అన్వేషించండి

Andhra Cabinet: ఆ 48 మంది ఎమ్మెల్యేల బాధ్యత మీదే - ఇంచార్జ్ మంత్రులకు చంద్రబాబు దిశానిర్దేశం - కేబినెట్ భేటీలో కీలక చర్చ

Andhrapradesh: టీడీపీలో 48 మంది ఎణ్మెల్యేల వ్యవహారం చర్చనీయాంశం అవుతోంది. వారి తీరుపై కేబినెట్ సమావేశంలోనూ చంద్రబాబు ప్రస్తావించారు. ఇంచార్జ్ మంత్రులు పట్టించుకోవాలన్నారు.

Cabinet meeting: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 48 మంది ఎమ్మెల్యేల పనితీరుపై  మంత్రవర్గ సమావేశంలో ప్రస్తావించారు. ఆ ఎమ్మెల్యేల విషయంలో జిల్లా ఇన్‌చార్జ్ మంత్రులు  బాధ్యతలు పూర్తిగా తీసుకోవాలన్నారు. ఆ ఎమ్మెల్యేలు పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనడం లేదు. పెన్షన్లు పంపిణీ చేయడం, సీఎంఆర్ఎఫ్  చెక్కులు ఇవ్వకపోవడం వంటివి చేస్తున్నారు. అలాంటి వారిపై చంద్రబాబు అసహనంతో ఉన్నారు.  కేబినెట్ లో ఎజెండాపై చర్చ తర్వాత మంత్రులతో చంద్రబాబు ప్రత్యేకంగా చర్చించారు. వైజాగ్  సమిట్ పై దృష్టి పెట్టాలని మంత్రులకు సూచించారు. ప్రతిష్టాత్మకంగా తీస్కుని పని చెయ్యాలన్నారు.                  

నారా లోకేష్ కూడా.. తొలి సారి ఎమ్మెల్యేలుగా గెేలిచిన వారికి మంచీ, చెడూ తెలియడం లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. తాము ఎక్కడి నుంచి వచ్చాము.. ఎలా ఎమ్మెల్యేలు అయ్యాము అన్నది మర్చిపోయి ప్రజలకు దూరం అవుతున్నారని అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆ నలభై మంది ఎమ్మెల్యేలలో ప్రజలను పట్టించుకోినివారితో పాటు..  వివాదాల్లో నిత్యం తలదూర్చేవారు మరికొందరు ఉన్నారు. ఇలాంటి వారికి ఎన్ని సార్లు హెచ్చరికలు పంపినా వారు తీరు మార్చుకోవడం లేదు. ఎమ్మెల్యేలను దారికి తెచ్చే బాధ్యతను ఇప్పుడు ఇంచార్జ్ మంత్రులకు ఇచ్చారు. రెండు మూడు నెలల తర్వాత ఆ ఎమ్మెల్యేలు దారికి వచ్చారా లేదా అన్నది పరిశీలించి ..  చంద్రబాబు చర్యలపై దృష్టి పెట్టే అవకాశం ఉంది.                            

టీడీపీ ప్రధాన కార్యాలయంలో శనివారం  నిర్వహించిన సమీక్ష సమావేశంలోనూ ప్రజాప్రతినిధులు సులభంగా అందుబాటులో ఉండి, పరిపాలనా వ్యవస్థను ముందుంచకపోతే ప్రభుత్వ లక్ష్యాలు సఫలం కావని హెచ్చరించారు. పెన్షన్ పంపిణీ, ముఖ్యమంత్రి రిలీఫ్ ఫండ్  చెక్కుల పంపిణీ కార్యక్రమాల్లో భాగం తీసుకోకపోవడం  వల్ల 48 మంది ఎమ్మెల్యేలకు నోటీసులు జారీచేయాలని ఆదేశించారు.  వారి వివరణలు స్పందించకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.                      

గత కేబినెట్ సమావేశంలోనూ  ఎమ్మెల్యేల పనితీరు పై చంద్రబాబు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.  వైయస్సార్‌సీపీ ప్రభుత్వ కాలంలో ఎమ్మెల్యేలు ఇలా వ్యవహరించారని విమర్శలు వచ్చినా, టీడీపీలో కూడా ఇలాంటి సమస్యలు ఉన్నాయని గుర్తుచేస్తూ చంద్రబాబు "ముందే మేల్కొని" చర్యలు తీసుకుంటున్నారు. పార్టీలో క్రమశిక్షణ కాపాడటానికి, ప్రజలతో మార్గదర్శకత్వం వహించడానికి ఎమ్మెల్యేలు మారాలని సూచనలు ఇచ్చారు. 

పాలిటికల్ లక్ష్మణ రేఖను ఎమ్మెల్యేలు దాటకుండా చూడాలని ఇంచార్జ్ మమంత్రులకు చంద్రబాబు సూచించినట్లుగా తెలుస్తోంది. మంత్రులు రాజకీయ సమన్వయంపై దృష్టి పెట్టాలని ఆదేశించారు. ప్రత్యేకంగా, ప్రతి ఐదుగురు ఎమ్మెల్యేలకు ఒక్కో ఇన్‌చార్జ్ మంత్రి బాధ్యత వహించాలనే ప్రతిపాదన వచ్చింది.  వెల్ఫేర్ కార్యక్రమాలు కేవలం అధికారిక  కార్యక్రమాలు మాత్రమే కాదని, ప్రజలతో బంధాలు బలోపేతం చేసే అవకాశాలని గుర్తుచేశారు. టీడీపీ కార్మికులకు బీమా కార్యక్రమాల్లో కూడా ఎమ్మెల్యేలు పాల్గొనాలని ఆదేశించారు. 

