అన్వేషించండి

Rampachodavaram Mega PTM: ప్రతి విద్యార్థి ప్రతిభను వెలికి తీసేలా విద్యావ్యవస్థలో మార్పులు - రంపచోడవరం మెగా పీటీఎంలో సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు

Chandrababu Future Vision: రంపచోడవరం మెగా PTM లో సీఎం చంద్రబాబు నాయుడు 76ఏళ్ల వయసులోనూ రాష్ట్రాన్ని నిలబెట్టే విజన్‌తో పనిచేస్తున్నానన్నారు. లోకేష్ ప్రోగ్రెస్ రిపోర్ట్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

Nara Lokesh Education Dept: విద్యాసంస్కరణలే రాష్ట్ర భవిష్యత్తుకు అసలైన పునాదులని, తాను నిన్నటి ఆలోచనను కాదని.. రాష్ట్రాన్ని నిలబెట్టే భవిష్యత్తు విజన్‌ను అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరంలో శుక్రవారం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన  మెగా పేరెంట్-టీచర్ మీట్    కార్యక్రమంలో విద్యాశాఖ మంత్రి నారా లోకేష్‌తో కలిసి సీఎం పాల్గొన్నారు. గిరిజన ప్రాంతమైన రంపచోడవరంలో విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులను ఉద్దేశించి మాట్లాడిన చంద్రబాబు, విద్యావ్యవస్థలో తాము తీసుకొచ్చిన మార్పులు , రాష్ట్ర భవిష్యత్తు ప్రణాళికలపై  మార్గదర్శనం చేశారు.

తన వయస్సు, నిరంతర శ్రమను ప్రస్తావిస్తూ సీఎం చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.  60 ఏళ్లు రాగానే జీవితం ముగిసిపోయిందని భావించి చాలామంది ఇంట్లో విశ్రాంతి తీసుకుంటారు. కానీ 76 ఏళ్ల వయసులోనూ పడుకునే సమయం తప్ప ప్రతి క్షణం యంత్రంలా పనిచేస్తున్నానంటే దానికి కారణం నాలోని సంకల్పమే. నేను గతం గురించి మాత్రమే మాట్లాడే వ్యక్తిని కాను, రేపటి తరాన్ని నిర్మించే భవిష్యత్తు విజన్‌ను అని సీఎం పేర్కొన్నారు. మారుమూల ఏజెన్సీ ప్రాంతాల నుంచి డిజిటల్ విప్లవం వరకు గిరిజన విద్యార్థులు ప్రపంచ స్థాయి పోటీకి సిద్ధం కావాలనేది తన ఆశయమని తెలిపారు.

విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పనితీరుపై ముఖ్యమంత్రి ప్రశంసల వర్షం కురిపించారు. ప్రభుత్వం ఏర్పడిన కొత్తలో లోకేష్ ఏరికోరి విద్యాశాఖను ఎంచుకున్నారు. ఆనాడు ఈ శాఖను ఎందుకు అడిగారో ఈరోజు నాకూ, రాష్ట్ర ప్రజలకూ స్పష్టంగా అర్థమైంది. విద్యావ్యవస్థలో ఆయన విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చారు అని చెప్పారు. ఈ సందర్భంగా విద్యార్థులు, ఉపాధ్యాయుల పురోగతిని పర్యవేక్షించే క్రమాన్ని వివరిస్తూ..  మీకు మార్కులు తగ్గితే.. లోకేష్‌కు మార్కులు తగ్గుతాయి! ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు విద్యార్థులకు మంచి మార్కులు వేస్తే.. విద్యాశాఖ మంత్రిగా పనితీరు ఆధారంగా ముఖ్యమంత్రిగా నేను లోకేష్‌కు మార్కులు వేస్తా  అని చమత్కరించారు. 

