అన్వేషించండి

Ambati Rayadu: వైసీపీకి అంబటి రాయుడు గుడ్ బై - కారణం ఇదేనంటూ ట్వీట్!

Andhra News: వైసీపీలో చేరిన 10 రోజులకే మాజీ క్రికెటర్ అంబటి రాయుడు ఆ పార్టీ నుంచి వైదొలగడం సంచలనం కలిగించింది. దీనిపై ఆయన స్పందిస్తూ తాజాగా ట్వీట్ చేశారు.

Ambati Rayudu Responds on Exit From Ysrcp: మాజీ క్రికెటర్ అంబటి రాయుడు (Ambati Rayudu) శనివారం వైసీపీని వీడుతున్నట్లు ట్విట్టర్ వేదికగా ప్రకటించడం సంచలనం కలిగించింది. ఈ నిర్ణయం అటు రాజకీయ వర్గాలు, ఇటు వైసీపీ శ్రేణులకు షాక్ ఇచ్చింది. ఈ అంశంపై సోషల్ మీడియాలోనూ విస్తృతంగా చర్చ సాగింది. అయితే, దీనిపై తాజాగా అంబటి రాయుడే స్వయంగా ట్విట్టర్ వేదికగా సమాధానమిచ్చారు. 'నేను ఈ నెల 20 నుంచి దుబాయ్ లో జరిగే ILt20లో ముంబై ఇండియన్స్ కు ప్రాతినిధ్యం వహిస్తున్నాను. వృత్తిపరమైన గేమ్ అడుతున్నప్పుడు రాజకీయాలకు దూరంగా ఉండాల్సిన అవసరం ఉంది.' అంటూ వివరణ ఇచ్చారు. 

ఆ ఒక్క ట్వీట్

డిసెంబర్ 28న సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన అంబటి రాయుడు ఈ నెల 6న (శనివారం) తాను పార్టీ వీడుతున్నట్లు ప్రకటించారు. వైసీపీ నుంచి బయటకు రావాలని నిర్ణయించుకున్నా. కొంతకాలం రాజకీయాలకు దూరంగా ఉండాలని భావిస్తున్నా. త్వరలో తదుపరి కార్యాచరణ ప్రకటిస్తా' అంటూ ట్వీట్ చేయడంతో అంతా షాకయ్యారు. వైసీపీ శ్రేణులు, అభిమానులు ఏమైందీ.? అంటూ సోషల్ మీడియా వేదికగా కామెంట్స్ చేశారు. గుంటూరు ఎంపీ టికెట్ ఇస్తామన్న హామీతోనే అంబటి రాయుడు వైసీపీలో చేరారని.. అయితే అది కేటాయించకపోవడంతోనే పార్టీని వీడుతున్నట్లు ప్రకటించారని వార్తలు హల్చల్ చేశాయి. ఆయనకు మచిలీపట్నం టికెట్ ఆఫర్ చేయగా అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. మరోవైపు, టీడీపీ సైతం అంబటి రాజీనామాపై స్పందించింది. 'జగన్ వంటి దుర్మార్గుడితో కలిసి మీరు మీ రాజకీయ ఇన్నింగ్స్ ఆడనందుకు సంతోషంగా ఉంది. మీ భవిష్యత్ ప్రయత్నాల్లో మీకు అంతా మంచే జరగాలని దేవుడిని కోరుకుంటున్నాం' అని ట్వీట్ చేస్తూ అంబటి రాయుడు ట్వీట్ ను ట్యాగ్ చేసింది. అధినేత చంద్రబాబు సైతం ఆదివారం తిరువూరు సభలో మాట్లాడుతూ.. అంబటి రాయుడు అంశంపై స్పందించారు. గుంటూరు ఎంపీ టికెట్ పేరుతో మాజీ క్రికెటర్ అంబటి రాయుడును మోసగించారని, ఆ టికెట్ మరొకరికి ఇవ్వడంతో ఆయన వైసీపీ నుంచి బయటకు వెళ్తున్నట్లు ప్రకటించారని అన్నారు. 

వైసీపీ నేతల స్పందన ఏంటంటే.?

అటు, అంబటి రాయుడు రాజీనామాపై స్పందించిన వైసీపీ నేతలు ఆయన్ను పార్టీలో చేరాలని ఎవరూ అడగలేదని.. ఆయనే ఒత్తిడి తెచ్చి మరీ వచ్చారని చెప్పారు. వైసీపీలోకి రాక ముందు వరకూ రాయుడు.. ఆ పార్టీ నేతలతో కలిసి గుంటూరు జిల్లాలో పర్యటించారు. సీఎం జగన్ కు మద్దతుగా ట్వీట్లు చేశారు. అంతా అనుకున్నట్లుగానే పార్టీలో చేరినా.. ఆ తర్వాత 10 రోజులకే వైదొలగుతూ నిర్ణయం తీసుకోవడం పట్ల అంతా విస్మయం వ్యక్తం చేశారు. 

