అన్వేషించండి

Andhra politics : కూటమి పార్టీ ఆఫీసుల్లో వినతి పత్రాలు తీసుకోవడంపై సీపీఎం అభ్యంతరం - ఘాటు రిప్లై ఇచ్చిన ఏపీ బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి

Andhra Pradesh : కమ్యూనిస్టు పార్టీల నేతల తీరుపై బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కూటమి పార్టీ ఆఫీసుల్లో వినతి పత్రాలు తీసుకోవద్దని చెప్పడం ప్రజల్ని అవమానించడమేనన్నారు.

BJP leader Vishnuvardhan expressed anger On CPM :  ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వంలోని పార్టీలు పార్టీ కార్యాలయాల్లో గ్రీవెన్స్ ఏర్పాటు చేయడంపై సీపీఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు అభ్యంతరం వ్యక్తం చేశారు. తక్షణం పార్టీ కార్యాలయాల్లో వినతులు తీసుకోవడం ఆపేసి.. ప్రభుత్వ కార్యాలయాల్లోనే తీసుకోవాలన్నారు. రాజకీయ పార్టీలకు ప్రభుత్వానికి మధ్య తేడా ఉండాలన్నారు. అయితే సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తీరుపై బీజేపీ ఉపాధ్యక్షుడు విష్ణువర్దన్ రెడ్డి మండిపడ్డారు.  ఆనపర్తిలో బీజేపీ వారధి కార్యక్రమంలో ప్రజా ఫిర్యాదుల స్వీకరణ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.      

 
రాను రాను కమ్యూనిష్టులు సిద్దాంతం వారి ఆలోచన తీసికట్టుగా మారుతున్నట్లు కనిపిస్తోందని  కూటమి పార్టీలు  ప్రజా సమస్యలు వినడం, పిర్యాదులు స్వీకరించడం , పరిస్కారం చేస్తున్న విధానంపై విమర్శలు  చూస్తే అర్థమైపోతుందన్నారు.   సాధారణ ప్రజలకు గ్రీవెన్స్ వ్యవస్థ కూటమి ప్రభుత్వంలో సమర్థంగా పని చేస్తోందని .. గుర్తుచేశారు.  ఈ మధ్య మీ కమ్యూనిష్టు పార్టీలు కూటమి ముఖ్యమంత్రి గారిని కలసి అభినందనలు కూడా తెలియచేశారని.. ఈ విషయాన్ని సీపీఎం నేతలు మర్చిపోయారా అని ప్రశ్నించారు. 

పార్టీ కార్యకర్తలు తమ పార్టీ ఆఫీసులకు రాకూడదా అని విష్ణువర్ధన్ ప్రశ్న                

గత ప్రభుత్వ హయాంలో వేధింపులకు గురైన మూడు పార్టీల కార్యకర్తలు తమ బాధల్ని చెప్పుకోవడానికి పార్టీ కార్యాలయాలకు వస్తున్నారని..  మా పార్టీ కార్యకర్తలు మా పార్టీ ఆఫీసులకురావద్దని  మీరు బావిస్తున్నారా అని విష్ణువర్ధన్ రెడ్డి ప్రశ్నించారు. కమ్యూనిస్టులు ప్రభుత్వాలు నడిపిన  త్రిపుర, బెంగాల్‌లలో  పార్టీ అంటే ప్రభుత్వం..  ప్రభుత్వం అంటే పార్టీ అన్నట్లుగా పాలన చేశారని ఇప్పుడెందుకు అభ్యంతరం అని ప్రశ్నించారు.  నేటికి మీకు అధికారం ఉన్న కేరళలో మీరు ఈ రకంగా పిర్యాదులు  తీసుకోవడం నిజం కాదా అని ప్రశ్నించారు.            

సీపీఎం అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఏం చేశారు.. చేస్తున్నారు ?                      

ఇక్కడ మీ పార్టీ కార్యాలయాలకు ఎవరూ రారు, మీ ఆఫీసులు ఖాళీగా ఉంటాయని కూటమి పార్టీలవీ అలాగే ఉండాలటే ఎలా అని మండిపడ్డారు.  పార్టీకి , ప్రభుత్వానికి స్పష్టమైన తేడాను ప్రజలు అందరూ చూస్తున్నారు.. మీరు తప్ప. ప్రజల అభిప్రాయాలు అర్థం చేసుకునే మైండ్ సెట్ కమ్యూనిస్టు పార్టీలకు ఉండదన్నారు.  ప్రజల పట్ల బాధ్యతగా ఉండాలని..  పేదలకు న్యాయం జరిగి అంశంలో వారికి వ్యతిరేకంగా ఇచ్చిన ప్రకటనపైన పేదప్రజలకు క్షమాపణలు చెప్పాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శిని విష్ణువర్ధన్ రెడ్డి డిమాండ్ చేశారు.         

