అన్వేషించండి

TDP And Janasena: టీడీపీ-జనసేన పొత్తులో మరో కీలక స్టెప్, మూడ్రోజుల పాటు సమన్వయ సమావేశాలు

TDP And Janasena: రేపటి నుంచి మూడ్రోజుల పాటు టీడీపీ-జనసేన సమన్వయ సమావేశాలు జరగనున్నాయి. జిల్లా స్థాయి నేతలు భేటీ కానున్నారు.

TDP And Janasena: ఏపీలో రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ-జనసేన కలిసి పోటీలోకి దిగుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే పొత్తులపై రెండు పార్టీలు అధికారిక ప్రకటన చేయగా.. పరస్పర సమన్వయంతో ముందుకెళ్తున్నాయి. కలిసి సమన్వయ సమావేశాలు నిర్వహించుకోవడంతో పాటు ఎలా ముందుకెళ్లాలనే విషయంపై చర్చించుకుంటున్నారు. ఇటీవల రాజమండ్రిలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ భేటీ అయ్యారు. టీడీపీ-జనసేన మధ్య జరిగిన తొలి సమన్వయ సమావేశంలో అనేక అంశాలపై చర్చించారు.

జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేయాలని రెండు పార్టీలు నిర్ణయం తీసుకున్నాయి. ఏపీలోని కరువు పరిస్థితులు, రైతు సమస్యలపై ఆందోళనలు చేపట్టాలని నిర్ణయించారు. అలాగే చంద్రబాబు అరెస్ట్‌ను ఖండిస్తూ తీర్మానం కూడా చేశారు. దీంతో పాటు ఉమ్మడి మ్యానిఫెస్టోపై కూడా సుదీర్ఘంగా చర్చించారు. టీడీపీ ఇప్పటికే ఆరు గ్యారెంటీల పేరుతో మినీ మ్యానిఫెస్టో ప్రకటించింది. ఈ మ్యానిఫెస్టో బాగుందని కితాబిచ్చిన పవన్.. జనసేన సిద్దాంతాలకు అనుగుణంగా కొన్ని మార్పులు సూచించారు. ఈ మార్పులపై టీడీపీ కూడా ఏకాభిప్రాయం వ్యక్తం చేయగా.. నవంబర్ 1న ఉమ్మడి మ్యానిఫెస్టో ప్రకటించనున్నారు.

ఈ క్రమంలో పొత్తులో టీడీపీ, జనసేన మరో అడుగు ముందుకేశాయి. రాష్ట్ర స్థాయిలో రెండు పార్టీలు ఏకమవ్వగా.. జిల్లా స్థాయిలో కూడా నేతల మధ్య సమన్వయం కుదిరేలా కార్యాచరణ రూపొందించారు. అందులో భాగంగా ఆదివారం నుంచి మూడు రోజుల పాటు జిల్లా స్థాయిలో టీడీపీ-జనసేన సమన్వయ సమావేశాలు జరగనున్నాయి. 29, 30,31వ తేదీల్లో ఉమ్మడి జిల్లాల వారీగా సమావేశాలు నిర్వహించనున్నారు. ఇరు పార్టీల నుంచి ఒక్కొక్కరు చొప్పున సమన్వయ సమావేశాలకు సీనియర్ నేతలు హాజరుకానున్నారు. జిల్లా స్థాయిలో ఎలా కలిసి పనిచేయాలనే అంశంతో పాటు ప్రజా సమస్యలపై కలిసి పోరాటం చేయడంపై చర్చించనున్నారని తెలుస్తోంది. జిల్లా స్థాయిలో కూడా రెండు పార్టీల నేతల మధ్య సమన్వయం ఏర్పడటానికి ఈ సమావేశాలు కీలకంగా మారనున్నాయి. ఈ సమావేశాలను రాష్ట్రస్థాయి నేతలు పర్యవేక్షించనున్నారు.

ఈ సమావేశాల్లో ఎలాంటి అంశాలు చర్చించాలనే దానిపై ఇటీవల జనసేన పొలిటికల్ అపైర్స్ కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ జనసేన జిల్లా అధ్యక్షులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమావేశాలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. జిల్లా స్థాయిలో టీడీపీతో నేతలు సమన్వయం చేసుకోవాలని సూచించారు. ఈ సమావేశాల్లో చర్చించాల్సిన అంశాలపై పలు సూచనలు చేశారు. జిల్లా స్థాయిలో టీడీపీ నేతలను కలవాలని, వారితో కలిసి కార్యక్రమాలకు ప్లాన్ చేయాలని తెలిపారు. ఏపీలో ఎన్నికలకు కొద్ది నెలలు మాత్రమే సమయం ఉంది. దీంతో పార్టీలన్నీ స్పీడ్ పెంచాయి. మొన్నటివరకు లోకేష్ యువగళం పాదయాత్ర, చంద్రబాబు భవిష్యత్తుకు గ్యారెంటీ యాత్ర, పవన్ కళ్యాణ్ వారాహి విజయ యాత్రతో ప్రజల్లోనే ఉన్నారు. ఇటీవల చంద్రబాబు అరెస్ట్ తర్వాత టీడీపీ కార్యక్రమాలకు బ్రేక్ పడింది. చంద్రబాబు అరెస్ట్‌కు నిరసనగా టీడీపీ కార్యక్రమాలు చేపడుతుంది. ప్రజా సమస్యలపై ప్రశ్నించడంపై టీడీపీ దృష్టి పెట్టలేదు. చంద్రబాబు అరెస్టైన సమయంలో టీడీపీతో పొత్తుపై పవన్ చేసిన ప్రకటన తెలుగు తమ్ముళ్లకు కాస్త ధైర్యం ఇచ్చింది.

