అన్వేషించండి

Pawan Kalyan: రోహింగ్యాల వల్ల భద్రతా సమస్యలు - తీరంలో అప్రమత్తత అవసరం - పవన్ కీలక వ్యాఖ్యలు

Rohingyas: రోహింగ్యాల వల్ల భద్రతా సమస్యలు వస్తున్నాయని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. అందుకే సీఎస్, డీజీపీలకు లేఖ రాశానన్నారు.

Deputy CM Pawan Kalyan:  మయన్మార్ నుంచి వలస వచ్చిన రోహింగ్యాల కారణంగా నిరుద్యోగం, అంతర్గత భద్రతా సమస్యలు ఏర్పడుతున్నాయని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. ఈ అంశంపై ఏపీ చీఫ్ సెక్రటరీతో పాటు డీజీపీకి కూడా లేఖ రాశారు  గన్నవరం ఎయిర్ పోర్టులో  తన లేఖ అంశంపై మీడియాతో మాట్లాడారు.  సరిహద్దుల్లో సైనికులు ఎంత భద్రంగా దేశాన్ని రక్షిస్తున్నారో, దేశం లోపల అంతర్గత భద్రతలో పోలీసు శాఖ కూడా నిరంతరం అప్రమత్తంగా ఉండటం కీలకం. దీనిపైనే రాష్ట్ర పోలీసులను, పరిపాలన సిబ్బందిని అప్రమత్తంగా ఉండాలని సూచనలు చేస్తూ లేఖ రాశానని  తెలిపారు. 

దక్షిణాది రాష్ట్రాలు ఉగ్రవాదుల సున్నితమైన లక్ష్యం అని గతంలో జరిగిన కిరాతక దాడుల్లో తేలిందని .. కోయంబత్తూరు, హైదరాబాద్ ప్రాంతాల్లో జరిగిన ఉగ్రదాడులు తల్చుకుంటే ఇప్పటికీ గుండె తరుక్కుపోతుందని చెప్పారు. పాలనా యంత్రంగంతో సమన్వయం చేసుకొని ఉగ్రవాద జాడలు కలిగిన వారి విషయంలో కఠినంగా వ్యవహరించాలని సూచించాననని ముఖ్యంగా వలసదారుల విషయంలో తగిన నిఘాను ఉంచితే జరగబోయే ప్రమాదాలను నివారించవచ్చునని స్పష్టం చేశారు. తీరంలో కొత్త వ్యక్తుల కదలికలు, వారి చర్యలను గమనించాల్సిన అవసరం ఉందన్నారు. పోలీసులు అజాగ్రత్తగా ఉండకుండా అంతర్గత భద్రత విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. 

రోహింగ్యాల మూలాలు మయన్మార్ లో ఉన్నాయి. అక్కడి  పశ్చిమ బెంగాల్ వైపు .. అక్కడి   ఆంధ్రప్రదేశ్ లోని పలు ప్రాంతాలకు విపరీతంగా రోహింగ్యాలు వలస వచ్చారు. ముఖ్యంగా 2017-18 ప్రాంతాల్లో  చాలా అధికంగా వీరి వలస జరిగింది.  ఇక్కడే స్థిర నివాసం ఏర్పరుచుకునేలా రేషన్, ఆధార్, ఓటరు కార్డులు పొందుతున్నారు. మన యువతకు చెందాల్సిన ఉద్యోగాలు, వ్యాపారాలు వారు చేసుకుంటున్నారు. రోహింగ్యాలకు స్థిర నివాసం ఏర్పరుచుకోవడంలో మన యంత్రాంగం నిర్లక్ష్యం ఉంది. వారికి ఎలా ఆధార్, ఓటరు, రేషన్ కార్డులు వస్తున్నాయి..? ఎవరు ఇస్తున్నారనేది తేలాలి. మన వ్యవస్థలోనే కొందరు వ్యక్తులు వారికి సహకరిస్తున్నారని అర్ధం అవుతుంది. రోహింగ్యాలు ఈ దేశ పౌరులుగా మారి, మన అవకాశాలను ఎలా కొల్లగొడుతున్నారనే దానిపై అందరిలోనూ చైతన్యం రావాలి. రోహింగ్యాలు స్థానికులుగా మారడానికి సహరిస్తున్న యంత్రాంగంపై కన్నేసి ఉంచాలని, అంతర్గత భద్రతలో మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలని పోలీసులకు బాధ్యత గల ఓ రాజకీయ పార్టీ అధ్యక్షుడిగా  లేఖ రాశానని తెలిపారు. 
 
