అన్వేషించండి

TDP And Janasena: టీడీపీ-జనసేన పొత్తులో మరో కీలక స్టెప్, మూడ్రోజుల పాటు సమన్వయ సమావేశాలు

TDP And Janasena: రేపటి నుంచి మూడ్రోజుల పాటు టీడీపీ-జనసేన సమన్వయ సమావేశాలు జరగనున్నాయి. జిల్లా స్థాయి నేతలు భేటీ కానున్నారు.

TDP And Janasena: ఏపీలో రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ-జనసేన కలిసి పోటీలోకి దిగుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే పొత్తులపై రెండు పార్టీలు అధికారిక ప్రకటన చేయగా.. పరస్పర సమన్వయంతో ముందుకెళ్తున్నాయి. కలిసి సమన్వయ సమావేశాలు నిర్వహించుకోవడంతో పాటు ఎలా ముందుకెళ్లాలనే విషయంపై చర్చించుకుంటున్నారు. ఇటీవల రాజమండ్రిలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ భేటీ అయ్యారు. టీడీపీ-జనసేన మధ్య జరిగిన తొలి సమన్వయ సమావేశంలో అనేక అంశాలపై చర్చించారు.

జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేయాలని రెండు పార్టీలు నిర్ణయం తీసుకున్నాయి. ఏపీలోని కరువు పరిస్థితులు, రైతు సమస్యలపై ఆందోళనలు చేపట్టాలని నిర్ణయించారు. అలాగే చంద్రబాబు అరెస్ట్‌ను ఖండిస్తూ తీర్మానం కూడా చేశారు. దీంతో పాటు ఉమ్మడి మ్యానిఫెస్టోపై కూడా సుదీర్ఘంగా చర్చించారు. టీడీపీ ఇప్పటికే ఆరు గ్యారెంటీల పేరుతో మినీ మ్యానిఫెస్టో ప్రకటించింది. ఈ మ్యానిఫెస్టో బాగుందని కితాబిచ్చిన పవన్.. జనసేన సిద్దాంతాలకు అనుగుణంగా కొన్ని మార్పులు సూచించారు. ఈ మార్పులపై టీడీపీ కూడా ఏకాభిప్రాయం వ్యక్తం చేయగా.. నవంబర్ 1న ఉమ్మడి మ్యానిఫెస్టో ప్రకటించనున్నారు.

ఈ క్రమంలో పొత్తులో టీడీపీ, జనసేన మరో అడుగు ముందుకేశాయి. రాష్ట్ర స్థాయిలో రెండు పార్టీలు ఏకమవ్వగా.. జిల్లా స్థాయిలో కూడా నేతల మధ్య సమన్వయం కుదిరేలా కార్యాచరణ రూపొందించారు. అందులో భాగంగా ఆదివారం నుంచి మూడు రోజుల పాటు జిల్లా స్థాయిలో టీడీపీ-జనసేన సమన్వయ సమావేశాలు జరగనున్నాయి. 29, 30,31వ తేదీల్లో ఉమ్మడి జిల్లాల వారీగా సమావేశాలు నిర్వహించనున్నారు. ఇరు పార్టీల నుంచి ఒక్కొక్కరు చొప్పున సమన్వయ సమావేశాలకు సీనియర్ నేతలు హాజరుకానున్నారు. జిల్లా స్థాయిలో ఎలా కలిసి పనిచేయాలనే అంశంతో పాటు ప్రజా సమస్యలపై కలిసి పోరాటం చేయడంపై చర్చించనున్నారని తెలుస్తోంది. జిల్లా స్థాయిలో కూడా రెండు పార్టీల నేతల మధ్య సమన్వయం ఏర్పడటానికి ఈ సమావేశాలు కీలకంగా మారనున్నాయి. ఈ సమావేశాలను రాష్ట్రస్థాయి నేతలు పర్యవేక్షించనున్నారు.

