అన్వేషించండి

Chandrababu: 'దేవతల రాజధానిని రాక్షసులు చెరబట్టారు' - వైసీపీకి కౌంట్ డౌన్ ప్రారంభమైందన్న చంద్రబాబు

Andhra News: వైసీపీ ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయని.. భవిష్యత్తులో మంచి రోజులు రాబోతున్నాయని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. అమరావతి మందడం భోగి వేడుకల్లో ఆయన పాల్గొన్నారు.

Chandrababu Comments in Sankranthi Celebrations: వైసీపీ ప్రభుత్వానికి కౌంట్ డౌన్ ప్రారంభమైందని.. మరో 3 నెలల్లో రాష్ట్రానికి మంచి రోజులు వస్తున్నాయని చంద్రబాబు (Chandrababu) అన్నారు. అమరావతి (Amaravathi) పరిధిలోని మందడం (Mandadam) గ్రామంలో నిర్వహించిన 'తెలుగు జాతికి స్వర్ణయుగం - సంక్రాంతి సంకల్పం' కార్యక్రమంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ తో కలిసి ఆయన పాల్గొన్నారు. వైసీపీ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక నిర్ణయాల ఉత్తర్వులు, అమరావతికి వ్యతిరేకంగా తెచ్చిన జీవోల ప్రతులను భోగి మంటల్లో వేశారు. వైసీపీ ప్రభుత్వం అసమర్థ, విధ్వంస విధానాలతో ప్రజలు తీవ్రంగా నష్టపోయారని మండిపడ్డారు. దేవతల రాజధాని అయిన అమరావతిని రాక్షసులు చెరబట్టారని విమర్శించారు. అమరావతి రైతులు అడుగడుగునా ఇబ్బంది పడ్డారని.. అవమానాలు ఎదుర్కొన్నారని అన్నారు. ఈ ఐదేళ్లు రాజధాని ప్రాంత వాసులకు, రైతులకు చీకటి రోజులని చెప్పారు. భవిష్యత్తు మనదే.. అమరావతి కేంద్రంగా రాజధాని ఉంటుందని స్పష్టం చేశారు.

పండుగ భోగీ.. పాలకుడు మానసిక రోగి

'ఇవాళ పండుగేమో భోగి.. పాలకుడేమో మానసిక రోగి' అని చంద్రబాబు (Chandrababu) మండిపడ్డారు. భవిష్యత్తు మనదేనని.. శుభ ఘడియలు తలుపు తడుతున్నాయని చెప్పారు. వైసీపీ విముక్త ఏపీ కోసం నేటి నుంచి 87 రోజుల పాటు కులాలు, మతాలు, ప్రాంతాలకు అతీతంగా అందరూ ఒకే బాటలో పయనించాలని పిలుపునిచ్చారు. 'మన రాజధాని అమరావతే. ఇది రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేస్తుంది. సంపద సృష్టించే కేంద్రంగా, సంక్షేమ పాలన అందించేందుకు తోడ్పడుతుంది. పోలీసులు ఎన్ని అడ్డంకులు సృష్టించినా అమరావతి రైతులు పోరాడారు. రాష్ట్రాన్ని పునఃనిర్మించుకోవాలి. సీఎం జగన్ కు కూల్చడమే తెలుసు. రాజకీయ హింస, మోసపు హామీలతో బడుగు, బలహీన వర్గాల ఉసురు తీస్తున్నారు. అంగన్వాడీలు 32 రోజులుగా తమ సమస్యలు పరిష్కరించాలని పోరాడుతున్నా పట్టించుకోకుండా.. పండుగ పూట కూడా వారిని రోడ్డుపై ఉండేలా చేశారు. వైసీపీ పాలనలో రైతుల కష్టాలు వర్ణనాతీతం. తుపాను వచ్చి నష్టపోయినా పట్టించుకోరు. యువతకు ఉపాధి అవకాశాలు లేకుండా పోయాయి. భవిష్యత్తులో నిరుద్యోగులకు ఉపాధి కల్పించే బాధ్యతను టీడీపీ - జనసేన కలిసి తీసుకుంటాయి. ప్రభుత్వం కరవు మండలాలను కూడా పట్టించుకోకుండా కేంద్ర సాయం రాకుండా చేస్తోంది. ప్రతి ఒక్కరికీ అండగా నిలిచే బాధ్యత మాది. ' అని చంద్రబాబు పేర్కొన్నారు.

