అన్వేషించండి

Jagananna Thodu Scheme: 'జగనన్న తోడు పథకం దేశానికే ఆదర్శం' - వారి ఖాతాల్లో డబ్బులు జమ చేసిన సీఎం జగన్

Andhra News: 'జగనన్న తోడు' పథకం కింద ఎనిమిదో విడత నిధులను సీఎం జగన్ విడుదల చేశారు. అర్హులైన చిరు వ్యాపారులకు, హస్త కళాకారులకు, చేతివృత్త కళాకారుల ఖాతాల్లో నిధులు విడుదల చేశారు.

CM Jagan Released Jagananna Thodu Funds: 'జగనన్న తోడు' పథకం దేశానికే ఆదర్శమని.. నిరుపేద చిరు వ్యాపారులు, హస్త కళాకారులు, సంప్రదాయ చేతి వృత్తుల వారు ఆర్థికంగా నిలదొక్కుకునేలా చేస్తుందని సీఎం జగన్ (CM Jagan) చెప్పారు. తాడేపల్లిలోని (Tadepalli) క్యాంపు కార్యాలయంలో గురువారం ఎనిమిదో విడత 'జగనన్న తోడు' (Jagananna Thodu) పథకం కింద నిధులను బటన్ నొక్కి విడుదల చేశారు. మొత్తం 16,73,576 మంది లబ్ధిదారుల్లో ఈ విడతలో వడ్డీ రీయింబర్స్ మెంట్ కింద 5.81 లక్షల మంది లబ్ధిదారులకు రూ.13.64 కోట్లు చెల్లించనున్నారు. పూర్తి వడ్డీ భారాన్ని ప్రభుత్వమే భరిస్తూ.. 3.95 లక్షల మందికి ఒక్కొక్కరికి రూ.10 వేలు, అంతకుపైన కలిపి రూ.417.94 కోట్ల వడ్డీ లేని రుణాలను ప్రభుత్వం అందిస్తోంది. మొత్తంగా రూ.431.58 కోట్లను లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో జమ చేశారు.

ఒక్కొక్కరికి ఏటా రూ.10 వేల రుణం సున్నా వడ్డీకే అందిస్తున్నామ‌ని, రుణాలను సకాలంలో చెల్లించిన వారికి ఏడాదికి మరో రూ.1,000 చొప్పున జోడిస్తూ రూ.13,000 వరకు వడ్డీలేని రుణం అందిస్తున్నామ‌ని సీఎం జగన్ తెలిపారు. ఇతరులపై ఆధారపడకుండా స్వయం ఉపాధితో జీవిస్తూ, మరో ఒకరిద్దరికి సైతం ఉపాధి కల్పిస్తున్న చిరు వ్యాపారులు అధిక వడ్డీల బారిన పడకుండా అండగా నిలుస్తున్నామని చెప్పారు. ఇప్పటి వరకు 16,73,580 చిరువ్యాపారులకు వడ్డీ  చెల్లించామని అన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా 87.13 శాతం అక్కచెల్లెమ్మలు లబ్ధి పొందారని, ఇది మహిళా సాధికారతలో మరో విప్లవమని పేర్కొన్నారు. 'దేశానికే ఈ కార్యక్రమం దిక్సూచిగా నిలిచింది. దేశం మొత్తం మీద పీఎం స్వనిధి పథకం కింద 58.63 లక్షల మందికి రుణాలు ఇస్తే.. రాష్ట్రంలోనే 16.74 లక్షల మంది ఉన్నారు. కేంద్రం రూ.10,220 కోట్లు ఇస్తే మన రాష్ట్రంలో రూ.3,337 కోట్లు ఇచ్చాం.' అని సీఎం పేర్కొన్నారు.