గిరిజన ప్రాంత పాఠశాలలను సమగ్రంగా అభివృద్ధి చేయడంతో పాటు  తల్లికి వందనం ,  లీప్ యాప్ వంటి సాంకేతిక వినూత్న విధానాల ద్వారా ప్రతి ఒక్క విద్యార్థి ప్రతిభను వెలికితీసేలా చర్యలు చేపట్టామన్నారు. విద్యార్థులు చదువుతో పాటు నైతిక విలువలు పెంపొందించుకోవాలని, తల్లిదండ్రులు తమ పిల్లల చదువుపై రోజూ దృష్టి సారించాలని సూచించారు. గత ప్రభుత్వం విద్యా రంగాన్ని నిర్లక్ష్యం చేసిందని, తాము అధికారంలోకి రాగానే మెగా డీఎస్సీ ద్వారా 16,000 పోస్టుల భర్తీకి శ్రీకారం చుట్టి, విద్యావ్యవస్థకు పూర్వవైభవం తీసుకొచ్చామని గుర్తుచేశారు.  

అనంతరం సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్‌లు విద్యాశాఖ అమలు చేస్తున్న  డొక్కా సీతమ్మ  మధ్యాహ్న భోజనాన్ని విద్యార్థులతో కలిసి ఆస్వాదించారు. లబ్ధిదారులైన  తల్లికి వందనం తల్లిదండ్రులతో నేరుగా ముచ్చటించి పథకాల అమలుపై వారి అభిప్రాయాలు సేకరించారు. విద్యార్థులు నాటిన మొక్కలకు జారీ చేసిన  గ్రీన్ పాస్‌పోర్టులు , క్యూఆర్ కోడ్‌లను సీఎం పరిశీలించారు. రాబోయే రోజుల్లో ఏపీ మోడల్ ఎడ్యుకేషన్‌ను దేశానికే ఆదర్శంగా నిలపడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి తన ప్రసంగాన్ని ముగించారు.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Rampachodavaram Mega PTM: ప్రతి విద్యార్థి ప్రతిభను వెలికి తీసేలా విద్యావ్యవస్థలో మార్పులు - రంపచోడవరం మెగా పీటీఎంలో సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
ప్రతి విద్యార్థి ప్రతిభను వెలికి తీసేలా విద్యావ్యవస్థలో మార్పులు - రంపచోడవరం మెగా పీటీఎంలో సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
Pawan Kalyan Vs Vijay: పవన్, చంద్రబాబుపై సెటైర్... జన నాయకుడికి జైలు సీన్ అవసరమా?
పవన్, చంద్రబాబుపై సెటైర్... జన నాయకుడికి జైలు సీన్ అవసరమా?
AP Education Reforms: ప్రైవేటు నుంచి ప్రభుత్వ స్కూళ్లకు మారిన లక్ష మందికిపైగా విద్యార్థులు - గిరిజన స్కూళ్లన్నింటికీ సొంత భవనాలు - లోకేష్ కీలక ప్రకటన
ప్రైవేటు నుంచి ప్రభుత్వ స్కూళ్లకు మారిన లక్ష మందికిపైగా విద్యార్థులు - గిరిజన స్కూళ్లన్నింటికీ సొంత భవనాలు - లోకేష్ కీలక ప్రకటన
Breaking News: వచ్చే ఏడాదికి గిరిజన ప్రాంత స్కూల్స్ అన్నింటికీ సొంత భవనాలు: మంత్రి నారా లోకేష్
వచ్చే ఏడాదికి గిరిజన ప్రాంత స్కూల్స్ అన్నింటికీ సొంత భవనాలు: మంత్రి నారా లోకేష్
Advertisement