సరిహద్దు అటవీ ప్రాంతాల్లో మదపుటేనుగుల గుంపులు పంట పొలాల్లోకి వస్తూ పంటకు, పొలాలలో ఉన్నవారి ప్రాణాలను తీస్తున్నాయి. ఇటీవల అలాంటి ఘటనలు చూశాం. ముఖ్యంగా చిత్తూరు, పార్వతీపురం మన్యం, అల్లూరు సీతారామరాజు జిల్లాల్లో ఈ సమస్య ఉంది. వీటికి పరిష్కారంగా గతంలోనే కర్ణాటక ప్రభుత్వంతో మాట్లాడి 6 కుంకీ ఏనుగుల కోసం ఒప్పందం చేసుకున్నాం. దీనికి అనుగుణంగా రాష్ట్రానికి 6 కుంకీ ఏనుగులను కర్ణాటక ప్రభుత్వం ఈ నెల 21వ తేదీన ఇవ్వనుంది. కుంకీ ఏనుగుల ద్వారా మదపుటేనుగుల విధ్వంసం నుంచి బయటపడగలం అనే నమ్మకం ఉంది. దీనికి సంబంధించి పూర్తి సహకారం కర్ణాటక ప్రభుత్వం అందించడం అభినందనీయం. దీంతో ఏనుగులతో వస్తున్న సమస్య చాలా వరకు తీరుతుందని భావిస్తున్నాను’’ అన్నారు.

టాప్ హెడ్ లైన్స్

Breaking News: గాదె సాయికృష్ణ కేసులో బిగ్ అప్‌డేట్! లొంగిపోయిన కానిస్టేబుల్స్ అశోక్‌,నాని
గాదె సాయికృష్ణ కేసులో బిగ్ అప్‌డేట్! లొంగిపోయిన కానిస్టేబుల్స్ అశోక్‌,నాని
Kakinada KIET College Invitation To CM Vijay: కాకినాడకు తమిళనాడు సీఎం విజయ్ - హోర్డింగులు పెట్టిన కాలేజీ - పబ్లిసిటీ గేమేనా?
కాకినాడకు తమిళనాడు సీఎం విజయ్ - హోర్డింగులు పెట్టిన కాలేజీ - పబ్లిసిటీ గేమేనా?
Veligonda Project: వెలిగొండ ప్రాజెక్టు నిర్వాసితులకు గుడ్‌న్యూస్.. ఖాతాల్లోకి పరిహారం నిధులు జమ
వెలిగొండ ప్రాజెక్టు నిర్వాసితులకు గుడ్‌న్యూస్.. ఖాతాల్లోకి పరిహారం నిధులు జమ
Bullet Train Corridors: హైదరాబాద్- చెన్నై, హైదరాబాద్- బెంగళూరు బుల్లెట్ రైళ్ల పనుల్లో తొలి అడుగు.. మార్కింగ్ చేస్తున్న అధికారులు
హైదరాబాద్- చెన్నై, హైదరాబాద్- బెంగళూరు బుల్లెట్ రైళ్ల పనుల్లో తొలి అడుగు.. మార్కింగ్ చేస్తున్న అధికారులు

