అన్వేషించండి

Sailajanath: ఐటీ కంపెనీలు ఏపీకి పంపించడం కాదు, కృష్ణా నీటి వాటా సంగతేంటో చెప్పండి, కేటీఆర్‌కు శైలజానాథ్ కౌంటర్

Sailajanath: ఐటీ కంపెనీలను ఏపీకి పంపిస్తామంటూ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై మాజీ మంత్రి శైలజానాథ్ కౌంటర్ ఇచ్చారు.

Sailajanath: ఐటీ కంపెనీలను ఏపీకి పంపిస్తామంటూ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై మాజీ మంత్రి శైలజానాథ్ కౌంటర్ ఇచ్చారు. కంపెనీలు పంపిస్తాం, స్థలాలు ఇప్పిస్తామని చెప్పడం కాదని, కృష్ణా నీటి వాటా సంగతి తేల్చాలని ఏపీసీసీ మాజీ అధ్యక్షుడు శైలజానాథ్ ప్రశ్నించారు. ఐటీ కంపెనీలను ఏపీకి పంపిస్తామని కేటీఆర్ చులకన భావనతో మాట్లాడటం.. తమ మనోభావాలను దెబ్బతీసిందని అన్నారు. కృష్ణా జలాల పంపిణీపై కేంద్రం ఇచ్చిన నోటిఫికేషన్ రాయలసీమకు చావు దెబ్బలాంటిదని పేర్కొన్నారు. బీజేపీ అప్పర్ భద్ర ప్రాజెక్టును కర్ణాటక ఎన్నికల కోసం వాడుకుందని విమర్శించారు. ఇప్పుడు తెలంగాణ ఎన్నికల కోసమే కృష్ణా జలాల పంపిణీపై కొత్త నోటిఫికేషన్ ను బీజేపీ ఇచ్చిందని ఆరోపించారు. 

రాయలసీమకు శ్రీశైలం జలాలను ఇవ్వాలని, హంద్రీనీవా గాలేరు నగరి ప్రాజెక్టులు మూతపడతాయని శైలజానాథ్ అన్నారు. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి దీనిపై స్పందించాలని డిమాండ్ చేశారు. ఢిల్లీకి వెళ్లడం కాదు.. రాష్ట్రానికి కావాల్సిన హక్కులను సాధించడం లేదని విమర్శించారు. రాష్ట్ర ప్రయోజనం దృష్ట్యా అందరినీ కలుపుకుని పోయి నీటి సమస్యను పరిష్కరించాలని సూచించారు. బీజేపీ దుర్మార్గాన్ని అడ్డుకోవాల్సిన అవసరం ఉందని ఏపీసీసీ మాజీ అధ్యక్షుడు శైలజానాథ్ అన్నారు.

ఏపీకి ఐటీ కంపెనీల్ని రికమెండ్ చేస్తా- కేటీఆర్

ఆంధ్రప్రదేశ్ లో ఐటీ కంపెనీలు పెట్టాలని ..  తాను రికమెండ్ చేస్తానని కేటీఆర్ ప్రకటించారు.  వరంగల్ సమీపంలోని మడికొండ ఐటీ పార్క్‌లో రూ.40 కోట్లతో ఏర్పాటు చేసిన క్వాట్రెండ్ సాఫ్టువేర్ కంపెనీని తెలంగాణ మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.   హైదరాబాద్, వరంగల్‌తో పాటు ఆంధ్రప్రదేశ్‌లోనూ ఐటీ కంపెనీలు రావాలని మంత్రి  వ్యాఖ్యానించారు.  రానున్న పదేళ్లలో హైదరాబాద్‌కు వరంగల్‌కు పెద్దగా తేడా ఉండదని విశ్వాసం వ్యక్తం చేశారు.  ఐటీ రంగంలో భవిష్యత్తు అంతా టైర్ 2 నగరాలదే అని.. ఆంధ్రాలోని భీమవరం, నెల్లూరు ప్రాంతాల్లో భవిష్యత్‌లో ఉజ్వలమైన ఉపాధి అవకాశాలు వస్తాయని కేటీఆర్ అన్నారు.                          

