అన్వేషించండి

Ysrcp: జిల్లా అధ్యక్షుల మార్పు - వైసీపీకి ఏ మేరకు లాభం?

Ysrcp: జిల్లాల్లో వైసీపీ ఇంఛార్జీలను మార్చి, కొత్త కార్యక్రమాలతో తిరిగి ప్రజల్లోకి వెళ్లేందుకు, పార్టీకి పూర్వ వైభవం తెచ్చేందుకు జగన్ ప్రయత్నిస్తున్నారు. మరి అది ఎంత వరకూ సక్సెస్ అవుతుందో చూడాలి.

YS Jagan Changes District Incharges: సార్వత్రిక ఎన్నికల్లో ఓటమి తర్వాత వైసీపీ(YCP)లో కొంతమంది సీనియర్లు యాక్టివ్ పాలిటిక్స్‌కి దూరమయ్యారు. మరికొందరు పార్టీలు మారుతున్నారు. ఈ దశలో పార్టీని అంతర్గతంగా పటిష్టం చేసేందుకు కొత్త వారికి జిల్లాల బాధ్యతలు అప్పగించారు జగన్(Jagan). ఈ మార్పు పార్టీకి ఏ మేరకు లాభం అనేది వేచి చూడాలి. 

ఇటీవల జిల్లా నేతలతో వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు వైసీపీ అధినేత జగన్. ఆయా జిల్లాల్లో ఎవరు యాక్టివ్‌గా ఉన్నారు.?, జిల్లా అధ్యక్షులుగా ఎవరిని ఉంచాలి.? నియోజకవర్గాల ఇంఛార్జీలుగా ఎవరు ఉండాలి.? అనేది డిసైడ్ చేస్తున్నారు. తాజాగా 4 జిల్లాలకు కొత్త అధ్యక్షులను(District Presidents) నియమించారు. విశాఖపట్నం జిల్లా పార్టీ అధ్యక్షుడిగా మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్‌‌కి అవకాశం ఇచ్చారు. అనకాపల్లి జిల్లా అధ్యక్షుడిగా బూడి ముత్యాలనాయుడిని నియమించారు. అల్లూరి జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా పాడేరు ఎమ్మెల్యే మత్స్యరాస విశ్వేశ్వరరాజుని ఛాన్స్ ఇచ్చారు. ఇక బాపట్ల జిల్లాకు సంబంధించి జిల్లా పార్టీ అధ్యక్షుడిగా మేరుగు నాగార్జునకు అవకాశం ఇచ్చిన జగన్, బాపట్ల పార్లమెంటు నియోజకవర్గ పరిశీలకుడిగా మాజీ ఎంపీ నందిగం సురేష్‌ని నియమించారు. టీడీపీ ఆఫీస్‌పై దాడి కేసులో ప్రస్తుతం నందిగం సురేష్ రిమాండ్ ఖైదీగా జైలులో ఉన్నారు. ఇక ప్రకాశం జిల్లాకు చెందిన మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్‌కి వైసీపీ పొలిటికల్ అఫైర్స్ కమిటీలో స్థానం ఇచ్చారు. ఇదే కమిటీలో మరో మెంబర్‌గా రాష్ట్ర పార్టీ ఎస్టీ విభాగం అధ్యక్షురాలిగా కొట్టగుళ్ళి భాగ్యలక్ష్మిని నియమించారు జగన్. 

ఇటీవలే గుంటూరు జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా మాజీ మంత్రి అంబటి రాంబాబుకి ఛాన్స్ ఇచ్చిన జగన్.. కృష్ణా జిల్లా అధ్యక్షుడిగా మరో మాజీ మంత్రి పేర్ని నానిని నియమించారు. ఎన్టీఆర్‌ జిల్లా అధ్య­క్ష బాధ్యతలు దేవినేని అవినాష్‌ కి అప్పగించారు. ఆమధ్య నెల్లూరు జిల్లా అధ్యక్ష బాధ్యతల్ని మాజీ మంత్రి కాకాణికి ఇచ్చారు. 

