునిస్తున్నామని బీజేపీ నాయకురాలు సుష్మస్వరాజ్‌ ప్రసంగించారని గుర్తు చేారు. మాకు ఇవ్వాల్సిన స్పెషల్‌ కేటగిరి ఇవ్వాలి..విభజన నాటి హామీలు ఏమీ ఇవ్వడం లేదన్నారు.  దయచేసి ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ..   ఇంతటి అవకాశం వచ్చినప్పుడు ఏకపక్ష రాష్ట్ర విభజనపై అడ్వకేట్‌ను పెట్టి పోరాడాల్సిన అవసరం ఉందని జగన్‌కు సలహా ఇచ్చారు. తెలంగాణాలో ఆంధ్రకు రాష్ట్రానికి రావాల్సిన ఆస్తులు సుమారు లక్ష కోట్లు ఉన్నాయన్నారు.  దేశంలో 50రాష్ట్రాలుగా విడగొట్టాలన్నది బీజేపీ పాలసీ అని విమర్శించారు. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Jagga Reddy: 20 ఏళ్లలో రూ.20కోట్లు ఖర్చు, ఎన్నికల్లో ఓటమితో ప్రశాంతంగా ఉంది: జగ్గారెడ్డి సంచలనం
20 ఏళ్లలో రూ.20కోట్లు ఖర్చు, ఎన్నికల్లో ఓటమితో ప్రశాంతంగా ఉంది: జగ్గారెడ్డి సంచలనం
YS Jagan: మరోసారి పెద్ద మనసు చాటుకున్న మాజీ సీఎం వైఎస్‌ జగన్, ఓ ప్రాణం నిలిచింది!
మరోసారి పెద్ద మనసు చాటుకున్న మాజీ సీఎం వైఎస్‌ జగన్, ఓ ప్రాణం నిలిచింది!
Brahmanandam: ‘భారతీయుడు 2’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో బ్రహ్మానందం టాలెంట్ చూశారా- వీడియో చూస్తే షాక్!
‘భారతీయుడు 2’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో బ్రహ్మానందం టాలెంట్ చూశారా- వీడియో చూస్తే షాక్!
Income Tax Notice: మీరు టాక్స్ పరిధిలో లేరా? అయినా సరే మీకు నోటీసులు వస్తాయ్, కారణం ఇదీ
మీరు టాక్స్ పరిధిలో లేరా? అయినా సరే మీకు నోటీసులు వస్తాయ్, కారణం ఇదీ
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Bobbili Maharaja Vintage Cars and Weapons | ఇలాంటి పాత, ఖరీదైన కార్లు మీకు ఎక్కడా కనిపించవు.! | ABPSingirikona Narasimha Swamy Temple | సింగిరికోన అడవిలో మహిమాన్విత నారసింహుడి ఆలయం చూశారా.! | ABP80 Years Old Man Completes 21 PGs | చదువు మీద ఈ పెద్దాయనకున్న గౌరవం చూస్తుంటే ముచ్చటేస్తుందిCM Chandrababu CM Revanth Reddy Meeting | అందరి కళ్లూ... తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశంపైనే

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Jagga Reddy: 20 ఏళ్లలో రూ.20కోట్లు ఖర్చు, ఎన్నికల్లో ఓటమితో ప్రశాంతంగా ఉంది: జగ్గారెడ్డి సంచలనం
20 ఏళ్లలో రూ.20కోట్లు ఖర్చు, ఎన్నికల్లో ఓటమితో ప్రశాంతంగా ఉంది: జగ్గారెడ్డి సంచలనం
YS Jagan: మరోసారి పెద్ద మనసు చాటుకున్న మాజీ సీఎం వైఎస్‌ జగన్, ఓ ప్రాణం నిలిచింది!
మరోసారి పెద్ద మనసు చాటుకున్న మాజీ సీఎం వైఎస్‌ జగన్, ఓ ప్రాణం నిలిచింది!
Brahmanandam: ‘భారతీయుడు 2’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో బ్రహ్మానందం టాలెంట్ చూశారా- వీడియో చూస్తే షాక్!
‘భారతీయుడు 2’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో బ్రహ్మానందం టాలెంట్ చూశారా- వీడియో చూస్తే షాక్!
Income Tax Notice: మీరు టాక్స్ పరిధిలో లేరా? అయినా సరే మీకు నోటీసులు వస్తాయ్, కారణం ఇదీ
మీరు టాక్స్ పరిధిలో లేరా? అయినా సరే మీకు నోటీసులు వస్తాయ్, కారణం ఇదీ
Ration Cards: తెలంగాణలో రేషన్ కార్డుల్లో మార్పులు చేసుకోవచ్చా? ఎడిట్ ఆప్షన్‌పై అధికారుల క్లారిటీ
తెలంగాణలో రేషన్ కార్డుల్లో మార్పులు చేసుకోవచ్చా? ఎడిట్ ఆప్షన్‌పై అధికారుల క్లారిటీ
Rakul Preet Singh: రకుల్ అందాన్ని చూస్తే రెప్ప వేయగలరా? భారతీయుడు 2 ప్రీ రిలీజ్‌లో గ్లామరస్ లేడీ ఫోటోలు
రకుల్ అందాన్ని చూస్తే రెప్ప వేయగలరా? భారతీయుడు 2 ప్రీ రిలీజ్‌లో గ్లామరస్ లేడీ ఫోటోలు
India vs Zimbabwe, 2nd T20I: అద‌ర‌గొట్టిన అభిషేక్ శర్మ, రఫ్ఫాడించేసిన భారత పేసర్లు- జింబాబ్వేతో సిరీస్ సమం
అద‌ర‌గొట్టిన అభిషేక్ శర్మ, రఫ్ఫాడించేసిన భారత పేసర్లు- జింబాబ్వేతో సిరీస్ సమం
Andhra Pradesh: టీడీపీ వాళ్లు పవన్ కళ్యాణ్‌కు గుడి కట్టాలి, డిప్యూటీ సీఎంను గౌరవించాలి- మార్గాని భరత్
టీడీపీ వాళ్లు పవన్ కళ్యాణ్‌కు గుడి కట్టాలి, డిప్యూటీ సీఎంను గౌరవించాలి- మార్గాని భరత్
Embed widget