Also Read: Chandrababu: 'జగన్ రివర్స్ పాలనలో 30 ఏళ్లు వెనక్కు ఏపీ' - మహిళలకు ఉచిత ప్రయాణం, నిరుద్యోగ భృతిపై చంద్రబాబు కీలక హామీ

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

CM Chandrababu: ఒక సామాన్యుడికి సీఎం చంద్రబాబు భరోసా.. చర్మకారుడి కుటుంబంలో సరికొత్త వెలుగులు
ఒక సామాన్యుడికి సీఎం చంద్రబాబు భరోసా.. చర్మకారుడి కుటుంబంలో సరికొత్త వెలుగులు
RTA Challan Link Scam: ఎమ్మెల్యేకే తప్పని సైబర్ షాక్.. చలాన్ పేరుతో లింక్, ఒక్క క్లిక్‌తో ₹12 లక్షలు మాయం
ఎమ్మెల్యేకే తప్పని సైబర్ షాక్.. చలాన్ పేరుతో లింక్, ఒక్క క్లిక్‌తో ₹12 లక్షలు మాయం
AP Ration Shops: ఏపీలో రేషన్ షాపుల్లో మళ్లీ కిరోసిన్ పంపిణీ.. గ్యాస్ కొరతతో ప్రభుత్వం నిర్ణయం
ఏపీలో రేషన్ షాపుల్లో మళ్లీ కిరోసిన్ పంపిణీ.. గ్యాస్ కొరతతో ప్రభుత్వం నిర్ణయం
ArcelorMittal Nippon Steel Plant: రేపే అనకాపల్లి స్టీల్ ప్లాంట్‌కి శంకుస్థాపన.. రూ.1.5 లక్షల కోట్లతో AM/NS ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్
రేపే అనకాపల్లి స్టీల్ ప్లాంట్‌కి శంకుస్థాపన.. 1.5 లక్షల కోట్లతో AM/NS ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్

వీడియోలు

Madhu Park Ridge Issue Updates | బండ్లగూడ కూల్చివేతలు గాంధీ సరోవర్ కోసం కాదు.!
Ashwin Predicts RCB to Win IPL 2026 | ఆర్‌సీబీపై అశ్విన్ ఆసక్తికర విశ్లేషణ
Tilak Varma about Mega Family | మెగాస్టార్ పై తిలక్ వర్మ ఎమోషనల్ కామెంట్స్
Mohammad Kaif Warns Gujarat Titans | గుజరాత్ టైటాన్స్‌కు మహమ్మద్ కైఫ్ వార్నింగ్
Ishan Kishan SRH Practice Match | ఇషాన్ కిషన్‌పై యువ బౌలర్ ఫైర్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Chandrababu: ఒక సామాన్యుడికి సీఎం చంద్రబాబు భరోసా.. చర్మకారుడి కుటుంబంలో సరికొత్త వెలుగులు
ఒక సామాన్యుడికి సీఎం చంద్రబాబు భరోసా.. చర్మకారుడి కుటుంబంలో సరికొత్త వెలుగులు
ArcelorMittal Nippon Steel Plant: రేపే అనకాపల్లి స్టీల్ ప్లాంట్‌కి శంకుస్థాపన.. రూ.1.5 లక్షల కోట్లతో AM/NS ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్
రేపే అనకాపల్లి స్టీల్ ప్లాంట్‌కి శంకుస్థాపన.. 1.5 లక్షల కోట్లతో AM/NS ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్
Moinabad Farmhouse Case: మొయినాబాద్ ఫాంహౌస్ కేసులో కీలక పరిణామం.. వీకెండ్ పార్టీలకు 20 సార్లు డ్రగ్స్ సరఫరా!
మొయినాబాద్ ఫాంహౌస్ కేసులో కీలక పరిణామం.. వీకెండ్ పార్టీలకు 20 సార్లు డ్రగ్స్ సరఫరా!
Simhadri Express Train: సింహాద్రి ఎక్స్ ప్రెస్ ప్రయాణికులకు ఊరట.. ట్రైన్ లో మార్పులు చేసిన రైల్వే
సింహాద్రి ఎక్స్ ప్రెస్ ప్రయాణికులకు ఊరట.. ట్రైన్ లో మార్పులు చేసిన రైల్వే
SRH Playing 11: ట్రావిస్ హెడ్- అభిషేక్ శర్మ ఓపెనింగ్.. సన్‌రైజర్స్ ప్లేయింగ్ XI ఇలా ఉండవచ్చు
ట్రావిస్ హెడ్- అభిషేక్ శర్మ ఓపెనింగ్.. SRH ప్లేయింగ్ XI ఇలా ఉండవచ్చు
World Happiness Report : ఇండియాలో జనాలు సంతోషంగా లేరట.. తాజా రిపోర్ట్​లో ఇంట్రెస్టింగ్ విషయాలు, టాప్​లో ఉన్న దేశమిదే
ఇండియాలో జనాలు సంతోషంగా లేరట.. తాజా రిపోర్ట్​లో ఇంట్రెస్టింగ్ విషయాలు, టాప్​లో ఉన్న దేశమిదే
CM Revanth Reddy: సిద్దిపేట జిల్లాలో ఆయిల్ పాం ఫ్యాక్టరీ ప్రారంభం సహా 775 కోట్ల పనులకు సీఎం రేవంత్ రెడ్డి శ్రీకారం
సిద్దిపేట జిల్లాలో ఆయిల్ పాం ఫ్యాక్టరీ ప్రారంభం సహా 775 కోట్ల పనులకు సీఎం రేవంత్ రెడ్డి శ్రీకారం
PM Modi Telangana Tour: ఏప్రిల్‌లో తెలంగాణకు రానున్న ప్రధాని మోదీ.. పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు
ఏప్రిల్‌లో తెలంగాణకు రానున్న ప్రధాని మోదీ.. పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు
Embed widget