అన్వేషించండి

Penmatsa : విజయనగరంలో విధేయకు పట్టం - పెన్మత్సకు మరో చాన్సిచ్చిన సీఎం జగన్ !

విజయనగరంలో ఎమ్మెల్సీగా పెన్మత్సకు మరో చాన్స్ ఇచ్చారు సీఎం జగన్.


Penmatsa :   విజయనగరం జిల్లాలో మొదట వైసీపీ జెండా మోసిన వ్యక్తుల్లో దివంగత నేత, మాజీ మంత్రి పెనుమత్స సాంబశివరాజు ఒకరు.  అనంతర పరిణామాలతో సాంబశివరాజు జీవించి ఉన్నంత కాలం ఆ కుటుంబానికి పార్టీ పరంగా జగన్‌ సముచిత ప్రాధాన్యమివ్వలేదనే ఆవేదన అభిమానుల్లో ఉండేది. సాంబశివరాజు తనయుడు డాక్టర్‌ పెనుమత్స సూర్యనారాయణ రాజు   2014 ఎన్నికల్లో నెల్లిమర్ల నియోజకవర్గం నుంచి బరిలో దిగినా.. అప్పటి పరిస్థితుల ప్రభావంతో టీడీపీ గెలిచింది. తర్వాత ఎన్నికల్లో ఎమ్మెల్యే టికెట్‌ ఆశించినా భంగపాటు తప్పలేదు. బడ్డుకొండ అప్పలనాయుడు వైపే జగన్‌ మొగ్గు చూపారు. సాంబశివరాజు మరణం తర్వాత  ఆ సానుభూతి వల్లనో, రుణం తీర్చుకుందామన్న ఉద్దేశమో గానీ... సురేష్‌బాబుకు ఎమ్మెల్సీ పదవిని ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ఇచ్చారు.   ఈ పదవిలో దాదాపుగా రెండున్నరేళ్లే కొనసాగారు. మరోసారి అవకాశమిస్తారా,  ఇవ్వరా? అన్న చర్చ సర్వత్రా సాగింది. ఈ సారి ఆయన స్థానంలో మరొకరికి అవకాశం కల్పించాలన్న డిమాండ్లూ వెళ్లాయి.  కానీ, ముఖ్యమంత్రి జగన్‌.. సూర్యనారాయణరాజు వైపే మొగ్గు చూపారు. ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీగా మరోసారి అవకాశం కల్పించారు. 

పార్టీకి విధేయుడు పెన్మత్స 
 
క్షత్రియ సామాజిక వర్గానికి చెందిన పెనుమత్స సురేష్‌బాబు.. ఆది నుంచి పార్టీ పట్ల విధేయతగా మెలిగారు. వివాదరహితంగా ఉంటూ, అందరితోనూ కలసిపోయే మనస్తత్వం వల్లే ఆయనకు మళ్లీ ఎమ్మెల్సీ పదవి వరించింది.   ఏపీలో వైసీపీ ప్రకటించిన ఎమ్మెల్సీ అభ్యర్థుల జాబితాలో ఎమ్మెల్యేల కోటాలో శాసన మండలి సభ్యుడుగా మరోసారి అడుగుపెట్టే అవకాశం లభించింది.  సూర్యనారాయణరాజు. సురేష్‌బాబుగా అందరికీ ఆయన సుపరిచితం. విజయనగరం పట్టణంలోనే కొన్నాళ్లు దంతవైద్యుడిగా సేవలందించారు. మొదట్లో క్రియాశీలక రాజకీయాలపై ఆయన అంతగా ఆసక్తి చూపలేదు. తండ్రి మంత్రిగా ఉన్న సమయంలోనూ సురేష్‌బాబు ఏనాడూ దర్పం చూపలేదు. రాజకీయాలకు దూరంగానే ఉండేవారు. తన వృత్తి చేసుకుని వెళ్లిపోతుండేవారు. వయస్సు మీద పడ్డాక రాజకీయాల్లో సాంబశివరాజు ప్రభావం తగ్గింది. బొత్స సత్యనారాయణతో విభేదాల వల్ల సాంబశివరాజు కాంగ్రెస్‌ నుంచి బయటకు వచ్చేశారు. తర్వాత కొన్నాళ్లకు వైసీపీలో చేరి, జిల్లావ్యాప్తంగా పార్టీ బలోపేతానికి కృషి చేశారు. వృద్ధాప్యం కారణంగా మునుపటి మాదిరి ఆయన తిరగలేకపోవడంతో స్నేహితులు, బంధువుల వల్ల సురేష్‌బాబు ప్రత్యక్ష రాజకీయాల్లో క్రియాశీలకంగా మారారు. 

