అన్వేషించండి

Vizianagaram : భూగర్భ జలాలూ కలుషితం - విజయనగరం జిల్లా గుర్లలో డయోరియా మరణాలు

Gurla mandal : విజయనగరం జిల్లా గుర్ల మండలంలో కలుషిత నీటి కారణంగా డయేరియా విజృంభిస్తోంది. ఐదుగురు మృతి చెందడంతో ప్రభుత్వం వైద్య శిబిరాలు ఏర్పాటు చేసింది.

Diarrhea is rampant due to polluted water in Gurla mandal : విజయనగరం జిల్లా గుర్ల మండలంలో డయేరియా విలయ తాండవం చేస్తుంది. వాంతులు, విరోచనాలతో నాలుగు రోజుల వ్యవధిలో ఏడుగురు మృతి చెందారు. ఇంకా గ్రామంలో డయోరియా అదుపులోకి రాలేదు. వంద మందికి పైగా రోగులు చికిత్స పొందుతున్నారు. డయోరియాను అదుపు చేసేందుకు అధికారులు ప్రత్యేక వైద్య శిబిరాలు ఏర్పాటుచేసి రోగులకు చికిత్స అందిస్తున్నారు.  

ప్రత్యేక వైద్య శిబిరాలు ఏర్పాటు 

గుర్ల మండలంలో ప్రత్యేక  వైద్య శిబిరం ఏర్పాటు చేసి డయోరియాను అదుపు చేసేందుకు ముమ్మర కసరత్తు చేస్తున్నారు. ప్రస్తుతం ఇరవై రెండు మంది రోగులు జిల్లా కేంద్రాసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మరొక ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండటంతో విశాఖ కేజీహెచ్ కు తరలించారు. రోగులు పరిస్థితి నిలకడగా ఉన్నట్లు చెబుతున్నారు వైద్యాధికారులు   గ్రామంలో ఏర్పాటు చేసిన వైద్య శిబిరంలో సుమారు 22 మంది, చీపురుపల్లి సిహెచ్సిలో  13 మంది, విజయనగరంలోని ప్రభుత్వ, ప్రయివేటు ఆసుపత్రుల్లో 15 మంది చొప్పున చికిత్స పొందు తున్నారు. ఇంకా కొంతమంది తమ ఇళ్లల్లోనే వాంతులు, విరేచనాలతో మంచాలపై ఉన్నారు. మృతుల సంఖ్య పెరుగుతుండడంతో గ్రామస్తులు భీతిల్లుతున్నారు.   గుర్ల, గోషాడ, పున్నుపురెడ్డిపేట, కెల్ల, గూడెం, కోటగండ్రేడు గ్రామాల్లో డయేరియా కేసులు ఉన్నట్టు  వెలుగులోకి వచ్చింది.   

కొనసాగుతున్న వైద్య శిబిరం   

గుర్ల గ్రామంలో వైద్య శిబిరం కొనసాగుతోంది. రోగులందరికీ డయేరియా నివారణ చికిత్స చేస్తున్నట్టు వైద్యాధికారులు చెబుతున్నారు. గ్రామంలో బోర్లు, కుళాయిల నీటి వాడకాన్ని నిషేదించారు. క్లోరినేషన్ చేసిన నీటి ట్యాంకర్లతో సరఫరా చేస్తున్నట్టు ఆర్డబ్ల్యుఎస్ ఎస్ఇ ఉమాశంకర్ చెబుతున్నారు. ఈ గ్రామాన్ని చిన్నతరహార పరిశ్రమల శాఖా మంత్రి కొండపల్లి శ్రీనివాస్ గురువారం ఉదయం సందర్శించారు. వైద్యాధికారులు, పంచాయతీరాజ్, RWS  అధికారులతో మాట్లాడి పరిస్థితిని తెలుసుకున్నారు. వివిధ ఆసుపత్రుల్లో బాధితులకు అందిస్తున్న వైద్యసహాయంపై మంత్రికి డిఎంహెచ్ఐ ఎస్.భాస్కరరావు వివరించారు. పారిశుధ్య నిర్వహణ పనులపై డిపిఒ వెంకటేశ్వరరావు తెలియజేశారు. గ్రామంలో తాగునీరు కలుషితం కావడానికి గల కారణాలపై మంత్రి అధికారులతో చర్చించారు. తాగునీటి పథకాల ద్వారా సరఫరా అవుతున్న నీటి నాణ్యతపై కూడా రిపోర్టులు సేకరించాలని మంత్రి ఆదేశించారు. మెరుగైన వైద్యసేవలు అందించేందుకు చర్యలు తీసుకున్నామని మంత్రి చెప్పారు.