'3 రాజధానులు ఎక్కడా లేవు'

సీఎం జగన్ అహంకారాన్ని భోగి మంటల్లో వేశామని చంద్రబాబు చెప్పారు. ప్రభుత్వ ఒత్తిడి వల్ల పోలీసులు అమరావతి వాసులను ఇబ్బంది పెట్టారని.. ఇదే పోలీసులు మీకు జిందాబాద్ కొట్టే పరిస్థితి వస్తుందని అన్నారు. ఏపీలో జరుగుతున్న అరాచకాలను కోర్టులు కూడా ఏమీ చేయలేని పరిస్థితి నెలకొందని వాపోయారు. ప్రపంచంలో 3 రాజధానులనేవి ఎక్కడా లేవని పేర్కొన్నారు. 'విశాఖను ఆర్థిక రాజధానిగా అభివృద్ధి చేస్తాం. కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేస్తాం. విశాఖ, కర్నూలు నగరాలకు పూర్వ వైభవం తెస్తాం. రాజకీయాల్లో ఉండేందుకు అర్హత లేని వ్యక్తి సీఎం జగన్' అని వ్యాఖ్యానించారు.

'రాజధాని రైతుల సంకల్ప నెరవేరుతుంది'

మరికొద్ది రోజుల్లో రాష్ట్రానికి పట్టిన పీడ తొలగిపోయే సమయం ఆసన్నమైందని జనసేనాని పవన్ కల్యాణ్ (Pawan Kalyan) అన్నారు. రాజధాని కోసం 33 వేల ఎకరాలు ఇచ్చిన రైతులకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. రాజధాని రైతులను దారుణంగా కొట్టి వేధించిన ఘటన తనను కలిచివేసిందని.. భవిష్యత్తులో రైతుల సంకల్పం నెరవేరుతుందని అన్నారు. 'బంగారు రాజధానిని నిర్మించుకుందాం. ఇది కేవలం అమరావతి సమస్యే కాదు. 5 కోట్ల మంది ప్రజలది. మీరు పడుతున్న కష్టం రేపు శ్రీకాకుళం, పులివెందులలోనూ వస్తుంది. భవన నిర్మాణ కార్మికులు, నిరుద్యోగులను వైసీపీ మోసం చేసింది.' అని పవన్ మండిపడ్డారు.

Also Read: Ambati Rambabu Dance: మంత్రి అంబటి సంక్రాంతి సంబరాలు, అదిరే స్టెప్పులతో మరోసారి వైరల్‌గా

 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

India vs New Zealand: న్యూజిలాండ్‌ను ఓడించి ప్రపంచ కప్ సెమీఫైనల్స్‌కు ప్రవేశించిన భారత్; మంధానా-ప్రతికా ఇన్నింగ్స్ అదుర్స్
న్యూజిలాండ్‌ను ఓడించి ప్రపంచ కప్ సెమీఫైనల్స్‌కు ప్రవేశించిన భారత్; మంధానా-ప్రతికా ఇన్నింగ్స్ అదుర్స్
Telangana Cabinet Decisions: బీసీ రిజర్వేన్లపై వీడిన సస్పెన్స్- తెలంగాణ క్యాబినేట్ కీలక నిర్ణయాలు!
బీసీ రిజర్వేన్లపై వీడిన సస్పెన్స్- తెలంగాణ క్యాబినేట్ కీలక నిర్ణయాలు!
YS Jagan Comments on Google Data Center: విశాఖకు గూగుల్ సెంటర్ రావడంలో మాకు, అదానీకి క్రెడిట్ ఇవ్వడం లేదు: జగన్
విశాఖకు గూగుల్ సెంటర్ రావడంలో మాకు, అదానీకి క్రెడిట్ ఇవ్వడం లేదు: జగన్
కాల్పులు జరిగిన 12గంటల్లోపే నిందితుడ్ని పట్టుకున్నాం.. గోఅక్రమ రవాణాలో అసలేం జరిగిందటే..!? రాచకొండ సీపీ సుధీర్ బాబు
కాల్పులు జరిగిన 12గంటల్లోపే నిందితుడ్ని పట్టుకున్నాం.. గోఅక్రమ రవాణాలో అసలేం జరిగిందటే..!? రాచకొండ సీపీ సుధీర్ బాబు
Advertisement

