అన్వేషించండి

AP TDP Vs BJP : ఏపీలో టీడీపీ, బీజేపీ మధ్య పరస్పర విమర్శలు - పొత్తు ప్రయత్నాలు తేలిపోయాయా ?

ఏపీలో టీడీపీ, బీజేపీ మధ్య విమర్శలు పెరుగుతున్నాయి. చంద్రబాబు , అచ్చెన్నపై ఏపీ బీజేపీ నేతలు విమర్శలు చేస్తున్నారు.

 

AP TDP Vs BJP : ఏపీలో టీడీపీ , బీజేపీ మధ్య పరస్పర విమర్శలు పెరుగుతున్నాయి.  జగన్ ప్రభుత్వం అవినీతి, అరాచకాల్లో మనిగిపోయిందని ఆ పార్టీ అగ్రనేతలు ప్రకటించారని మరి చర్యలెప్పుడు తీసుకుంటారని టీడీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబుతో పాటు .. ఏపీ టీడీప అధ్యక్షుడు అచ్చెన్నాయుడు పదే పదే ఈ విషయాలను ప్రకటిస్తున్నారు. దీనిపై ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు. ఆ పార్టీ ఏపీ ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి మండి పడుతున్నారు. అచ్చెన్నాయుడు తీరును విమర్శిస్తున్నారు. 

వైసీపీపై చర్యలు తీసుకోవాలని బీజేపీని డిమాండ్ చేస్తున్న అచ్చెన్నాయుడు 

రాష్ట్రంలో పాలన గాడి తప్పినప్పుడు ఆర్టికల్ 355 ప్రకారం కేంద్రం కల్పించుకునే అధికారం ఉందని... ఏపీలో రాష్ట్రపతి పాలన విధించాలని అచ్చెన్నాయుడు ఇటీవల డిమాండ్ చేస్తున్నారు. బీజేపీ అగ్రనేతలు ఏపీలో అరాచక పాలన ఉందని అన్నారని ఆయన అంటున్నారు.   ఏపీలో ప్రభుత్వ ఉగ్రవాదం, నేరాలపై అమిత్ షా తో పాటు నడ్డా కూడా ఆందోళన వ్యక్తం చేశారని టీడీపీ నేతలు వాదిస్తున్నారు.  వివేకా కేసులో సీబీఐపై రాష్ట్ర ప్రభుత్వం చేసిన దాడి  చేస్తోందని..  ఏపీలో దళితులు, బడుగు వర్గాలపై జరుగుతున్న హింస బీజేపీకి కనిపించడం లేదా అని ప్రశ్నిస్తున్నారు. 

అచ్చెన్న, చంద్రబాబుపై సోము వీర్రాజు విమర్శలు 
 
ఏపీ మాజీ సీఎం, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడిపై ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు సంచలన వ్యాఖ్యలు చేశారు.  గతంలో ఏపీలోకి సిబిఐని చంద్రబాబు అనుమతించలేదని, అమిత్ షాపై తిరుపతిలో దాడి జరిగితే చంద్రబాబు చర్యలు తీసుకోలేదని సోము విమర్శలు గుప్పించారు.  ఆ విషయాలపై మాట్లాడే దమ్ముందా అంటూ చంద్రబాబుకు సోము వీర్రాజు సవాల్ విసిరారు. ల చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు ప్రత్యేక హోదా వద్దన్నారని, చంద్రబాబు వ్యాఖ్యలపై ఆయనను మీడియా ప్రతినిధులు ఎందుకు ప్రశ్నించలేదని సోము నిలదీశారు.   సోము వ్యాఖ్యలపై ఏపీ టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు మండిపడ్డారు. రాష్ట్రాన్ని రావణ కాష్టంలాగా మార్చిన జగన్ పై కేంద్రం చర్యలు తీసుకోవాలని కోరితే సోముకు ఎందుకు అంత కోపం వచ్చిందని అచ్చెన్న ప్రశ్నించారు.రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వ విధ్వంసంపై, పాలనపై పోరాడాల్సిన సోము వీర్రాజు ఆ పార్టీని వెనకేసుకు రావడానికి ప్రయత్నించడం దారుణం అన్నారు.  

