అన్వేషించండి

Tollywood Politics: ఒక్క వారంలో మారిన సీన్, టాలీవుడ్ తో వివాదంలో ఏపీ ప్రభుత్వం - దగ్గరవుతున్న తెలంగాణ సర్కార్

Gaddar Awards | ఒక్క వారంలో తెలుగు రాష్ట్రాల్లో టాలీవుడ్ తో రిలేషన్ పూర్తిగా మారిపోయింది. సన్నిహితులు అనుకున్న ఏపీ ప్రభుత్వం టాలీవుడ్ కు దూరం కాగా, అదే సమయంలో తెలంగాణ సర్కార్ వారికి దగ్గరైంది.

Gaddar Movie Awards | మీరు సరిగ్గా గమనిస్తే ఒక్క వారంలో ఏపీ తెలంగాణ ప్రభుత్వాలకు  టాలీవుడ్ తో ఉన్న సంబంధాల్లో వచ్చిన మార్పు క్లియర్ గా కనబడుతుంది. టాలీవుడ్‌కు అత్యంత సన్నిహితంగా ఉండే  కూటమి ప్రభుత్వం  ప్రస్తుతం థియేటర్ల ఇష్యూ లో నిర్మాతలతో గ్యాప్ తెచ్చుకుంటే మరోవైపు తెలంగాణ సర్కార్ గద్దర్ అవార్డుల ప్రకటన తో దగ్గరయ్యే పనిలో పడింది. తెలుగు ప్రజలకు సినిమాతో అవినాభావ సంబంధం ఉంది.

హీరోలకు అతిపెద్ద ఫాలోయింగ్ ఆంధ్ర ప్రాంతంలో ఉంటే కలెక్షన్ల పరంగా నైజాం ప్రాంతం ముందు వరుసలో ఉంటుంది. అందుకే ప్రభుత్వాలు ఎప్పుడూ సినీ ప్రపంచంతో దగ్గరగా ఉండే ప్రయత్నం చేస్తాయి. అలాగే టాలీవుడ్ కూడా ప్రభుత్వం గుడ్ లక్స్ లో ఉండేందుకు తాపత్రయపడుతుంది. రిలీజ్ టైం లో టికెట్ ధరలు పెంచుకోవడానికి కొన్ని ప్రత్యేక సినిమాలకు ట్యాక్స్ బెనిఫిట్ పొందడానికి  ముఖ్యమంత్రుల  పర్మిషన్ తప్పనిసరి కావడంతో బడా హీరోలు పెద్ద నిర్మాతలు ప్రభుత్వాలతో వివాదం కొనితెచ్చుకునే ప్రయత్నం చేయరు. కానీ గడిచిన వారంలో అనూహ్య పరిస్థితులు టాలీవుడ్ లో ఒక గందరగోళ ఎట్మాస్పియర్ని  క్రియేట్ చేశాయి. 

థియేటర్ల ఇష్యూ లో పవన్ సీరియస్ 
 ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తన కొత్త సినిమా "హరిహర వీరమల్లు " ను అడ్డుకోవడానికి కొంతమంది కుట్ర చేస్తున్నారంటూ సీరియస్ అయ్యారు. టాలీవుడ్ లోని కొందరు నిర్మాతలు కావాలనే థియేటర్ల బంద్ ఇష్యు తెరపైకి తెచ్చి తనకు ఇబ్బంది కలుగ చేస్తున్నారని  సినిమా హాళ్ల కేటాయింపు వెనక ఉన్నది "ఆ నలుగురు నిర్మాతలు " అంటూ  అనుమానం వ్యక్తం చేయడంతో ఒక్కసారిగా టాలీవుడ్ ఉలిక్కిపడింది. ప్రెస్ మీట్ లు పెట్టి అల్లు అరవింద్, 'దిల్ 'రాజు అలాంటివాళ్లు తమకు ఈ గొడవకు సంబంధం లేదన్నట్టు చెప్పుకొచ్చారు. మరోవైపు పవన్ కళ్యాణ్  ఏపీ లోని థియేటర్లలో సౌకర్యాలు ఉన్నాయా లేదా అన్న విషయంపై  దర్యాప్తు చేస్తున్నారు.

ఏపీ సినిమాటోగ్రఫీ శాఖ కూడా  జనసేన చేతుల్లోనే ఉండడంతో  ప్రస్తుతం ఏపీ ప్రభుత్వాన్ని మంచి చేసుకునే పనిలో టాలీవుడ్ బడా బాబులు పడ్డారు. అయితే ఆర్ నారాయణ మూర్తి లాంటి కొందరు ప్రముఖులు మాత్రం పవన్ వ్యాఖ్యలను తప్పుపడుతున్నారు. ఇక సినీ రంగానికి ఎప్పుడు దగ్గరగా ఉండే టీడీపీ ఈ వ్యవహారంలో ఆచితూచి వ్యవహరిస్తుంది. దానితో అసలు ఈ వివాదం ఎప్పుడు పుల్ స్టాప్ పడుతుంది అంటూ టాలీవుడ్ ఎదురుచూస్తుంది. ఏదేమైనా సినీ ప్రపంచంతో దగ్గరగా ఉండే  ఏపీలోని కూటమి ప్రభుత్వంతో ఇలాంటి వివాదం రావడం టాలీవుడ్ కి మింగుడు పడడం లేదు.

