అన్వేషించండి

Chandrababu: కష్టపడి పనిచేసేవారికి అండగా ఉండటం మా బాధ్యత - ఏపీ సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు

AP CM: కష్టపడేవారికి అండగా ఉండటం తమ బాధ్యత అని చంద్రబాబు అన్నారు. శ్రీకాకుళం, విశాఖ కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు.

Chandrababu Naidu :కష్టపడి పనిచేసే స్వభావం ఉన్నవారికి అండగా నిలవడం ప్రభుత్వ ప్రాథమిక కర్తవ్యమని చంద్రబాబు అన్నారు. వేట నిషేధ సమయంలో ఆదాయం లేక మత్స్యకారులు పడే ఇబ్బందులను తాను ప్రత్యక్షంగా చూశానని, వారి కష్టాలను దృష్టిలో ఉంచుకొనే ఈ సాయాన్ని రెట్టింపు చేయాలని నిర్ణయించినట్లు చంద్రబాబు తెలిపారు. శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల నియోజకవర్గ పరిధిలోని బుడగట్లపాలెంలో మత్స్యకారుల సేవలో పథకాన్ని ప్రారంభించారు. 

ఎన్నికలలో ఇచ్చిన హామీకి అనుగుణంగా మత్స్యకారులకు వేట విరామ కాలంలో అందించే ఆర్థిక సాయాన్ని పెంచుతూ తీసుకున్న నిర్ణయాన్ని అమలు చేయడం సంతోషంగా ఉందని  ఈ సందర్భంగా అన్నారు.   గతంలో రూ.10 వేలుగా ఉన్న ఈ సహాయాన్ని రూ. 20 వేలకు పెంచారు.   ఈ పథకం కింద నేడు 1,29,178 మంది మత్స్యకారులకు ఒక్కొక్కరికి రూ. 20 వేల చొప్పున మొత్తం రూ. 258.35 కోట్లను వారి ఖాతాల్లో జమ చేశారు. మత్స్యకారులతో మాట్లాడారు. ప్రభుత్వ పరంగా వారికి అన్ని విధాలా మేలు చేసే కార్యక్రమాలు చేపడతామని భరోసా ఇచ్చారు. 

కష్టజీవులతో గడిపిన సమయం, రాష్ట్ర ప్రజల కోసం మరింత కష్టపడి పనిచేయాలనే తన సంకల్పాన్ని మరింత దృఢపరిచిందని చంద్రబాబు చెప్పుకొచ్చారు.  టీడీపీకి వెనుకబడిన వర్గాలే వెన్నెముక అని అన్నారు. స్థానికుల సమస్యలు, పేదల కష్టాలు చూశానని.. కొందరు జాలర్ల ఆదాయం కూడా కాజేస్తున్నారని తెలిపారు. మత్స్యకారుల జీవితాల్లో వెలుగులు తీసుకొస్తామని స్పష్టం చేశారు. ఎన్ని ఇబ్బందులున్నా మత్స్యకారుల సమస్యలు పరిష్కరిస్తామన్నారు.  ప్రభుత్వం బాధ్యతగా ఉండాలని.. ప్రజల ఆదాయం పెంచాలన్నారు. ప్రజల జీవన ప్రమాణాలను ప్రభుత్వం మెరుగుపరిచాలన్నారు. గతంలో నేతలు వస్తే చెట్టు నరికేయడం.. పరదాలు కట్టడం జరిగేవని విమర్శించారు.

గత పాలకుల్లా బటన్ నొక్కి ప్రచారం చేసుకోవడం తనకూ వచ్చని కానీ చేయాల్సింది అది కాదన్నారు.  ఫిష్ ఆంధ్ర పేరుతో రూ. 300 కోట్లు ఖర్చు పెట్టామన్నారు. ఒక్క మత్స్యకారుని కుటుంబమైనా బాగుపడిందా అని ప్రశ్నించారు.  రాష్ట్రంలో 68,396 మంది మత్స్యకారులకు నెలనెలా పింఛన్లు అందిస్తున్నాము. మత్స్యకారులు చేపల వేట సమయంలో మరణిస్తే రూ.10 లక్షలు ఎక్స్‌గ్రేషియో చెల్లిస్తున్నాము. వేటకు వెళ్లే బోట్లకు లీటర్ డీజిల్‌పై రూ.9 సబ్సిడీ ఇస్తున్నామన్నారు.  

ఈ కార్యక్రమం తర్వాత విశాఖలో ఆంధ్రా యూనివర్శిటీ సెంటినరీ కార్యక్రమంలో పాల్గొన్నారు. అందరి కన్నా డాక్టర్లు ఎక్కువ కష్టపడతారని టెక్నాలజీ , మెడికల్ రంగాల్లో విప్లవాత్మకమైన మార్పులు రావాల్సి ఉందన్నారు.  విశాఖకు గూగుల్ వస్తోందని చంద్రబాబు తెలిపారు. గూగుల్ రాకతో విశాఖ డేటా సెంటర్ రాత మారుతుందని స్పష్టంచేశారు.               

