అన్వేషించండి

AP Assembly Chandrababu: విధ్వంసం నుంచి పునర్నిర్మాణం వైపు ఆంధ్ర - అసెంబ్లీలో సీఎం చంద్రబాబు ధీమా

CM Chandrababu: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేసిన ప్రసంగించారు. విధ్వంసం నుంచి పునర్నిర్మాణం వైపు వెళ్తున్నామన్నారు.

Chandrababu Naidu speech in the assembly: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శుక్రవారం కీలక ప్రసంగం చేశారు. గత ఐదేళ్ల వైసీపీ పాలనలో రాష్ట్రం ఎదుర్కొన్న  విధ్వంసాన్ని గుర్తు చేస్తూనే, కూటమి ప్రభుత్వం చేపట్టిన 20 నెలల అభివృద్ధి, సంక్షేమ ప్రస్థానాన్ని ఆయన వివరించారు. చట్టసభ అనేది ప్రజా దేవాలయమని, గతంలో దీనిని  బూతుల అడ్డా గా మార్చారని వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డిపై ఆయన తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.
 
గత ప్రభుత్వ హయాంలో అసెంబ్లీలో తనకు జరిగిన అవమానాన్ని గుర్తు చేసుకుంటూ చంద్రబాబు భావోద్వేగానికి గురయ్యారు. నాడు తనలాగే ఎంతోమంది కన్నీళ్లు పెట్టుకున్నారని, వైసీపీ పాలన ఎంత అరాచకంగా సాగిందో ఇది నిదర్శనమని పేర్కొన్నారు. ఇటీవల తాము నిర్వహించిన మాక్ అసెంబ్లీలో విద్యార్థులు ప్రస్తుత సభ్యుల కంటే ఎంతో హుందాగా, చక్కగా ప్రసంగించారని కొనియాడారు. సభ గౌరవాన్ని పునరుద్ధరించడమే తమ లక్ష్యమని స్పష్టం చేశారు.
 
ప్రజల సంక్షేమం కోసం ప్రభుత్వం భారీగా ఖర్చు చేస్తోందని సీఎం తెలిపారు. ముఖ్యంగా పెన్షన్ల కోసం ఏడాదికి 34 వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నామని, దేశంలో ఇంత పెద్ద మొత్తంలో పెన్షన్లు ఇస్తున్న రాష్ట్రం మరేదీ లేదని ఆయన గర్వంగా ప్రకటించారు. తల్లికి వందనం పథకం కింద 10,700 కోట్ల రూపాయలు అందించామని, సంక్షేమంలో ప్రపంచంలోనే అతిపెద్ద డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్ ప్రోగ్రాం చేపడుతున్నామని వెల్లడించారు.

రాష్ట్ర మౌలిక సదుపాయాల కల్పనలో ఆర్టీసీ పాత్రను అభినందిస్తూ, స్త్రీశక్తి  పథకం ద్వారా సుమారు 443 కోట్ల మంది మహిళలు ఉచితంగా ప్రయాణించారని చంద్రబాబు తెలిపారు. ప్రజా రవాణాను మరింత బలోపేతం చేసేందుకు త్వరలో మరో వెయ్యి ఏసీ బస్సులను ప్రవేశపెట్టనున్నట్లు వెల్లడించారు. అలాగే ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీ, రైతులకు అన్నదాత సుఖీభవ కింద 20 వేల రూపాయల ఆర్థిక సాయం వంటి పథకాల అమలును ఆయన వివరించారు. అమరావతి రాజధాని నిర్మాణం కోసం 29 వేల మంది రైతులు తమ 33 వేల ఎకరాల భూమిని ప్రభుత్వంపై నమ్మకంతో ఇచ్చారని సీఎం గుర్తు చేశారు. వారికి పైసా కూడా ఇవ్వలేకపోయినప్పటికీ, భవిష్యత్తులో అభివృద్ధి చేసిన ప్లాట్లు ఇస్తామని ఇచ్చిన హామీకి కట్టుబడి ఉన్నామని చెప్పారు. గత ప్రభుత్వం రాజధానిని నిర్వీర్యం చేసినా, తమ ప్రభుత్వం పునర్నిర్మాణ పనులను వేగవంతం చేసిందని ధీమా వ్యక్తం చేశారు.                         
 
రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదనే ఉద్దేశంతో టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి పోటీ చేశాయని చంద్రబాబు స్పష్టం చేశారు. దేశ చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా 94 శాతం స్ట్రైక్ రేట్‌తో ప్రజలు తమను గెలిపించారని, ఈ నమ్మకాన్ని వమ్ము చేయకుండా రాష్ట్రాన్ని ముందుకు నడిపిస్తామని ఆయన ప్రకటించారు. శ్వేతపత్రాల ద్వారా గత ప్రభుత్వ వైఫల్యాలను ఇప్పటికే ప్రజల ముందు ఉంచామని సీఎం తన ప్రసంగంలో పేర్కొన్నారు.          