టాప్ హెడ్ లైన్స్

Nimmala Ramanaidu: 2027 జూలై వరకు తాగునీటికే మొదటి ప్రాధాన్యత: మంత్రి నిమ్మల రామానాయుడు
2027 జూలై వరకు తాగునీటికే మొదటి ప్రాధాన్యత: మంత్రి నిమ్మల రామానాయుడు
BC Reservations: బీసీల కోసం కేబినెట్ 3 చారిత్రాత్మక నిర్ణయాలు.. రేపు వైసీపీ కేసులు వేస్తుంది: సీఎం చంద్రబాబు
బీసీల కోసం కేబినెట్ 3 చారిత్రాత్మక నిర్ణయాలు.. రేపు వైసీపీ కేసులు వేస్తుంది: సీఎం చంద్రబాబు
AP Cabinet Decisions: స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సహా ఏపీ క్యాబినెట్‌ కీలక నిర్ణయాలివే
స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సహా ఏపీ క్యాబినెట్‌ కీలక నిర్ణయాలివే
Pawan Kalyan: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అలక! కీలక సమావేశాలకు డుమ్మా! బుజ్జగిస్తున్న చంద్రబాబు!
డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అలక! కీలక సమావేశాలకు డుమ్మా! బుజ్జగిస్తున్న చంద్రబాబు!

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nimmala Ramanaidu: 2027 జూలై వరకు తాగునీటికే మొదటి ప్రాధాన్యత: మంత్రి నిమ్మల రామానాయుడు
2027 జూలై వరకు తాగునీటికే మొదటి ప్రాధాన్యత: మంత్రి నిమ్మల రామానాయుడు
Satyendar Jain Arrest: ఢిల్లీ జల్ బోర్డ్ టెండర్ల కుంభకోణం.. మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ అరెస్ట్- బీజేపీపై కేజ్రీవాల్ ఆగ్రహం
ఢిల్లీ జల్ బోర్డ్ టెండర్ల కుంభకోణం.. మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ అరెస్ట్- బీజేపీపై కేజ్రీవాల్ ఆగ్రహం
AP Cabinet Decisions: స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సహా ఏపీ క్యాబినెట్‌ కీలక నిర్ణయాలివే
స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సహా ఏపీ క్యాబినెట్‌ కీలక నిర్ణయాలివే
CM Revanth Reddy: మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ ఎలాగో.. తెలంగాణలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్: సీఎం రేవంత్ రెడ్డి
మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ ఎలాగో.. తెలంగాణలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్: సీఎం రేవంత్ రెడ్డి
National Sports Awards: గాయ‌త్రీ , శ్రీకాంత్ లకు అర్జున అవార్డు.. మొత్తం 17 మందికి ఈ పురస్కారాలు, ఈసారి ఎవరికీ దక్కని ఖేల్ రత్న అవార్డు..  
గాయ‌త్రీ , శ్రీకాంత్ లకు అర్జున అవార్డు.. మొత్తం 17 మందికి ఈ పురస్కారాలు, ఈసారి ఎవరికీ దక్కని ఖేల్ రత్న అవార్డు..  
India Dominates Galle Test:  విజ‌యంపై క‌న్నేసిన భార‌త్, లంక ముందు 372 రన్స్ భారీ టార్గెట్.. ఛేజింగ్‌లో తేలిపోయిన ప్రత్యర్థి
విజ‌యంపై క‌న్నేసిన భార‌త్, లంక ముందు 372 రన్స్ భారీ టార్గెట్.. ఛేజింగ్‌లో తేలిపోయిన ప్రత్యర్థి
Maruti Alto K10 నుంచి Baleno వరకు.. కార్ల ధరలు పెంచిన మారుతి కంపెనీ
Maruti Alto K10 నుంచి Baleno వరకు.. కార్ల ధరలు పెంచిన మారుతి కంపెనీ
Congress Politics: వివాదాస్పద కాంగ్రెస్ నేతలపై అధిష్టానం చర్యలు తీసుకుంటుంది: మహేష్ కుమార్ గౌడ్
వివాదాస్పద కాంగ్రెస్ నేతలపై అధిష్టానం చర్యలు తీసుకుంటుంది: మహేష్ కుమార్ గౌడ్
Embed widget