అన్వేషించండి

Chandrababu Team Davos: ఎంవోయూలు చేసుకోకుండానే దావోస్ టూర్ ముగింపు - చంద్రబాబు, లోకేష్ వ్యూహం మార్చారా ?

Davos: దావోస్‌లో ఏపీ బృందం ఒక్క ఎంవోయూ చేసుకోలేదు. పెట్టుబడుల ఒప్పందాలు రాష్ట్రంలోనే చేసుకోవాలన్న ఉద్దేశంతో ఒప్పందాలు చేసుకోలేదని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.

Chandrababu team turned back without making MOUs in Davos why:  దావోస్‌లో తెలంగాణ ప్రభుత్వం గత రికార్డులను అధిగమించి లక్షన్నర కోట్లకుపైగా పెట్టుబడులు సాధించామని ప్రకటించుకుంది. రికార్డులు బద్దలయ్యాయని సంచలనం సృష్టించామని చెప్పుకున్నారు. అయితే పొరుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ మాత్రం ఒక్క ఎంవోయూ కూడా చేసుకోలేదు. దావోస్ పర్యటనలో చంద్రబాబు, లోకేష్ కొత్త ఒరవడి సృష్టించారు. 

గతంలో చంద్రబాబు దావోస్ ఎప్పుడు వెళ్లినా వేలు, లక్షల కోట్ల ఒప్పందాలు అంటూ హడావడి జరిగేది. కానీ ఈ సారి మాత్రం  ఎలాంటి ముందస్తు ఒప్పందాలు చేసుకోలేదు. పారిశ్రామికవేత్తలకు ఆంధ్రప్రదేశ్ అనుకూలతల గురించి ప్రజెంటేషన్ ఇవ్వడం. తమ రాష్ట్రానికి వచ్చి క్షేత్ర స్థాయిలో పరిశీలించాలని కోరడానికే ప్రాధాన్యం ఇచ్చారు. ఓ రకంగా పూర్తి స్థాయిలో మార్కెటింగ్ మీదనే దృష్టిపెట్టారని అనుకోవచ్చు. బిల్ గేట్స్ వరకూ దావోస్‌కు వచ్చిన దిగ్గజ పారిశ్రామికవేత్తలందర్నీ చంద్రబాబు,లోకేష్ కలిశారు. విస్తృతంగా సెమినార్లలో పాల్గొన్నారు. ఏపీలో ఉన్న అవకాశాల్ని వివరించారు.    

Also Read: రాజకీయాల్లో వారసత్వం ఓ భ్రమ - లోకేష్ నాయకత్వంపై చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు

దావోస్‌ సదస్సు పూర్తిగా పెట్టుబడిదారులు, ఆ పెట్టుబడులను ఆకర్షించాలనుకునేవారికి మధ్య ఓ వారధి లాంటిది. అనేక దేశాల్లో ఉన్న అవకాశాలను అక్కడ ప్రజెంట్ చేసుకునే అవకాశం  ఇక్కడ లభిస్తుంది. అయితే అక్కడ వచ్చే టాప్ ఎగ్జిక్యూటివ్స్ ..  ప్రభుత్వాలకు చెందిన వారితో మాట్లాడి వెంటనే ఒప్పందాలు చేసుకోవడం అనేది అసహజం అనుకోవచ్చు. అప్పటికప్పుడు ఒప్పందాలు చేసుకోవడం అనేది ఉండదు. ముందస్తుగా చర్చలు పూర్తి చేసుకున్న  ఒప్పందాలు ఉంటే అక్కడ పత్రాలు మార్చుకుంటారు.                        

ఓ పారిశ్రామిక సంస్థ అయినా.. ఇలా చంద్రబాబో..లోకేషో మరొకరో అడిగారని ఎంవోయూ చేసుకుంటే..అది వాస్తవ రూపంలోకి వచ్చేందుకు అవకాశం చక్కువగా ఉటుంది.  అందుకే అలాంటి పెట్టుబడులకు దూరంగా ఉండాలని చంద్రబాబు,లోకేష్ నిర్ణయించుకున్నారు. అందుకే పూర్తిగా ఏపీ గురించే చెప్పడానికే ప్రాదాన్యం ఇచ్చారని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి.  ఏపీలో పెట్టుబడులు పెట్టాలని నిర్మయించుకున్న చాలా కంపెనీలు వాటి టాప్ ఎగ్జిక్యూటివ్స్ దావోస్ వచ్చారు. అనకాపల్లిలో స్టీల్ ప్లాంట్ పెట్టాలనుకున్న ఆర్సెలార్ మిట్టల్ యజమాని కూడా దావోస్ వచ్చారు. చంద్రబాబు, లోకేష్ తో సమావేశమయ్యారు. రూ. లక్షన్నర కోట్ల పెట్టుబడి ప్రతిపాదనలు వారి ఉన్నాయి. అయితే  తమ ప్రతిపాపనలపై మరోసారి చర్చించారు.అయితే ఆ పెట్టుబడుల ప్రకటనలకు దావోస్ సరైన వేదిక కాదని అనుకున్నట్లుగా తెలుస్తోంది.  

Also Read:  త్వరలో మోదీ కేబినెట్‌లోకి చంద్రబాబు - బ్లూమ్‌బెర్గ్ డౌట్ - సీఎం రియాక్షన్ ఏమిటంటే ?

