అన్వేషించండి

CM Jagan: ఆ కుంభకోణంపై సీఎం జగన్ సీరియస్.. వాళ్ల దగ్గర డబ్బులు రికవరీ చేయాల్సిందే

ఆంధ్రప్రదేశ్‌లో నకిలీ చలాన్ల స్కామ్ ఎంత పెద్దదో అంచనా వేయడం ఉన్నతాధికారులకు కూడా సాధ్యం కావడం లేదు.  అయితే తాజా ఈ కుంభకోణంపై సీఎం జగన్ సీరియస్ అయ్యారు. అధికారులతో భేటీ అయ్యారు.


ఏపీలో నకిలీ చలాన్ల కుంభకోణంపై సీఎం జగన్ సీరియస్ అయ్యారు.  స్టాంప్ అండ్ రిజిస్ట్రేషన్ల శాఖ ఉన్నతాధికారులతో భేటీ అయ్యారు. అక్రమార్కుల నుంచి సొమ్ము రికవరీపై దృష్టి పెట్టాలని ఆదేశించారు. రూ.40 లక్షలు రికవరీ చేసినట్లు ముఖ్యమంత్రికి అధికారులు వివరించారు.

ఏంటీ నకిలీ చలాన్ల కుంభకోణం


ఆంధ్రప్రదేశ్‌లో నకిలీ చలాన్ల స్కాం ఎంత పెద్దదో అంచనా వేయడం ఉన్నతాధికారులకు కూడా సాధ్యం కావడం లేదు. పరిశీలన జరిపే కొద్దీ మోసాలు వెలుగు చూస్తున్నాయి. ఇప్పటి వరకూ 770 డాక్యుమెంట్లు నకిలీ చలాన్లు పెట్టి రిజిస్ట్రేషన్ చేసినట్లుగా గుర్తించినట్లుగా రెవిన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ భార్గవ మీడియాకు వెల్లడించారు. అయితే ఈ స్కాం స్వరూప  స్వభావాలు ప్రభుత్వం చెబుతున్న దాని కంటే చాలా ఎక్కువగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఇప్పటికే  సస్పెండైన సబ్ రిజిస్ట్రార్ల సంఖ్య ఆరుకు చేరుకుంది. ఇతర సిబ్బందిని కూడా సస్పెండ్ చేశారు పెద్ద ఎత్తున డాక్యుమెంట్ రైటర్ల ప్రమేయాన్ని గుర్తించారు.  ఇప్పటి వరకూ 65 లక్షల డాక్యుమెంట్లను పరిశీలించినట్లగా ప్రభుత్వం చెబుతోంది. అయితే ఈ స్కాంలో కేవలం రూ. ఐదు కోట్లు మాత్రమే గోల్ మాల్ జరిగిందని ప్రభుత్వం చెబితే ఇంత హడావుడి  పడాల్సిన పని లేదని ఎంత కాలం నుంచిజరుగుతుందో గుర్తిస్తే తప్ప అసలు గోల్‌మాల్‌ను అంచనా వేయడం కష్టమని నిపుణులు అంచనావేస్తున్నారు.  


సాఫ్ట్‌వేర్‌లో ఉన్న లోపం కారణంగా ఉపయోగించిన చలానానే మళ్లీ మళ్లీ రిజిస్ట్రేషన్లకు ఉపయోగించినందున ప్రతీ డాక్యుమెంట్‌ను నిశితంగా పరిశీలిస్తేనే అసలు విషయం  బయటపడుతుందని అంచనా వేస్తున్నారు. ఈ స్కాంపై ముఖ్యమంత్రి జగన్ కూడా ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. అసలు మూలం కనిపెట్టాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ కారణంగానే రెవిన్యూ శాఖ ప్రత్యేక ప్రధానకార్యదర్శి సైతం రంగంలోకి దిగారు. కడప, కృష్ణా జిల్లాల్లో  సబ్ రిజిస్ట్రార్లు ఎక్కువ అక్రమాలకు పాల్పడినట్లుగా గుర్తించారు. అయితే ఇది మొత్తం ఇంటర్‌లింక్‌లతో నిండిన స్కాం అని భావిస్తున్నారు. ఎక్కడ నుంచైనా రిజిస్ట్రేషన్లు చేయించుకునే సౌకర్యం అందుబాటులోకి వచ్చిన తర్వాత స్కాం చేయడానికి మరింత స్కోప్ పెరిగిందని అంచనా వేస్తున్నారు. ఈ వ్యవహారంలో సమగ్రమైన విచారణ జరిగితే స్కాం మొత్తం బయటకు వచ్చే అవకాశం ఉంది. ప్రత్యేకంగా సిట్‌ను ఏర్పాటు చేయడం లేదా.. సీఐడీ విచారణకు ఆదేశించడం వంటి చర్యలు తీసుకుంటారని భావించారు. 