టాప్ హెడ్ లైన్స్

Priyanka Death Case:రాజమండ్రి మెడికో విద్యార్థి ప్రియాంక మృతిపై దర్యాప్తు వేగవంతం! రాజకీయం చేయొద్దని తండ్రి విజ్ఞప్తి!
రాజమండ్రి మెడికో విద్యార్థి ప్రియాంక మృతిపై దర్యాప్తు వేగవంతం! రాజకీయం చేయొద్దని తండ్రి విజ్ఞప్తి!
Vizag and Vijayawada Metro Rail:విశాఖ, విజయవాడ మెట్రో ప్రాజెక్టులో కదలిక!లేటెస్ట్ అప్‌డేట్ ఏంటంటే?
విశాఖ, విజయవాడ మెట్రో ప్రాజెక్టులో కదలిక!లేటెస్ట్ అప్‌డేట్ ఏంటంటే?
AP Municipal Elections: ఏపీలో ప్రత్యక్ష పద్ధతిలో మేయర్, మున్సిపల్ చైర్మన్ ఎన్నికలు.. చట్టంలో మార్పులతో ఎవరికి లాభం?
ఏపీలో ప్రత్యక్ష పద్ధతిలో మేయర్, మున్సిపల్ చైర్మన్ ఎన్నికలు.. చట్టంలో మార్పులతో ఎవరికి లాభం?
AP Mega DSC Politics: డీఎస్సీ టీచర్లు వర్సెస్ వైఎస్ఆర్‌సీపీ - విజేతల్ని అవమనిస్తున్నారా? వైసీపీ రాంగ్ స్టెప్ వేస్తోందా?
డీఎస్సీ టీచర్లు వర్సెస్ వైఎస్ఆర్‌సీపీ - విజేతల్ని అవమనిస్తున్నారా? వైసీపీ రాంగ్ స్టెప్ వేస్తోందా?

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Priyanka Death Case:రాజమండ్రి మెడికో విద్యార్థి ప్రియాంక మృతిపై దర్యాప్తు వేగవంతం! రాజకీయం చేయొద్దని తండ్రి విజ్ఞప్తి!
రాజమండ్రి మెడికో విద్యార్థి ప్రియాంక మృతిపై దర్యాప్తు వేగవంతం! రాజకీయం చేయొద్దని తండ్రి విజ్ఞప్తి!
Gen Z Protests India 2026: జెన్‌జీ ఉద్యమాలు, ప్రశాంత్ కిషోర్ విజయం బీజేపీ స్క్రిప్టేనా - దేశ రాజకీయాల్లో అసలేం జరుగుతోంది?
జెన్‌జీ ఉద్యమాలు, ప్రశాంత్ కిషోర్ విజయం బీజేపీ స్క్రిప్టేనా - దేశ రాజకీయాల్లో అసలేం జరుగుతోంది?
Telangana BJP: తెలంగాణలో ఇకపై పోరు కాంగ్రెస్ Vs బీజేపీ మాత్రమే - రోడ్ మ్యాప్ రెడీ చేసిన హైకమాండ్ - ఇక కమలం దూకుడేనా?
తెలంగాణలో ఇకపై పోరు కాంగ్రెస్ Vs బీజేపీ మాత్రమే - రోడ్ మ్యాప్ రెడీ చేసిన హైకమాండ్ - ఇక కమలం దూకుడేనా?
Vizag and Vijayawada Metro Rail:విశాఖ, విజయవాడ మెట్రో ప్రాజెక్టులో కదలిక!లేటెస్ట్ అప్‌డేట్ ఏంటంటే?
విశాఖ, విజయవాడ మెట్రో ప్రాజెక్టులో కదలిక!లేటెస్ట్ అప్‌డేట్ ఏంటంటే?
Gold- Silver Price Today 10 August 2026: ఆగస్టు 10న బంగారం ధర ఎంత? వెండి ధరలు కూడా మారాయా?  
ఆగస్టు 10న బంగారం ధర ఎంత? వెండి ధరలు కూడా మారాయా?  
Korean Kanakaraju Collections Day 3 : కొరియన్ కనకరాజు ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్ - వరుణ్ తేజ్ ఖాతాలో మరో హిట్
కొరియన్ కనకరాజు ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్ - వరుణ్ తేజ్ ఖాతాలో మరో హిట్
PM Modi CWG: గ్లాస్గో కామన్వెల్త్ మెడలిస్ట్స్ తో ప్ర‌ధాని న‌రేంద్ర‌ మోడీ భేటీ.. క్రీడాకారులపై ప్రశంసల వర్షం
గ్లాస్గో కామన్వెల్త్ మెడలిస్ట్స్ తో ప్ర‌ధాని న‌రేంద్ర‌ మోడీ భేటీ.. క్రీడాకారులపై ప్రశంసల వర్షం
AP Municipal Elections: ఏపీలో ప్రత్యక్ష పద్ధతిలో మేయర్, మున్సిపల్ చైర్మన్ ఎన్నికలు.. చట్టంలో మార్పులతో ఎవరికి లాభం?
ఏపీలో ప్రత్యక్ష పద్ధతిలో మేయర్, మున్సిపల్ చైర్మన్ ఎన్నికలు.. చట్టంలో మార్పులతో ఎవరికి లాభం?
Embed widget