అచ్చెన్నాయుడుపై విష్ణువర్ధన్ రెడ్డి విమర్శలు 
 

అచ్చెన్నాయుడు తీరు  ఆడలేక మద్దెల ఓడన్నట్లుగా ఉందని విష్ణువర్ధన్ రెడ్డి మండిపడ్డారు.  వైసీపీపై పోరాడలేక బీజేపీపై నిందలేయడం చేతకాని తనమేనన్నారు.  వైసీపీపై పోరాడలేక  
బద్వేలు, ఆత్మకూరు ఉపఎన్నికల్లో  పోటీ చేయలేక పారిపోయారు..స్థానిక ఎన్నికల్లో నామినేషన్లలు వేసి మరీ పోటీకి దూరంగా ఉన్నారన్నారు.  ప్రతిపక్ష పార్టీగా వైసీపీ వైఫల్యాలపై నిలదీయలేకపోయారు.. ప్రతిపక్ష పార్టీగా అన్ని రకాలుగా వైఫల్యంగా చెందారని మండిపడ్డారు. ప్రతిపక్ష పార్టీ గా ఘోర వైఫల్యం చెందిన విషయాన్ని ప్రజలు గుర్తించారని.. దాన్ని కప్పి పుచ్చుకునేందుకు బీజేపీపై వ్యాఖ్యలు చేస్తున్నారని విమర్శించారు.  రాష్ట్రంలో శాంతిభద్రతల వైఫల్యంపై కేంద్రం జోక్యం చేసుకోవాలనుకుంటే 2018-19లోనే ఏపీలో రాష్ట్రపతి  పాలన విధించేవారని విష్ణువర్దన్ రెడ్డి గుర్తు చేశారు. అప్పట్లో  సాక్షాత్తూ హోంమంత్రి అమిత్ షా పై తిరుపతిలో రాళ్ల దాడి జరిగిందన్నారు.  ఓ వైపు పొత్తు కోసం ప్రయత్నిస్తూ.. మరో వైపు బీజేపీని దెబ్బతీసే కుట్రలను తెలుగుదేశం పార్టీ ఇప్పటికీ అమలు చేస్తోందని విష్ణువర్ధన్ రెడ్డి మండిపడ్డారు.   కేంద్రం .. ఏపీలో వైసీపీ ప్రభుత్వం చర్యలు తీసుకోలేదని.. ఆ రెండు పార్టీలు ఒకటేనన్న అభిప్రాయం కల్పించేందుకు ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు రోజూ అలాంటి ప్రకటనలు చేస్తున్నారన్నారు.   


పొత్తులు ఉంటాయనుకున్న పార్టీల మధ్య ఇలా మాటల మంటలు పెరుగుతూండటంతో.. ఏపీ రాజకీయాల్లో కొత్త పరిణామాలు చోటు చేసుకునే అవకాశం కనిపిస్తోంది. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Vizag Ganja Lady Don: సాఫ్ట్‌వేర్ ఉద్యోగం మానేసి గంజాయి స్మగ్లింగ్ డాన్‌గా మారిన రేణుక - ఏ సినిమా చూసి ఇన్‌స్పయిర్ అయిందో మరి !
సాఫ్ట్‌వేర్ ఉద్యోగం మానేసి గంజాయి స్మగ్లింగ్ డాన్‌గా మారిన రేణుక - ఏ సినిమా చూసి ఇన్‌స్పయిర్ అయిందో మరి !
New Year 2026: శుక్రవారం నుంచి న్యూ ఇయర్‌ ఈవెంట్స్‌పై నిఘా- తేడా వస్తే లైసెన్స్‌ రద్దు: హైదరాబాద్ సీపీ వార్నింగ్ 
శుక్రవారం నుంచి న్యూ ఇయర్‌ ఈవెంట్స్‌పై నిఘా- తేడా వస్తే లైసెన్స్‌ రద్దు: హైదరాబాద్ సీపీ వార్నింగ్ 
NTR Bharosa Pensions: ఏపీలో పింఛన్‌దారులకు ముందే కొత్త సంవత్సరం- డిసెంబర్ 31న ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ
ఏపీలో పింఛన్‌దారులకు ముందే కొత్త సంవత్సరం- డిసెంబర్ 31న ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ
PPP Kims: ఆదోని మెడికల్ కాలేజీకి టెండర్ వేసింది కిమ్స్ కాదు - ఏపీ ప్రభుత్వానికి మరో షాక్ !
ఆదోని మెడికల్ కాలేజీకి టెండర్ వేసింది కిమ్స్ కాదు - ఏపీ ప్రభుత్వానికి మరో షాక్ !

