అన్వేషించండి

Alluri Sitarama Raju District News: అల్లూరి జిల్లాలో హృదయ విదారక ఘటన, మూడు రోజులుగా ఇంట్లోనే డెడ్ బాడీ

Alluri Sitarama Raju District News: అల్లూరి జిల్లాలో హృదయవిదారక ఘటన వెలుగు చూసింది. చిన్నారి మృతదేహానికి అంత్యక్రియలు చేసేందుకు రెండు రోజులు వేచి చూడాల్సిన దుస్థితి తలెత్తింది.

Alluri Sitarama Raju District News: అల్లూరి జిల్లాలో హృదయ విదారక ఘటన వెలుగు చూసింది. ఇంట్లో చిన్నారి ప్రాణాలు కోల్పోతే ఆ మృతదేహాన్ని అంత్యక్రియలు చేసేందుకు రెండు రోజులు వేచి చూడాల్సిన దుస్థితి.  గత కొద్ది రోజులుగా జిల్లాలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. శ్మశానం వెల్లడం కష్టమే అయినప్పటికీ ఈ కష్టాలు ఇప్పట్లో తీరదని చివరికి సాహసం చేసి ఆ మృతదేహాన్ని తరలించారు. కొండంత కష్టంలో కన్నీటితో ఆ మృతదేహానికి అంత్యక్రియలు చేశారు. 

గిరిజన గ్రామంలో పదేళ్ల బాలిక అనారోగ్యంతో మృతి చెందింది. ఊరికి, స్మశానానికి మధ్యలో వాగు ఉంది. వర్షాలకు వాగులు, వంకలు పొంగిపొర్లుతుండంతో మృతదేహాన్ని స్మశానానికి తరలించే మార్గం లేకపోయింది. దీంతో డెడ్ బాడీని మూడు రోజుల పాటు ఇంట్లోనే ఉంచుకోవాల్సిన పరిస్థితి తలెత్తింది. అయితే వరద ఉధృతి ఎంతకీ తగ్గకపోవడంతో మృతదేహంతో వాగును దాటి అంత్యక్రియలు నిర్వహించాల్సి వచ్చింది.

అల్లూరి జిల్లా ముంచంగిపుట్టు మండలంలోని లక్ష్మీపురం పంచాయతీ తుమ్ముడిపుట్టుకి చెందిన బురిడి భాను (10) మూడు రోజుల క్రితం అనారోగ్యంతో మృతి చెందింది.  అంత్యక్రియలు చేయడానికి గ్రామానికి దూరంగా వాగు అవతల శ్మశానం ఉంది. జిల్లాలో విస్తారంగా కురుస్తున్న వర్షాలకు ఊర పక్కనే ఉన్న వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో దానిని దాటి అంత్యక్రియలు నిర్వహించే అవకాశం లేక మూడు రోజుల పాటు మృతదేహాన్ని ఇంట్లోనే ఉంచారు. శవాన్ని ఇంట్లోనే పెట్టుకుని జాగారం చేశారు. 

గంటలు రోజులయ్యాయి. వరద మాత్రం తగ్గలేదు. దీంతో ఇక సాహసం చేయక తప్పలేదు. మూడు రోజులు గడుస్తున్నా వరద తగ్గకపోవడంతో బుధవారం గ్రామస్తులు ప్రాణాలకు తెగించి మృతదేహాన్ని వాగు దాటించి అంత్యక్రియలు నిర్వహించారు. దీనిపై గిరిజనలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వాలు మారినా తమ బ్రతుకులు మారడం లేదన్నారు. ఆస్పత్రికి వెళ్లాలన్నా, ఎవరైనా చనిపోతే శ్మశానానికి వెళ్లాలన్నా వాగులు దాటాల్సి వస్తోందని వాపోతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి తమకు రోడ్డు వసతి కల్పించాలన్నారు. 

ప్రభుత్వాలు మారుతున్నా అడవి బిడ్డలకు మాత్రం కనీస సౌకర్యాలు ఆమడ దూరంలోనే ఉన్నాయి. చంద్రుడిపై అడుగుపెట్టే స్థాయికి దేశం చేరుకున్నా అడవిని నమ్ముకున్న అల్లూరి జిల్లా పాడేరు ఏజెన్సీలో గిరిజనులకు కష్టాలు అన్ని ఇన్ని కావు. రోగం వచ్చిన కష్టం వచ్చినా తండాల నుంచి డోలి కష్టాలు తప్పడం లేదు. రాళ్లు కొండలు లోయలపై నుంచి డోలి కట్టి తరలించాల్సిన పరిస్థితులు ఉన్నాయి. రోడ్లు లేకున్నా వాగులు దాటుకుంటూ ఎలాగోలా ఒకరి కష్టాన్ని నలుగురు పంచుకొని ఒకరికి ఒకరు సాయం చేసుకుని తరలిస్తారు. 

