అన్వేషించండి

Grok AI: 'X'కు నోటీసు పంపిన కేంద్రం! గ్రోక్ ఏఐ నుంచి అశ్లీల కంటెంట్ తొలగించాలని ఆదేశం! 72 గంటల గడువు

Grok AI: మహిళలు, పిల్లలను లక్ష్యంగా చేసుకుని అశ్లీ, అసభ్యకరమైన కంటెంట్‌ను ఇస్తున్న AIపై మంత్రిత్వ శాఖ ఆందోళన వ్యక్తం చేసింది. చట్టవిరుద్ధమైన కంటెంట్‌ను తొలగించాలని ఆదేశించింది.

Grok AI: కేంద్ర ప్రభుత్వం సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ 'X'కి కఠినమైన నోటీసు పంపింది, Grok AI నుండి అశ్లీల కంటెంట్‌ను తొలగించాలని ఆదేశించింది. దీనితో పాటు, కంపెనీ 72 గంటల్లో నివేదిక పంపాలని ప్రభుత్వం కోరింది.

శుక్రవారం నాడు సమాచార సాంకేతిక మంత్రిత్వ శాఖ (MeitY) ఎలాన్ మస్క్ యాజమాన్యంలోని సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ X కి అధికారిక నోటీసు జారీ చేసింది. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం, IT నియమాల ప్రకారం చట్టబద్ధమైన డ్యూ డిలిజెన్స్‌లో తీవ్రమైన లోపాలను గుర్తించింది. ప్లాట్‌ఫారమ్‌కు చెందిన AI సాధనం Grok దుర్వినియోగంపై పెరుగుతున్న ఆందోళనల మధ్య, ఈ సాధనం అశ్లీల, లైంగికంగా అసభ్యకరమైన, అవమానకరమైన కంటెంట్‌ను, ముఖ్యంగా మహిళలు, పిల్లలను లక్ష్యంగా చేసుకుని ఉత్పత్తి చేసిన సందర్భాలను మంత్రిత్వ శాఖ హైలైట్ చేసింది. అధికారులు దీనిని గౌరవం, గోప్యత, డిజిటల్ భద్రత తీవ్రమైన ఉల్లంఘనగా అభివర్ణించారు.

ప్రభుత్వం తక్షణ చర్య తీసుకోవాలని డిమాండ్ చేస్తోంది

MeitY X ని Grok సాంకేతిక, కార్యకలాపాలను వెంటనే సమీక్షించాలని, చట్టవిరుద్ధమైన కంటెంట్‌ను తొలగించాలని ఆదేశించారు. నేరపూరిత వినియోగదారులపై చర్య తీసుకోవాలని స్పష్టం చేశారు. 72 గంటల్లోపు యాక్షన్ టేకెన్ రిపోర్ట్ (ATR)ను సమర్పించాలని ఆదేశించింది. కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ నేతృత్వంలోని మంత్రిత్వ శాఖ, నిబంధనలను సరిగా పాటించకపోతే IT చట్టం కింద ప్లాట్‌ఫారమ్‌పై చర్యలు తప్పవని హెచ్చరించింది. చట్టపరమైన రక్షణను కోల్పోయే ప్రమాదం ఉందని పేర్కొంది. మల్టీ సైబర్, క్రిమినల్, పిల్లల రక్షణ చట్టాల కింద శిక్షార్హులని స్పష్టం చేసింది.  

సోషల్ మీడియా జవాబుదారీతనం అవసరం

శుక్రవారం ప్రారంభంలో, సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లు తాము ప్రచురించే కంటెంట్‌కు బాధ్యత వహించాలని వైష్ణవ్ గట్టిగా చెప్పారు. ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్‌ల జవాబుదారీతనాన్ని నిర్ధారించడానికి స్టాండింగ్ కమిటీ ఇప్పటికే బలమైన చట్టాన్ని సిఫార్సు చేసిందని ఆయన అన్నారు. మహిళల అసభ్యకరమైన ఫోటోలను సృష్టించడానికి, వాటిని ఆన్‌లైన్‌లో పబ్లిష్, షేర్‌ చేయడానికి AI యాప్‌లను ఉపయోగించినట్లు తమ దృష్టికి వచ్చిందని తక్షణ ప్రభుత్వ జోక్యం కోరుతూ రాజ్యసభ ఎంపీ ప్రియాంక చతుర్వేది కూడా మంత్రికి లేఖ రాశారు. వేర్వేరు మార్గాల్లో వచ్చిన ఫిర్యాదులు, ఎంపీ ఫిర్యాదను పరిగణలోకి తీసుకున్న ప్రభుత్వం ఎక్స్‌కు నోటీసు జారీ చేసింది. 