వైసీపీ ఆగ్రహం 

 డయేరియా తో ఏడుగురు చనిపోవడం పై వైసిపి జిల్లా అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావు ఘాటుగా స్పందించారు. జిల్లా కేంద్రానికి పదిహేను కిలోమీటర్ల దూరంలో జరిగిన ఘటన దురదృష్టమని ఆవేదన వ్యక్తం చేశారు. నాలుగు నెలలుగా వైద్యం పడకేసిందని, వ్యవస్థలన్నీ నిర్వీర్యం అయ్యాయని మండిపడ్డారు. డయోరియా మరణాలన్ని ప్రభుత్వ మరణాలని, తక్షణమే బాధిత కుటుంబాలను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ప్రబలిన డయోరియా ఘటన పై ముఖ్యమంత్రి కార్యలయం కూడా వెంటనే స్పందించింది. బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించింది. జిల్లా కలెక్టర్ బి ఆర్ అంబేద్కర్ కూడా వెంటనే రంగంలోకి దిగి చర్యలకు చేపట్టారు. గుర్ల గ్రామాన్ని సందర్శించడంతో పాటు డయేరియా బాధితులను కూడా కలిసి పరిస్థితి పై ఆరా తీశారు. డయోరియా అదుపు చేసేందుకు అదనపు వైద్య సిబ్బందిని నియమించి గ్రామంలో క్లోరినేషన్ జరిపించారు. గ్రామంలో డయోరియా అదుపులోకి వచ్చే వరకు వైద్య ఉన్నతాధికారులు గ్రామంలో ఉండి పర్యవేక్షించాలని ఆదేశించారు. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Pawan Kalyan: చిలకలూరిపేట స్కూల్‌కు లైబ్రరీ, 25 కంప్యూటర్లు - ఇచ్చిన మాట ప్రకారం పంపిన పవన్ కల్యాణ్
చిలకలూరిపేట స్కూల్‌కు లైబ్రరీ, 25 కంప్యూటర్లు - ఇచ్చిన మాట ప్రకారం పంపిన పవన్ కల్యాణ్
Viral Video: ముస్లిం యువతి హిజాబ్ లాగిన బీహార్ సీఎం నితీష్‌- వీడియో వైరల్‌
ముస్లిం యువతి హిజాబ్ లాగిన బీహార్ సీఎం నితీష్‌- వీడియో వైరల్‌
Sircilla Sarpanchs: సర్పంచ్‌లుగా గెలిచిన వారికి న్యాయసాయం కోసం జిల్లాలో లీగల్ సెల్ - కేటీఆర్ నిర్ణయం
సర్పంచ్‌లుగా గెలిచిన వారికి న్యాయసాయం కోసం జిల్లాలో లీగల్ సెల్ - కేటీఆర్ నిర్ణయం
Prashant Kishor: దేశ రాజకీయాల్లో కీలక మార్పులు - ప్రియాంకా గాంధీతో ప్రశాంత్ కిషోర్ చర్చలు - కాంగ్రెస్‌లో చేరుతారా?
దేశ రాజకీయాల్లో కీలక మార్పులు - ప్రియాంకా గాంధీతో ప్రశాంత్ కిషోర్ చర్చలు - కాంగ్రెస్‌లో చేరుతారా?

