By: ABP Desam | Updated at : 17 Mar 2023 03:19 PM (IST)
సీఎం జగన్, పీఎం మోదీ (ఫైల్ ఫోటో)
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రధాని నరేంద్ర మోదీని కలిశారు. గురువారం (మార్చి 16) సాయంత్రం ఆయన ఢిల్లీకి బయలుదేరి వెళ్లిన సంగతి తెలిసిందే. పార్లమెంటు ఆవరణలోని ప్రధాని కార్యాలయంలో జగన్, మోదీతో భేటీ అయ్యారు. రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై ప్రధాని మోదీతో చర్చించారు. కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ సీఎం జగన్కు పార్లమెంటులో స్వాగతం పలికారు. వైఎస్ఆర్ సీపీ ఎంపీలు కూడా సీఎం జగన్ వెంట ఉన్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కూడా జగన్ కలవనున్నారు.
మధ్యాహ్నం 3 గంటలకు సీఎం జగన్ తిరుగు ప్రయాణం
ముఖ్యమంత్రి కార్యాలయం వెల్లడించిన వివరాల ప్రకారం.. కేంద్ర మంత్రి అమిత్ షాను కలిసిన అనంతరం సీఎం జగన్ విజయవాడకు తిరుగు ప్రయాణం కానున్నారు. మూడు గంటలకు జన్ పథ్ నివాసం నుంచి బయలుదేరి 3.30 గంటలకు ఢిల్లీ ఎయిర్ పోర్టుకు చేరుకొని 3.45 గంటలకు గన్నవరం ఎయిర్ పోర్టుకు ప్రత్యేక విమానంలో రానున్నారు. 6 గంటలకు రోడ్డు మార్గం ద్వారా తాడేపల్లి క్యాంపు కార్యాలయానికి చేరుకోనున్నారు.
టీడీపీ నేతల వ్యంగ్యపు ట్వీట్లు
సీఎం జగన్ ఢిల్లీ పర్యటనపై టీడీపీ నేతలు వ్యంగ్యపు ట్వీట్లు చేస్తున్నారు. ఓ వైపు వైఎస్ వివేకా హత్య కేసు.. ఇంకో వైపు లిక్కర్ కేసు.. రెండు కేసుల్లో సీబీఐ, ఈడీ దూకుడుగా ఉన్నాయి. అందుకే జగన్ ఢిల్లీ పర్యటన ప్రాధాన్యం సంతరించుకుందని టీడీపీ నేతలు అంటున్నారు.
Palnadu News : పల్నాడు జిల్లాలో విషాదం, నదిలో ఈతకు దిగి ఇద్దరు యువకులు మృతి
CM Jagan Party Meet : ఏప్రిల్ 3న పార్టీ నేతలతో సీఎం జగన్ కీలక సమావేశం, కఠిన నిర్ణయాలుంటాయని జోరుగా ప్రచారం
Mekapati challenge : దమ్ముంటే రండి, నన్ను తరిమేయండి- నడిరోడ్డుపై కూర్చీ వేసుకుని కూర్చొన్న ఎమ్మెల్యే మేకపాటి
అచ్చెన్న ఫ్లెక్సీలపై దువ్వాడ పోస్టర్లు -మండిపడుతున్న తెలుగు తమ్ముళ్లు
CM Jagan : రుణాలపై కేంద్రం ఆంక్షలు విధించడం సరికాదు, నిర్మలా సీతారామన్ దృష్టికి తీసుకెళ్లిన సీఎం జగన్
Manchu Vishnu: మనోజ్తో గొడవపై మంచు విష్ణు ఊహించని ట్విస్ట్ - తాజా వీడియో చూస్తే తల పట్టుకుంటారు!
Mla Raja Singh : ఎమ్మెల్యే రాజాసింగ్ పై ముంబయిలో కేసు నమోదు
Data Theft ED Case : సైబరాబాద్ డేటా చోరీ కేసులో ఈడీ ఎంటర్, మనీలాండరింగ్ కింద కేసు నమోదు
IPL 2023: ఐపీఎల్ ట్రోఫీతో కెప్టెన్ల గ్రూప్ ఫొటో! మరి రోహిత్ ఎక్కడా?