అన్వేషించండి

Uddanam : భారత్-పాక్ మ్యాచ్ లో ఉద్దానం సమస్యపై ప్లకార్డుల ప్రదర్శన

Uddanam : ఆసియా కప్ లో భాగంగా భారత్, పాక్ మధ్య ట్వీ20 మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్ ప్రారంభానికి ముందు ఓ ఆసక్తికర సంఘటన జరిగింది. ఏపీకి చెందిన పుల్లట రామ్ కుమార్ ఉద్దానం సమస్యపై ప్లకార్డులు ప్రదర్శించారు.

Uddanam : దుబాయ్‌లో ఆసియాకప్‌లో భాగంగా ఇండియా, పాకిస్తాన్ మధ్య హోరాహోరి ట్వీ20 పోరు జరుగుతోంది. ఈ మ్యాచ్ ను వీక్షించేందుకు భారత్ నుంచే కాకుండా ఇతర దేశాల్లో ఉన్న భారతీయులకు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఈ మ్యాచ్ చూసేందుకు ఏపీ వాసులు కూడా వెళ్లారు. శ్రీకాకుళం జిల్లా కవిటికు చెందిన పుల్లట రామ్‌కుమార్‌ యూఏఈలో ఉంటున్నారు. భారత్‌, పాకిస్థాన్‌కు మ్యాచ్ చూసేందుకు వచ్చిన ఆయన తన స్వస్థలం ఉద్దానం కిడ్నీ బాధితుల సమస్యలను వివరిస్తూ మ్యాచ్‌ ప్రారంభానికి ముందు మాట్లాడారు. 


Uddanam : భారత్-పాక్ మ్యాచ్ లో ఉద్దానం సమస్యపై ప్లకార్డుల ప్రదర్శన

ఉద్దానం కిడ్నీ వ్యాధి సమస్యలు

శ్రీకాకుళం జిల్లా ఉద్దానం పేరు చెప్పగానే కిడ్నీ వ్యాధులే గుర్తొస్తాయి. అయితే ఉద్దానం చూడడానికి కోనసీమ ప్రాంతంలా ఎంతో పంచదనంతో ఉంటుంది.  కానీ ఈ ప్రాంతాన్ని కిడ్నీ సమస్యలు వేధిస్తున్నాయి. శ్రీకాకుళం జిల్లాలోని ఇచ్ఛాపురం, కంచిలి, కవిటి, సోంపేట, పలాస, వజ్రపుకొత్తూరు, మందస మండలాలను కలిపి ఉద్దానంగా పిలుస్తారు. ఈ ప్రాంతంలో నివసిస్తున్న దాదాపు లక్షమంది జనాభాలో 35 శాతం మంది కిడ్నీ సమస్యలతో బాధపడుతున్నారు. వీరిలో దాదాపు 21 శాతం మంది 10 ఏళ్లకు పైగా కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నారని ఉద్దానంపై పరిశోధనలు చేసిన జార్జ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ గ్లోబల్ హెల్త్ తెలిపింది.

క్రియాటినిన్ శాతం 25 పైగా 

ఈ సంస్థ పరిశోధనలో రక్తంలోని సిరం క్రియాటినిన్ 1.2 మి.గ్రా/డెసీలీటర్ కంటే ఎక్కువగా ఉంటే కిడ్నీలు సరిగా పనిచేయడంలేదని తెలిసింది. ఉద్దానం ప్రాంతంలో సీరం క్రియాటినిన్ పాయింట్లు  25 మి.గ్రా/డెసిలీటర్ కూడా ఉన్నాయని గుర్తించారు. క్రియాటినిన్ 5 దాటితే వారికి డయాలసిస్ చేయాల్సిఉంటుందని వైద్యులు తెలిపారు. క్రియాటినిన్ పాయింట్లను బట్టి బాధితులు వారానికి రెండు, మూడుసార్లు కూడా డయాలసిస్‌ చేయించుకోవాల్సిన అవసరం ఉంటుంది.