వర్షం పడితే ఆ గిరిజనుల కష్టాలు వర్ణనాతీతం. వాగులు పొంగుతుంటాయి. గడ్డలు ఉదృతంగా ప్రవహిస్తుంటాయి. చాలా గ్రామాలకు రాకపోకలు నిలిచిపోతాయి. ఈ సమయంలో ఏ ఇంటిలోనైనా కష్టం వచ్చి పడితే.. ఇక ఆ బాధ, వ్యధ వర్ణించలేనిది. ఆసుపత్రికి తరలించాలన్న కష్టమే. పిల్లలు పాఠశాలలకు వెళ్లాలన్న సాహసం చేయాల్సిందే. కొన్ని సందర్భాల్లో వాగులో కొట్టుకుపోయిన పరిస్థితులు కూడా ఉన్నాయి. ఇప్పటికైనా తమ కష్టాలను గుర్తించి వంతెన సదుపాయం కల్పించాలని గిరిజనులు విన్నవిస్తున్నారు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Good News For Farmers: సన్న వడ్లకు క్వింటాకు రూ.500 బోనస్, రైతుల ఖాతాల్లో జమపై ప్రభుత్వం శుభవార్త
సన్న వడ్లకు క్వింటాకు రూ.500 బోనస్, రైతుల ఖాతాల్లో జమపై ప్రభుత్వం శుభవార్త
Tirumala Brahmotsavalu 2024: శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు శాస్త్రోక్తంగా అంకురార్పణ, Photo చూశారా
శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు శాస్త్రోక్తంగా అంకురార్పణ, Photo చూశారా
Ola Offer: రూ.50 వేలలోపే ఎలక్ట్రిక్ స్కూటర్ - అద్భుతమైన ఆఫర్ ఇస్తున్న ఓలా!
రూ.50 వేలలోపే ఎలక్ట్రిక్ స్కూటర్ - అద్భుతమైన ఆఫర్ ఇస్తున్న ఓలా!
Telangana News: కేటీఆర్ పై ఉట్నూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన ఆత్రం సుగుణక్క
కేటీఆర్ పై ఉట్నూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన ఆత్రం సుగుణక్క
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Rupai Village Story | ఈ ఊరి పేరు వెనుక స్టోరీ వింటే ఆశ్చర్యపోతారు | ABP DesamThalapathy69 Cast Reveal | తలపతి విజయ్ ఆఖరి సినిమా కథ ఇదేనా.? | ABP DesamRohit Sharma on Virat Kohli | టెస్ట్ క్రికెట్ లో టీమిండియా ప్రభంజనం..ఓపెన్ అయిన రోహిత్ | ABP Desamఇజ్రాయేల్‌పై ఇరాన్ భీకర దాడులు, నెతన్యాహు స్ట్రాంగ్ వార్నింగ్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Good News For Farmers: సన్న వడ్లకు క్వింటాకు రూ.500 బోనస్, రైతుల ఖాతాల్లో జమపై ప్రభుత్వం శుభవార్త
సన్న వడ్లకు క్వింటాకు రూ.500 బోనస్, రైతుల ఖాతాల్లో జమపై ప్రభుత్వం శుభవార్త
Tirumala Brahmotsavalu 2024: శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు శాస్త్రోక్తంగా అంకురార్పణ, Photo చూశారా
శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు శాస్త్రోక్తంగా అంకురార్పణ, Photo చూశారా
Ola Offer: రూ.50 వేలలోపే ఎలక్ట్రిక్ స్కూటర్ - అద్భుతమైన ఆఫర్ ఇస్తున్న ఓలా!
రూ.50 వేలలోపే ఎలక్ట్రిక్ స్కూటర్ - అద్భుతమైన ఆఫర్ ఇస్తున్న ఓలా!
Telangana News: కేటీఆర్ పై ఉట్నూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన ఆత్రం సుగుణక్క
కేటీఆర్ పై ఉట్నూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన ఆత్రం సుగుణక్క
Jio Best 5G Plan: జియో చవకైన 5జీ ప్లాన్ - రూ.200 లోపే అన్‌లిమిటెడ్ డేటా!
జియో చవకైన 5జీ ప్లాన్ - రూ.200 లోపే అన్‌లిమిటెడ్ డేటా!
Raashi Khanna : గ్రే సూట్​లో హాట్​ ఫోటోషూట్ చేసిన రాశీ ఖన్నా.. స్టైలిష్​ లుక్స్​ చూశారా?
గ్రే సూట్​లో హాట్​ ఫోటోషూట్ చేసిన రాశీ ఖన్నా.. స్టైలిష్​ లుక్స్​ చూశారా?
Nagarjuna Defamation: మంత్రి కొండా సురేఖపై పరువు నష్టం దావా వేసిన నాగార్జున, ఏం డిమాండ్ చేశారంటే!
మంత్రి కొండా సురేఖపై పరువు నష్టం దావా వేసిన నాగార్జున, ఏం డిమాండ్ చేశారంటే!
Happy Dussehra 2024 : దసరా శుభాకాంక్షలు సోషల్ మీడియాలో ఇలా చెప్పేయండి.. ఫేస్​బుక్, వాట్సాప్​ల​లో ఇవి షేర్ చేసేయండి
దసరా శుభాకాంక్షలు సోషల్ మీడియాలో ఇలా చెప్పేయండి.. ఫేస్​బుక్, వాట్సాప్​ల​లో ఇవి షేర్ చేసేయండి
Embed widget