అన్వేషించండి

Liquor case against Chandrababu closed: చంద్రబాబుకు ఊరట - వైసీపీ హయాంలో పెట్టిన ఎక్సైజ్ కేసును క్లోజ్ చేసిన కోర్టు

Liquor case closed: చంద్రబాబుపై గత ప్రభుత్వ హయాంలో పెట్టిన లిక్కర్ అక్రమాల కేసును కోర్టు క్లోజ్ చేసింది. కేసు దర్యాప్తు పూర్తయినట్లు సీఐడీ కోర్టుకు తెలిపింది.

Court closed the liquor case filed against Chandrababu Naidu:  వైఎస్ జగన్ హయాంలో చంద్రబాబుపై పెట్టిన మరో కేసు కోర్టులో తెలిపింది. లిక్కర్ పాలసీ అక్రమాల కేసులో దర్యాప్తు పూర్తయినట్లుగా సీఐడీ కోర్టుకు తెలిపింది. అక్రమాలు జరిగినట్లుగా ఆధారాలేమీ లేకపోవడంతో కేసును క్లోజ్ చేస్తూ కోర్టు నిర్ణయం తీసుకుంది.  

ఇదీ కేసు

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ  అధికారంలో ఉన్న సమయంలో   2023 అక్టోబర్ 30న  ఎక్సైజ్ పాలసీలో అక్రమాలు జరిగాయని సీఐడీ కేసు నమోదు చేసింది. 2014-19  మధ్య   ఎక్సైజ్ పాలసీలో అక్రమాలు, డిస్టిలరీలకు అర్హత లేకపోయినా  లైసెన్సులు ఇవ్వడం, కొంతమంది సప్లయర్లకు ప్రయోజనాలు  కల్పించారని కేసులు నమోదు చేశారు.  సీఎంగా ఉన్న సమయంలో  మద్యం తయారీ కంపెనీలకు అనుమతుల విషయంలో చంద్రబాబు అక్రమాలకు పాల్పడ్డారని  సీఐడీ అభియోగాలు మోపింది. పీసీ యాక్ట్ తో పాటు  పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసింది. కొన్ని మద్యం తయారీ సంస్థలకు  ప్రయోజనం చేకూరేలా  చంద్రబాబు సర్కార్  వ్యవహరించిందని  ఏపీ సీఐడీ  కేసు నమోదు చేసింది. ఈ మేరకు  ఏపీ బేవరేజేస్  ఎండీ  ఇచ్చిన ఫిర్యాదు మేరకు  ఏపీ సీఐడీ కేసు నమోదు చేసింది. ఈ కేసులో  ఏ1 గా సుధాకర్, ఏ2 కొల్లు రవీంద్, ఏ3 చంద్రబాబు పేర్లను  ఏపీ సీఐడీ  నమోదు చేసింది.              

వైసీపీ ప్రభుత్వం 2019లో అధికారంలోకి  వచ్చినప్పటికీ 2023లో రెండు  బేవరేజీలు, మూడు డిస్టిలరీలకు లబ్ది చేకూర్చేందుకు మద్యం పాలసీని మార్చారని అప్పటి ఏబీ బేవరేజెస్ ఎండీ ఫిర్యాదు చేశారు.  కొన్ని మద్యం తయారీ సంస్థలకు  ప్రయోజనం కలిగేలా  2012 ఎక్సైజ్ పాలసీని మార్చారని ..  2015లో  కొత్త ఎక్సైజ్ పాలసీ తీసుకు వచ్చిన ప్రభుత్వానికి పన్నులు రాకుండా చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు.  ఈ సంస్థ ఫిర్యాదు మేరకు ఏపీ సీఐడీ కేసు నమోదు చేసింది.   అయితే అప్పటి , ఇప్పటికి బేవరేజెస్ ఎండీలు..  ఎలాంటి అవకతవకలు జరగలేదని.. ఆధారాల్లేవని చెప్పినట్లుగా తెలుస్తోంది. ఆధారాలు లేని విషయాన్ని సీఐడీ కోర్టుకు తెలిపింది. దాంతో కోర్టు మూసివేసింది. 

ఇటీవలే చంద్రబాబుపై గత ప్రభుత్వం పెట్టిన  ఫైబర్‌నెట్ కేసును కూడా కోర్టు మూసివేసింది.  ఈ కేసులో ఎలాంటి అక్రమాలు జరగలేదని, సంస్థకు ఎటువంటి ఆర్థిక నష్టం వాటిల్లలేదని సీఐడీ  దర్యాప్తులో తేలింది. ఈ కేసుకు సంబంధించి ఫైబర్‌నెట్ మాజీ మేనేజింగ్ డైరెక్టర్ ఎం. మధుసూదన రెడ్డి, ప్రస్తుత ఎండీ గీతాంజలి శర్మ   ఏసీబీ కోర్టుకు హాజరయ్యి.. సీఐడీ సమర్పించిన తుది నివేదికతో తాము పూర్తిగా ఏకీభవిస్తున్నామని, కేసు మూసివేతకు తమకు ఎలాంటి అభ్యంతరం లేదని వారు లిఖితపూర్వకంగా, మౌఖికంగా కోర్టుకు  తెలిపారు. దాంతో కేసును  కోర్టు మూసివేసింది.                                            

 