ఎన్నికల తర్వాత జిల్లాల్లో వైసీపీ కార్యక్రమాలు కాస్త స్తబ్దుగా మారాయి. ఎన్నికల ముందు సవాళ్లు విసిరిన నేతలంతా ఎన్నికల తర్వాత సైలెంట్ అయ్యారు. దీంతో పార్టీ కార్యక్రమాల్లో యాక్టివ్‌గా ఉన్న వారికే మరిన్ని బాధ్యతలను జగన్ అప్పగిస్తున్నారు. జిల్లా పార్టీ అధ్యక్షులుగా మాజీ మంత్రులకు అవకాశమిచ్చారు. నియోజకవర్గ ఇంఛార్జీలను కూడా భవిష్యత్తుని దృష్టిలో ఉంచుకునే నియమించారు. ఆయా నియోజకవర్గాల్లో పార్టీని పటిష్ట పరిస్తే.. ఐదేళ్ల తర్వాత వారే అభ్యర్థులుగా ఉండొచ్చనే హామీ ఇచ్చారు. 

పార్టీకి సంబంధించిన కార్యక్రమాలు కూడా మెల్లగా జోరందుకోబోతున్నాయి. ఇటీవల విజయవాడ వరదల సందర్భంగా వైసీపీ నేతలు ప్రజల్లోకి వచ్చారు. తిరుమల లడ్డూ వివాదం నేపథ్యంలో శనివారం రాష్ట్రవ్యాప్తంగా పాప ప్రక్షాళన పూజలు చేయాలని జగన్ పిలుపునిచ్చారు. ఈ పిలుపు మేరకు జిల్లా కేంద్రాల్లో వైసీపీ నేతలు విష్ణు ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేయబోతున్నారు. జిల్లాల్లో పార్టీ కార్యక్రమాలు పెంచాలని చూస్తున్నారు. ఇంఛార్జీలను మార్చి, కొత్త కార్యక్రమాలతో తిరిగి ప్రజల్లోకి వెళ్లేందుకు, పార్టీకి పూర్వ వైభవం తెచ్చేందుకు జగన్ ప్రయత్నిస్తున్నారు. 

Also Read: 'దళితులను ఆలయాల్లోకి రానీయడం లేదని ఎవరు చెప్పారు' - వైఎస్ జగన్ వ్యాఖ్యలపై సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Ind vs Nz 3rd ODI: ఒక మార్పుతో బరిలోకి దిగిన గిల్ సేన.. ఇండోర్‌లో తమ రికార్డు కాపాడుకుంటుందా?
ఒక మార్పుతో బరిలోకి దిగిన గిల్ సేన.. ఇండోర్‌లో తమ రికార్డు కాపాడుకుంటుందా?
AR Rahman Vs Kangana Ranaut: ఏఆర్ రెహమాన్‌పై విమర్శలు గుప్పించిన కంగనా రనౌత్... నన్ను కలవలేదు, అంత ద్వేషమా?
ఏఆర్ రెహమాన్‌పై విమర్శలు గుప్పించిన కంగనా రనౌత్... నన్ను కలవలేదు, అంత ద్వేషమా?
NTR Vardhanti: ఎన్టీఆర్ 30వ వర్థంతి.. ఎన్టీఆర్ ఘాట్ వద్ద మంత్రి లోకేష్, కల్యాణ్ రామ్ నివాళులు
ఎన్టీఆర్ 30వ వర్థంతి.. ఎన్టీఆర్ ఘాట్ వద్ద మంత్రి లోకేష్, కల్యాణ్ రామ్ నివాళులు
Hyderabad Crime News: హైదరాబాద్‌లో సైబర్ మోసం.. 5 వేలు లాభం చూపించి, ఐటీ ఉద్యోగికి రూ. 2.9 కోట్లు ఎగనామం
హైదరాబాద్‌లో సైబర్ మోసం.. 5 వేలు లాభం చూపించి, ఐటీ ఉద్యోగికి రూ. 2.9 కోట్లు ఎగనామం