 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Dasara Holidays In Andhra Pradesh: దసరా సెలవులు ప్రకటించిన ఏపీ ప్రభుత్వం, విద్యార్థులకు పండగే
దసరా సెలవులు ప్రకటించిన ఏపీ ప్రభుత్వం, విద్యార్థులకు పండగే
Tirupati Bus Terminal: తిరుపతిలో వరల్డ్ క్లాస్ బస్ టెర్మినల్: లక్ష మంది ప్రయాణికులకు సరిపడా, అత్యాధునిక హంగులతో...!
తిరుపతిలో ప్రపంచస్థాయి బస్ టెర్మినల్ – రోజుకు లక్షమంది ప్రయాణించేలా ఏర్పాట్లు
Vantara Case: వంతారాలో ఎలాంటి చట్ట ఉల్లంఘనలు జరగలేదు - సుప్రీంకోర్టుకు సిట్ నివేదిక
వంతారాలో ఎలాంటి చట్ట ఉల్లంఘనలు జరగలేదు - సుప్రీంకోర్టుకు సిట్ నివేదిక
AP Liquor Scam Update: చెవిరెడ్డి టీమ్‌పై మరో చార్జిషీట్ - ఏపీ లిక్కర్ స్కామ్‌లో సిట్ మరో ముందడుగు
చెవిరెడ్డి టీమ్‌పై మరో చార్జిషీట్ - ఏపీ లిక్కర్ స్కామ్‌లో సిట్ మరో ముందడుగు
Advertisement

వీడియోలు

Mizoram Lifestyle Exploring Telugu Vlog | మిజోరం లైఫ్ స్టైల్ ఒక్కరోజులో చూసేద్దాం రండి.! | ABP Desam
NASA Says Mars Rover Discovered Potential Biosignature | అంగారకుడిపై జీవం నిజమే | ABP Desam
India vs Pakistan | Operation Sindoor | ఇంటర్నేషనల్ లెవెల్ లో పాక్ పరువు తీసేలా మాస్టర్ ప్లాన్
India vs Pakistan | Pahalgam Attack | ఈ విజయం భారత సైన్యానికి అంకితం
India vs Pakistan Asia Cup 2025 | పాక్ ప్లేయర్స్ కు షేక్ హ్యాండ్ ఇవ్వని టీమిండియా!
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Dasara Holidays In Andhra Pradesh: దసరా సెలవులు ప్రకటించిన ఏపీ ప్రభుత్వం, విద్యార్థులకు పండగే
దసరా సెలవులు ప్రకటించిన ఏపీ ప్రభుత్వం, విద్యార్థులకు పండగే
Tirupati Bus Terminal: తిరుపతిలో వరల్డ్ క్లాస్ బస్ టెర్మినల్: లక్ష మంది ప్రయాణికులకు సరిపడా, అత్యాధునిక హంగులతో...!
తిరుపతిలో ప్రపంచస్థాయి బస్ టెర్మినల్ – రోజుకు లక్షమంది ప్రయాణించేలా ఏర్పాట్లు
Vantara Case: వంతారాలో ఎలాంటి చట్ట ఉల్లంఘనలు జరగలేదు - సుప్రీంకోర్టుకు సిట్ నివేదిక
వంతారాలో ఎలాంటి చట్ట ఉల్లంఘనలు జరగలేదు - సుప్రీంకోర్టుకు సిట్ నివేదిక
AP Liquor Scam Update: చెవిరెడ్డి టీమ్‌పై మరో చార్జిషీట్ - ఏపీ లిక్కర్ స్కామ్‌లో సిట్ మరో ముందడుగు
చెవిరెడ్డి టీమ్‌పై మరో చార్జిషీట్ - ఏపీ లిక్కర్ స్కామ్‌లో సిట్ మరో ముందడుగు
Telangana Congress Risk: రేవంత్ ప్రభుత్వానికి దెబ్బ మీద దెబ్బ - కాలేజీలకు తోడుగా ఆస్పత్రులు - ఆరోగ్యశ్రీబంద్ !
రేవంత్ ప్రభుత్వానికి దెబ్బ మీద దెబ్బ - కాలేజీలకు తోడుగా ఆస్పత్రులు - ఆరోగ్యశ్రీబంద్ !
Katrina Kaif: బాలీవుడ్ హీరోయిన్ కత్రినా కైఫ్ తల్లి కాబోతున్నారా? - వచ్చే నెలలోనే గుడ్ న్యూస్ చెప్పనున్న కపుల్!
బాలీవుడ్ హీరోయిన్ కత్రినా కైఫ్ తల్లి కాబోతున్నారా? - వచ్చే నెలలోనే గుడ్ న్యూస్ చెప్పనున్న కపుల్!
Income Tax Returns Filing Deadline: ట్యాక్స్ పేయర్లను ఇబ్బంది పెడుతున్న ఐటీ వెబ్‌సైట్.. నేడు లాస్ట్ డేట్ కావడంతో టెన్షన్
ట్యాక్స్ పేయర్లను ఇబ్బంది పెడుతున్న ఐటీ వెబ్‌సైట్.. నేడు లాస్ట్ డేట్ కావడంతో టెన్షన్
Chandrababu Urea: యూరియా వాడకం తగ్గిస్తే ప్రోత్సాహక నగదు - రైతులకు చంద్రబాబు బంపర్ ఆఫర్
యూరియా వాడకం తగ్గిస్తే ప్రోత్సాహక నగదు - రైతులకు చంద్రబాబు బంపర్ ఆఫర్
Embed widget