రూ. 10 వేల ఆర్థిక సాయం 

శ్రీకాకుళం జిల్లాలోని పలాస, టెక్కలి, శ్రీకాకుళం, సోంపేట, కవిటి, పాలకొండలలో కిడ్నీ బాధితుల కోసం డయాలసిస్‌ కేంద్రాలు ఉన్నాయి. వీటిలో కిడ్నీ బాధితులు డయాలసిస్ చేయించుకుంటున్నారు. ఉద్దానం ప్రాంతంలో కిడ్నీ సమస్యలపై ఎప్పటి కప్పుడు పరిశోధనలు చేసి బాధితులను రక్షించేందుకు ప్రయత్నిస్తున్నారు అధికారులు. డయాలసిస్  బాధితుల కోసం ప్రభుత్వం ఆర్థిక సాయం అందిస్తోంది. కిడ్నీ బాధితులకు ఏపీ ప్రభుత్వం వైఎస్‌ఆర్‌ భరోసా పేరుతో రూ. 10 వేలు ఆర్థిక సాయం అందిస్తుంది. వ్యాధి తీవ్రత, క్రియాటినిన్ స్థాయి వంటి లెక్కలు, ఇతర నిబంధనలతో చాలా తక్కువ మందికి సాయం అందుతోందని బాధితులు ఆవేదన చెందుతున్నారు.  ఈ వ్యాధికి గురైన వారిలో కిడ్నీలు 35 నుంచి 50 శాతం పాడవుతాయని, తర్వాత 80 శాతం వరకు, ఆ తర్వాత కిడ్నీలు పనిచేయడం మానేస్తాయని వైద్యులు అంటున్నారు. దీంతో వీరికి డయాలసిస్ తప్పనిసరి అవుతోందని అంటున్నారు. 

Also Read : Vinayaka Chaviti 2022 : గణేష్ మండపాల చుట్టూ ఏపీ రాజకీయాలు, ఇంతకీ అనుమతి తీసుకోవాలా? వద్దా?

Also Read : Ganesh Chaturthi 2022 : గణేష్ మండపాల ఏర్పాటుకు రుసుం చెల్లించక్కర్లేదు- ఏపీ దేవాదాయ శాఖ

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Bhu Bharati Registration Scam: భూభారతి రిజిస్ట్రేషన్ అక్రమాలపై కేసు నమోదు.. సీఎస్ సహా పలువురికి లోకాయుక్త కీలక ఆదేశాలు
భూభారతి రిజిస్ట్రేషన్ అక్రమాలపై కేసు.. సీఎస్ సహా పలువురికి లోకాయుక్త కీలక ఆదేశాలు
Hyderabad Cyber ​​Crime: ట్రేడింగ్ పేరిట రెండున్నర కోట్ల మోసం - నిండా మునిగిన మాజీ ఐపీఎస్ భార్య
ట్రేడింగ్ పేరిట రెండున్నర కోట్ల మోసం - నిండా మునిగిన మాజీ ఐపీఎస్ భార్య
Konaseema Youth New Business: గోదావరి సంక్రాంతి సంబరాలు చూపడానికి అమలాపురం కుర్రాళ్ల సరికొత్త ప్రయత్నం! కాన్సెప్ట్ తెలిస్తే వెంటనే ఫోన్ చేస్తారు!
గోదావరి సంక్రాంతి సంబరాలు చూపడానికి అమలాపురం కుర్రాళ్ల సరికొత్త ప్రయత్నం! కాన్సెప్ట్ తెలిస్తే వెంటనే ఫోన్ చేస్తారు!
Tata Punch Facelift Features: సంక్రాంతి కానుకగా వస్తున్న టాటా పంచ్ ఫేస్‌లిఫ్ట్- మార్పులు చూసి కొనేయండి
సంక్రాంతి కానుకగా వస్తున్న టాటా పంచ్ ఫేస్‌లిఫ్ట్- మార్పులు చూసి కొనేయండి

