అన్వేషించండి

Deputy CM Pawan Kalyan: తుపాను బాధితులకు ఉదారంగా సాయం అందాలి - అంచనాలు పక్కాగా ఉండాలి - అధికారులకు డిప్యూటీ సీఎం ఆదేశం

Pawan Kalyan: మొంథా తుపాను సహాయ చర్యల్లో ఉదారంగా ఉండాలి.. సాయం విరివిగా ప్రజలకు అందేలా చూడాలని అధికారులను సీఎం ఆదేశించారు. పిఠాపురం వరదసాయంపై ప్రత్యేకంగా సమీక్షించారు.

Pawan Kalyan reviews:  కాకినాడ జిల్లా పరిధిలో మొంథా తుపాను ప్రభావంతో నష్టపోయిన ప్రతి ఒక్కరికీ స్వాంతన కలిగించి, న్యాయం చేయాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కాకినాడ జిల్లా అధికారులను ఆదేశించారు. పంట నష్టం, ఆస్తి నష్టం అంచనాలు పకడ్బందీగా రూపొందించాలని సూచించారు. ప్రభుత్వం నుంచి ప్రకటించిన సాయం నష్టపోయిన ప్రతి ఒక్కరికీ  అందేలా చూడాలని తెలిపారు. పిఠాపురం నియోజకవర్గం పరిధిలోని తీర ప్రాంత గ్రామాల్లో పారిశుధ్యం, తాగు నీటికి ఇబ్బందులు రాకుండా చూడాలని సూచించారు. సముద్రానికి ఆనుకుని ఉన్న మత్స్యకార గ్రామాల్లో పరిస్థితులపై ఎప్పటికప్పుడు నివేదికలు పంపాలని ఆదేశించారు.

శుక్రవారం కాకినాడ జిల్లా కలెక్టర్, ఎస్పీ, డీఆర్ఓ, ఆర్డీవోలు, పడా ప్రాజెక్ట్ డైరెక్టర్, పంచాయతీరాజ్, రోడ్లు భవనాల శాఖ, వ్యవసాయ, విద్యుత్ శాఖలతోపాటు వివిధ శాఖల జిల్లా స్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా తుపాను అనంతర పరిస్థితులపై సమీక్ష నిర్వహించారు. కాకినాడ జిల్లా పరిధిలో మొంథా తుపాను ప్రభావంతో జరిగిన నష్టం వివరాలపై ఆరా తీశారు. పిఠాపురం నియోజకవర్గంలో ప్రస్తుత పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. తుపాను అనంతరం తీసుకుంటున్న ఉపశమన చర్యలు, ఆస్తి, పంట నష్టం అంచనాలపై దిశా నిర్దేశం చేశారు.

కాకినాడ జిల్లా పరిధిలో మొత్తం 21 మండలాలు, ఏడు మున్సిపాలిటీలు ప్రభావితం అయినట్టు కలెక్టర్ షాన్ మోహన్  వివరించారు. మొత్తం 61 ఇళ్లు దెబ్బ తినగా, 41,932 కుటుంబాలపై మొంథా ప్రభావం చూపినట్టు తెలిపారు. అందులో 27,624 మత్స్యకార, 313 చేనేత కుటుంబాలు ఉన్నట్టు చెప్పారు. 21, 711 హెక్టార్లలో పంటకు నష్టం వాటిల్లిందని, 668 ఎకరాల్లో అరటి, బొప్పాయి తదితర ఉద్యాన పంటలు దెబ్బతిన్నాయని వివరించారు. మొత్తం 33,596 మంది రైతులు తుపాను కారణంగా నష్టపోయినట్టు తెలిపారు.  విద్యుత్ పరికరాలు, రోడ్లు కూడా పెద్ద ఎత్తున దెబ్బతిన్నట్టు వివరించారు. ఒక్క పిఠాపురం నియోజకవర్గంలోనే  వరి, ఉద్యాన పంటలు కలిపి 2,500 మంది రైతులు వరకు పంటలు నష్టపోయినట్టు చెప్పారు. అంతటా ఉపసమన చర్యలు చేపడుతున్నట్టు తెలిపారు. 

