అన్వేషించండి

Guntur Jinnah Tower name controversy Bjp Madhav: గుంటూరు జిన్నాటవర్ చుట్టూ మళ్లీ వివాదం - పేరు మార్చాల్సిందేనన్న మాధవ్ -వైసీపీ ఫైర్!

Guntur Politics: గుంటూరు జిన్నా టవర్ పేరు మార్చాలని బీజేపీ డిమాండ్ చేస్తోంది. కానీ వైసీపీ నేతలు మత సామరస్యానికి ప్రతీక అంటున్నారు.

BJP demands renaming of Guntur Jinnah Tower: గుంటూరులో జిన్నాటవర్ పేరు మార్చాలని బీజేపీ డిమాండ్ చేస్తోంది.  జిన్నా టవర్ బానిస చిహ్నమన్న ఏపీ బీజేపీ చీఫ్ మాధవ్ ఇటీవల విమర్శించారు.  జిన్నాటవర్ పేరు  మార్చాల్సిందేన్నారు. మాధవ్ వ్యాఖ్యలను తప్పుబట్టిన వైసీపీ నేత గులాం రసూల్  తప్పు పట్టారు. బీజేపీ నేతలు మత రాజకీయం చేసి ప్రజల్ని రెచ్చగొడుతున్నారని మండిపడ్డారు.   రసూల్ వ్యాఖ్యలపై బీజేపీ నేత జయప్రకాష్ ఆగ్రహం వ్యక్తం చేశారు.  జిన్నాను ప్రేమించేవాళ్లు పాక్‍కు వెళ్లిపోవచ్చంటూ  సూచించారు. 

పాకిస్తాన్ జాతి పిత పేరుతో గుంటూరులో టవర్                  

గుంటూరులో జిన్నాటవర్ సెంటర్ ఉంది. జిన్నా టవర్ వల్లనే ఆ సెంటర్ కు ఆ పేరు వచ్చింది. అయితే ఆ టవర్‌ను పాకిస్థాన్ జాతిపిత మహమ్మద్ అలీ జిన్నా పేరుతో  నిర్మించారని చాలా మందికి తెలియదు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు  ఈ అంశంపై వివాదం ప్రారంభమయింది.   భారతీయ జనతా పార్టీ (బీజేపీ) నేతలు జిన్నా టవర్ పేరును మార్చాలని లేదా స్థూపాన్ని తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు. దేశ విభజనకు కారణమైన జిన్నా పేరుతో స్థూపం ఉండటం సముచితం కాదని, ఇది "బానిస చిహ్నం" అని వారు వాదిస్తున్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్  స్వాతంత్య్ర సమరయోధులు లేదా ఏపీజే అబ్దుల్ కలాం, గుర్రం జాషువా వంటి వారి పేర్లను పెట్టాలని  డిమాండ్ చేస్తున్నారు.                     

జిన్నా దేశ స్వాతంత్ర సమరయోధుడంటున్న వైసీపీ నేతలు       
 
జిన్నా టవర్ స్వాతంత్య్రోద్యమ కాలంలో నిర్మితమైంది. జిన్నా సన్నిహితుడైన లియాఖత్ అలీ ఖాన్ ఈ స్థూపం ఆవిష్కరణ సభకు హాజరయ్యారు.   ఆ కాలంలో జిన్నా గాంధీ, నెహ్రూ వంటి నాయకులతో కలిసి పనిచేశారు.  అయితే తర్వాత పాకిస్థాన్ ఏర్పాటుకు డిమాండ్ చేయడంతో దేశ విభజనకు దారితీసింది. జిన్నా పాకిస్తాన్ జాతి పిత అయ్యారు. వైసీపీ హయాంలో  బీజేపీ నేతలు పెద్ద ఎత్తున ఉద్యమం చేశారు. ఆ సమయంలో  జిన్నా టవర్ జాతీయ జెండా రంగులు వేసి ఎవరూ ధ్వంసం చేయకుండా చూశారు. జిన్నా స్వాతంత్య్ర సమరయోధుడని వైసీపీ నేతలంటున్నారు.             

పేరు మార్పు వివాదంపై ప్రభుత్వం  స్పందన ఏమిటో ?                
 
జిన్నా టవర్ వివాదం గుంటూరులో రాజకీయ, మతపరమైన ఉద్రిక్తతలను రేకెత్తిస్తోంది. బీజేపీ దీనిని దేశభక్తి అంశంగా, వైసీపీ మత సామరస్యం అంశంగా చూపిస్తూ రాజకీయ లబ్ధి కోసం ప్రయత్నిస్తున్నాయి. మాధవ్ ఇటీవల విజయవాడలో పర్యటించినప్పుడు లెనిన్ సెంటర్ పేరు మార్చాలని డిమాండ్ చేశారు. ఇప్పుడు గుంటూరు జిన్నా టవర్ సెంటర్ పేరు మార్చాలంటున్నారు. బీజేపీ కూడా కూటమిలో భాగం కావడంతో ...  ప్రభుత్వ స్పందన ఏమిటన్నది తెలియాల్సి ఉంది. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

