అన్వేషించండి

Chittoor News: మూడేళ్ల వయసులో తప్పిపోయి పద్నాలుగేళ్ల తర్వాత ఇంటికి... ఇన్నాళ్లు ఆ బాలుడు ఎక్కడున్నాడో తెలుసా..!

మూడేళ్ల వయసులో తప్పిపోయిన ఓ బాలుడు పద్నాలుగేళ్ల తర్వాత తల్లిదండ్రులు వద్దకు చేరారు. ఇన్నేళ్ల తర్వాత కన్నబిడ్డ తిరిగి ఇంటికి రావడంతో ఆ తల్లిదండ్రుల ఆనందానికి అవధుల్లేవు.

మూడేళ్ల వయసులో తప్పిపోయిన బాలుడు పద్నాలుగు ఏళ్ల తరువాత తల్లిదండ్రుల చెంతకు చేరాడు. అల్లారు ముద్దుగా పెంచుకున్న పిల్లలు కనిపించకుండా పోతే ఆ తల్లిదండ్రుల బాధను వర్ణించలేం. చిన్నారులు తెలిసి తెలియని వయసులో ఇంటి నుంచి వెళ్లిపోయి తప్పిపోయిన ఘటనలు చూస్తుంటాం. కనిపించకుండా పోయిన పిల్లల కోసం ఆ తల్లిదండ్రులు బాధపడని రోజు ఉండదు. ఏ దేవుడో కరుణించి తమ పిల్లలు తిరిగి ఇంటికి రావాలని కోరుకుంటారు. ఇలాంటి ఘటన చిత్తూరు జిల్లాలో చోటుచేసుకుంది. మూడేళ్ల వయసులో తప్పిపోయిన బాలుడు పద్నాలుగు ఏళ్ల తర్వాత ఇంటికి చేరుకున్నాడు. ఇన్నాళ్లు తమ బిడ్డ ఆచూకీ‌ కోసం కళ్లుకాయలు కాసేలా ఎదురుచూసిన ఆ తల్లిదండ్రుల ఆనందానికి అవధులు లేవు. ఇన్నాళ్లు తమ బిడ్డ ఆచూకీ కోసం వెతకనీ చోటు లేదు.. పలకరించని మనిషి లేడు.. తమ బిడ్డ ఆచూకీ దొరికిందా, ఎలాగైనా తమ బిడ్డను తమ వద్దకు చేర్చాలని పోలీసు స్టేషన్ చుట్టూ తిరిగారు. అంతలా బిడ్డ కోసం పరితప్పించే ఆ తల్లిదండ్రుల వద్దకు పద్నాలుగు ఏళ్ల తరువాత కన్న కొడుకు చెంతకు చేరిన ఘటన జిల్లాలో చోటుచేసుకుంది.Chittoor News: మూడేళ్ల వయసులో తప్పిపోయి పద్నాలుగేళ్ల తర్వాత ఇంటికి... ఇన్నాళ్లు ఆ బాలుడు ఎక్కడున్నాడో తెలుసా..!

Also Read: పులివెందులలో పదివేల ఉద్యోగాలు.. ఆదిత్య బిర్లా కంపెనీకి జగన్ శంకుస్థాపన !

2008లో తప్పిపోయిన బాలుడు 

చిత్తూరు జిల్లా మదనపల్లె రూరల్‌ మండలం నీరుగట్టువారి పల్లెకు చెందిన రమణ, రెడ్డమ్మలు చేనేత వృతి చేస్తూ జీవనం సాగిస్తున్నారు. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. రెండో కుమారుడు ఆకాష్ మూడేళ్ల వయసులో ఇంటి ఆవరణంలో ఆడుకుంటూ ఎటో వెళ్లి పోయాడు. అయితే ఆకాష్ ఆచూకీ కోసం చుట్టు పక్కల తెలిసిన వారిని, ‌బంధువులను ఆరా తీశారు. కానీ తమ బిడ్డ కనిపించకపోవడంతో 2008లో మదనపల్లె టూటౌన్ పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. అయితే పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మూడేళ్ల బాలుడు ఆకాష్ ఆచూకీ కోసం పోలీసులు అన్ని ప్రాంతాల్లో గాలించారు. కానీ బాలుడి ఆచూకీ మాత్రం దొరకలేదు. పోలీసులు ఒక వైపు గాలిస్తుండే మరో వైపు తల్లిదండ్రులు తమ ప్రయత్నం చేశారు. బంధువులు కూడా ఆ చిన్నారి కోసం గాలింపులు చేపట్టారు. కానీ బాలుడి ఆచూకీ లభించలేదు. 