 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Warangal Viral News: లేగ దూడకు నామకరణ మహోత్సవం! అయ్యప్ప మాలధరణ స్వాముల సమక్షంలో పేరు పెట్టిన వరంగల్ జిల్లా రైతు 
లేగ దూడకు నామకరణ మహోత్సవం! అయ్యప్ప మాలధరణ స్వాముల సమక్షంలో పేరు పెట్టిన వరంగల్ జిల్లా రైతు 
Durgam Cheruvu Cable Bridge: నాడు వెలుగులు - నేడు చీకట్లు - దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జిని పట్టించుకోని ప్రభుత్వం
నాడు వెలుగులు - నేడు చీకట్లు - దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జిని పట్టించుకోని ప్రభుత్వం
Amaravati Land Pooling: అమరావతికి రెండో విడత భూసమీకరణ - రైతుల్లో అప్పటి ఉత్సాహం ఉందా?
అమరావతికి రెండో విడత భూసమీకరణ - రైతుల్లో అప్పటి ఉత్సాహం ఉందా?
Telangana Latest News: తెలంగాణలో యూరియా నిల్వలపై ప్రభుత్వం కీలక ప్రకటన! అసెంబ్లీ సాక్షిగా లెక్కలు బయటపెట్టి మంత్రి తుమ్మల!
తెలంగాణలో యూరియా నిల్వలపై ప్రభుత్వం కీలక ప్రకటన! అసెంబ్లీ సాక్షిగా లెక్కలు బయటపెట్టి మంత్రి తుమ్మల!
Advertisement

వీడియోలు

INSV Kaundinya Explained | INSV కౌండిన్య స్పెషాలిటి తెలుసా ?
Rohit Sharma, Virat Kohli ODI Matches in 2026 | 2026లో రో - కో ఆడే మ్యాచులు ఇవే
India vs New Zealand Series Squad | టీమ్ సెలక్షన్ లో భారీ ట్విస్ట్
Shubman Gill in Team India BCCI | గిల్ విషయంలో సెలెక్టర్ల మాస్టర్ ప్లాన్ ఇదేనా?
Hardik Pandya in Test Cricket | టెస్టుల్లోకి పాండ్యా రీఎంట్రీ ఫిక్స్?
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Warangal Viral News: లేగ దూడకు నామకరణ మహోత్సవం! అయ్యప్ప మాలధరణ స్వాముల సమక్షంలో పేరు పెట్టిన వరంగల్ జిల్లా రైతు 
లేగ దూడకు నామకరణ మహోత్సవం! అయ్యప్ప మాలధరణ స్వాముల సమక్షంలో పేరు పెట్టిన వరంగల్ జిల్లా రైతు 
Durgam Cheruvu Cable Bridge: నాడు వెలుగులు - నేడు చీకట్లు - దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జిని పట్టించుకోని ప్రభుత్వం
నాడు వెలుగులు - నేడు చీకట్లు - దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జిని పట్టించుకోని ప్రభుత్వం
Amaravati Land Pooling: అమరావతికి రెండో విడత భూసమీకరణ - రైతుల్లో అప్పటి ఉత్సాహం ఉందా?
అమరావతికి రెండో విడత భూసమీకరణ - రైతుల్లో అప్పటి ఉత్సాహం ఉందా?
Telangana Latest News: తెలంగాణలో యూరియా నిల్వలపై ప్రభుత్వం కీలక ప్రకటన! అసెంబ్లీ సాక్షిగా లెక్కలు బయటపెట్టి మంత్రి తుమ్మల!
తెలంగాణలో యూరియా నిల్వలపై ప్రభుత్వం కీలక ప్రకటన! అసెంబ్లీ సాక్షిగా లెక్కలు బయటపెట్టి మంత్రి తుమ్మల!
Aadi Saikumar: ఆది సాయి కుమార్ ఇంట్లో డబుల్ ధమాకా - 'శంబాల' సక్సెస్ తర్వాత మరో శుభవార్త!
ఆది సాయి కుమార్ ఇంట్లో డబుల్ ధమాకా - 'శంబాల' సక్సెస్ తర్వాత మరో శుభవార్త!
Pawan Kalyan Kondagattu: శనివారం కొండగట్టుకు పవన్ కల్యాణ్ - టీటీడీ నిధులతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన
శనివారం కొండగట్టుకు పవన్ కల్యాణ్ - టీటీడీ నిధులతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన
India vs New Zealand ODI : ఇది కదా రో.కో. పవర్‌! 8 నిమిషాల్లో భారత్ న్యూజిలాండ్ మొదటి వన్డే టిక్కెట్లు సేల్‌!
ఇది కదా రో.కో. పవర్‌! 8 నిమిషాల్లో భారత్ న్యూజిలాండ్ మొదటి వన్డే టిక్కెట్లు సేల్‌!
Grok AI: 'X'కు నోటీసు పంపిన కేంద్రం! గ్రోక్ ఏఐ నుంచి అశ్లీల కంటెంట్ తొలగించాలని ఆదేశం! 72 గంటల గడువు
'X'కు నోటీసు పంపిన కేంద్రం! గ్రోక్ ఏఐ నుంచి అశ్లీల కంటెంట్ తొలగించాలని ఆదేశం! 72 గంటల గడువు
Embed widget