కానీ ప్రభుత్వం మాత్రం పోలీసు విచారణ సరిపోతుందని ఉంటున్నారు. రెవన్యూ పరంగా సోదాలు చేసి.. ఎక్కడెక్కడ దోపిడీ జరిగిందో గుర్తించి కేసులుపెడితే చాలని భావిస్తోంది. కానీ ఇది రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకే గండి కొట్టే అతిపెద్ద స్కాం కావడంతో ప్రభుత్వ చర్యలు మరింత సీరియస్‌గా ఉండాల్సిన అవసరం ఉందన్న అభిప్రాయం వినిపిస్తోంది. సాధారణంగా రిజిస్ట్రార్ కార్యాలయాలు అంటేనే అవినీతికి నిలయాలన్న అభిప్రాయంఉంది. ప్రజల వద్ద నుంచి పీడించడం.. నకిలీ రిజిస్ట్రేషన్లు లాంటి దందాలతోపాటు ఇప్పుడు నేరుగా ప్రభుత్వ ఖజానాకే్ చిల్లు పెట్టేలా సబ్ రిజిస్ట్రార్లు వ్యవహరించడం సంచలనం రేపుతోంది. ముందు ముందు ఈ కేసు విషయంలో బయటపడే వ్యవహారాలు మరింత కలకలం రేపడం ఖాయంగా భావిస్తున్నారు.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Maoist Ganesh : ఒడిశా ఎన్‌కౌంటర్‌లో సెంట్రల్ కమిటీ సభ్యుడు గణేష్ మృతి- మావోయిస్టురహిత రాష్ట్రంగా ప్రకటించిన అమిత్‌షా
ఒడిశా ఎన్‌కౌంటర్‌లో సెంట్రల్ కమిటీ సభ్యుడు గణేష్ మృతి- మావోయిస్టురహిత రాష్ట్రంగా ప్రకటించిన అమిత్‌షా
Bandi Sanjay : చంద్రబాబు నుంచి కేసీఆర్‌కు ముడుపులు- సానుభూతి కోసం రేవంత్ రెడ్డి బూతులు; బండి సంజయ్‌ సంచలన ఆరోపణలు 
చంద్రబాబు నుంచి కేసీఆర్‌కు ముడుపులు- సానుభూతి కోసం రేవంత్ రెడ్డి బూతులు; బండి సంజయ్‌ సంచలన ఆరోపణలు 
Naznin Munni : బంగ్లాదేశ్ అల్లరి మూకలకు ఈ టీవీ యాంకరే సింహస్వప్నం - ఉద్యోగం నుంచి తీసేయాలని ఆందోళనలు - ఇలా ఉన్నారేంటి?
బంగ్లాదేశ్ అల్లరి మూకలకు ఈ టీవీ యాంకరే సింహస్వప్నం - ఉద్యోగం నుంచి తీసేయాలని ఆందోళనలు - ఇలా ఉన్నారేంటి?
BCCI Video: రోహిత్, కోహ్లీ సెంచరీల వీడియో షేర్ చేసి అభాసుపాలైన బీసీసీఐ! సోషల్ మీడియాలో ఫ్యాన్స్ ఎగతాళి
రోహిత్, కోహ్లీ సెంచరీల వీడియో షేర్ చేసి అభాసుపాలైన బీసీసీఐ! సోషల్ మీడియాలో ఫ్యాన్స్ ఎగతాళి