వాటితోనే సాధ్యం 

అన్ని రాష్ట్రాలు కలిపి కేంద్రం ఇచ్చే 7 శాతం రుణాలు ఇస్తుంటే.. ఒక్క మన రాష్ట్రంలోనే వడ్డీ రూపంలో రూ.88 కోట్లు చెల్లించినట్లు జగన్ తెలిపారు. సచివాలయ, వాలంటీర్‌ వ్యవస్థ వల్లే ఇది సాధ్యమైందని ఉద్ఘాటించారు. పారదర్శకంగా రుణాలు ఇప్పించగలుగుతున్నామని, అదే విధంగా వాళ్లు రుణాలు చెల్లించేలా ఈ వ్యవస్థ ఉపయోగపడిందని అన్నారు. రుణాల రికవరీ 90 శాతం పైగానే ఉందని తెలిపారు. నాలుగున్నరేళ్లలో గొప్ప అడుగులు పడ్డాయని పేర్కొన్నారు. ఇంకా ప్రజలకు మంచి చేసే అవకాశం కలగాలని ఆకాంక్షించారు.

'జగనన్న తోడు' అంటే.?

రాష్ట్రంలో నిరుపేదలైన చిరు వ్యాపారులు, హస్త కళాకారులు, సంప్రదాయ చేతి వృత్తుల వారు, హస్త కళాకారులు, సంప్రదాయ చేతి వృత్తుల వారు వారి కాళ్ల మీద నిలదొక్కుకునేలా ప్రభుత్వం ఆర్థిక సాయం అందిస్తోంది. ఒక్కొక్కరికి ఏటా రూ.10 వేల రుణాన్ని సున్నా వడ్డీకే ఇస్తుంది. రుణాలను సకాలంలో చెల్లించిన వారికి ఏడాదికి మరో రూ.1000 చొప్పున జోడిస్తూ రూ.13 వేల వరకూ వడ్డీ లేని రుణాన్ని అందిస్తున్నారు. 8వ విడతగా రూ.417.94 కోట్ల రుణంతో కలిపి ఇప్పటి వరకూ వడ్డీ లేని రుణాలు రూ.3,373.73 కోట్లు అందించారు. 10 అడుగుల పొడవు, 10 అడుగుల వెడల్పు స్థలంలో శాశ్వత లేక తాత్కాలిక షాపులు ఏర్పాటు చేసుకున్న వారు, తోపుడు బండ్లపై కూరగాయలు, పండ్లు, టిఫిన్స్ అమ్ముకుని జీవించే వారు, రోడ్ల పక్కన టిఫిన్ సెంటర్లు నిర్వహించే వారు, సైకిల్, మోటార్ సైకిళ్లు, ఆటోలపై వ్యాపారాలు చేసుకునే వారు, చేనేత, సంప్రదాయ చేతి వృత్తుల కళాకారులకు ఈ పథకం కింద ఆర్థిక సాయం అందిస్తున్నారు.

Also Read: Vijayawada News: కేశినేని నానికి చిన్ని స్ట్రాంగ్ కౌంటర్- కుటుంబ కలహాలపై క్లారిటీ

టాప్ హెడ్ లైన్స్

Breaking News: అఫ్గానిస్తాన్‌లో భారీ భూకంపం: ఢిల్లీ టు కాశ్మీర్ వణికిన ఉత్తరాది..
అఫ్గానిస్తాన్‌లో భారీ భూకంపం: ఢిల్లీ టు కాశ్మీర్ వణికిన ఉత్తరాది..
Made in Jonnagiri Gold Biscuits: బులియన్ మార్కెట్‌లోకి ‘మేడ్ ఇన్ జొన్నగిరి’ గోల్డ్ బిస్కెట్లు - ఏపీ మ్యాప్‌తో సరికొత్తగా కర్నూలు స్వచ్ఛమైన బంగారం!
బులియన్ మార్కెట్‌లోకి ‘మేడ్ ఇన్ జొన్నగిరి’ గోల్డ్ బిస్కెట్లు - ఏపీ మ్యాప్‌తో సరికొత్తగా కర్నూలు స్వచ్ఛమైన బంగారం!
Vizag Land Scam: డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణ రాజు స్థలం కబ్జా - విశాఖలో రూ. 2 కోట్ల ల్యాండ్ వివాదంపై కేసు నమోదు!
డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణ రాజు స్థలం కబ్జా - విశాఖలో రూ. 2 కోట్ల ల్యాండ్ వివాదంపై కేసు నమోదు!
Idupu Kayitham: ఆంధ్ర vs తెలంగాణ గొడవకు దారి తీసిన 'ఇడుపు కాయితం'... సబ్‌ టైటిల్స్‌ కావాలా? అసలేమిటీ చర్చ??
ఆంధ్ర vs తెలంగాణ గొడవకు దారి తీసిన 'ఇడుపు కాయితం'... సబ్‌ టైటిల్స్‌ కావాలా? అసలేమిటీ చర్చ??