వీడియోలు

Vizag Google Data Centre Controversy | వైజాగ్ గూగుల్ డేటా సెంటర్ పై ప్రశ్నలకు సమాధానాలేవి..? | ABP
Aus vs Ind 2nd ODI Highlights | రెండు వికెట్ల తేడాతో భారత్ పై రెండో వన్డేలోనూ నెగ్గిన ఆసీస్ | ABP Desam
Netaji Subhash Chandra Bose | నేతాజీ సుభాష్ చంద్రబోస్ స్థాపించిన ఆజాద్ హింద్ ఫౌజ్ చరిత్ర | ABP Desam
కోహ్లీ భయ్యా.. ఏమైందయ్యా..? అన్నీ గుడ్లు, గుండు సున్నాలు పెడుతున్నావ్!
గిల్‌కి షేక్ హ్యాండ్ ఇచ్చిన పాకిస్తాన్ ఫ్యాన్‌.. ఫైర్ అవుతున్న క్రికెట్ ఫ్యాన్స్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
India vs New Zealand: న్యూజిలాండ్‌ను ఓడించి ప్రపంచ కప్ సెమీఫైనల్స్‌కు ప్రవేశించిన భారత్; మంధానా-ప్రతికా ఇన్నింగ్స్ అదుర్స్
న్యూజిలాండ్‌ను ఓడించి ప్రపంచ కప్ సెమీఫైనల్స్‌కు ప్రవేశించిన భారత్; మంధానా-ప్రతికా ఇన్నింగ్స్ అదుర్స్
Telangana Cabinet Decisions: బీసీ రిజర్వేన్లపై వీడిన సస్పెన్స్- తెలంగాణ క్యాబినేట్ కీలక నిర్ణయాలు!
బీసీ రిజర్వేన్లపై వీడిన సస్పెన్స్- తెలంగాణ క్యాబినేట్ కీలక నిర్ణయాలు!
YS Jagan Comments on Google Data Center: విశాఖకు గూగుల్ సెంటర్ రావడంలో మాకు, అదానీకి క్రెడిట్ ఇవ్వడం లేదు: జగన్
విశాఖకు గూగుల్ సెంటర్ రావడంలో మాకు, అదానీకి క్రెడిట్ ఇవ్వడం లేదు: జగన్
కాల్పులు జరిగిన 12గంటల్లోపే నిందితుడ్ని పట్టుకున్నాం.. గోఅక్రమ రవాణాలో అసలేం జరిగిందటే..!? రాచకొండ సీపీ సుధీర్ బాబు
కాల్పులు జరిగిన 12గంటల్లోపే నిందితుడ్ని పట్టుకున్నాం.. గోఅక్రమ రవాణాలో అసలేం జరిగిందటే..!? రాచకొండ సీపీ సుధీర్ బాబు
Andhra Politics: నేరాల్లో బాధితులకు ప్రజాధనం పరిహారంగా ఇవ్వొచ్చా?  సీఎం చంద్రబాబు ఎందుకిలా చేస్తున్నారు?
నేరాల్లో బాధితులకు ప్రజాధనం పరిహారంగా ఇవ్వొచ్చా? సీఎం చంద్రబాబు ఎందుకిలా చేస్తున్నారు?
Telangana Cabinet: స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇద్దరు పిల్లల నిబంధన ఎత్తివేత - కేబినెట్ నిర్ణయం - త్వరలో ఆర్డినెన్స్
స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇద్దరు పిల్లల నిబంధన ఎత్తివేత - కేబినెట్ నిర్ణయం - త్వరలో ఆర్డినెన్స్
Pakistani Taliban: పాకిస్తాన్ ఆర్మీ చీఫ్‌ పరువు తీసిన తాలిబన్ - మగాడివైతే మాతో పోరాడాలని సవాల్
పాకిస్తాన్ ఆర్మీ చీఫ్‌ పరువు తీసిన తాలిబన్ - మగాడివైతే మాతో పోరాడాలని సవాల్
Jublihills Byelections: జూబ్లిహిల్స్ గెలుపు కోసం కేసీఆర్ రూట్ మ్యాప్ - ఫామ్ హౌస్‌లో కీలక నేతలతో సమావేశం !
జూబ్లిహిల్స్ గెలుపు కోసం కేసీఆర్ రూట్ మ్యాప్ - ఫామ్ హౌస్‌లో కీలక నేతలతో సమావేశం !
Embed widget