టాలివుడ్ కి దగ్గరగా  రేవంత్ సర్కార్ 

 "పుష్ప 2" సినిమా విడుదల సమయంలో జరిగిన పరిణామాలు  ఎంతటి సంచలన సృష్టించాయో అందరికి తెలిసిందే. ప్రీమియర్ షో సమయంలో తొక్కిసలాట జరగడం ఒక మహిళ మృతి చెందడం దానికి కారణం అల్లు అర్జున్ ఆ ప్రీమియర్ షో కి వెళ్లడం అంటూ ఆయన్ని ఒకరోజు జైల్లో పెట్టడం  దేశవ్యాప్తంగా  వివాదాస్పదమైన  అంశాలతో టాలీవుడ్ పట్ల రేవంత్ సర్కార్ అంటి ముట్టనట్లు వ్యవహరిస్తుంది అన్న ప్రచారం జరిగింది. కానీ అలాంటి గ్యాప్ ఏది లేదని  తాజాగా ప్రకటించిన గద్దర్ అవార్డులతో తేలిపోయింది. ముఖ్యంగా "పుష్ప 2" లో నటనకు అల్లు అర్జున్ కు అవార్డు ప్రకటించారు. అదే సమయంలో తెలంగాణ నుంచి స్టార్ గా ఎదిగిన విజయ్ దేవరకొండ కు కూడా అవార్డు లభించింది. ఒకేసారి పదేళ్ల పెండింగ్ అవార్డు లు ప్రకటించడం తో దాదాపు టాలీవుడ్ లోని అగ్రహీరోలు ఏదో ఒక క్యాటగిరిలో అవార్డు పొందారు. ఇది కచ్చితంగా రేవంత్ సర్కార్ తో టాలీవుడ్ కి సంబంధాలు మరింత పెరుగుపడే విషయమే.

ప్రస్తుతం దేశంలోనే అతిపెద్ద బడ్జెట్ సినిమాలు నిర్మించే  వ్యవస్థగా మారిన టాలీవుడ్ కి రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాల సహకారం అలాగే ప్రభుత్వాలకు టాలీవుడ్ నుంచి లభించే  ఆదాయం రెండూ ముఖ్యమే. అయితే ఇందులో ఏపీ ప్రభుత్వం ముందంజలో ఉండేది అని ఒక అభిప్రాయం మొన్నటి వరకు ఉండేది. లేనిపోని వివాదాల నడుమ టాలీవుడ్ తో  ఏపీ తెలంగాణ ప్రభుత్వాలు సత్సంబంధాల వైఖరి కుడి ఎడమయింది. మరి వీలైనంత త్వరగా ఈ థియేటర్ల వివాదం కూడా ముగిసిపోయి ఏపీ ప్రభుత్వం టాలీవుడ్ ల స్నేహం కూడా  ఒకప్పటి స్థితికి వెళ్లాలని సినీ ప్రపంచం కోరుకుంటుంది

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

YSRCP local polls plan: లోకల్‌పోల్స్‌లో అసలు టార్గెట్ కూటమి మధ్య చిచ్చే - వైసీపీ పక్కా ప్లాన్‌తో రెడీ అవుతోందా?
లోకల్‌పోల్స్‌లో అసలు టార్గెట్ కూటమి మధ్య చిచ్చే - వైసీపీ పక్కా ప్లాన్‌తో రెడీ అవుతోందా?
Moinabad Drugs Case: మొయినాబాద్ డ్రగ్స్ కేసులో కీలక పరిణామం.. డ్రగ్స్ వాడటం ఇదే తొలిసారి కాదా? శాంపిల్స్‌లో మరిన్ని అవశేషాలు
మొయినాబాద్ డ్రగ్స్ కేసులో కీలక పరిణామం.. డ్రగ్స్ వాడటం ఇదే తొలిసారి కాదా? శాంపిల్స్‌లో మరిన్ని అవశేషాలు
Dangerous bike smoke: బైక్ ఆన్ చేసి గదిలో ఉంచితే ప్రాణాలు మిగలవు - పుంగనూరు ఘటనలో జరిగింది ఇదే - ఎందుకంటే ?
బైక్ ఆన్ చేసి గదిలో ఉంచితే ప్రాణాలు మిగలవు - పుంగనూరు ఘటనలో జరిగింది ఇదే - ఎందుకంటే ?
East Godavari Crime News: తూర్పుగోదావరి జిల్లాలో వివాహిత‌ మ‌ర్డ‌ర్ అండ్ రేప్ కేసులో రాజ‌మండ్రి కోర్టు సంచ‌ల‌న తీర్పు; మృగాళ్ల‌కు జీవిత ఖైదు,జ‌రిమానా!
తూర్పుగోదావరి జిల్లాలో వివాహిత‌ మ‌ర్డ‌ర్ అండ్ రేప్ కేసులో రాజ‌మండ్రి కోర్టు సంచ‌ల‌న తీర్పు; మృగాళ్ల‌కు జీవిత ఖైదు,జ‌రిమానా!