Also Read:  హీరో నాని ఎవరో తెలీదు.. నాకు కొడాలి నానీనే తెలుసు, బైక్ అమ్మి పవన్ కల్యాణ్ కటౌట్లు కట్టా: మంత్రి అనిల్

ఆటో డ్రైవర్ ఇంట్లో...

2019లో తెలిసినవారు తమ కుమారుడు ఆకాష్ మదనపల్లెకు సమీప‌ంలోని కొత్తపేట గ్రామంలో ఓ ఆటో డ్రైవర్ ఇంటిలో ఉన్నాడని సమాచారం ఇచ్చారు. అయితే కొత్తపేటకు వెళ్లిన ఆకాష్ తల్లిదండ్రులు తమ బిడ్డకు ఉన్న పచ్చబొట్టులను గుర్తుగా చెప్పి తమ‌ బాలుడే అని వాదించారు. కానీ ఆకాష్ తమ బాలుడే అని ఆటో డ్రైవర్ వారించారు. అప్పుడు బాలుడు రెడ్డమ్మ, రమణలతో వెళ్లేందుకు అంగీకరించక పోవడంతో ఏమీ చేయలేక తిరిగి ఇంటికి చేరుకున్నారు. కన్న ప్రేమతో తమ బాలుడిని చూసేందుకు ఆ తల్లిదండ్రులు వారంలో రెండు మూడు సార్లు ఆ గ్రామానికి వెళ్లి వచ్చేవారు. చుట్టు పక్కల వారు ఆ తల్లిదండ్రుల బాధను చూడలేక బాలుడికి విషయం చెప్పారు. తనను కన్న తల్లిదండ్రులు రెడ్డమ్మ, రమణలే అని చెప్పి ఆకాష్ కు వివరించడంతో వారి వద్దకు వెళ్లేందుకు అంగీకరించాడు. దీంతో గురువారం మదనపల్లె టూటౌన్ పోలీసుల సమక్షంలో ఆకాష్ తమ తల్లిదండ్రులు రెడ్డమ్మ, రమణలను కలిశాడు. దీంతో ఆ తల్లిదండ్రుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.

Also Read:  వేర్వేరుగా ప్రార్థనలు.. నివాళులు... ! జగన్, విజయమ్మ మధ్య కూడా మాటల్లేవా ?

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Steel Plant Credit Game: మిట్టల్ స్టీల్ ప్లాంట్ క్రెడిట్ తనదేనన్న జగన్ - పాత వీడియోతో షాకిచ్చిన టీడీపీ
మిట్టల్ స్టీల్ ప్లాంట్ క్రెడిట్ తనదేనన్న జగన్ - పాత వీడియోతో షాకిచ్చిన టీడీపీ
Deputy CM Pawan Kalyan: రామతీర్థంలో భక్తుల కల సాకారం- గిరి ప్రదక్షిణ మార్గాన్ని ప్రారంభించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్
రామతీర్థంలో భక్తుల కల సాకారం- గిరి ప్రదక్షిణ మార్గాన్ని ప్రారంభించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్
AP Assembly special meeting: 28న ఏపీ అసెంబ్లీ ప్రత్యేక సమావేశం - అమరావతిని రాజధానిగా ఖరారు చేస్తూ తీర్మానం !
28న ఏపీ అసెంబ్లీ ప్రత్యేక సమావేశం - అమరావతిని రాజధానిగా ఖరారు చేస్తూ తీర్మానం !
Vijayawada Terror Links Case: విజయవాడలో టెర్రర్ లింక్స్ కేసు.. హైదరాబాద్‌లో మహిళ అరెస్ట్! 13 మందిపై కేసు నమోదు
విజయవాడలో టెర్రర్ లింక్స్ కేసు.. హైదరాబాద్‌లో మహిళ అరెస్ట్! 13 మందిపై కేసు నమోదు