YS Jagan: ముఖ్యమంత్రిగానే భరించలేకపోతున్నాం, ఇక  ప్రధాని అయితే దేశం గతేంటీ?- చంద్రబాబుపై జగన్ కామెంట్స్ వైరల్ 
ముఖ్యమంత్రిగానే భరించలేకపోతున్నాం, ఇక  ప్రధాని అయితే దేశం గతేంటీ?- చంద్రబాబుపై జగన్ కామెంట్స్ వైరల్ 
Vijaya Dairy Issue: విజయ బ్రాండ్ నెయ్యి ఇష్యూపై లోకేష్ వర్సెస్ గుత్తా అమిత్ రెడ్డి - చివరికి ఏం తేలిందంటే ?
విజయ బ్రాండ్ నెయ్యి ఇష్యూపై లోకేష్ వర్సెస్ గుత్తా అమిత్ రెడ్డి - చివరికి ఏం తేలిందంటే ?
Gas Cylinder shortage: గ్యాస్ కొరతతో అయోధ్య సహా అనేక దేవాలయాల్లో అన్నదానం నిలిపివేత - మరి తిరుమల పరిస్థితి ఏమిటి?
గ్యాస్ కొరతతో అయోధ్య సహా అనేక దేవాలయాల్లో అన్నదానం నిలిపివేత - మరి తిరుమల పరిస్థితి ఏమిటి?
Google AI Hub Issue: గూగుల్ ఏఐ హబ్‌కు భూముల కేటాయింపుపై తిరుపతి ఎంపీ పిల్ - ఏపీపై జగన్ ద్వేషానికి నిదర్శనమని లోకేష్ ఆగ్రహం
గూగుల్ ఏఐ హబ్‌కు భూముల కేటాయింపుపై తిరుపతి ఎంపీ పిల్ - ఏపీపై జగన్ ద్వేషానికి నిదర్శనమని లోకేష్ ఆగ్రహం

వీడియోలు

Sanju Samson Phone Call with Sachin | సంజు విజయం వెనుక సచిన్
ICC Penalizes Arshdeep After T20 World Cup Final | అర్ష్‌దీప్ సింగ్‌పై ఐసీసీ వేటు
Shahid Afridi praises Team India | భారత జట్టుపై షాహిద్ అఫ్రిదీ ప్రశంసలు
BCCI Reward for T20 World Cup Champions | టీమిండియాపై బీసీసీఐ కాసుల వర్షం
Gambhir Dedicates T20WC Win to Dravid & Laxman | ట్రోఫీ గెలిచాక గంభీర్ సంచలన నిర్ణయం

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Gas Cylinder shortage: గ్యాస్ కొరతతో అయోధ్య సహా అనేక దేవాలయాల్లో అన్నదానం నిలిపివేత - మరి తిరుమల పరిస్థితి ఏమిటి?
గ్యాస్ కొరతతో అయోధ్య సహా అనేక దేవాలయాల్లో అన్నదానం నిలిపివేత - మరి తిరుమల పరిస్థితి ఏమిటి?
Good news for AP farmers: ఏపీ రైతులకు ఉగాది కానుక - 13న అన్నదాత సుఖీభవ నిధులు రూ.6వేలు జమ !
ఏపీ రైతులకు ఉగాది కానుక - 13న అన్నదాత సుఖీభవ నిధులు రూ.6వేలు జమ !
Harish Rana Case : 13 ఏళ్లు మంచంపై ఉన్న హరీష్‌ రాణా కేసు సుప్రీంకోర్టుకు ఎలా చేరింది? బ్రెయిన్ డెడ్, PVS మధ్య తేడా ఏంటీ?
13 ఏళ్లు మంచంపై ఉన్న హరీష్‌ రాణా కేసు సుప్రీంకోర్టుకు ఎలా చేరింది? బ్రెయిన్ డెడ్, PVS మధ్య తేడా ఏంటీ?
కాంగ్రెస్ నుంచి ఎంపీగా పోటీ చేసిన వ్యక్తికే క్లిన్ చిట్, ప్రజల తీర్పును అవమానించడం: కేటీఆర్
కాంగ్రెస్ నుంచి ఎంపీగా పోటీ చేసిన వ్యక్తికే క్లిన్ చిట్, ప్రజల తీర్పును అవమానించడం: కేటీఆర్
First Euthanasia: ఏ దేశంలో తొలి కారుణ్యమరణం (Mercy Killing) అమలులోకి వచ్చింది? దాని బ్యాక్‌డ్రౌండ్ పూర్తి వివరాలివే
ఏ దేశంలో తొలి కారుణ్యమరణం (Mercy Killing) అమలులోకి వచ్చింది? దాని బ్యాక్‌డ్రౌండ్ పూర్తి వివరాలివే
Kavuri Sambasivarao Passes Away: కేంద్ర మాజీ మంత్రి కావూరి సాంబశివరావు కన్నుమూత, సీఎం చంద్రబాబు సహా ప్రముఖుల సంతాపం
కేంద్ర మాజీ మంత్రి కావూరి సాంబశివరావు కన్నుమూత, సీఎం చంద్రబాబు సహా ప్రముఖుల సంతాపం
Hansika Divorce : భర్త సోహైల్‌తో హీరోయిన్ హన్సిక డివోర్స్ - నాలుగేళ్ల వివాహ బంధానికి ఎండ్ కార్డ్
భర్త సోహైల్‌తో హీరోయిన్ హన్సిక డివోర్స్ - నాలుగేళ్ల వివాహ బంధానికి ఎండ్ కార్డ్
Team India నెక్ట్స్ ఇంటర్నేషనల్ మ్యాచ్ ఎప్పుడు ఆడుతుంది? IPL కోసం ఫ్యాన్స్ వెయిటింగ్
Team India నెక్ట్స్ ఇంటర్నేషనల్ మ్యాచ్ ఎప్పుడు ఆడుతుంది? IPL కోసం ఫ్యాన్స్ వెయిటింగ్
Embed widget