అన్వేషించండి

Sri Rama Navami Talambralu : భద్రాచలం సీతారాముల కళ్యాణానికి గోటితో ఒలిచిన కోటి తలంబ్రాలు సిద్ధం

Sri Rama Navami Talambralu : భద్రాచలం, ఒంటిమిట్ట సీతారాముల కళ్యాణానికి రాజమహేంద్రవరం తలంబ్రాలు సిద్ధం అయ్యాయి. రాజమహేంద్రవరం పుష్కరఘాట్‌లో వేదమంత్రాలు, హోమాల మధ్య కోటి తలంబ్రాలు సిద్ధం చేశారు.

Sri Rama Navami Talambralu : భద్రాచలం, ఒంటిమిట్ట శ్రీరామనవమి కళ్యాణోత్యవాలకు గత పన్నెండేళ్లుగా యజ్ఞంగా చేపట్టిన కోటి తలంబ్రాలు పంపిణీ ఈ ఏడాదికి కూడా దిగ్విజయంగా పూర్తి చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. భద్రాచలం, ఒంటిమిట్ల ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేసిన అనంతరం విత్తనాలను తూర్పుగోదావరి జిల్లా పరిధిలోని ప్రత్యేక వ్యవసాయ క్షేత్రంలో పండిస్తారు. ఆ ధాన్యాన్ని గోటితో ఒలిపించి అలా కోటి తలంబ్రాలను భద్రాచలం, ఒంటిమిట్టలోని సీతారాముల కళ్యాణోత్సవానికి సిద్ధం చేస్తారు. ఈ సంప్రదాయం గత 12 ఏళ్లుగా జరుగుతుండగా ఈ ఏడాది జరగబోయే సీతారాముల కళ్యాణోత్సవానికి సిద్ధం చేసిన కోటి గోటి తలంబ్రాలను ప్రత్యేక పూజల అనంతరం ప్రత్యేకంగా తయారు చేసిన శుభకలశాలల్లో భద్రపరిచి వాటిని భద్రాచలం, ఒంటిమిట్ట పంపించేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు వేదపండితులు తెలిపారు. ఈ క్రతువును రాజమహేంద్రవరంలోని పుష్కరఘాట్‌ వద్ద హోమాలు నిర్వహించి రామనామస్మరణల మధ్య వీటిని సిద్ధం చేశారు.


Sri Rama Navami Talambralu : భద్రాచలం సీతారాముల కళ్యాణానికి గోటితో ఒలిచిన కోటి తలంబ్రాలు సిద్ధం

గోటితో ఒలిచిన తలంబ్రాలు చాలా ప్రత్యేకం 

ప్రతీఏటా భద్రాచలం, ఒంటిమిట్ట శ్రీరామనవమి కళ్యాణోత్సవాలకు గోటితో ఒలిచిన కోటి తలంబ్రాలను వినియోగిస్తుంటారు. తూర్పుగోదావరి జిల్లాలని గోకవరం మండలం అచ్యుతాపురం గ్రామంలో సర్వే నెం. 16 బై 2 సర్వే నెంబర్‌లోని వ్యవసాయ క్షేత్రంలో తలంబ్రాల కోసం పంటను పండిస్తున్నారు. వీటికి ఎటువంటి రసాయన ఎరువులు వినియోగించకుండా పంట పండిరచడం విశేషం. అదేవిధంగా ఈ పంటకోసం విత్తనాలను భద్రాచలం, ఒంటిమిట్ట సీతరాముల సన్నిధిలో ఉంచి వాటిని తీసుకొచ్చి సేద్యం చేస్తున్నారు. పంటను కూడా చాలా నిష్టగా పండించి ఆ తరువాత సీతారామనామస్మరణల మధ్య పంటను కోసి, ఒబ్బిడి చేస్తారు. ఆ తరువాత వీటిని నాలుగు రాష్ట్రాల్లోని 3000 మంది భక్తులకు పంపించి వాటిని రామనామస్మరణ చేస్తూ ఒలిపిస్తారు. అలా ఒలిచిన కోటి తలంబ్రాలను శ్రీరామనవమి సందర్భంగా భద్రాచలం, ఒంటిమిట్ట ఆలయాల్లో వైభవంగా జరిగే సీతారాముల కళ్యాణోత్సంలో తలంబ్రాలుగా వినియోగిస్తున్నారు.  

తలంబ్రాల ప్రత్యేకత 

శ్రీరామ నవమి వచ్చిందంటే భద్రాచలం రామనామస్మరణతో మారుమోగిపోతుంది. ఈ ఏడాది మార్చి 30న శ్రీరామ నవమి జరగనుంది. అయితే సీతారాముల కళ్యాణంలో తలంబ్రాల గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. అవి తయారు చేయడం దగ్గర నుంచి భద్రాచలం చేరుకునే వరకు ఎంతో భక్తి ఉంది. జానకి దోసిట కెంపుల బ్రోవై, రాముని దోసిట నీలపు రాశై, ఆణిముత్యలే తలంబ్రాలుగా అని శ్రీరామనవమి నాడు రాములోరి కళ్యాణంలో తలంబ్రాల గురించి ప్రత్యేకంగా వివరిస్తుంటారు. అయితే అలాంటి కోటి తలంబ్రాలను స్వయంగా గోటితోనే ఒలుస్తారు భక్తులు. కొన్నేళ్లుగా ఇదే ఆనవాయితీగా కొనసాగుతుంది. ఏపీలోని తూర్పుగోదావరి జిల్లా అచ్యుతాపురం నుంచి ఈ తలంబ్రాలు తెలంగాణలోని భద్రాచలానికి, ఏపీలోని ఒంటిమిట్టకు చేరుకుంటాయి. సీతారాముల కళ్యాణానికి శచీదేవి, అహల్య ఇలా కొంతమంది శ్రీరామ ధ్యానం చేస్తూ గోటితో వడ్లను ఒలిచారని పురణాలు చెబుతున్నాయి. ఇదే స్ఫూర్తిగా తూర్పు గోదావరి జిల్లా వాసులు రాములోరికి గోటితో ఒలిచిన తలంబ్రాలను పంపిస్తారు.  వరుసగా 12వ సారి గోటితో ఒలిచిన కోటి తలంబ్రాలను భద్రాద్రి, ఒంటిమిట్టకు పంపించారు. 