ఈ సమావేశాల్లో ఎలాంటి అంశాలు చర్చించాలనే దానిపై ఇటీవల జనసేన పొలిటికల్ అపైర్స్ కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ జనసేన జిల్లా అధ్యక్షులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమావేశాలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. జిల్లా స్థాయిలో టీడీపీతో నేతలు సమన్వయం చేసుకోవాలని సూచించారు. ఈ సమావేశాల్లో చర్చించాల్సిన అంశాలపై పలు సూచనలు చేశారు. జిల్లా స్థాయిలో టీడీపీ నేతలను కలవాలని, వారితో కలిసి కార్యక్రమాలకు ప్లాన్ చేయాలని తెలిపారు. ఏపీలో ఎన్నికలకు కొద్ది నెలలు మాత్రమే సమయం ఉంది. దీంతో పార్టీలన్నీ స్పీడ్ పెంచాయి. మొన్నటివరకు లోకేష్ యువగళం పాదయాత్ర, చంద్రబాబు భవిష్యత్తుకు గ్యారెంటీ యాత్ర, పవన్ కళ్యాణ్ వారాహి విజయ యాత్రతో ప్రజల్లోనే ఉన్నారు. ఇటీవల చంద్రబాబు అరెస్ట్ తర్వాత టీడీపీ కార్యక్రమాలకు బ్రేక్ పడింది. చంద్రబాబు అరెస్ట్‌కు నిరసనగా టీడీపీ కార్యక్రమాలు చేపడుతుంది. ప్రజా సమస్యలపై ప్రశ్నించడంపై టీడీపీ దృష్టి పెట్టలేదు. చంద్రబాబు అరెస్టైన సమయంలో టీడీపీతో పొత్తుపై పవన్ చేసిన ప్రకటన తెలుగు తమ్ముళ్లకు కాస్త ధైర్యం ఇచ్చింది.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Inter students suicide: ఇంటర్ ఫెయిల్.. ముగ్గురు విద్యార్థుల ఆత్మహత్య, మరోచోట ఫినాయిల్ తాగిన విద్యార్థిని
ఇంటర్ ఫెయిల్.. ముగ్గురు విద్యార్థుల ఆత్మహత్య, మరోచోట ఫినాయిల్ తాగిన విద్యార్థిని
Pawan Kalyan: 'మార్క్ శంకర్ కోలుకుంటున్నాడు' - కుమారుడి ఆరోగ్య పరిస్థితిపై పవన్ కల్యాణ్ కీలక ప్రకటన
'మార్క్ శంకర్ కోలుకుంటున్నాడు' - కుమారుడి ఆరోగ్య పరిస్థితిపై పవన్ కల్యాణ్ కీలక ప్రకటన
Tirumala News: పాదరక్షలతో శ్రీవారి ఆలయంలోకి భక్తులు, నిర్లక్ష్యంగా ఉన్న సిబ్బందిపై వేటు వేసిన టీటీడీ
పాదరక్షలతో శ్రీవారి ఆలయంలోకి భక్తులు, నిర్లక్ష్యంగా ఉన్న సిబ్బందిపై వేటు వేసిన టీటీడీ
Akhanda 2: బాలకృష్ణ 'అఖండ 2'పై కీలక అప్ డేట్ - సినిమాకే హైలెట్‌గా యాక్షన్ సీన్స్, ఆ సన్నివేశం కోసం భారీ సెట్?