ఏపీలోని పిల్లలకు కూడా టాలెంట్ ఏం తక్కువ లేదన్నారు. బెంగళూరులో ఉన్న 40 శాతం మంది ఐటీ ఉద్యోగులు.. ఆంధ్రా, తెలంగాణ వాళ్లేనని అన్నారు. వాళ్లందరూ తిరిగి సొంత ప్రాంతాలకు రావడానికి రెడీగా ఉన్నారని.. ఏపీలోనూ ఐటీ సంస్థలు పెట్టాలని క్వాడ్రంట్‌ సాఫ్ట్‌వేర్ కంపెనీ ప్రతినిధులకు కేటీఆర్ సూచించారు. జగనన్నకు చెప్పి నేను మీకు జాగా ఇప్పిస్తానని హామీ ఇచ్చారు.వరంగల్ మాత్రమే కాకుండా ఏపీలోని భీమవరం, నెల్లూరుకూ ఐటీ సంస్థలు రావాలన్నారు కేటీఆర్. అక్కడ కూడా ఎన్నారైలు ఐటీ సంస్థలు పెట్టాలని కోరారు. టాలెంట్ ఎవరబ్బ సొత్తు కాదని, టాలెంట్ ఉంటే ఎక్కడైనా కంపెనీలు ఏర్పాటు చేసి ఉపాధి కల్పించవచ్చునని చెప్పారు. అధిక జనాభా నష్టం అని చెప్పారు కానీ అది అబద్ధమన్నారు. మానవ వనరులను సద్వినియోగం చేసుకోవాలన్నారు.

కేటీఆర్ ఉద్దేశం ప్రకారం ఏపీకి అసలు పెట్టుబడులేమీ రావడం లేదు..  ఏదైనా కంపెనీల్ని తానే రికమెండ్ చేస్తానని అన్నట్లుగా ఉందన్న అభిప్రాయం వినిపిస్తోంది. ఉమ్మడి రాష్ట్ర విభజన తర్వాత రెండు తెలుగు రాష్ట్రాలు పెట్టుబడుల కోసం పోటాపోటీగా ప్రయత్నించాయి. హీరో ఎలక్ట్రిక్ ప్లాంట్ తో పాటు కియా,  డిక్సన్, హెచ్‌సీఎల్ తో పాటు చంద్రబాబు సీఎంగగా ఉన్న సమయంలో అనేక పరిశ్రమలు ఏపీకి తరలి వచ్చాయి. శరవేగంగా ఉత్పత్తి ప్రారంభించాయి. విజయవాడ సమీపంలో అతి పెద్ద హెచ్సీఎల్ క్యాంపస్ ను నిర్మించారు. విశాఖలో ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ వంటి సంస్థలు వచ్చేందుకు ఒప్పందాలు చేసుకున్నాయి.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Indigo Show Cause Notice: ఇండిగో సీఈవోకు DGCA నోటీసులు.. గందరగోళంపై చర్యలకు సిద్ధమైన ప్రభుత్వం
ఇండిగో సీఈవోకు DGCA నోటీసులు.. గందరగోళంపై చర్యలకు సిద్ధమైన ప్రభుత్వం
Telangana Rising Global Summit Agenda: తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ అజెండా ఖరారు.. హాజరయ్యే సినీ, క్రీడా ప్రముఖులు వీరే
తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ అజెండా ఖరారు.. హాజరయ్యే సినీ, క్రీడా ప్రముఖులు వీరే
RGV ఊర్మిళ: రంగీలా బ్యూటీతో అఫైర్ గురించి ఫస్ట్ టైమ్ మాట్లాడిన రామ్ గోపాల్ వర్మ! అసలు నిజం ఇదేనా?
RGV ఊర్మిళ: రంగీలా బ్యూటీతో అఫైర్ గురించి ఫస్ట్ టైమ్ మాట్లాడిన రామ్ గోపాల్ వర్మ! అసలు నిజం ఇదేనా?
Ind vs SA 3rd ODI Highlights: జైస్వాల్ తొలి సెంచరీ, రాణించిన రోహిత్, కోహ్లీ.. దక్షిణాఫ్రికాపై 2-1తో వన్డే సిరీస్ కైవసం
జైస్వాల్ తొలి సెంచరీ, రాణించిన రోహిత్, కోహ్లీ.. దక్షిణాఫ్రికాపై 2-1తో వన్డే సిరీస్ కైవసం