 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

ఈ 29న ప్రధాని నరేంద్ర మోదీ విశాఖ పర్యటన రద్దు - కారణం ఏంటంటే!
ఈ 29న ప్రధాని నరేంద్ర మోదీ విశాఖ పర్యటన రద్దు - కారణం ఏంటంటే!
Pawan Kalyan to Delhi : హఠాత్తుగా ఢిల్లీకి పవన్ కల్యాణ్ - ఎవరెవరితో భేటీలో సస్పెన్స్ !
హఠాత్తుగా ఢిల్లీకి పవన్ కల్యాణ్ - ఎవరెవరితో భేటీలో సస్పెన్స్ !
Revanth Reddy: తెలంగాణకు అదానీ విరాళంపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం, లేఖ రాసినట్లు క్లారిటీ
తెలంగాణకు అదానీ విరాళంపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం, లేఖ రాసినట్లు క్లారిటీ
Rain Alert: బంగాళాఖాతంలో వాయుగుండం - ఏపీలోని ఈ జిల్లాలో భారీ వర్షాలు, ఐఎండీ బిగ్ అలర్ట్
బంగాళాఖాతంలో వాయుగుండం - ఏపీలోని ఈ జిల్లాలో భారీ వర్షాలు, ఐఎండీ బిగ్ అలర్ట్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ఆర్‌జీవీ ఇంటికి పోలీసులు, అరెస్ట్‌కి రంగం సిద్ధంపుష్ప 2 మూవీలోని కిస్సిక్ సాంగ్‌పై విపరీతమైన ట్రోల్స్యూపీలోని షాహీ మసీద్‌ వద్ద తీవ్ర ఉద్రిక్తతవిజయ్‌తో రిలేషన్‌షిప్‌పై ఓపెన్ అయిన రష్మిక

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
ఈ 29న ప్రధాని నరేంద్ర మోదీ విశాఖ పర్యటన రద్దు - కారణం ఏంటంటే!
ఈ 29న ప్రధాని నరేంద్ర మోదీ విశాఖ పర్యటన రద్దు - కారణం ఏంటంటే!
Pawan Kalyan to Delhi : హఠాత్తుగా ఢిల్లీకి పవన్ కల్యాణ్ - ఎవరెవరితో భేటీలో సస్పెన్స్ !
హఠాత్తుగా ఢిల్లీకి పవన్ కల్యాణ్ - ఎవరెవరితో భేటీలో సస్పెన్స్ !
Revanth Reddy: తెలంగాణకు అదానీ విరాళంపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం, లేఖ రాసినట్లు క్లారిటీ
తెలంగాణకు అదానీ విరాళంపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం, లేఖ రాసినట్లు క్లారిటీ
Rain Alert: బంగాళాఖాతంలో వాయుగుండం - ఏపీలోని ఈ జిల్లాలో భారీ వర్షాలు, ఐఎండీ బిగ్ అలర్ట్
బంగాళాఖాతంలో వాయుగుండం - ఏపీలోని ఈ జిల్లాలో భారీ వర్షాలు, ఐఎండీ బిగ్ అలర్ట్
Ambati Rambabu On PusPha 2: కుట్రలు చేసినా పుష్ప-2 సినిమాని ఆపలేరని అంబటి రాంబాబు ఫైర్ - ఇంతకీ అల్లు అర్జున్ సినిమాని ఆపాలని ప్రయత్నించింది ఎవరు ?
కుట్రలు చేసినా పుష్ప-2 సినిమాని ఆపలేరని అంబటి రాంబాబు ఫైర్ - ఇంతకీ అల్లు అర్జున్ సినిమాని ఆపాలని ప్రయత్నించింది ఎవరు ?
Bhuvneshwar Kumar: భారీ ధరకు భువనేశ్వర్‌ను దక్కించుకున్న ఆర్సీబీ, బాధలో హైదరాబాద్ ఫ్యాన్స్!
భారీ ధరకు భువనేశ్వర్‌ను దక్కించుకున్న ఆర్సీబీ, బాధలో హైదరాబాద్ ఫ్యాన్స్!
Ram Gopal Varma: ఆర్జీవీ మార్ఫింగ్‌ల కేసు కాదు అంతకు మించి - అందుకే పోలీసుల ఎదుట విచారణకు హాజరు కాకుండా పరార్ ?
ఆర్జీవీ మార్ఫింగ్‌ల కేసు కాదు అంతకు మించి - అందుకే పోలీసుల ఎదుట విచారణకు హాజరు కాకుండా పరార్ ?
KTR: '28 సార్లు ఢిల్లీకి పోయి రూ.28 కూడా తేలేదు' - సీఎం రేవంత్‌కు రైతుల బాధలు వినే తీరిక లేదని కేటీఆర్ సెటైర్లు
'28 సార్లు ఢిల్లీకి పోయి రూ.28 కూడా తేలేదు' - సీఎం రేవంత్‌కు రైతుల బాధలు వినే తీరిక లేదని కేటీఆర్ సెటైర్లు
Embed widget