By: ABP Desam | Updated at : 01 Jan 2022 05:45 PM (IST)
చంద్రబాబు కొత్త ఏడాది నిర్ణయాలు
తెలుగుదేశం పార్టీలో పదవులు పొంది పని చేయని వారిని పక్కన పెడతానని ఆ పార్టీ అధినేత చంద్రబాబు ప్రకటించారు. కొత్త ఏడాది సందర్భంగా పలు అంశాలపై ఆయన మీడియాతో మాట్లాడారు. ఇటీవలి కాలంలో పార్టీలో వివిధ రకాల సంస్థాగత పదవులను భర్తీచేస్తున్నారు. వారి పని తీరును ఎప్పటికప్పుడు అంచనా వేస్తున్నామని సరిగ్గా పని చేయని వారిని తొలగించి కొత్త వారికి చాన్సిస్తామన్నారు. ఎవరి కోసమో పార్టీ త్యాగాలు చేయదని ఆయన స్పష్టం చేశారు.
Also Read: జగన్ పాలనకు 30 నెలలు.. ప్రజాసేవకు పునరంకితం అవుతున్నాం.. : సజ్జల
ఒకవేళ రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు గురించి చర్చ జరుగుతోంది.. ఒక వేళ వస్తే, వాటికి సిద్ధంగా ఉన్నామని అన్నారు. ప్రభుత్వ అరాచకాలను ఎన్నికల్లో ప్రజలు ఎండగడతారన్నారు. అసెంబ్లీకి ముందస్తు ఎన్నికలపై ప్రచారం జరుగుతోందని, వస్తే సిద్ధంగా ఉన్నామన్నారు. పొత్తులపై ప్రశ్నలు ఊహాజనితమని, దానిపై తాను స్పందించనన్నారు. రానున్న రోజుల్లో ప్రజా ఉద్యమాలను తీవ్రతరం చేస్తామన్నారు.
Also Read: టిక్కెట్ రేట్ల తగ్గింపును విమర్శించేవారు శత్రువులే.. సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు !
రాష్ట్ర ఆర్ధిక పరిస్థితిని అంచనా వేయలేకపోతున్నామని.. అనేక మంది సీఎంలు పని చేసినా ఆర్థిక వ్యవస్థను ఛిన్నాభిన్నం చేసిన సీఎం ఎవ్వరూ లేరు.రాష్ట్రంలో ఇప్పుడు ఆర్థిక విధ్వంసం జరుగుతోంది. ఏపీ బ్రాండ్ ఇమేజీని దెబ్బ తీశారని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. పారిశ్రామిక వేత్తలు మొదలుకుని రోజూ కూలీ వరకు పొరుగు రాష్ట్రాలకు వలస పోతున్నారు. గతంలో భువనేశ్వర్ నుంచి విశాఖకు వచ్చే వాళ్లు.. ఇప్పుడు విశాఖ నుంచి భువనేశ్వర్ వెళ్తున్నారు.ఏ సీబీ, సీఐడీలను కంట్రోల్లో పెట్టుకుని అందర్నీ బెదిరిస్తున్నారు.గౌరవానికి భంగం కలుగుతుందని భయపడి సైలెంటుగా ఉంటున్నారన్నారు.
ఏపీలో వ్యవసాయ రంగం పూర్తిగా దెబ్బతింది.దిగుబడులు తగ్గాయి.. పంటల పర్యవేక్షణలో ప్రభుత్వం నిర్లక్ష్యంతో ఉంది.ఒకప్పుడు అన్నపూర్ణగా ఉన్న రాష్ట్రంలో దిగుబడుల్లో వెనకపడింది.మిర్చి పంట పూర్తిగా నష్టపోయింది.టీడీపీ హయాంలో బిందు సేద్యం 90 శాతం సబ్సిడీ మీద ఇచ్చాం.. ఇప్పుడు అస్సలు ఆ ప్రస్తావనే లేదు.ట్రాక్టర్లు.. వ్యవసాయ యాంత్రీకరణ విషయంలో టీడీపీ ఎంతో చేసింది. వ్యవసాయానికి జగన్ ప్రభుత్వం చేసింది శూన్యం. ప్రభుత్వం అరాచకాలను ప్రస్తుతం ప్రజలు భరిస్తున్నారు.. ఎన్నికల్లో అన్ని తేలుస్తారని చంద్రబాబు స్పష్టం చేశారు.
AP In Davos : దావోస్ నుంచి ఏపీకి రూ. 1లక్షా 25వేల కోట్ల పెట్టుబడులు - జగన్ పర్యటన విజయవంతమయిందన్న ప్రభుత్వం !
Breaking News Live Updates: హైదరాబాద్ కు నిఖత్ జరీన్, శంషాబాద్ ఎయిర్ పోర్టులో ఘనస్వాగతం
MP GVL On Bus Yatra : ఏపీలో ఒకే సామాజిక వర్గం చేతిలో అధికారం, మంత్రులకు వారి శాఖల పేర్లు కూడా తెలీదు - ఎంపీ జీవీఎల్
Atmakur Byelection 2022 : నెల్లూరు జిల్లా మొత్తం ఎన్నికల కోడ్, ఆత్మకూరు ఉపఎన్నిక కోసం పగడ్బందీ ఏర్పాట్లు
Tammineni Seetharam : కుళ్లి, కృశించిపోయిన టీడీపీకి మహానాడులో దహన సంస్కారాలు, స్పీకర్ తమ్మినేని తీవ్ర వ్యాఖ్యలు
F3 Movie Review - 'ఎఫ్ 3' రివ్యూ: వెంకటేష్, వరుణ్ తేజ్ నవ్వించారా? ఫ్రస్ట్రేషన్ తెప్పించారా?
Nikhat Zareen : హైదరాబాద్ కు నిఖత్ జరీన్, శంషాబాద్ ఎయిర్ పోర్టులో ఘన స్వాగతం
Anna Hazare President Candidate KCR Plan: రాష్ట్రపతి అభ్యర్థిగా అన్నా హజారే ! కేసీఆర్ చెబుతున్న సంచలనం అదేనా ?
Honor Killing In Adilabad: ఆదిలాబాద్ జిల్లాలో దారుణం- మతాంతర వివాహం చేసుకుందని కుమార్తె గొంతు కోసి హత్య చేసిన తండ్రి