అన్వేషించండి

Uddanam : భారత్-పాక్ మ్యాచ్ లో ఉద్దానం సమస్యపై ప్లకార్డుల ప్రదర్శన

Uddanam : ఆసియా కప్ లో భాగంగా భారత్, పాక్ మధ్య ట్వీ20 మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్ ప్రారంభానికి ముందు ఓ ఆసక్తికర సంఘటన జరిగింది. ఏపీకి చెందిన పుల్లట రామ్ కుమార్ ఉద్దానం సమస్యపై ప్లకార్డులు ప్రదర్శించారు.

Uddanam : దుబాయ్‌లో ఆసియాకప్‌లో భాగంగా ఇండియా, పాకిస్తాన్ మధ్య హోరాహోరి ట్వీ20 పోరు జరుగుతోంది. ఈ మ్యాచ్ ను వీక్షించేందుకు భారత్ నుంచే కాకుండా ఇతర దేశాల్లో ఉన్న భారతీయులకు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఈ మ్యాచ్ చూసేందుకు ఏపీ వాసులు కూడా వెళ్లారు. శ్రీకాకుళం జిల్లా కవిటికు చెందిన పుల్లట రామ్‌కుమార్‌ యూఏఈలో ఉంటున్నారు. భారత్‌, పాకిస్థాన్‌కు మ్యాచ్ చూసేందుకు వచ్చిన ఆయన తన స్వస్థలం ఉద్దానం కిడ్నీ బాధితుల సమస్యలను వివరిస్తూ మ్యాచ్‌ ప్రారంభానికి ముందు మాట్లాడారు. 


Uddanam : భారత్-పాక్ మ్యాచ్ లో ఉద్దానం సమస్యపై ప్లకార్డుల ప్రదర్శన

ఉద్దానం కిడ్నీ వ్యాధి సమస్యలు

శ్రీకాకుళం జిల్లా ఉద్దానం పేరు చెప్పగానే కిడ్నీ వ్యాధులే గుర్తొస్తాయి. అయితే ఉద్దానం చూడడానికి కోనసీమ ప్రాంతంలా ఎంతో పంచదనంతో ఉంటుంది.  కానీ ఈ ప్రాంతాన్ని కిడ్నీ సమస్యలు వేధిస్తున్నాయి. శ్రీకాకుళం జిల్లాలోని ఇచ్ఛాపురం, కంచిలి, కవిటి, సోంపేట, పలాస, వజ్రపుకొత్తూరు, మందస మండలాలను కలిపి ఉద్దానంగా పిలుస్తారు. ఈ ప్రాంతంలో నివసిస్తున్న దాదాపు లక్షమంది జనాభాలో 35 శాతం మంది కిడ్నీ సమస్యలతో బాధపడుతున్నారు. వీరిలో దాదాపు 21 శాతం మంది 10 ఏళ్లకు పైగా కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నారని ఉద్దానంపై పరిశోధనలు చేసిన జార్జ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ గ్లోబల్ హెల్త్ తెలిపింది.

క్రియాటినిన్ శాతం 25 పైగా 

ఈ సంస్థ పరిశోధనలో రక్తంలోని సిరం క్రియాటినిన్ 1.2 మి.గ్రా/డెసీలీటర్ కంటే ఎక్కువగా ఉంటే కిడ్నీలు సరిగా పనిచేయడంలేదని తెలిసింది. ఉద్దానం ప్రాంతంలో సీరం క్రియాటినిన్ పాయింట్లు  25 మి.గ్రా/డెసిలీటర్ కూడా ఉన్నాయని గుర్తించారు. క్రియాటినిన్ 5 దాటితే వారికి డయాలసిస్ చేయాల్సిఉంటుందని వైద్యులు తెలిపారు. క్రియాటినిన్ పాయింట్లను బట్టి బాధితులు వారానికి రెండు, మూడుసార్లు కూడా డయాలసిస్‌ చేయించుకోవాల్సిన అవసరం ఉంటుంది.

రూ. 10 వేల ఆర్థిక సాయం 

శ్రీకాకుళం జిల్లాలోని పలాస, టెక్కలి, శ్రీకాకుళం, సోంపేట, కవిటి, పాలకొండలలో కిడ్నీ బాధితుల కోసం డయాలసిస్‌ కేంద్రాలు ఉన్నాయి. వీటిలో కిడ్నీ బాధితులు డయాలసిస్ చేయించుకుంటున్నారు. ఉద్దానం ప్రాంతంలో కిడ్నీ సమస్యలపై ఎప్పటి కప్పుడు పరిశోధనలు చేసి బాధితులను రక్షించేందుకు ప్రయత్నిస్తున్నారు అధికారులు. డయాలసిస్  బాధితుల కోసం ప్రభుత్వం ఆర్థిక సాయం అందిస్తోంది. కిడ్నీ బాధితులకు ఏపీ ప్రభుత్వం వైఎస్‌ఆర్‌ భరోసా పేరుతో రూ. 10 వేలు ఆర్థిక సాయం అందిస్తుంది. వ్యాధి తీవ్రత, క్రియాటినిన్ స్థాయి వంటి లెక్కలు, ఇతర నిబంధనలతో చాలా తక్కువ మందికి సాయం అందుతోందని బాధితులు ఆవేదన చెందుతున్నారు.  ఈ వ్యాధికి గురైన వారిలో కిడ్నీలు 35 నుంచి 50 శాతం పాడవుతాయని, తర్వాత 80 శాతం వరకు, ఆ తర్వాత కిడ్నీలు పనిచేయడం మానేస్తాయని వైద్యులు అంటున్నారు. దీంతో వీరికి డయాలసిస్ తప్పనిసరి అవుతోందని అంటున్నారు. 