వీడియోలు

Adilabad Petrol Crisis | ఆదిలాబాద్ లో పెట్రోల్ కోసం బారులు తీరిన వాహనదారులు | ABP Desam
Ashwin Comments on MI Captain | హార్దిక్ పాండ్యాపై అశ్విన్ సంచలన వ్యాఖ్యలు | ABP Desam
Shreyas Iyer as captain of Team India? | టీమిండియా నెక్స్ట్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్? | ABP Desam
SRH Spends 10 Crores for Uppal Stadium | 10 కోట్లతో ఉప్పల్ స్టేడియం రినోవేషన్ | ABP Desam
RCB Sold to Aditya Birla Group IPL 2026 | భారీ ధరకు అమ్ముడైన RCB | ABP Desam Bangalore

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Steel Plant Credit Game: మిట్టల్ స్టీల్ ప్లాంట్ క్రెడిట్ తనదేనన్న జగన్ - పాత వీడియోతో షాకిచ్చిన టీడీపీ
మిట్టల్ స్టీల్ ప్లాంట్ క్రెడిట్ తనదేనన్న జగన్ - పాత వీడియోతో షాకిచ్చిన టీడీపీ
Telangana Assembly Indiramma Controversy: తెలంగాణ అసెంబ్లీలో ఇప్పసారా చిచ్చు - ఇందిరమ్మ పేరు తెచ్చిన బీజేపీ ఎమ్మెల్యే - తర్వాత మాటల యుద్ధమే!
తెలంగాణ అసెంబ్లీలో ఇప్పసారా చిచ్చు - ఇందిరమ్మ పేరు తెచ్చిన బీజేపీ ఎమ్మెల్యే - తర్వాత మాటల యుద్ధమే!
Varanasi Movie Set: వారణాసి సెట్‌లో ఏమున్నాయి..? రాజమౌళిని ఇండియన్ క్రిస్టోఫర్ నోలన్ అని విదేశీ మీడియా ఎందుకు అంటోంది..?
వారణాసి సెట్‌లో ఏమున్నాయి..? రాజమౌళిని ఇండియన్ క్రిస్టోఫర్ నోలన్ అని విదేశీ మీడియా ఎందుకు అంటోంది..?
Hero Vida VX2 Plus KKR Edition: కేకేఆర్ ఫ్యాన్స్ కోసం అదిరిపోయే గిఫ్ట్: హీరో వీడా స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్.. ఫీచర్లు మామూలుగా లేవుగా!
కేకేఆర్ ఫ్యాన్స్ కోసం అదిరిపోయే గిఫ్ట్: హీరో వీడా స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్.. ఫీచర్లు మామూలుగా లేవుగా!
Hyundai India : హ్యూందాయ్‌లో ఉన్న మోడల్స్‌ ఎన్ని? అమ్మకానికి ఎన్ని ఉన్నాయి? కొత్తగా ఎన్ని రాబోతున్నాయి?
హ్యూందాయ్‌లో ఉన్న మోడల్స్‌ ఎన్ని? అమ్మకానికి ఎన్ని ఉన్నాయి? కొత్తగా ఎన్ని రాబోతున్నాయి?
Rakasa Trailer : ఊరిలో కోట మిస్టరీ ఏంటి? - భయపెడుతూనే నవ్వించిన రాకాస ట్రైలర్
ఊరిలో కోట మిస్టరీ ఏంటి? - భయపెడుతూనే నవ్వించిన రాకాస ట్రైలర్
Deputy CM Pawan Kalyan: రామతీర్థంలో భక్తుల కల సాకారం- గిరి ప్రదక్షిణ మార్గాన్ని ప్రారంభించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్
రామతీర్థంలో భక్తుల కల సాకారం- గిరి ప్రదక్షిణ మార్గాన్ని ప్రారంభించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్
New Corona: ఉన్నవి సరిపోనట్లుగా మళ్లీ కరోనా కొత్త రకం వచ్చేస్తోందట - వ్యాక్సిన్ కూడా పని చేయదని తేల్చిన శాస్త్రవేత్తలు
ఉన్నవి సరిపోనట్లుగా మళ్లీ కరోనా కొత్త రకం వచ్చేస్తోందట - వ్యాక్సిన్ కూడా పని చేయదని తేల్చిన శాస్త్రవేత్తలు
Embed widget