అన్వేషించండి

Andhra Cabinet: ఆ 48 మంది ఎమ్మెల్యేల బాధ్యత మీదే - ఇంచార్జ్ మంత్రులకు చంద్రబాబు దిశానిర్దేశం - కేబినెట్ భేటీలో కీలక చర్చ

Andhrapradesh: టీడీపీలో 48 మంది ఎణ్మెల్యేల వ్యవహారం చర్చనీయాంశం అవుతోంది. వారి తీరుపై కేబినెట్ సమావేశంలోనూ చంద్రబాబు ప్రస్తావించారు. ఇంచార్జ్ మంత్రులు పట్టించుకోవాలన్నారు.

Cabinet meeting: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 48 మంది ఎమ్మెల్యేల పనితీరుపై  మంత్రవర్గ సమావేశంలో ప్రస్తావించారు. ఆ ఎమ్మెల్యేల విషయంలో జిల్లా ఇన్‌చార్జ్ మంత్రులు  బాధ్యతలు పూర్తిగా తీసుకోవాలన్నారు. ఆ ఎమ్మెల్యేలు పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనడం లేదు. పెన్షన్లు పంపిణీ చేయడం, సీఎంఆర్ఎఫ్  చెక్కులు ఇవ్వకపోవడం వంటివి చేస్తున్నారు. అలాంటి వారిపై చంద్రబాబు అసహనంతో ఉన్నారు.  కేబినెట్ లో ఎజెండాపై చర్చ తర్వాత మంత్రులతో చంద్రబాబు ప్రత్యేకంగా చర్చించారు. వైజాగ్  సమిట్ పై దృష్టి పెట్టాలని మంత్రులకు సూచించారు. ప్రతిష్టాత్మకంగా తీస్కుని పని చెయ్యాలన్నారు.                  

నారా లోకేష్ కూడా.. తొలి సారి ఎమ్మెల్యేలుగా గెేలిచిన వారికి మంచీ, చెడూ తెలియడం లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. తాము ఎక్కడి నుంచి వచ్చాము.. ఎలా ఎమ్మెల్యేలు అయ్యాము అన్నది మర్చిపోయి ప్రజలకు దూరం అవుతున్నారని అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆ నలభై మంది ఎమ్మెల్యేలలో ప్రజలను పట్టించుకోినివారితో పాటు..  వివాదాల్లో నిత్యం తలదూర్చేవారు మరికొందరు ఉన్నారు. ఇలాంటి వారికి ఎన్ని సార్లు హెచ్చరికలు పంపినా వారు తీరు మార్చుకోవడం లేదు. ఎమ్మెల్యేలను దారికి తెచ్చే బాధ్యతను ఇప్పుడు ఇంచార్జ్ మంత్రులకు ఇచ్చారు. రెండు మూడు నెలల తర్వాత ఆ ఎమ్మెల్యేలు దారికి వచ్చారా లేదా అన్నది పరిశీలించి ..  చంద్రబాబు చర్యలపై దృష్టి పెట్టే అవకాశం ఉంది.                            

టీడీపీ ప్రధాన కార్యాలయంలో శనివారం  నిర్వహించిన సమీక్ష సమావేశంలోనూ ప్రజాప్రతినిధులు సులభంగా అందుబాటులో ఉండి, పరిపాలనా వ్యవస్థను ముందుంచకపోతే ప్రభుత్వ లక్ష్యాలు సఫలం కావని హెచ్చరించారు. పెన్షన్ పంపిణీ, ముఖ్యమంత్రి రిలీఫ్ ఫండ్  చెక్కుల పంపిణీ కార్యక్రమాల్లో భాగం తీసుకోకపోవడం  వల్ల 48 మంది ఎమ్మెల్యేలకు నోటీసులు జారీచేయాలని ఆదేశించారు.  వారి వివరణలు స్పందించకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.                      

గత కేబినెట్ సమావేశంలోనూ  ఎమ్మెల్యేల పనితీరు పై చంద్రబాబు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.  వైయస్సార్‌సీపీ ప్రభుత్వ కాలంలో ఎమ్మెల్యేలు ఇలా వ్యవహరించారని విమర్శలు వచ్చినా, టీడీపీలో కూడా ఇలాంటి సమస్యలు ఉన్నాయని గుర్తుచేస్తూ చంద్రబాబు "ముందే మేల్కొని" చర్యలు తీసుకుంటున్నారు. పార్టీలో క్రమశిక్షణ కాపాడటానికి, ప్రజలతో మార్గదర్శకత్వం వహించడానికి ఎమ్మెల్యేలు మారాలని సూచనలు ఇచ్చారు. 

పాలిటికల్ లక్ష్మణ రేఖను ఎమ్మెల్యేలు దాటకుండా చూడాలని ఇంచార్జ్ మమంత్రులకు చంద్రబాబు సూచించినట్లుగా తెలుస్తోంది. మంత్రులు రాజకీయ సమన్వయంపై దృష్టి పెట్టాలని ఆదేశించారు. ప్రత్యేకంగా, ప్రతి ఐదుగురు ఎమ్మెల్యేలకు ఒక్కో ఇన్‌చార్జ్ మంత్రి బాధ్యత వహించాలనే ప్రతిపాదన వచ్చింది.  వెల్ఫేర్ కార్యక్రమాలు కేవలం అధికారిక  కార్యక్రమాలు మాత్రమే కాదని, ప్రజలతో బంధాలు బలోపేతం చేసే అవకాశాలని గుర్తుచేశారు. టీడీపీ కార్మికులకు బీమా కార్యక్రమాల్లో కూడా ఎమ్మెల్యేలు పాల్గొనాలని ఆదేశించారు. 