వీడియోలు

Gollapudi Gannavaram Bypass Beauty | కొండల మధ్య నుంచి ఇంత చక్కని బైపాస్ రోడ్ చూశారా.! | ABP Desam
MI vs RCB Highlights WPL 2026 | ఉత్కంఠ పోరులో ఆర్సీబీ విక్టరీ
MI vs RCB WPL 2026 Harmanpreet Kaur | తమ ఓటమికి కారణం ఏంటో చెప్పిన కెప్టెన్
Shreyas in place of Tilak Ind vs NZ | తిలక్ స్థానంలో శ్రేయస్
Jay Shah about Rohit Sharma | రోహిత్ పై జై షా ప్రశంసలు

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Bhu Bharati Registration Scam: భూభారతి రిజిస్ట్రేషన్ అక్రమాలపై కేసు నమోదు.. సీఎస్ సహా పలువురికి లోకాయుక్త కీలక ఆదేశాలు
భూభారతి రిజిస్ట్రేషన్ అక్రమాలపై కేసు.. సీఎస్ సహా పలువురికి లోకాయుక్త కీలక ఆదేశాలు
Hyderabad Cyber ​​Crime: ట్రేడింగ్ పేరిట రెండున్నర కోట్ల మోసం - నిండా మునిగిన మాజీ ఐపీఎస్ భార్య
ట్రేడింగ్ పేరిట రెండున్నర కోట్ల మోసం - నిండా మునిగిన మాజీ ఐపీఎస్ భార్య
Konaseema Youth New Business: గోదావరి సంక్రాంతి సంబరాలు చూపడానికి అమలాపురం కుర్రాళ్ల సరికొత్త ప్రయత్నం! కాన్సెప్ట్ తెలిస్తే వెంటనే ఫోన్ చేస్తారు!
గోదావరి సంక్రాంతి సంబరాలు చూపడానికి అమలాపురం కుర్రాళ్ల సరికొత్త ప్రయత్నం! కాన్సెప్ట్ తెలిస్తే వెంటనే ఫోన్ చేస్తారు!
Tata Punch Facelift Features: సంక్రాంతి కానుకగా వస్తున్న టాటా పంచ్ ఫేస్‌లిఫ్ట్- మార్పులు చూసి కొనేయండి
సంక్రాంతి కానుకగా వస్తున్న టాటా పంచ్ ఫేస్‌లిఫ్ట్- మార్పులు చూసి కొనేయండి
Charter plane crashed: కుప్పకూలిన చార్టర్ విమానం - అయినా అందరూ సేఫ్ - ఒడిషాలో జరిగిన ఘటన వీడియో
కుప్పకూలిన చార్టర్ విమానం - అయినా అందరూ సేఫ్ - ఒడిషాలో జరిగిన ఘటన వీడియో
Pawan Kalyan Pithapuram Tour: పిఠాపురం వాసుల ముంపు కష్టాలు తీర్చిన పవన్ కళ్యాణ్ - గొల్లప్రోలు నూతన వంతెన పరిశీలన
పిఠాపురం వాసుల ముంపు కష్టాలు తీర్చిన పవన్ కళ్యాణ్ - గొల్లప్రోలు నూతన వంతెన పరిశీలన
The Raja Saab Reaction : ప్రభాస్ ఓల్డ్ లుక్ మిస్సింగ్ - 'ది రాజా సాబ్'లో 8 నిమిషాల సీన్స్ యాడ్... రివ్యూస్‌పై మారుతి రియాక్షన్
ప్రభాస్ ఓల్డ్ లుక్ మిస్సింగ్ - 'ది రాజా సాబ్'లో 8 నిమిషాల సీన్స్ యాడ్... రివ్యూస్‌పై మారుతి రియాక్షన్
Sankranti Special Trains: హైదరాబాద్- విజయవాడ మధ్య సంక్రాంతి స్పెషల్ ట్రైన్స్‌- టైమింగ్ సహా పూర్తి వివరాలు ఇవే
హైదరాబాద్- విజయవాడ మధ్య సంక్రాంతి స్పెషల్ ట్రైన్స్‌- టైమింగ్ సహా పూర్తి వివరాలు ఇవే
Embed widget