వీడియోలు

Ind vs SA 3rd ODI Highlights | సెంచరీతో సత్తా చాటిన జైశ్వాల్..సిరీస్ కొట్టేసిన భారత్ | ABP Desam
Virat Kohli Records in Vizag Stadium | వైజాగ్ లో విరాట్ రికార్డుల మోత
Team India Bowling Ind vs SA | తేలిపోయిన భారత బౌలర్లు
Smriti Mandhana Post after Wedding Postponement | పెళ్లి వాయిదా తర్వాత స్మృతి తొలి పోస్ట్
India vs South Africa 3rd ODI Preview | వైజాగ్ లో మూడో వన్డే మ్యాచ్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Indigo Show Cause Notice: ఇండిగో సీఈవోకు DGCA నోటీసులు.. గందరగోళంపై చర్యలకు సిద్ధమైన ప్రభుత్వం
ఇండిగో సీఈవోకు DGCA నోటీసులు.. గందరగోళంపై చర్యలకు సిద్ధమైన ప్రభుత్వం
Telangana Rising Global Summit Agenda: తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ అజెండా ఖరారు.. హాజరయ్యే సినీ, క్రీడా ప్రముఖులు వీరే
తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ అజెండా ఖరారు.. హాజరయ్యే సినీ, క్రీడా ప్రముఖులు వీరే
RGV ఊర్మిళ: రంగీలా బ్యూటీతో అఫైర్ గురించి ఫస్ట్ టైమ్ మాట్లాడిన రామ్ గోపాల్ వర్మ! అసలు నిజం ఇదేనా?
RGV ఊర్మిళ: రంగీలా బ్యూటీతో అఫైర్ గురించి ఫస్ట్ టైమ్ మాట్లాడిన రామ్ గోపాల్ వర్మ! అసలు నిజం ఇదేనా?
Ind vs SA 3rd ODI Highlights: జైస్వాల్ తొలి సెంచరీ, రాణించిన రోహిత్, కోహ్లీ.. దక్షిణాఫ్రికాపై 2-1తో వన్డే సిరీస్ కైవసం
జైస్వాల్ తొలి సెంచరీ, రాణించిన రోహిత్, కోహ్లీ.. దక్షిణాఫ్రికాపై 2-1తో వన్డే సిరీస్ కైవసం
భారత్‌లో అతి చవకైన, అత్యధిక మైలేజ్ ఇచ్చే బైక్స్.. 800 Km రేంజ్, లిస్ట్ చూశారా
భారత్‌లో అతి చవకైన, అత్యధిక మైలేజ్ ఇచ్చే బైక్స్.. 800 Km రేంజ్, లిస్ట్ చూశారా
CM Revanth Reddy: కేటీఆర్ బీఆర్ఎస్‌ను సమాధి చేస్తాడు - మంచి రోజులు ఎలా వస్తాయి? - కేసీఆర్‌కు రేవంత్ కౌంటర్
కేటీఆర్ బీఆర్ఎస్‌ను సమాధి చేస్తాడు - మంచి రోజులు ఎలా వస్తాయి? - కేసీఆర్‌కు రేవంత్ కౌంటర్
Adulterated Liquor Scam Charge Sheet: జోగి రమేష్ అండతో అద్దేపల్లి సోదరుల నకిలీ లిక్కర్ దందా - విజయవాడ ఎక్సైజ్ కోర్టులో 8 మందిపై చార్జ్ షీట్
జోగి రమేష్ అండతో అద్దేపల్లి సోదరుల నకిలీ లిక్కర్ దందా - విజయవాడ ఎక్సైజ్ కోర్టులో 8 మందిపై చార్జ్ షీట్
Garlic in Winter : చలికాలంలో వెల్లుల్లి తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు.. ఎలా తీసుకుంటే మంచిదో చెప్పిన నిపుణులు
చలికాలంలో వెల్లుల్లి తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు.. ఎలా తీసుకుంటే మంచిదో చెప్పిన నిపుణులు
Embed widget