అన్వేషించండి

AP CM Jagan: ఢిల్లీ బయల్దేరిన సీఎం జగన్, రేపు ప్రధాని మోదీతో భేటీ!

Jagan Delhi Tour: సీఎం జగన్ ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. చంద్రబాబు ఢిల్లీ నుంచి రాగానే.. జగన్ వెళ్లడం ఆసక్తికరంగా మారింది.

Jagan In Delhi: ఏపీ సీఎం జగన్ ఢిల్లీకి బయల్దేరారు. గురువారం సాయంత్రం తాడేపల్లిలోని తన నివాసం నుంచి గన్నవరం ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్న జగన్.. అక్కడ నుంచి స్పెషల్ ఫ్లైట్‌లో హస్తినకు పయనమయ్యారు. రాత్రికి జగన్ ఢిల్లీకి చేరుకోనుండగా.. అనంతరం రోడ్డు నెంబర్ 1లోని జన్ ‌పథ్ నివాసంలో బస చేయనున్నారు. శుక్రవారం ఉదయం ప్రధాని మోదీతో జగన్ భేటీ కానున్నారు. ఈ మేరకు మోదీ అపాయింట్‌మెంట్ ఇప్పటికే ఫిక్స్ అయింది. గురువారం మధ్యాహ్నం ప్రధాని కార్యాలయం నుంచి ఫోన్ రావడంతో హుటాహుటిన జగన్ ఢిల్లీకి బయల్దేరారు. ఏపీ అభివృద్ది, రాష్ట్రానికి రావాల్సిన నిధులు, విభజన  హామీలపై మోదీతో జగన్ చర్చిస్తారని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. పోలవరం నిధులు, కేంద్రం నుంచి రావాల్సిన పన్ను వాటా చెల్లింపులు, విశాఖ స్టాల్ ప్లాంట్ అంశాలపై ప్రధానితో సీఎం మాట్లాడతారని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.

అలాగే ఏపీలో మెడికల్ కాలేజీల ఏర్పాటు కోసం కేంద్రం నుంచి మరింత వాటా, ప్రత్యేక హోదాపై మోదీకి జగన్ వినతిపత్రం అందించనున్నారని తెలుస్తోంది. దీంతో పాటు ఎన్నికలకు మరో రెండు నెలలు మాత్రమే సమయం ఉండటంతో ఏపీలోని రాజకీయ పరిణామాలను కేంద్రానికి వివరించే అవకాశముంది. మోదీతో పాటు పలువురు కేంద్ర మంత్రులను కూడా జగన్ కలవనున్నారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులపై కేబినెట్ మంత్రులతో చర్చించనున్నారు. ప్రభుత్వ పరంగా అధికారిక పర్యటన అని చెబుతున్నప్పటికీ.. ఇది రాజకీయంగా ప్రాధాన్యతను సంతరించుకుంది. ముందుగా ఎలాంటి షెడ్యూల్ లేకుండా హఠాత్తుగా ప్రధాని నుంచి పిలుపురావడం ఏపీ రాజకీయాల్లో ఉత్కంఠ రేపుతోంది. బుధవారం రాత్రి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో టీడీపీ అధినేత చంద్రబాబు భేటీ అయ్యారు. మరుసటి రోజే మధ్యాహ్నమే జగన్‌కు మోదీ నుంచి కబురు రావడం కీలకంగా మారింది.