టాప్ హెడ్ లైన్స్

Agri Gold Victims: అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేసే దిశగా ప్రభుత్వం - ఆస్తులు వేలం వేసి చెల్లింపులు - ఆటంకాలు లేకుండా పూర్తి చేయగలరా?
అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేసే దిశగా ప్రభుత్వం - ఆస్తులు వేలం వేసి చెల్లింపులు - ఆటంకాలు లేకుండా పూర్తి చేయగలరా?
Breaking News: నేడు సీడ్ యాక్సెస్ రోడ్డు ప్రారంభం- అర్థరాత్రి వరకు ఏర్పాట్లు పరిశీలించిన మంత్రి నారాయణ
నేడు సీడ్ యాక్సెస్ రోడ్డు ప్రారంభం- అర్థరాత్రి వరకు ఏర్పాట్లు పరిశీలించిన మంత్రి నారాయణ
Pawan Kalyan: అమరావతి పనుల ప్రారంభోత్సవానికి పవన్ కళ్యాణ్‌కు మంత్రి నారాయణ ఆహ్వానం.. డిప్యూటీ సీఎం హాజరవుతారా
అమరావతి పనుల ప్రారంభోత్సవానికి పవన్ కళ్యాణ్‌కు మంత్రి నారాయణ ఆహ్వానం.. డిప్యూటీ సీఎం హాజరవుతారా
Breaking News: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను కలిసిన మంత్రి నారాయణ.. రాజధాని ప్రాజెక్టుల ప్రారంభోత్సవానికి ఆహ్వానం
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను కలిసిన మంత్రి నారాయణ.. రాజధాని ప్రాజెక్టుల ప్రారంభోత్సవానికి ఆహ్వానం

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan: అమరావతి పనుల ప్రారంభోత్సవానికి పవన్ కళ్యాణ్‌కు మంత్రి నారాయణ ఆహ్వానం.. డిప్యూటీ సీఎం హాజరవుతారా
అమరావతి పనుల ప్రారంభోత్సవానికి పవన్ కళ్యాణ్‌కు మంత్రి నారాయణ ఆహ్వానం.. డిప్యూటీ సీఎం హాజరవుతారా
IND vs SL Test Series: గాయంతో టీమ్ ఇండియాకి బిగ్ షాక్.. లంక టెస్ట్ సిరీస్ నుంచి మ‌రో ఆల్‌రౌండర్ అవుట్!
గాయంతో టీమ్ ఇండియాకి బిగ్ షాక్.. లంక టెస్ట్ సిరీస్ నుంచి మ‌రో ఆల్‌రౌండర్ అవుట్!
Sridhar Babu: బీఆర్ఎస్ హయాంలోనే తక్కువ ధర! భూ కేటాయింపుల ఆరోపణలపై కేటీఆర్‌కు మంత్రి శ్రీధర్ బాబు కౌంటర్
బీఆర్ఎస్ హయాంలోనే తక్కువ ధర! భూ కేటాయింపుల ఆరోపణలపై కేటీఆర్‌కు మంత్రి శ్రీధర్ బాబు కౌంటర్
Free NEET Coaching: నీట్ ఫ్రీ లాంగ్ టర్మ్ కోచింగ్.. అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించిన TGSWREIS
నీట్ ఫ్రీ లాంగ్ టర్మ్ కోచింగ్.. అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించిన TGSWREIS
Indias Top 10 Business Families: భారత్‌లో టాప్ 10 రిచెస్ట్ ఫ్యామిలీస్ సంపద విలువ ఎంత.. ఆ మొత్తంతో ఎన్ని పనులు చేయవచ్చు
భారత్‌లో టాప్ 10 రిచెస్ట్ ఫ్యామిలీస్ సంపద విలువ ఎంత.. ఆ మొత్తంతో ఎన్ని పనులు చేయవచ్చు
Bigg Boss Agnipariksha: 'బిగ్ బాస్'లో డర్టీ పాలిటిక్స్... అగ్నిపరీక్ష సెలక్షన్స్‌లో మోసం జరిగిందా?
'బిగ్ బాస్'లో డర్టీ పాలిటిక్స్... అగ్నిపరీక్ష సెలక్షన్స్‌లో మోసం జరిగిందా?
Ayyanna Patrudu: వారికి ఎమ్మెల్యే పదవి ఎందుకు? అసెంబ్లీకి రాకుంటే అనర్హత వేటు వేయాలి: స్పీకర్ అయ్యన్నపాత్రుడు
వారికి ఎమ్మెల్యే పదవి ఎందుకు? అసెంబ్లీకి రాకుంటే అనర్హత వేటు వేయాలి: స్పీకర్ అయ్యన్నపాత్రుడు
Adilabad Crime News: ఆదిలాబాద్, మహారాష్ట్రలో టూవీలర్స్ మాయం.. అంతర్రాష్ట్ర గ్యాంగ్ అరెస్ట్, 44 బైక్స్ స్వాధీనం
ఆదిలాబాద్, మహారాష్ట్రలో టూవీలర్స్ మాయం.. అంతర్రాష్ట్ర గ్యాంగ్ అరెస్ట్, 44 బైక్స్ స్వాధీనం
Embed widget