బాలకృష్ణ 'అఖండ 2'పై కీలక అప్ డేట్ - సినిమాకే హైలెట్‌గా యాక్షన్ సీన్స్, ఆ సన్నివేశం కోసం భారీ సెట్?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Travis Head vs Maxwell Stoinis Fight | ఐపీఎల్ మ్యాచులో ఆస్ట్రేలియన్ల మధ్య ఫైట్ | ABP DesamShreyas Iyer Reading Abhishek Sharma Paper | ఆ పేపర్ లో ఏముంది అభిషేక్ | ABP DesamAbhishek Sharma Thanking Yuvraj Singh | యువీ లేకపోతే నేను లేనంటున్న అభిషేక్ శర్మ | ABP DesamAbhishek Sharma 141 vs PBKS | IPL 2025 లో సంచలన సెంచరీ బాదిన అభిషేక్ శర్మ | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Inter students suicide: ఇంటర్ ఫెయిల్.. ముగ్గురు విద్యార్థుల ఆత్మహత్య, మరోచోట ఫినాయిల్ తాగిన విద్యార్థిని
ఇంటర్ ఫెయిల్.. ముగ్గురు విద్యార్థుల ఆత్మహత్య, మరోచోట ఫినాయిల్ తాగిన విద్యార్థిని
Pawan Kalyan: 'మార్క్ శంకర్ కోలుకుంటున్నాడు' - కుమారుడి ఆరోగ్య పరిస్థితిపై పవన్ కల్యాణ్ కీలక ప్రకటన
'మార్క్ శంకర్ కోలుకుంటున్నాడు' - కుమారుడి ఆరోగ్య పరిస్థితిపై పవన్ కల్యాణ్ కీలక ప్రకటన
Tirumala News: పాదరక్షలతో శ్రీవారి ఆలయంలోకి భక్తులు, నిర్లక్ష్యంగా ఉన్న సిబ్బందిపై వేటు వేసిన టీటీడీ
పాదరక్షలతో శ్రీవారి ఆలయంలోకి భక్తులు, నిర్లక్ష్యంగా ఉన్న సిబ్బందిపై వేటు వేసిన టీటీడీ
Akhanda 2: బాలకృష్ణ 'అఖండ 2'పై కీలక అప్ డేట్ - సినిమాకే హైలెట్‌గా యాక్షన్ సీన్స్, ఆ సన్నివేశం కోసం భారీ సెట్?
బాలకృష్ణ 'అఖండ 2'పై కీలక అప్ డేట్ - సినిమాకే హైలెట్‌గా యాక్షన్ సీన్స్, ఆ సన్నివేశం కోసం భారీ సెట్?
Abhishek Records: అభిషేక్ రికార్డుల జాత‌ర‌.. తాజాగా రెండు రికార్డులు నమోదు.. స‌న్ సెకండ్ హ‌య్యెస్ట్ ఛేజింగ్
అభిషేక్ రికార్డుల జాత‌ర‌.. తాజాగా రెండు రికార్డులు నమోదు.. స‌న్ సెకండ్ హ‌య్యెస్ట్ ఛేజింగ్
YSRCP PAC: వైఎస్ఆర్‌సీపీ రాజకీయ సలహా కమిటీ కన్వీనర్‌గా సజ్జల రామకృష్ణారెడ్డి - పీఏసీని ప్రకటించిన జగన్
వైఎస్ఆర్‌సీపీ రాజకీయ సలహా కమిటీ కన్వీనర్‌గా సజ్జల రామకృష్ణారెడ్డి - పీఏసీని ప్రకటించిన జగన్
Palm Sunday : మట్టల ఆదివారంని క్రైస్తవులు ఎందుకు జరుపుకుంటారో తెలుసా? పామ్ సండే చరిత్ర, ప్రాముఖ్యతలు ఇవే
మట్టల ఆదివారంని క్రైస్తవులు ఎందుకు జరుపుకుంటారో తెలుసా? పామ్ సండే చరిత్ర, ప్రాముఖ్యతలు ఇవే
Myanmar Earthquake: మయన్మార్‌లో మరో భారీ భూకంపం, వరుస భూ ప్రకంపనలతో వణికిపోతున్న ప్రజలు
మయన్మార్‌లో మరో భారీ భూకంపం, వరుస భూ ప్రకంపనలతో వణికిపోతున్న ప్రజలు
Embed widget