Also Read : Vinayaka Chaviti 2022 : గణేష్ మండపాల చుట్టూ ఏపీ రాజకీయాలు, ఇంతకీ అనుమతి తీసుకోవాలా? వద్దా?

Also Read : Ganesh Chaturthi 2022 : గణేష్ మండపాల ఏర్పాటుకు రుసుం చెల్లించక్కర్లేదు- ఏపీ దేవాదాయ శాఖ

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Group 1 Results: గ్రూప్ 1 ప్రిలిమినరీ రిజల్ట్ విడుదల - ఇలా చెక్ చేసుకోండి
గ్రూప్ 1 ప్రిలిమినరీ రిజల్ట్ విడుదల - ఇలా చెక్ చేసుకోండి
Jon Landau Death: ‘టైటానిక్‘, ‘అవతార్‘ చిత్రాల నిర్మాత జాన్ మృతి - హాలీవుడ్‌లో ఘోర విషాదం
‘టైటానిక్‘, ‘అవతార్‘ చిత్రాల నిర్మాత జాన్ మృతి - హాలీవుడ్‌లో ఘోర విషాదం
The Cave Pub Case: కేవ్ పబ్‌లో వీకెండ్ డ్రగ్స్ పార్టీ, లిమిట్‌ దాటి డీజే సౌండ్ - మణికొండ పబ్ కేసులో కీలక వివరాలు
కేవ్ పబ్‌లో వీకెండ్ డ్రగ్స్ పార్టీ, లిమిట్‌ దాటి డీజే సౌండ్ - మణికొండ పబ్ కేసులో కీలక వివరాలు
Free Sand Scheme: ఏపీ ప్రజలకు ప్రభుత్వం గుడ్ న్యూస్ - ఇకపై ఇసుక ఫ్రీ, ఈ విషయాలు తెలుసా!
ఏపీ ప్రజలకు ప్రభుత్వం గుడ్ న్యూస్ - ఇకపై ఇసుక ఫ్రీ, ఈ విషయాలు తెలుసా!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Bobbili Maharaja Vintage Cars and Weapons | ఇలాంటి పాత, ఖరీదైన కార్లు మీకు ఎక్కడా కనిపించవు.! | ABPSingirikona Narasimha Swamy Temple | సింగిరికోన అడవిలో మహిమాన్విత నారసింహుడి ఆలయం చూశారా.! | ABP80 Years Old Man Completes 21 PGs | చదువు మీద ఈ పెద్దాయనకున్న గౌరవం చూస్తుంటే ముచ్చటేస్తుందిCM Chandrababu CM Revanth Reddy Meeting | అందరి కళ్లూ... తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశంపైనే

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Group 1 Results: గ్రూప్ 1 ప్రిలిమినరీ రిజల్ట్ విడుదల - ఇలా చెక్ చేసుకోండి
గ్రూప్ 1 ప్రిలిమినరీ రిజల్ట్ విడుదల - ఇలా చెక్ చేసుకోండి
Jon Landau Death: ‘టైటానిక్‘, ‘అవతార్‘ చిత్రాల నిర్మాత జాన్ మృతి - హాలీవుడ్‌లో ఘోర విషాదం
‘టైటానిక్‘, ‘అవతార్‘ చిత్రాల నిర్మాత జాన్ మృతి - హాలీవుడ్‌లో ఘోర విషాదం
The Cave Pub Case: కేవ్ పబ్‌లో వీకెండ్ డ్రగ్స్ పార్టీ, లిమిట్‌ దాటి డీజే సౌండ్ - మణికొండ పబ్ కేసులో కీలక వివరాలు
కేవ్ పబ్‌లో వీకెండ్ డ్రగ్స్ పార్టీ, లిమిట్‌ దాటి డీజే సౌండ్ - మణికొండ పబ్ కేసులో కీలక వివరాలు
Free Sand Scheme: ఏపీ ప్రజలకు ప్రభుత్వం గుడ్ న్యూస్ - ఇకపై ఇసుక ఫ్రీ, ఈ విషయాలు తెలుసా!
ఏపీ ప్రజలకు ప్రభుత్వం గుడ్ న్యూస్ - ఇకపై ఇసుక ఫ్రీ, ఈ విషయాలు తెలుసా!
Gudivada News: బట్టలిప్పేసి నగ్నంగా క్షుద్రపూజలు - గుడివాడలో బెదిరిపోయిన జనం!
బట్టలిప్పేసి నగ్నంగా క్షుద్రపూజలు - గుడివాడలో బెదిరిపోయిన జనం!
Hyderabad: మణికొండలోని ది కేవ్ పబ్‌పై దాడి, డ్రగ్స్ టెస్టుల్లో 24 మందికి పాజిటివ్
మణికొండలోని ది కేవ్ పబ్‌పై దాడి, డ్రగ్స్ టెస్టుల్లో 24 మందికి పాజిటివ్
Andhra Pradesh: ఏపీలో స్కూల్ విద్యార్థుల బ్యాగుల్లో గంజాయి, తెలంగాణతో కలిసి డ్రగ్స్‌పై యుద్ధం - అనగాని సత్యప్రసాద్
ఏపీలో స్కూల్ విద్యార్థుల బ్యాగుల్లో గంజాయి, తెలంగాణతో కలిసి డ్రగ్స్‌పై యుద్ధం - అనగాని సత్యప్రసాద్
Weather Latest Update: ఏపీ తీరం వద్ద ఆవర్తనం, తెలుగు రాష్ట్రాల్లో నేడు భారీ వర్షాలు - ఐఎండీ
ఏపీ తీరం వద్ద ఆవర్తనం, తెలుగు రాష్ట్రాల్లో నేడు భారీ వర్షాలు - ఐఎండీ
Embed widget