ఓడినా ఎమ్మెల్సీ పదవి ఇచ్చి  ప్రోత్సహిస్తున్న సీఎం జగన్ 

2014 ఎన్నికల్లో సురేష్‌బాబు వైసీపీ తరఫున నెల్లిమర్ల నియోజకవర్గం నుంచి పోటీ చేసి, టీడీపీ అభ్యర్థి చేతిలో ఓటమి చెందారు. 2019 ఎన్నికల సమయానికి మరోసారి టికెట్‌ ఆయనకే వస్తుందని భావించినా.. కాంగ్రెస్‌ నుంచి వచ్చిన బడ్డుకొండ అప్పలనాయుడు తన్నుకుపోయారు. అప్పట్లో పెనుమత్స వర్గీయులు దీనిపై ఆవేదన చెందినా.. అధినేత నిర్ణయాన్ని ఏనాడూ ధిక్కరించలేదు. సాంబశివరాజు కుటుంబానికి జగన్‌ సముచిత ప్రాధాన్యం ఇవ్వలేదని ఆయన అనుయాయుల్లో అసంతృప్తి ఉండేది. కొవిడ్‌ సమయంలో సాంబశివరాజు మృతి చెందారు. అదే సమయంలో ఎమ్మెల్సీగా ఉన్న మోపిదేవి వెంకటరమణను రాజ్యసభకు పంపడంతో.. తద్వారా ఖాళీ అయిన స్థానాన్ని సాంబశివరాజు కుమారుడు సురేష్‌బాబుకు ఇస్తూ జగన్‌ నిర్ణయం తీసుకున్నారు. ఆ విధంగా శాసనమండలిలో అడుగుపెట్టిన సురేష్‌బాబుకు.. అడుగడుగునా చేదు అనుభవమే ఎదురైంది. నెల్లిమర్ల నియోజకవర్గంలో ఆయనకు తగిన గౌరవం దక్కలేదు. అధికారులు సైతం ప్రోటోకాల్‌ పాటించడం లేదని పలు సందర్భాల్లో ఆయన ఆవేదన చెందారు. నెల్లిమర్ల నియోజకవర్గంలో సాంబశివరాజు వర్గానికి చెక్‌ పెట్టాలని, సురేష్‌బాబు పోటీ దారు కాకూడదన్న ఉద్దేశంతో ఆయనకు వ్యతిరేకంగా అనేక కోటరీలు నడిచాయి. సురేష్‌బాబుకు బలగమే లేదని, ఆ స్థానాన్ని వేరొకరికి ఇస్తే వచ్చే ఎన్నికలకు ఉపయోగపడుతుందని నూరిపోసినవారూ ఉన్నారు.  

అందరి మన్ననలతోనే ముందుకు !

నాటి నుంచి పార్టీ కార్యక్రమాలను చిత్తశుద్ధితో అమలుచేసుకుంటూ సురేష్‌బాబు ముందుకుపోయారు. ఎక్కడా వర్గాలను ప్రోత్సహించలేదు. మొదటి నుంచి పార్టీ కోసం ఒక కార్యకర్తగానే కష్టపడుతూ వచ్చారు. అందరినీ కలుపుకొంటూనే వెళ్లారు. ప్రభుత్వ కార్యక్రమమైనా, పార్టీ కార్యక్రమమైనా ముందుండేవారు. ఎవరు పిలిచినా వెళ్లేవారు. జిల్లాలో ఉన్న ముఖ్య నాయకులందరితోనూ మంచి సంబంధాలు కొనసాగించారు. అవే.. ఇప్పుడు సురేష్‌బాబుకు కలిసివచ్చాయి. ఆ మంచితనంతోనే తన అభ్యర్థిత్వాన్ని ఎవరూ కాదనలేకపోయారు. పెద్దాయన సాంబశివరాజు పట్ల జగన్‌కు ఉన్న అభిమానం, విజయనగరంలో క్షత్రియ సామాజిక వర్గానికి అవకాశం ఇవ్వాలన్న ఉద్దేశంతో సురేష్‌బాబువైపే జగన్‌ మొగ్గు చూపారు. ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీగా అవకాశం కల్పించారు. దీంతో నెల్లిమర్ల నియోజకవర్గ రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. ఎమ్మెల్సీగా తనకు మరోసారి అవకాశం కల్పించినందుకు ముఖ్యమంత్రి జగన్‌కు, జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలందరికీ సురేష్‌బాబు కృతజ్ఞతలు తెలియజేశారు.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