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana Budget: తెలంగాణ బడ్జెట్‌లో నిరుద్యోగులకు తీపి కబురు- 57,946 పోస్టులు భర్తీ చేయబోతున్నట్టు ప్రకటన
తెలంగాణ బడ్జెట్‌లో నిరుద్యోగులకు తీపి కబురు- 57,946 పోస్టులు భర్తీ చేయబోతున్నట్టు ప్రకటన
YS Viveka Case: వివేకా కేసులో మరో నిందితుడికి ప్రాణభయం - హత్య సినిమాపైనా ఫిర్యాదు- ఎస్పీని కలిసిన ఏ-2 సునీల్ యాదవ్
వివేకా కేసులో మరో నిందితుడికి ప్రాణభయం - హత్య సినిమాపైనా ఫిర్యాదు- ఎస్పీని కలిసిన ఏ-2 సునీల్ యాదవ్
Chandrababu Naidu meets Bill Gates: ఏపీలో గేట్స్ ఫౌండేషన్ సేవలు - బిల్ గేట్స్ బృందంతో ఏపీ సీఎం ఒప్పందాలు
ఏపీలో గేట్స్ ఫౌండేషన్ సేవలు - బిల్ గేట్స్ బృందంతో ఏపీ సీఎం ఒప్పందాలు
Telangana Roads: HAM ద్వారా రహదారుల అభివృద్ధి, 28 వేల కోట్లతో 17,000 కిలోమీటర్ల గ్రామీణ రహదారులే టార్గెట్
HAM ద్వారా రహదారుల అభివృద్ధి, 28 వేల కోట్లతో 17,000 కిలోమీటర్ల గ్రామీణ రహదారులే టార్గెట్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Blue Whales Welcome Sunita Williams | ఫ్లోరిడా తీరంలో ఆస్ట్రానాట్లకు స్వాగతం పలికిన సముద్ర జీవులు | ABP DesamSunita Williams Touched Earth | 9నెలల తర్వాత భూమి మీద కాలుపెట్టిన సునీతా విలియమ్స్ | ABP DesamDragon Capsule Recovery | Sunita Williams సముద్రంలో దిగాక ఎలా కాపాడతారంటే | ABP DesamSunita Williams Return to Earth Safely | ఫ్లోరిడా సముద్ర తీరంలో ఉద్విగ్న క్షణాలు | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Budget: తెలంగాణ బడ్జెట్‌లో నిరుద్యోగులకు తీపి కబురు- 57,946 పోస్టులు భర్తీ చేయబోతున్నట్టు ప్రకటన
తెలంగాణ బడ్జెట్‌లో నిరుద్యోగులకు తీపి కబురు- 57,946 పోస్టులు భర్తీ చేయబోతున్నట్టు ప్రకటన
YS Viveka Case: వివేకా కేసులో మరో నిందితుడికి ప్రాణభయం - హత్య సినిమాపైనా ఫిర్యాదు- ఎస్పీని కలిసిన ఏ-2 సునీల్ యాదవ్
వివేకా కేసులో మరో నిందితుడికి ప్రాణభయం - హత్య సినిమాపైనా ఫిర్యాదు- ఎస్పీని కలిసిన ఏ-2 సునీల్ యాదవ్
Chandrababu Naidu meets Bill Gates: ఏపీలో గేట్స్ ఫౌండేషన్ సేవలు - బిల్ గేట్స్ బృందంతో ఏపీ సీఎం ఒప్పందాలు
ఏపీలో గేట్స్ ఫౌండేషన్ సేవలు - బిల్ గేట్స్ బృందంతో ఏపీ సీఎం ఒప్పందాలు
Telangana Roads: HAM ద్వారా రహదారుల అభివృద్ధి, 28 వేల కోట్లతో 17,000 కిలోమీటర్ల గ్రామీణ రహదారులే టార్గెట్
HAM ద్వారా రహదారుల అభివృద్ధి, 28 వేల కోట్లతో 17,000 కిలోమీటర్ల గ్రామీణ రహదారులే టార్గెట్
Rythu Bharosa Scheme: అన్నదాతలకు గుడ్ న్యూస్, రైతు భరోసా పథకానికి భారీగా కేటాయింపులు
అన్నదాతలకు గుడ్ న్యూస్, రైతు భరోసా పథకానికి భారీగా కేటాయింపులు
Chahal - Dhanashree Verma Divorce: చాహల్, ధనశ్రీ వర్మ విడాకులు కన్ఫామ్- భరణం ఎంత ఇస్తున్నాడో తెలుసా ?
చాహల్, ధనశ్రీ వర్మ విడాకులు కన్ఫామ్- భరణం ఎంత ఇస్తున్నాడో తెలుసా ?
Telangana Budget 2025: తెలంగాణ బడ్జెట్ ప్రవేశపెట్టిన భట్టి విక్రమార్క, శాఖలవారీగా కేటాయింపుల పూర్తి వివరాలు
తెలంగాణ బడ్జెట్ ప్రవేశపెట్టిన భట్టి విక్రమార్క, శాఖలవారీగా కేటాయింపుల పూర్తి వివరాలు
Karantaka Assembly: మగాళ్లు అల్లాడిపోతున్నారయ్యా… వారానికి రెండు బాటిళ్లు ఫ్రీ గా ఇవ్వండి- అసెంబ్లీలో ఎమ్మెల్యే అభ్యర్థన
మగాళ్లు అల్లాడిపోతున్నారయ్యా… వారానికి రెండు బాటిళ్లు ఫ్రీ గా ఇవ్వండి- అసెంబ్లీలో ఎమ్మెల్యే అభ్యర్థన
Embed widget