వీడియోలు

IND W vs AUS W World Cup | టీ20 వరల్డ్ కప్ లో ముగిసిన భారత్ పోరాటం
IND vs IRE 2nd T20 Highlights | ఐర్లాండ్ చేతిలో భారత్ క్లీన్ స్వీప్
Vaibhav Debut in England Series | ఇంగ్లాండ్ సిరీస్ లో వైభవ్ సూర్యవంశీ ఎంట్రీ ?
Ricky Ponting To Replace Gautam Gambhir ? | త్వరలోనే టీమిండియాకు కొత్త హెడ్ కోచ్ ?
IND vs AUS Women's T20 World Cup 2026 | ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్ వెళ్తామా?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Ayodhya Ram Mandir Donation Theft Case: అయోధ్య రాముడి విరాళాల చోరీ కేసు నిందితులకు లాయర్స్ షాక్ - వారి తరపున వాదించకూడదని నిర్ణయం
అయోధ్య రాముడి విరాళాల చోరీ కేసు నిందితులకు లాయర్స్ షాక్ - వారి తరపున వాదించకూడదని నిర్ణయం
Kakinada KIET College Invitation To CM Vijay: కాకినాడకు తమిళనాడు సీఎం విజయ్ - హోర్డింగులు పెట్టిన కాలేజీ - పబ్లిసిటీ గేమేనా?
కాకినాడకు తమిళనాడు సీఎం విజయ్ - హోర్డింగులు పెట్టిన కాలేజీ - పబ్లిసిటీ గేమేనా?
Patancheru Real Estate: ఇంద్రేశంపై కన్నేసిన ఐటీ ఉద్యోగులు.. పటాన్ చెరు రియల్ ఎస్టేట్ ధరల్లో ఊహించని మార్పులు
ఇంద్రేశంపై కన్నేసిన ఐటీ ఉద్యోగులు.. పటాన్ చెరు రియల్ ఎస్టేట్ ధరల్లో ఊహించని మార్పులు
NBK111 Update : బాలయ్య NBK111 న్యూ షెడ్యూల్ - హైదరాబాద్ To కాకినాడ... రిలీజ్ ఎప్పుడంటే?
బాలయ్య NBK111 న్యూ షెడ్యూల్ - హైదరాబాద్ To కాకినాడ... రిలీజ్ ఎప్పుడంటే?
AIADMK MLA MR Vijayabhaskar Resigns: టీవీకే విజయ్ ప్లాన్‌కు అల్లాడిపోతున్న అన్నాడీఎంకే - మరో ఎమ్మెల్యే రాజీనామా - లైన్‌లో ఇంకా ఉన్నారా?
టీవీకే విజయ్ ప్లాన్‌కు అల్లాడిపోతున్న అన్నాడీఎంకే - మరో ఎమ్మెల్యే రాజీనామా - లైన్‌లో ఇంకా ఉన్నారా?
Kodangal Duplicate Votes: కొడంగల్‌లో 11 వేల కర్ణాటక వాసుల ఓట్లు - కవిత సంచలన ఆరోపణలు
కొడంగల్‌లో 11 వేల కర్ణాటక వాసుల ఓట్లు - కవిత సంచలన ఆరోపణలు
ENE Sequel Release Date : ఓవైపు కుర్రాళ్లు రెడీ... మరోవైపు నవ్వుల తుపాన్ - ఈ నగరానికి ఏమైంది? సీక్వెల్ రిలీజ్ డేట్ ఫిక్స్
ఓవైపు కుర్రాళ్లు రెడీ... మరోవైపు నవ్వుల తుపాన్ - ఈ నగరానికి ఏమైంది? సీక్వెల్ రిలీజ్ డేట్ ఫిక్స్
Rice Water For Face : 30 రోజులు రైస్ వాటర్‌ను ముఖానికి అప్లై చేస్తే కలిగే లాభాలివే.. ఎలా ఉపయోగించాలంటే
30 రోజులు రైస్ వాటర్‌ను ముఖానికి అప్లై చేస్తే కలిగే లాభాలివే.. ఎలా ఉపయోగించాలంటే
Embed widget