ముఖ్యంగా పంట నష్టం అంచనాలు రూపొందించే సమయంలో రైతుల పక్షాన నిలచి పక్కాగా నివేదికలు రూపొందించాలి. దీంతోపాటు ఆస్తి నష్టం వివరాలు కూడా రూపొందించాలని పవన్ సూచించారు.  దెబ్బ తిన్న ఇళ్లకు తక్షణం పరిహారం చెల్లించే ఏర్పాటు చేయాలి. తుపాను అనంతరం గ్రామాల్లో పల్లపు ప్రాంతాల్లో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలి. గ్రామాల వారీగా పారిశుధ్య కార్యక్రమాలు ఎంత వరకు వచ్చాయో ఎప్పటికప్పుడు నివేదికలు సమర్పించండి. ఎంత మేర రోడ్లు దెబ్బతిన్నాయో  గుర్తించి, పాక్షికంగా దెబ్బ తిన్న చోట వెంటనే మరమ్మతులు చేపట్టాలన్నారు.   ఉప్పాడ తీర ప్రాంతంలోని సుబ్బంపేట వద్ద సముద్ర కోత నుంచి రక్షణకు రాళ్లతో తాత్కాలిక రక్షణ గోడ ఏర్పాటు చేశాం. ఇది సముద్రపు కోతను నిలువరించగలిగింది. మిగిలిన తీర ప్రాంత గ్రామాలకు కూడా ఈ రాళ్ల గోడ నిర్మించే విధంగా చర్యలు తీసుకుంటాం. శాశ్వత రక్షణ గోడ నిర్మాణం పూర్తయ్యే వరకు ఇది తీర ప్రాంత గ్రామాలకు రక్షణ కల్పిస్తుంది. తీర ప్రాంత గ్రామాల రక్షణకి ప్రత్యేక ప్రణాళిక చేపట్టాలని ఆదేశించారు. 

 పిఠాపురం నియోజకవర్గంలో పరిస్థితులపై పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా సమీక్షించారు.  తుపాను అనంతరం కురిసిన భారీ వర్షానికి పలు ప్రాంతాలు నీట మునిగినట్టు సమాచారం వచ్చింది. పిఠాపురం పట్టణం పరిధిలోని కరివేపాకు పేట ప్రాంతం వద్ద పల్లపు ప్రాంతాల్లో వర్షం నీరు ఇంకా నిలిచి ఉన్నట్టు తెలిసింది. ఆ నీటిని తక్షణం బయటికి పంపే ప్రయత్నం చేయాలి.  ఏలేరు కాలువ గొర్రెకండె గట్టు వద్ద కొంత బలహీనంగా ఉన్నట్టు తెలిసింది. ముంపు ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో బలహీనంగా ఉన్న ప్రాంతాల్లో యుద్ధ ప్రాతిపదికన కాలువ గట్లు పటిష్టపరచాలన్నారు.  

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Breaking News: కర్ణాటక రాజకీయాల్లో కీలక పరిణామం.. మే 28న సిద్ధరామయ్య రాజీనామా!
కర్ణాటక రాజకీయాల్లో కీలక పరిణామం.. మే 28న సిద్ధరామయ్య రాజీనామా!
 Nara Lokesh Big Announcement: మహిళలకు 33శాతం సీట్లు  మహానాడులో చారిత్రాత్మక తీర్మానాన్ని ప్రవేశపెట్టిన లోకష్
మహిళలకు 33శాతం సీట్లు..!  మహానాడులో చారిత్రాత్మక తీర్మానాన్ని ప్రవేశపెట్టిన నారాలోకేష్
AP FDC Chairman: ఏపీ ఎఫ్‌డీసీ ఛైర్మన్ భరత్ భూషణ్‌కు ఛాంబర్ సత్కారం... చదలవాడ శ్రీనివాస రావుకు కూడా
ఏపీ ఎఫ్‌డీసీ ఛైర్మన్ భరత్ భూషణ్‌కు ఛాంబర్ సత్కారం... చదలవాడ శ్రీనివాస రావుకు కూడా
Nara Lokesh On Women Reservation: రిజర్వేషన్‌తో సంబంధం లేకుండా వచ్చే ఎన్నికల్లో మహిళలకు 33 శాతం సీట్లు- నారా లోకేష్ కీలక ప్రకటన
రిజర్వేషన్‌తో సంబంధం లేకుండా వచ్చే ఎన్నికల్లో మహిళలకు 33 శాతం సీట్లు- నారా లోకేష్ కీలక ప్రకటన