AP Cabinet decisions: పరిశ్రమలకు కేటాయించిన భూములు 22A నుంచి తొలగింపు -ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం
పరిశ్రమలకు కేటాయించిన భూములు 22A నుంచి తొలగింపు -ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం
Central assistance: ప్రకృతి వైపరీత్యాల సహాయం - ఏపీ సహా 6 రాష్ట్రాలకు రూ.1,930 కోట్ల అదనపు నిధులు
Central assistance: ప్రకృతి వైపరీత్యాల సహాయం - ఏపీ సహా 6 రాష్ట్రాలకు రూ.1,930 కోట్ల అదనపు నిధులు
Kadapa Crime News: ఉరి అలా కాదు.. ఇలా వేసుకోవాలి.. భార్యకు చెబుతూ సూసైడ్ వీడియో రికార్డు చేసిన భర్త !
ఉరి అలా కాదు.. ఇలా వేసుకోవాలి.. భార్యకు చెబుతూ సూసైడ్ వీడియో రికార్డు చేసిన భర్త !
Tirumala Laddu Row: తిరుమల లడ్డూ వివాదంపై పిటిషన్ కొట్టివేసిన సుప్రీంకోర్టు, CBIకి చెప్పాలని సూచన
తిరుమల లడ్డూ వివాదంపై పిటిషన్ కొట్టివేసిన సుప్రీంకోర్టు, CBIకి చెప్పాలని సూచన

వీడియోలు

IPL 2026 First Phase Schedule | ఐపీఎల్ 2026 సమరానికి షెడ్యూల్ ఖరారు | ABP Desam
Irfan Pathan Predicts Future Captain of Team India | శ్రేయాస్ పై ఇర్ఫాన్ పఠాన్ కామెంట్స్ | ABP Desam
ICC T20 Rankings after T20WC | ఐసీసీ ర్యాంకింగ్స్‌లో టీమిండియా హవా | ABP Desam
Shivam Dube's Secret Train Journey | ట్రైన్ లో ప్రయాణించిన వరల్డ్ కప్ హీరో | ABP Desam
Sanju Samson Phone Call with Sachin | సంజు విజయం వెనుక సచిన్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR Letter to Amit Shah: రేవంత్ రెడ్డి బినామీ అక్రమాల కేటీఆర్ ఆరోపణలు - అమిత్ షాకు లేఖ- సీబీఐ, ఈడీ విచారణకు డిమాండ్
రేవంత్ రెడ్డి బినామీ అక్రమాల కేటీఆర్ ఆరోపణలు - అమిత్ షాకు లేఖ- సీబీఐ, ఈడీ విచారణకు డిమాండ్
AP Cabinet decisions: పరిశ్రమలకు కేటాయించిన భూములు 22A నుంచి తొలగింపు -ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం
పరిశ్రమలకు కేటాయించిన భూములు 22A నుంచి తొలగింపు -ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం
Movie Ticket Rates : టికెట్ రేట్స్ హైక్... పవన్ ఉస్తాద్ భగత్ సింగ్‌కు లైన్ క్లియర్!... ఆ ఆదేశాలపై సుప్రీంకోర్టు స్టే
టికెట్ రేట్స్ హైక్... పవన్ ఉస్తాద్ భగత్ సింగ్‌కు లైన్ క్లియర్!... ఆ ఆదేశాలపై సుప్రీంకోర్టు స్టే
Tamil Nadu Assembly Elections 2026: కొత్త పార్టీతో వచ్చేసిన శశికళ - తమిళనాడు రాజకీయాల్లో మరో కీలక మలుపు
కొత్త పార్టీతో వచ్చేసిన శశికళ - తమిళనాడు రాజకీయాల్లో మరో కీలక మలుపు
IAF Wing Commander commits suicide: చత్తీస్‌ఘడ్‌లో వింగ్ కమాండ్ ఆత్మహత్య - భార్యతో గొడవలే కారణమా?
చత్తీస్‌ఘడ్‌లో వింగ్ కమాండ్ ఆత్మహత్య - భార్యతో గొడవలే కారణమా?
IPL 2026: ఐపీఎల్ టికెట్ల విక్రయాలు ఎప్పుడు ప్రారంభమవుతాయి? ఎలా బుక్ చేసుకోవాలి
ఐపీఎల్ టికెట్ల విక్రయాలు ఎప్పుడు ప్రారంభమవుతాయి? ఎలా బుక్ చేసుకోవాలి
Sensex tumbles: మార్కెట్‌పై వార్ ఎఫెక్ట్ - ఒక్క రోజే 16 లక్షల కోట్ల ఇన్వెస్టర్ల సంపద మాయం!
మార్కెట్‌పై వార్ ఎఫెక్ట్ - ఒక్క రోజే 16 లక్షల కోట్ల ఇన్వెస్టర్ల సంపద మాయం!
Uttam Kumar Reddy: తగినంత స్టాక్ అందుబాటులో.. LPG సిలిండర్లకు కొరత లేదు: మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి
తగినంత స్టాక్ అందుబాటులో.. LPG సిలిండర్లకు కొరత లేదు: మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి
Embed widget