వీడియోలు

AIMIM MLAs Walkout Vandematarm | తెలంగాణ అసెంబ్లీలో జరిగిన ఘటనపై కేంద్ర మంత్రుల ఫైర్ | ABP Desam
Jay Shah Smashes T20W C 2026 Controversies | పాకిస్థాన్, బంగ్లాదేశ్‌లకు జై షా వార్నింగ్ | ABP Desam
Abhishek Sharma T20WC 2026 Secret Revealed | అభిషేక్ కు గంభీర్ సలహా | ABP Desam
Rishabh Pant Transformation IPL 2026 | యువరాజ్ సింగ్ శిక్షణలో రిషబ్ పంత్ | ABP Desam
Sanju Samson Funny Advice to Abhishek | అభిషేక్ శర్మకు సంజూ పెళ్లి సలహా | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pakistan Airstrike: కాబూల్‌లో పాక్ వైమానిక దాడులు.. 400 మందికి పైగా మృతి- హాస్పిటల్స్, నివాస ప్రాంతాలే టార్గెట్
కాబూల్‌లో పాక్ వైమానిక దాడులు.. 400 మందికి పైగా మృతి- హాస్పిటల్స్, నివాస ప్రాంతాలే టార్గెట్
Jeevan Reddy: జగిత్యాలలో రాజకీయ ప్రకంపనలు! 40 ఏళ్ల కాంగ్రెస్‌ బంధానికి జీవన్ రెడ్డి గుడ్‌బై? కారు ఎక్కనున్న సీనియర్‌ నేత!
జగిత్యాలలో రాజకీయ ప్రకంపనలు! 40 ఏళ్ల కాంగ్రెస్‌ బంధానికి జీవన్ రెడ్డి గుడ్‌బై? కారు ఎక్కనున్న సీనియర్‌ నేత!
YS Avinash Reddy: హత్య చేసిన దస్తగిరికి మద్దతు - డ్రైవర్ ప్రసాద్ విషయంలో సైలెంట్ - సునీతపై అవినాష్ రెడ్డి ఆరోపణలు
హత్య చేసిన దస్తగిరికి మద్దతు - డ్రైవర్ ప్రసాద్ విషయంలో సైలెంట్ - సునీతపై అవినాష్ రెడ్డి ఆరోపణలు
Iran War Updates: నెతన్యాహు వీడియోలు ఓకే - మరి ఇరాన్ కొత్త సుప్రీంలీడర్ వీడియోలు ఎక్కడ - నిజంగానే కోమాలో ఉన్నారా?
నెతన్యాహు వీడియోలు ఓకే - మరి ఇరాన్ కొత్త సుప్రీంలీడర్ వీడియోలు ఎక్కడ - నిజంగానే కోమాలో ఉన్నారా?
Telangana Assembly: వందేమాతరం పాడకుండా వాకౌట్ చేసిన మజ్లిస్ ఎమ్మెల్యేలు - బీజేపీ నేతల తీవ్ర విమర్శలు
వందేమాతరం పాడకుండా వాకౌట్ చేసిన మజ్లిస్ ఎమ్మెల్యేలు - బీజేపీ నేతల తీవ్ర విమర్శలు
Statue of Sacrifice: ఆంధ్రప్రదేశ్ గౌరవం ‘స్టాచ్యూ ఆఫ్ శాక్రిఫైస్’.. 58 అడుగుల పొట్టి శ్రీరాములు కాంస్య విగ్రహం ఆవిష్కరణ
ఆంధ్రప్రదేశ్ గౌరవం ‘స్టాచ్యూ ఆఫ్ శాక్రిఫైస్’.. 58 అడుగుల పొట్టి శ్రీరాములు కాంస్య విగ్రహం ఆవిష్కరణ
Nandini Sidda Reddy : తెలంగాణ అక్షర శిఖరానికి జాతీయ గౌరవం! నందిని సిధారెడ్డిని వరించిన కేంద్ర సాహిత్య పురస్కారం 
తెలంగాణ అక్షర శిఖరానికి జాతీయ గౌరవం! నందిని సిధారెడ్డిని వరించిన కేంద్ర సాహిత్య పురస్కారం 
Sreeleela : శ్రీలీలతో రంగస్థలం మహేష్ మిస్ బిహేవ్ చేశాడా? - ఇదిగో క్లారిటీ
శ్రీలీలతో రంగస్థలం మహేష్ మిస్ బిహేవ్ చేశాడా? - ఇదిగో క్లారిటీ
Embed widget