 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

ఏపీలో LPG కనెక్షన్ల తాజా పరిస్థితిపై కీలక ప్రకటన విడుదల చేసిన ప్రభుత్వం
ఏపీలో LPG కనెక్షన్ల తాజా పరిస్థితిపై కీలక ప్రకటన విడుదల చేసిన ప్రభుత్వం
Deputy CM Pawan Kalyan: గిరిపుత్రుల గడపకు ఉప ముఖ్యమంత్రి - అల్లూరి జిల్లాలో పవన్ కళ్యాణ్ ‘మాటా-మంతి’
గిరిపుత్రుల గడపకు ఉప ముఖ్యమంత్రి - అల్లూరి జిల్లాలో పవన్ కళ్యాణ్ ‘మాటా-మంతి’
IntrCity SmartBus: భారత్‌లో తొలి AQI ఇంటర్‌సిటీ బస్సు సర్వీస్ విజయవాడలో ప్రారంభించిన ఇంట్రసిటీ స్మార్ట్‌బస్
భారత్‌లో తొలి AQI ఇంటర్‌సిటీ బస్సు సర్వీస్ విజయవాడలో ప్రారంభించిన ఇంట్రసిటీ స్మార్ట్‌బస్
Vijaya ghee issue: విజయా నెయ్యిపై ఆగని దుమారం - లోకేష్‌కు గుత్తా అమిత్ మరో ఘాటు ట్వీట్
విజయా నెయ్యిపై ఆగని దుమారం - లోకేష్‌కు గుత్తా అమిత్ మరో ఘాటు ట్వీట్
Advertisement

వీడియోలు

Pawan Kalyan Paderu Tour | పాడేరులో పర్యటించి గిరిజనులతో గడిపిన పవన్ కళ్యాణ్ | ABP Desam
Yuvraj Singh Mentoring Rishabh Pant | స్పైడీ రిషభ్ పంత్ కు అండగా యువరాజ్ సింగ్ | ABP Desam
RCB Acquisition Race | కోహ్లీ కోసం 17వేల కోట్లు పెట్టడానికైనా ఆ సంస్థ సిద్ధం | ABP Desam
Salman Agha Run out Controversy | బాల్ ఇద్దామనుకున్నాడు..రనౌట్ అయిపోయాడు | ABP Desam
MS Dhoni Crafting Bat | ధోని క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదుగా | ABP Desam
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
కానిస్టేబుల్ ఆత్మహత్యాయత్నం ఓ డ్రామా.. వాస్తవాలను వెల్లడించిన హైదరాబాద్ పోలీస్ శాఖ
కానిస్టేబుల్ ఆత్మహత్యాయత్నం ఓ డ్రామా.. వాస్తవాలను వెల్లడించిన హైదరాబాద్ పోలీస్ శాఖ
Jeevan Reddy To joins BRS: బీఆర్ఎస్‌లో చేరే యోచనలో కాంగ్రెస్ సీనియర్ నేత - ఫిరాయింపు ఎమ్మెల్యేతో పొసగకపోవడం వల్లే!
బీఆర్ఎస్‌లో చేరే యోచనలో కాంగ్రెస్ సీనియర్ నేత - ఫిరాయింపు ఎమ్మెల్యేతో పొసగకపోవడం వల్లే!
Deputy CM Pawan Kalyan: గిరిపుత్రుల గడపకు ఉప ముఖ్యమంత్రి - అల్లూరి జిల్లాలో పవన్ కళ్యాణ్ ‘మాటా-మంతి’
గిరిపుత్రుల గడపకు ఉప ముఖ్యమంత్రి - అల్లూరి జిల్లాలో పవన్ కళ్యాణ్ ‘మాటా-మంతి’
Fake Ranker: సివిల్స్‌లో ర్యాంక్ వచ్చిందని పోలీసులు, రాజకీయ నేతలతో సన్మానాలు చేయించుకున్నాడు - నిజం తెలిసే సరికి జంప్!
సివిల్స్‌లో ర్యాంక్ వచ్చిందని పోలీసులు, రాజకీయ నేతలతో సన్మానాలు చేయించుకున్నాడు - నిజం తెలిసే సరికి జంప్!
IntrCity SmartBus: భారత్‌లో తొలి AQI ఇంటర్‌సిటీ బస్సు సర్వీస్ విజయవాడలో ప్రారంభించిన ఇంట్రసిటీ స్మార్ట్‌బస్
భారత్‌లో తొలి AQI ఇంటర్‌సిటీ బస్సు సర్వీస్ విజయవాడలో ప్రారంభించిన ఇంట్రసిటీ స్మార్ట్‌బస్
Dhanush : శంకర్ 'వేల్పారి'లో ధనుష్ ఫిక్స్! - వరుస ప్రాజెక్టులు... అంత రిస్క్ చేస్తారా?
శంకర్ 'వేల్పారి'లో ధనుష్ ఫిక్స్! - వరుస ప్రాజెక్టులు... అంత రిస్క్ చేస్తారా?
Indian Ships Stuck In Hormuz: హర్మూజ్ జలసంధిలో ఎన్ని భారత ఓడలు చిక్కుకున్నాయి, వాటిలో ఏమేం ఉన్నాయి?
హర్మూజ్ జలసంధిలో ఎన్ని భారత ఓడలు చిక్కుకున్నాయి, వాటిలో ఏమేం ఉన్నాయి?
BCCI Naman Awards: శుభ్‌మన్ గిల్‌కు అత్యున్నత పురస్కారం ప్రకటించిన BCCI.. స్మృతీ మంధానా ఏకంగా 5వసారి
శుభ్‌మన్ గిల్‌కు అత్యున్నత పురస్కారం ప్రకటించిన BCCI.. స్మృతీ మంధానా ఏకంగా 5వసారి
Embed widget