వీడియోలు

Mancherial Durga Idol Viral Video | మంచిర్యాల గోదావరీ తీరాన బయటపడిన అమ్మవారు | ABP Desam
India vs South Africa 3rd T20 Records | మూడో టీ20లో 5 పెద్ద రికార్డులు
Hardik Pandya Records in 3rd T20 | చరిత్ర సృష్టించిన హార్దిక్
Shubman Gill in Ind vs SA 3rd T20 | మళ్లీ విఫలమైన శుభ్మన్ గిల్
Suryakumar Yadav about His Batting | తన ఫార్మ్ పై వరుస క్లారిటీ ఇచ్చిన సూర్య

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan: చిలకలూరిపేట స్కూల్‌కు లైబ్రరీ, 25 కంప్యూటర్లు - ఇచ్చిన మాట ప్రకారం పంపిన పవన్ కల్యాణ్
చిలకలూరిపేట స్కూల్‌కు లైబ్రరీ, 25 కంప్యూటర్లు - ఇచ్చిన మాట ప్రకారం పంపిన పవన్ కల్యాణ్
Viral Video: ముస్లిం యువతి హిజాబ్ లాగిన బీహార్ సీఎం నితీష్‌- వీడియో వైరల్‌
ముస్లిం యువతి హిజాబ్ లాగిన బీహార్ సీఎం నితీష్‌- వీడియో వైరల్‌
Sircilla Sarpanchs: సర్పంచ్‌లుగా గెలిచిన వారికి న్యాయసాయం కోసం జిల్లాలో లీగల్ సెల్ - కేటీఆర్ నిర్ణయం
సర్పంచ్‌లుగా గెలిచిన వారికి న్యాయసాయం కోసం జిల్లాలో లీగల్ సెల్ - కేటీఆర్ నిర్ణయం
Prashant Kishor: దేశ రాజకీయాల్లో కీలక మార్పులు - ప్రియాంకా గాంధీతో ప్రశాంత్ కిషోర్ చర్చలు - కాంగ్రెస్‌లో చేరుతారా?
దేశ రాజకీయాల్లో కీలక మార్పులు - ప్రియాంకా గాంధీతో ప్రశాంత్ కిషోర్ చర్చలు - కాంగ్రెస్‌లో చేరుతారా?
IPS officer Sanjay: ప్రభుత్వం నిధుల దుర్వినియోగం కేసులో ఐపీఎస్‌ సంజయ్‌కు బెయిల్‌ మంజూరు!
ప్రభుత్వం నిధుల దుర్వినియోగం కేసులో ఐపీఎస్‌ సంజయ్‌కు బెయిల్‌ మంజూరు!
Axar Patel Ruled Out : భారత జట్టు నుంచి ఆల్ రౌండర్ అవుట్, దక్షిణాఫ్రికాతో నాల్గో టీ20 మ్యాచ్ ఆడే జట్టు ఇదే!
భారత జట్టు నుంచి ఆల్ రౌండర్ అవుట్, దక్షిణాఫ్రికాతో నాల్గో టీ20 మ్యాచ్ ఆడే జట్టు ఇదే!
UP bride: పెళ్లి మండపంలో కారు డిమాండ్ చేసిన వరుడు - పెళ్లి రద్దు చేసుకున్న వధువు -అచ్చం సినిమాలో జరిగినట్లే
పెళ్లి మండపంలో కారు డిమాండ్ చేసిన వరుడు - పెళ్లి రద్దు చేసుకున్న వధువు -అచ్చం సినిమాలో జరిగినట్లే
Nuclear ash over the Himalayas: హిమాలయాలపై అమెరికా పెట్టిన అణుకుంపటి -ఎవరికీ తెలియని సంచలన విషయాలు ఇవిగో
హిమాలయాలపై అమెరికా పెట్టిన అణుకుంపటి -ఎవరికీ తెలియని సంచలన విషయాలు ఇవిగో
Embed widget