అమిత్ షా నుంచి పిలుపురావడంతో మంగళవారం సాయంత్రం హస్తిన పర్యటనకు చంద్రబాబు వెళ్లారు. బుధవారం రాత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో జేపీ నడ్డా కూడా పాల్గొన్నారు. ఏపీలోని పొత్తులపై వారి మధ్య చర్చ జరిగినట్లు తెలుస్తోంది. దాదాపు గంటన్నర పాటు ఈ భేటీ జరిగింది. ఏపీలో టీడీపీ-జనసేన-బీజేపీతో పొత్తుపై ప్రధానంగా చర్చించుకున్నట్లు తెలుస్తోంది. అలాగే  సీట్ల సర్దుబాటుపై కూడా ప్రాథమికంగా చర్చలు జరిగినట్లు రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. మూడు పార్టీల పొత్తు దాదాపు ఖరారైనట్లు ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో మోదీని జగన్ కలవనుండటం ఆసక్తిని రేకెత్తిస్తోంది. దీంతో రానున్న రోజుల్లో ఏపీ రాజకీయాల్లో ఎలాంటి ట్విస్ట్‌లు చోటుచేసుకుంటాయనేది ఉత్కంఠ రేపుతోంది. ఏపీ అధికార, ప్రతిపక్ష నేతలు ఇద్దరూ ఢిల్లీ టూర్లకు వెళ్లడంతో.. రాష్ట్ర రాజకీయాలన్నీ హస్తిన చుట్టూనే తిరుగుతున్నాయి.  ఈ పర్యటనలతో ఏపీలో పొత్తులపై త్వరలో క్లారిటీ వచ్చే అవకాశముంది. అమిత్ షాతో భేటీ తర్వాత చంద్రబాబు మీడియాతో మాట్లాడకుండానే వెళ్లిపోయారు. త్వరలోనే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఢిల్లీ టూర్ ఉంటుందనే వార్తలొస్తున్నాయి. పవన్ ఢిల్లీ పర్యటన తర్వాత పొత్తులపై పూర్తి స్పష్టత రానుందని తెలుస్తోంది.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

AP MLA son arrested in drug case: హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
India News: ఈ పరిస్థితుల్లో వెనిజులాకు వెళ్లవద్దు.. పౌరులకు భారత ప్రభుత్వం అడ్వైజరీ
ఈ పరిస్థితుల్లో వెనిజులాకు వెళ్లవద్దు.. పౌరులకు భారత ప్రభుత్వం అడ్వైజరీ
Bhogapuram Airport: భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
Constable Kanakam Season 2 : వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...

వీడియోలు

Indian Team Announced for Nz ODI Series | న్యూజిలాండ్ వన్డే సిరీస్ కు భారత జట్టు ప్రకటన | ABP Desam
పక్కటెముక విరగ్గొట్టుకున్నాడు.. షాక్‌లో గుజరాత్ ఫ్యాన్స్
ముస్తాఫిజుర్‌ ఐపీఎల్ ఆడితే మ్యాచ్‌లు జరగనివ్వం: షారూఖ్‌కు హిందూ సంఘాల వర్నింగ్
2026లో భారత్, పాకిస్తాన్ ఎన్నిసార్లు తలపడతాయంటే..
టీ20 వరల్డ్ కప్ ఎవ్వరూ చూడరు: మాజీ ప్లేయర్ అశ్విన్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP MLA son arrested in drug case: హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
India News: ఈ పరిస్థితుల్లో వెనిజులాకు వెళ్లవద్దు.. పౌరులకు భారత ప్రభుత్వం అడ్వైజరీ
ఈ పరిస్థితుల్లో వెనిజులాకు వెళ్లవద్దు.. పౌరులకు భారత ప్రభుత్వం అడ్వైజరీ
Bhogapuram Airport: భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
Constable Kanakam Season 2 : వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
CM Revanth Reddy: జూరాల నుంచి రోజుకు 2 టీఎంసీల నీటిని మళ్లించి, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు నిర్మాణం
జూరాల నుంచి రోజుకు 2 టీఎంసీల నీటిని మళ్లించి, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు నిర్మాణం
Priyanka Gandhi Son Engagement: గాంధీ కుటుంబంలో పెళ్లి వేడుక.. వధువు ధరించే చీరకు ఉన్న ఈ ప్రత్యేకత తెలుసా !
గాంధీ కుటుంబంలో పెళ్లి వేడుక.. వధువు ధరించే చీరకు ఉన్న ఈ ప్రత్యేకత తెలుసా !
Tata Sierra వర్సెస్ Kia Seltos.. మిడ్ సైజ్ లో ఏ SUV బెటర్, కొనేముందు ఇవి తెలుసుకోండి
Tata Sierra వర్సెస్ Kia Seltos.. మిడ్ సైజ్ లో ఏ SUV బెటర్, కొనేముందు ఇవి తెలుసుకోండి
Telangana Assembly: శ్రీధర్ బాబు సీఎం సీట్లో కూర్చోవాలి - మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు పొగడ్తల వర్షం
శ్రీధర్ బాబు సీఎం సీట్లో కూర్చోవాలి - మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు పొగడ్తల వర్షం
Embed widget