వీడియోలు

Vinicius Jr History vs Scotland | రోనాల్డో రికార్డ్స్ సమం చేసిన వినీసియస్
IND W vs BAN W T20 World Cup Highlights | బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం
Shree Charani Creates History In T20 World Cup | శ్రీ చరణి హిస్టారికల్ రికార్డ్
94-Year-Old Woman Renounces US Citizenship | US సిటిజన్‌షిప్ వద్దని తిరిగొచ్చిన బామ్మ
Bhumika Ramesh Biography | మేఘసందేశం భూమి రియల్ లైఫ్ స్టోరీ ఇదే

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Afghanistan Earthquake: అఫ్గానిస్తాన్‌లో 6.2 తీవ్రతతో భారీ భూకంపం.. కాశ్మీర్ నుంచి ఢిల్లీ వరకు కంపించిన భూమి
అఫ్గానిస్తాన్‌లో 6.2 తీవ్రతతో భారీ భూకంపం.. కాశ్మీర్ నుంచి ఢిల్లీ వరకు కంపించిన భూమి
Made in Jonnagiri Gold Biscuits: బులియన్ మార్కెట్‌లోకి ‘మేడ్ ఇన్ జొన్నగిరి’ గోల్డ్ బిస్కెట్లు - ఏపీ మ్యాప్‌తో సరికొత్తగా కర్నూలు స్వచ్ఛమైన బంగారం!
బులియన్ మార్కెట్‌లోకి ‘మేడ్ ఇన్ జొన్నగిరి’ గోల్డ్ బిస్కెట్లు - ఏపీ మ్యాప్‌తో సరికొత్తగా కర్నూలు స్వచ్ఛమైన బంగారం!
KTR Politics: కమాండ్ కంట్రోల్ సెంటర్ చూసి మేఘాలయ సీఎం సంగ్మా షాక్: కేటీఆర్
కమాండ్ కంట్రోల్ సెంటర్ చూసి మేఘాలయ సీఎం సంగ్మా షాక్: కేటీఆర్
NRI Priest Arrest: పూజల పేరుతో లక్షలు కొట్టేసి అమెరికా పారిపోయిన దొంగ పూజారి - రిటర్న్‌లో ఎయిర్‌పోర్టులో దిగగానే పట్టేసిన పోలీసులు
పూజల పేరుతో లక్షలు కొట్టేసి అమెరికా పారిపోయిన దొంగ పూజారి - రిటర్న్‌లో ఎయిర్‌పోర్టులో దిగగానే పట్టేసిన పోలీసులు
Vizag Land Scam: డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణ రాజు స్థలం కబ్జా - విశాఖలో రూ. 2 కోట్ల ల్యాండ్ వివాదంపై కేసు నమోదు!
డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణ రాజు స్థలం కబ్జా - విశాఖలో రూ. 2 కోట్ల ల్యాండ్ వివాదంపై కేసు నమోదు!
Jai Moondra Cricket Career: ఐర్లాండ్ తరపున దుమ్మురేపిన రాజస్థాన్ క్రికెటర్ జై ముంద్రా.. అసలు ఎవరితను ?
ఐర్లాండ్ తరపున దుమ్మురేపిన రాజస్థాన్ క్రికెటర్ జై ముంద్రా.. అసలు ఎవరితను ?
Pawan Kalyan Comments :
"క్రిమినల్స్‌కి వత్తాసు పలికే వైసీపీ కమిట్‌మెంట్‌ చూసి ముచ్చటేస్తుంది- వారు అలానే ఉండి, మరింత కరిగిపోవాలి" పవన్ కామెంట్స్ వైరల్ 
Suhas as Saattapuli: సాట్టపులిగా సుహాస్... 80 కోట్ల బడ్జెట్ సినిమాలో విలన్ రోల్!
సాట్టపులిగా సుహాస్... 80 కోట్ల బడ్జెట్ సినిమాలో విలన్ రోల్!
Embed widget