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

HYDRA News: హైడ్రాను రద్దు చేయాలని హైకోర్టులో పిటిషన్, విచారణ వాయిదా
హైడ్రాను రద్దు చేయాలని హైకోర్టులో పిటిషన్, విచారణ వాయిదా
Chittoor Accident: చిత్తూరు జిల్లాలో ఘోర ప్రమాదం! 8 మంది దుర్మరణం
చిత్తూరు జిల్లాలో ఘోర ప్రమాదం! 8 మంది దుర్మరణం
YS Jagan: ఏలేరుకి వరద చంద్రబాబు వల్లనే, ఆ ప్రచారాలకు చంద్రబాబు తమ్ముడి వరుస - జగన్ ఎద్దేవా
ఏలేరుకి వరద చంద్రబాబు వల్లనే, ఆ ప్రచారాలకు చంద్రబాబు తమ్ముడి వరుస - జగన్ ఎద్దేవా
YSRCP Leaders Bail: టీడీపీ ఆఫీస్‌పై దాడి కేసులో వైసీపీ నేతలకు ఊరట- సుప్రీంకోర్టులో ముందస్తు బెయిల్ మంజూరు
టీడీపీ ఆఫీస్‌పై దాడి కేసులో వైసీపీ నేతలకు ఊరట- సుప్రీంకోర్టులో ముందస్తు బెయిల్ మంజూరు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

అరవింద్ కేజ్రీవాల్‌కి సుప్రీంకోర్టు బెయిల్, సీబీఐ కేసులో ఊరటదవాఖానకు పోవాలి, చేయి నొప్పి పుడుతోంది - పోలీసులతో హరీశ్ వాగ్వాదంఅభిమాని చివరి కోరిక తీర్చనున్న జూనియర్ ఎన్‌టీఆర్, దేవర సినిమా స్పెషల్ షోబలవంతంగా లాక్కెళ్లిన పోలీసులు, నొప్పితో విలవిలలాడిన హరీశ్ రావు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
HYDRA News: హైడ్రాను రద్దు చేయాలని హైకోర్టులో పిటిషన్, విచారణ వాయిదా
హైడ్రాను రద్దు చేయాలని హైకోర్టులో పిటిషన్, విచారణ వాయిదా
Chittoor Accident: చిత్తూరు జిల్లాలో ఘోర ప్రమాదం! 8 మంది దుర్మరణం
చిత్తూరు జిల్లాలో ఘోర ప్రమాదం! 8 మంది దుర్మరణం
YS Jagan: ఏలేరుకి వరద చంద్రబాబు వల్లనే, ఆ ప్రచారాలకు చంద్రబాబు తమ్ముడి వరుస - జగన్ ఎద్దేవా
ఏలేరుకి వరద చంద్రబాబు వల్లనే, ఆ ప్రచారాలకు చంద్రబాబు తమ్ముడి వరుస - జగన్ ఎద్దేవా
YSRCP Leaders Bail: టీడీపీ ఆఫీస్‌పై దాడి కేసులో వైసీపీ నేతలకు ఊరట- సుప్రీంకోర్టులో ముందస్తు బెయిల్ మంజూరు
టీడీపీ ఆఫీస్‌పై దాడి కేసులో వైసీపీ నేతలకు ఊరట- సుప్రీంకోర్టులో ముందస్తు బెయిల్ మంజూరు
Hyderabad News: హైదరాబాద్‌లో ఘోర విషాదం - ఐదేళ్ల చిన్నారిపై దూసుకెళ్లిన స్కూల్ బస్సు
హైదరాబాద్‌లో ఘోర విషాదం - ఐదేళ్ల చిన్నారిపై దూసుకెళ్లిన స్కూల్ బస్సు
Kedarnath: కేదార్ నాథ్ లో చిక్కుకున్న తెలుగువారు - వర్షాలు, తీవ్ర చలితో ఇబ్బందులు
కేదార్ నాథ్ లో చిక్కుకున్న తెలుగువారు - వర్షాలు, తీవ్ర చలితో ఇబ్బందులు
CM Revanth Reddy: 'శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠినచర్యలు' - డీజీపీకి సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు
'శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠినచర్యలు' - డీజీపీకి సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు
Pawan Kalyan Vacate Office:  ప్రభుత్వం ఇచ్చిన క్యాంపు కార్యాలయాన్ని ఖాళీ చేస్తున్న పవన్ కల్యాణ్
ప్రభుత్వం ఇచ్చిన క్యాంపు కార్యాలయాన్ని ఖాళీ చేస్తున్న పవన్ కల్యాణ్
Embed widget