వీడియోలు

Union Minister Kishan Reddy Interview | త్వరలోనే ఆదిలాబాద్ ఎయిర్ పోర్ట్ అభివృద్ధి పనులు | ABP Desam
World Cup 2026 Squad BCCI Selectors | బీసీసీఐపై మాజీ కెప్టెన్ ఫైర్
Trolls on Gambhir about Rohit Form | గంభీర్ ను టార్గెట్ చేసిన హిట్ మ్యాన్ ఫ్యాన్స్
Ashwin about Shubman Gill T20 Career | మాజీ ప్లేయర్ అశ్విన్ సంచలన కామెంట్స్
India vs Sri Lanka 3rd T20 | నేడు భారత్‌, శ్రీలంక మూడో టీ20

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Vizag Ganja Lady Don: సాఫ్ట్‌వేర్ ఉద్యోగం మానేసి గంజాయి స్మగ్లింగ్ డాన్‌గా మారిన రేణుక - ఏ సినిమా చూసి ఇన్‌స్పయిర్ అయిందో మరి !
సాఫ్ట్‌వేర్ ఉద్యోగం మానేసి గంజాయి స్మగ్లింగ్ డాన్‌గా మారిన రేణుక - ఏ సినిమా చూసి ఇన్‌స్పయిర్ అయిందో మరి !
New Year 2026: శుక్రవారం నుంచి న్యూ ఇయర్‌ ఈవెంట్స్‌పై నిఘా- తేడా వస్తే లైసెన్స్‌ రద్దు: హైదరాబాద్ సీపీ వార్నింగ్ 
శుక్రవారం నుంచి న్యూ ఇయర్‌ ఈవెంట్స్‌పై నిఘా- తేడా వస్తే లైసెన్స్‌ రద్దు: హైదరాబాద్ సీపీ వార్నింగ్ 
NTR Bharosa Pensions: ఏపీలో పింఛన్‌దారులకు ముందే కొత్త సంవత్సరం- డిసెంబర్ 31న ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ
ఏపీలో పింఛన్‌దారులకు ముందే కొత్త సంవత్సరం- డిసెంబర్ 31న ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ
PPP Kims: ఆదోని మెడికల్ కాలేజీకి టెండర్ వేసింది కిమ్స్ కాదు - ఏపీ ప్రభుత్వానికి మరో షాక్ !
ఆదోని మెడికల్ కాలేజీకి టెండర్ వేసింది కిమ్స్ కాదు - ఏపీ ప్రభుత్వానికి మరో షాక్ !
India vs Sri Lanka Highlights: మూడో టి20లో టీమ్ ఇండియా ఘన విజయం- శ్రీలంకపై 8 వికెట్ల తేడాతో గెలిచి సిరీస్ ముందంజ
మూడో టి20లో టీమ్ ఇండియా ఘన విజయం- శ్రీలంకపై 8 వికెట్ల తేడాతో గెలిచి సిరీస్ ముందంజ
Rajasthan: ఉద్యోగినిపై గ్యాంగ్‌రేప్‌ కు పాల్పడిన ఐటీ కంపెనీ ఓనర్ - రాజస్థాన్‌లో కలకలం !
ఉద్యోగినిపై గ్యాంగ్‌రేప్‌ కు పాల్పడిన ఐటీ కంపెనీ ఓనర్ - రాజస్థాన్‌లో కలకలం !
Amaravathiki Aahwanam: హారర్ థ్రిల్లర్‌లో సురేఖ కుమార్తె... వీఎఫ్ఎక్స్ పనుల్లో 'అమరావతికి ఆహ్వానం'
హారర్ థ్రిల్లర్‌లో సురేఖ కుమార్తె... వీఎఫ్ఎక్స్ పనుల్లో 'అమరావతికి ఆహ్వానం'
APSRTC employees: ఆర్టీసీ మెడికల్ అన్‌ఫిట్‌గా మారిన ఉద్యోగులకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్ - వేరే శాఖల్లో ఉద్యోగాలివ్వాలని నిర్ణయం
ఆర్టీసీ మెడికల్ అన్‌ఫిట్‌గా మారిన ఉద్యోగులకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్ - వేరే శాఖల్లో ఉద్యోగాలివ్వాలని నిర్ణయం
Embed widget