వీడియోలు

రికార్డులు సృష్టిస్తున్నా ఐపీఎల్ ఛాన్స్ రాని బ్యాటర్ సకిబుల్ గని
బుమ్రా, పంత్ తనపై చేసిన వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పారన్న బవుమా
విజయ్ హజారే ట్రోఫీలో సెంచరీల మోత.. ఒక్క రోజే 22 సెంచరీలు
సీసీటీవీల్లో రికార్డ్ చేశారా? బీసీసీఐపై ఫ్యాన్స్ ఫైర్
Rohit Sharma Century Mumbai vs Sikkim | Vijay Hazare Trophy 2025 తొలి మ్యాచ్ లో ముంబై ఘన విజయం | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Maoist Ganesh : ఒడిశా ఎన్‌కౌంటర్‌లో సెంట్రల్ కమిటీ సభ్యుడు గణేష్ మృతి- మావోయిస్టురహిత రాష్ట్రంగా ప్రకటించిన అమిత్‌షా
ఒడిశా ఎన్‌కౌంటర్‌లో సెంట్రల్ కమిటీ సభ్యుడు గణేష్ మృతి- మావోయిస్టురహిత రాష్ట్రంగా ప్రకటించిన అమిత్‌షా
Bandi Sanjay : చంద్రబాబు నుంచి కేసీఆర్‌కు ముడుపులు- సానుభూతి కోసం రేవంత్ రెడ్డి బూతులు; బండి సంజయ్‌ సంచలన ఆరోపణలు 
చంద్రబాబు నుంచి కేసీఆర్‌కు ముడుపులు- సానుభూతి కోసం రేవంత్ రెడ్డి బూతులు; బండి సంజయ్‌ సంచలన ఆరోపణలు 
Naznin Munni : బంగ్లాదేశ్ అల్లరి మూకలకు ఈ టీవీ యాంకరే సింహస్వప్నం - ఉద్యోగం నుంచి తీసేయాలని ఆందోళనలు - ఇలా ఉన్నారేంటి?
బంగ్లాదేశ్ అల్లరి మూకలకు ఈ టీవీ యాంకరే సింహస్వప్నం - ఉద్యోగం నుంచి తీసేయాలని ఆందోళనలు - ఇలా ఉన్నారేంటి?
BCCI Video: రోహిత్, కోహ్లీ సెంచరీల వీడియో షేర్ చేసి అభాసుపాలైన బీసీసీఐ! సోషల్ మీడియాలో ఫ్యాన్స్ ఎగతాళి
రోహిత్, కోహ్లీ సెంచరీల వీడియో షేర్ చేసి అభాసుపాలైన బీసీసీఐ! సోషల్ మీడియాలో ఫ్యాన్స్ ఎగతాళి
Microsoft: C, C++కు చరమగీతం పాడుతున్న మైక్రోసాఫ్ట్ - రస్ట్ పేరుతో కొత్త లాంగ్వేజ్ - కొత్తది నేర్చుకోక తప్పదా?
C, C++కు చరమగీతం పాడుతున్న మైక్రోసాఫ్ట్ - రస్ట్ పేరుతో కొత్త లాంగ్వేజ్ - కొత్తది నేర్చుకోక తప్పదా?
Viraansh Bhanushali: ఇప్పుడు ఈ భారత ఆక్సఫర్ స్టూడెంటే వైరల్ - పాక్‌ను చెడుగుడు ఆడేశాడు మరి !
ఇప్పుడు ఈ భారత ఆక్సఫర్ స్టూడెంటే వైరల్ - పాక్‌ను చెడుగుడు ఆడేశాడు మరి !
Tarique Rahman: బంగ్లాదేశ్‌లో 17 ఏళ్ల తర్వాత అడుగు పెట్టిన తారిక్ రెహమాన్! తన భార్య, కుమార్తె, పిల్లితో కలిసి రాక!
బంగ్లాదేశ్‌లో 17 ఏళ్ల తర్వాత అడుగు పెట్టిన తారిక్ రెహమాన్! తన భార్య, కుమార్తె, పిల్లితో కలిసి రాక!
Govt New Rules: జనవరి 2026 నుంచి మారే నియమాలు ఇవే! తెలుసుకోకుంటే భారీగా నష్టపోతారు!
జనవరి 2026 నుంచి మారే నియమాలు ఇవే! తెలుసుకోకుంటే భారీగా నష్టపోతారు!
Embed widget