స్టాండింగ్ కమిటీ కఠినమైన చట్టాలను సిఫార్సు చేసింది

నకిలీ కంటెంట్, వార్తలు, దుష్ప్రచారానికి కేంద్రంగా మారుతున్న సోషల్ మీడియా, ప్లాట్‌ఫామ్‌లను జవాబుదారీగా ఉంచాలని పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ప్రభుత్వాన్ని కోరింది. దుర్వినియోగాన్ని అరికట్టడానికి, సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లు అభ్యంతరకరమైన కంటెంట్‌కు బాధ్యత వహించేలా జోక్యం అవసరం అని కూడా స్పష్టం చేసినట్టు వైష్ణవ్ హైలైట్ చేశారు.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana Latest News: తెలంగాణలో యూరియా నిల్వలపై ప్రభుత్వం కీలక ప్రకటన! అసెంబ్లీ సాక్షిగా లెక్కలు బయటపెట్టి మంత్రి తుమ్మల!
తెలంగాణలో యూరియా నిల్వలపై ప్రభుత్వం కీలక ప్రకటన! అసెంబ్లీ సాక్షిగా లెక్కలు బయటపెట్టి మంత్రి తుమ్మల!
Pawan Kalyan Kondagattu: శనివారం కొండగట్టుకు పవన్ కల్యాణ్ - టీటీడీ నిధులతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన
శనివారం కొండగట్టుకు పవన్ కల్యాణ్ - టీటీడీ నిధులతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన
Grok AI: 'X'కు నోటీసు పంపిన కేంద్రం! గ్రోక్ ఏఐ నుంచి అశ్లీల కంటెంట్ తొలగించాలని ఆదేశం! 72 గంటల గడువు
'X'కు నోటీసు పంపిన కేంద్రం! గ్రోక్ ఏఐ నుంచి అశ్లీల కంటెంట్ తొలగించాలని ఆదేశం! 72 గంటల గడువు
Budget 2026:దేశంలో తొలిసారి ఆదివారం నాడు కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారా ? కొనసాగుతున్న సస్పెన్స్ !
దేశంలో తొలిసారి ఆదివారం నాడు కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారా ? కొనసాగుతున్న సస్పెన్స్ !
Advertisement

వీడియోలు

INSV Kaundinya Explained | INSV కౌండిన్య స్పెషాలిటి తెలుసా ?
Rohit Sharma, Virat Kohli ODI Matches in 2026 | 2026లో రో - కో ఆడే మ్యాచులు ఇవే
India vs New Zealand Series Squad | టీమ్ సెలక్షన్ లో భారీ ట్విస్ట్
Shubman Gill in Team India BCCI | గిల్ విషయంలో సెలెక్టర్ల మాస్టర్ ప్లాన్ ఇదేనా?
Hardik Pandya in Test Cricket | టెస్టుల్లోకి పాండ్యా రీఎంట్రీ ఫిక్స్?
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Latest News: తెలంగాణలో యూరియా నిల్వలపై ప్రభుత్వం కీలక ప్రకటన! అసెంబ్లీ సాక్షిగా లెక్కలు బయటపెట్టి మంత్రి తుమ్మల!
తెలంగాణలో యూరియా నిల్వలపై ప్రభుత్వం కీలక ప్రకటన! అసెంబ్లీ సాక్షిగా లెక్కలు బయటపెట్టి మంత్రి తుమ్మల!
Pawan Kalyan Kondagattu: శనివారం కొండగట్టుకు పవన్ కల్యాణ్ - టీటీడీ నిధులతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన
శనివారం కొండగట్టుకు పవన్ కల్యాణ్ - టీటీడీ నిధులతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన
Grok AI: 'X'కు నోటీసు పంపిన కేంద్రం! గ్రోక్ ఏఐ నుంచి అశ్లీల కంటెంట్ తొలగించాలని ఆదేశం! 72 గంటల గడువు
'X'కు నోటీసు పంపిన కేంద్రం! గ్రోక్ ఏఐ నుంచి అశ్లీల కంటెంట్ తొలగించాలని ఆదేశం! 72 గంటల గడువు
Budget 2026:దేశంలో తొలిసారి ఆదివారం నాడు కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారా ? కొనసాగుతున్న సస్పెన్స్ !
దేశంలో తొలిసారి ఆదివారం నాడు కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారా ? కొనసాగుతున్న సస్పెన్స్ !
Ibomma Case: ఐబొమ్మ రవి విచారణలో కొత్త ట్విస్ట్! తెలుగులో హీరో క్రేజ్ ఆధారంగానే పైరసీ ధరలు నిర్ధారణ
ఐబొమ్మ రవి విచారణలో కొత్త ట్విస్ట్! తెలుగులో హీరో క్రేజ్ ఆధారంగానే పైరసీ ధరలు నిర్ధారణ
Gig Workers Strike : గిగ్ వర్కర్ల సమ్మె నివారణకు కేంద్రం కొత్త ఫార్ములా! ఈ షరతులు నెరవేర్చితేనే సామాజిక భద్రతా ప్రయోజనాలు!
గిగ్ వర్కర్ల సమ్మె నివారణకు కేంద్రం కొత్త ఫార్ములా! ఈ షరతులు నెరవేర్చితేనే సామాజిక భద్రతా ప్రయోజనాలు!
India Tour of Bangladesh 2026:బంగ్లాదేశ్‌లో హింసపై భారత్‌లో ఆందోళనలు కొనసాగుతున్న వేళ బీసీబీ కీలక ప్రకటన
బంగ్లాదేశ్‌లో హింసపై భారత్‌లో ఆందోళనలు కొనసాగుతున్న వేళ బీసీబీ కీలక ప్రకటన
Pariksha Pe Charcha 2026: పరీక్షా పే చర్చ 2026 కోసం ఎలా నమోదు చేసుకోవాలి? ఎవరు పాల్గొనవచ్చు?
పరీక్షా పే చర్చ 2026 కోసం ఎలా నమోదు చేసుకోవాలి? ఎవరు పాల్గొనవచ్చు?
Embed widget