వీడియోలు

Vaibhav Suryavanshi broke Virat Record | కోహ్లీ రికార్డ్ బ్రేక్ చేసిన వైభవ్
India vs Bangladesh Under-19 World Cup | బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన టీమిండియా
Nara Lokesh Tribute to NTR on Death Anniversary | ఎన్టీఆర్ కు నివాళి అర్పించిన లోకేష్
Vande Bharat Sleeper Train Started | పచ్చ జెండా ఊపి వందేభారత్ స్లీపర్ ను ప్రారంభించిన ప్రధాని మోదీ | ABP Desam
WPL 2026 RCB vs GG Highlights | హ్యాట్రిక్ కొట్టిన బెంగళూరు!

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Ind vs Nz 3rd ODI: ఒక మార్పుతో బరిలోకి దిగిన గిల్ సేన.. ఇండోర్‌లో తమ రికార్డు కాపాడుకుంటుందా?
ఒక మార్పుతో బరిలోకి దిగిన గిల్ సేన.. ఇండోర్‌లో తమ రికార్డు కాపాడుకుంటుందా?
AR Rahman Vs Kangana Ranaut: ఏఆర్ రెహమాన్‌పై విమర్శలు గుప్పించిన కంగనా రనౌత్... నన్ను కలవలేదు, అంత ద్వేషమా?
ఏఆర్ రెహమాన్‌పై విమర్శలు గుప్పించిన కంగనా రనౌత్... నన్ను కలవలేదు, అంత ద్వేషమా?
NTR Vardhanti: ఎన్టీఆర్ 30వ వర్థంతి.. ఎన్టీఆర్ ఘాట్ వద్ద మంత్రి లోకేష్, కల్యాణ్ రామ్ నివాళులు
ఎన్టీఆర్ 30వ వర్థంతి.. ఎన్టీఆర్ ఘాట్ వద్ద మంత్రి లోకేష్, కల్యాణ్ రామ్ నివాళులు
Hyderabad Crime News: హైదరాబాద్‌లో సైబర్ మోసం.. 5 వేలు లాభం చూపించి, ఐటీ ఉద్యోగికి రూ. 2.9 కోట్లు ఎగనామం
హైదరాబాద్‌లో సైబర్ మోసం.. 5 వేలు లాభం చూపించి, ఐటీ ఉద్యోగికి రూ. 2.9 కోట్లు ఎగనామం
Rafale Fighter Jets: భారత్‌లో తయారుకానున్న రాఫెల్ ఫైటర్ జెట్స్.. విదేశాలకు ఎగుమతితో ఎలైట్ క్లబ్‌లోకి
భారత్‌లో తయారుకానున్న రాఫెల్ ఫైటర్ జెట్స్.. విదేశాలకు ఎగుమతితో ఎలైట్ క్లబ్‌లోకి
Shefali Jariwala Death Reason: చేతబడి వల్లే నా భార్య మరణించింది... అజ్ఞాతవాసి, సర్కారు వారి పాట విలన్
చేతబడి వల్లే నా భార్య మరణించింది... అజ్ఞాతవాసి, సర్కారు వారి పాట విలన్
IND vs NZ 3rd ODI: కీలకమైన మూడో వన్డేలో పరుగుల వర్షమే.. పిచ్ రిపోర్ట్, IND vs NZ ప్లేయింగ్ XI అంచనా
కీలకమైన మూడో వన్డేలో పరుగుల వర్షమే.. పిచ్ రిపోర్ట్, IND vs NZ ప్లేయింగ్ XI అంచనా
CM Revanth Reddy: ఖమ్మంలో కీలక అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి
ఖమ్మంలో కీలక అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి
Embed widget