వీడియోలు

PM Modi Midnight Statement on Paper Leak | పేపర్ లీకేజీలపై మోదీ అర్ధరాత్రి ప్రకటన
Shreyas Iyer about IND vs ZIM T20 | జింబాబ్వేపై గెలుపుపై శ్రేయస్ అయ్యర్ కామెంట్స్
Gundenininda Gudigantalu Serial July 24 | మనోజ్ నోట్లో బలవంతంగా పెసరట్టు కుక్కిన బాలు
India vs Zimbabwe 1st T20 Highlights | జింబాబ్వేపై భారత్ ఘన విజయం
Karthika Deepam Tejaswini Prakash as Malini | తెలుగు బిజినెస్‌మ్యాన్‌ని పెళ్లి చేసుకున్న మాలిని
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR Warning to PM Modi : జెన్-జీ పవర్‌ను తక్కువ అంచనా వేయకండి - నేపాల్,శ్రీలంకల్లా జరగొచ్చు - ప్రధాని మోదీకి కేటీఆర్ ఘాటు హెచ్చరిక!
జెన్-జీ పవర్‌ను తక్కువ అంచనా వేయకండి - నేపాల్,శ్రీలంకల్లా జరగొచ్చు - ప్రధాని మోదీకి కేటీఆర్ ఘాటు హెచ్చరిక!
Andhra Pradesh Rainfall: ఏపీలో 51 శాతం, కృష్ణా డెల్టాలో 49 శాతం లోటు వర్షపాతం.. రైతులకు ఈఎన్సీ కీలక సూచనలు
ఏపీలో 51 శాతం, కృష్ణా డెల్టాలో 49 శాతం లోటు వర్షపాతం.. రైతులకు ఈఎన్సీ కీలక సూచనలు
Raja Singh : తెలంగాణ బీజేపీలోకి రాజాసింగ్‌కు ఇక నో ఎంట్రీ - మహారాష్ట్ర, యూపీలకు వెళ్లిపోతారా?
తెలంగాణ బీజేపీలోకి రాజాసింగ్‌కు ఇక నో ఎంట్రీ - మహారాష్ట్ర, యూపీలకు వెళ్లిపోతారా?
Kumki Elephants: పలమనేరు క్యాంపు నుంచి పార్వతీపురానికి కుంకీ ఏనుగులు తరలింపు.. పవన్ కళ్యాణ్ కృషి ఫలించేనా !
పలమనేరు క్యాంపు నుంచి పార్వతీపురానికి కుంకీ ఏనుగులు తరలింపు.. పవన్ కళ్యాణ్ కృషి ఫలించేనా !
Viral Video: యువతిని ఒళ్లో కూర్చోబెట్టుకుని ఆటో డ్రైవింగ్.. మైనర్‌కు శిక్ష విధించిన జువైనల్ బోర్డ్
యువతిని ఒళ్లో కూర్చోబెట్టుకుని ఆటో డ్రైవింగ్.. మైనర్‌కు శిక్ష విధించిన జువైనల్ బోర్డ్
Honda ZR-V Review: మైలేజ్‌లో అద్భుతం, డ్రైవింగ్‌లో బెస్ట్.. అధిక ధర Honda ZR-Vకు మైనస్ అవుతుందా..
మైలేజ్‌లో అద్భుతం, డ్రైవింగ్‌లో బెస్ట్.. అధిక ధర Honda ZR-Vకు మైనస్ అవుతుందా..
తొలి ఏకాదశి నుంచి కార్తీకమాసం వరకూ 4 నెలలు ఏం తినాలి , ఏం తినకూడదు?
తొలి ఏకాదశి నుంచి కార్తీకమాసం వరకూ 4 నెలలు ఏం తినాలి , ఏం తినకూడదు?
CJP Protests: రంగంలోకి ప్రధాని మోదీ.. పేపర్ లీక్ ఆందోళనల్లో కీలక పరిణామం.. నేడు సీజేపీతో కేంద్రం చర్చలు
రంగంలోకి ప్రధాని మోదీ.. పేపర్ లీక్ ఆందోళనల్లో కీలక పరిణాలు.. నేడు సీజేపీతో కేంద్రం చర్చలు
Embed widget