వీడియోలు

Dharmendra Receives Padma Vibhushan Award | ధర్మేంద్రకు పద్మవిభూషణ్ అవార్డు
Student Jokes On MI Nita Ambani | నీతా అంబానీ ముందే ముంబై ఇండియన్స్‌పై పంచ్
RCB vs GT IPL Match 2026 Prediction | నేడు బెంగళూరుతో తలపడుతున్న గుజరాత్ టైటాన్స్
Hardik Pandya Decoding 07:07 Insta Post | ముంబైని వీడుతున్న హార్దిక్ పాండ్యా ?
RR vs MI Match Playoffs IPL 2026 | కెప్టెన్సీపై రియాన్ పరాగ్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Byjus Founder Byju Raveendran: బైజూస్ వ్యవస్థాపకుడు రవీంద్రన్‌కు 6 నెలల జైలు, భారీ జరిమానా! రోడ్డున పడ్డ బిలియనీర్
బైజూస్ వ్యవస్థాపకుడు రవీంద్రన్‌కు 6 నెలల జైలు, భారీ జరిమానా! రోడ్డున పడ్డ బిలియనీర్
Chandrababu Speech At Mahanadu: జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పిన ఏకైక పార్టీ టీడీపీ, విజన్ పాలిటిక్స్‌కు నాంది: చంద్రబాబు
జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పిన ఏకైక పార్టీ టీడీపీ, విజన్ పాలిటిక్స్‌కు నాంది: చంద్రబాబు
BRS Aggressive Politics: బీఆర్ఎస్ యువనేతల దూకుడు.. ఆవేశంలో మునిగిపోతున్న ఆలోచన! లాభమా..నష్టమా?
బీఆర్ఎస్ యువనేతల దూకుడు.. ఆవేశంలో మునిగిపోతున్న ఆలోచన! లాభమా..నష్టమా?
Mahesh Babu: 'వారణాసి' తర్వాత... పాన్ ఇండియా యాక్షన్ ఫిలిమ్స్ దర్శకుడితో మహేష్ సినిమా?
'వారణాసి' తర్వాత... పాన్ ఇండియా యాక్షన్ ఫిలిమ్స్ దర్శకుడితో మహేష్ సినిమా?
Mancherial Crime News: రూ.2 కోట్ల ఇన్సురెన్స్ నగదు కోసం సుపారీ ఇచ్చి భర్త హత్య.. మంచిర్యాల జిల్లాలో దారుణం
రూ.2 కోట్ల ఇన్సురెన్స్ నగదు కోసం సుపారీ ఇచ్చి భర్త హత్య.. మంచిర్యాల జిల్లాలో దారుణం
Driving Without Insurance: ఇన్సూరెన్స్ లేకుండా వాహనం నడిపితే ఏమవుతుంది? పెరుగుతున్న జరిమానాలు, ప్రమాదాలు
ఇన్సూరెన్స్ లేకుండా వాహనం నడిపితే ఏమవుతుంది? పెరుగుతున్న జరిమానాలు, ప్రమాదాలు
AIADMK MLAs resignation: ఉపఎన్నికల కొరివితో గోక్కుంటున్న విజయ్ - తేడా వస్తే నిలబడటం కష్టమే ?
ఉపఎన్నికల కొరివితో గోక్కుంటున్న విజయ్ - తేడా వస్తే నిలబడటం కష్టమే ?
AP FDC Chairman: ఏపీ ఎఫ్‌డీసీ ఛైర్మన్ భరత్ భూషణ్‌కు ఛాంబర్ సత్కారం... చదలవాడ శ్రీనివాస రావుకు కూడా
ఏపీ ఎఫ్‌డీసీ ఛైర్మన్ భరత్ భూషణ్‌కు ఛాంబర్ సత్కారం... చదలవాడ శ్రీనివాస రావుకు కూడా
Embed widget