అన్వేషించండి

Srikakulam News: 100 రోజుల్లోపే శ్రీకాకుళం జిల్లాలో బాబాయ్ అబ్బాయి మార్క్ - దశాబ్దాల కల సాకారమయ్యేనా!

Andhra Pradesh News | కూటమి ప్రభుత్వం ఏర్పడి 100 రోజుల్లోపే శ్రీకాకుళం జిల్లాలో బాబాయ్ అబ్బాయి మార్కు చూపించారు..

Atchannaidu and Ram Mohan Naidu | బాబాయ్ అబ్బాయిలపై సిక్కోలు జిల్లా అభివృద్ధి మంత్రం ఆధారపడి ఉంది. కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు, ఏపీ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడులకు పదవులు వచ్చాయని అంతా అన్నారు. జిల్లా అభివృద్ధిని పరుగులు పెట్టిస్తారని ప్రజలు భావిస్తున్నారు. రామ్మోహన్ నాయుడు గత పదేళ్లుగా శ్రీకాకుళం ఎంపీగానే ఉన్నారు. ఆయన పార్లమెంటులో వివిధ సమస్యలపై గళం విప్పడంతో ప్రధాన మంత్రి మోదీ దృష్టిలో పడ్డారు. అంతేకాకుండా సీనియర్ కేంద్ర మంత్రులతో కూడా ఆయనకున్న సత్ససంబంధాలే ఇప్పుడు సిక్కోలు జిల్లా అభివృద్ధికి ఆస్కారం ఏర్పడనుంది. ప్రధానంగా జిల్లాలోని ఆముదాలవలస, పలాస, రైల్వే స్టేషన్లు అభివృద్ధికి ఆస్కారం ఏర్పడింది.

శ్రీకాకుళం రోడ్ మీదుగా నడిచే వివిధ రైళ్లుకూడ అక్కడ స్టేషన్ లో నిలిచేందుకు కృషి చేశారు. కేవలం శ్రీకాకుళం జిల్లాపైన కాకుండా రాష్ట్రంపై రామ్మోహన్ నాయుడు దృష్టి సారించారు. మొన్నటికి మొన్న విజయవాడ ఎయిర్ పోర్టులో ప్రత్యేక మార్గాన్ని ప్రారంభించారు. దేశంలో తొలిసారి అని ప్రకటించారు. ఇక రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు కూడా జిల్లాపై ప్రత్యేకంగా దృష్టి సారించారు. గత వైసీపీ ప్రభుత్వ హాయాంలో కొటబొమ్మాళి, సంతబొమ్మాళి, జలుమూరు, సారవకోట మండలాల్లో ఏడు లిఫ్టు ఇరిగేషన్లు పడకేయగా వాటిన్నింటిని పునరుద్దరించారు. కొత్తగా ట్రాన్స్ ఫార్మర్లను ఏర్పాటు చేసి ఈ ఏడాది సుమారు రెండు వేల ఎకరాలకు నీరందించేందుకు కృషి చేశారు. ఇక గత ఐదేళ్లుగా గొట్టా బ్యారేజ్ నుంచి పలాస నియోజకవర్గంలోని వజ్రపుకొత్తూరు మండలానికి సాగునీరు గగనమైంది. దాదాపు అరకోటి రూపాయలతో ఎడమకాలువ మరమ్మత్తు పనులు చేపట్టి వంశధార సాగునీరు శివారు ప్రాంతాలకు అందివ్వడంతో ఆప్రాంతీయుల్లో ఆనందం పొంగి ప్రవహించింది.

Srikakulam News: 100 రోజుల్లోపే శ్రీకాకుళం జిల్లాలో బాబాయ్ అబ్బాయి మార్క్ - దశాబ్దాల కల సాకారమయ్యేనా!

టెక్కలి జిల్లా కేంద్ర ఆసుపత్రి ప్రక్షాళనకు శ్రీకారం చుట్టారు. కొత్తమ్మ తల్లి జాతర సంబరాలు ప్రభుత్వం నిర్వహించడమే కాకుండా దాదాపు కోటి రూపాయలు మంజూరుకు కృషి చేశారు. ఇలా ప్రభుత్వం ఏర్పడిన తొలి వందరోజుల్లో బాబాయ్, అబ్బాయ్ తమ మార్కును చూపించారని స్థానికంగా వినిపిస్తోంది. విశాఖకు రైల్వే జోన్ డిమాండ్ అర్ధ శతాబ్దంపైగా ఉంది. ఇప్పటికి 55 ఏళ్ల కిందట విశాఖకు రైల్వే జోన్ కావాలని ఆనాటి విశాఖ లోక్ సభ సభ్యుడు తెన్నేటి విశ్వనాథం పార్లమెంట్లో గళమెత్తారు. యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వం సమయంలో కొత్త జోన్లు ప్రకటించినా విశాఖకు ఆ అదృష్టం దక్కలేదు. ప్రధానిగా వాజ్ పేయ్ హయాంలోనూ మరికొన్ని రైల్వే జోన్లను ఇచ్చారు. అయినా కూడా విశాఖ పేరు ప్రస్తావనకు లేదు, విభజన హామీలలో చివరికి చోటు దక్కింది. ఆంధ్రప్రదేశ్ రెండుగా విడిపోయి దశాబ్దం దాటింది. కానీ ఇంకా రైల్వే జోన్ కూతను మాత్రం విశాఖ వాసులు వినలేదు. విశాఖ రైల్వే జోన్ ఇచ్చేశామని 2019 ఎన్నికల ముందు కేంద్రం ప్రకటించింది. కానీ అయిదేళ్లలో అడుగు ముందు పడలేదు. దానికి వైసీపీ ప్రభుత్వం భూమి చూపించలేదని కేంద్రంపేర్కొంది. తాము భూమి ఇచ్చామని వైసీపీ చెప్పింది. ఎక్కడ గ్యాప్ ఉందో తెలియదు కానీ అలా ఆ ప్రాజెక్ట్ అయితే నిలిచిపోయింది.

ప్రస్తుతం ఏపీలో, కేంద్రంలో ఎన్డీయే కూటమి అధికారంలో ఉంది. దాంతో బీజేపీ రైల్వేజోన్ ఇవ్వడం పెద్ద సమస్య కాదు. ఏపీ సీఎం చంద్రబాబుకూడా అడిగి తెచ్చుకోగలరు. కానీ ఆలస్యం మాత్రం అలాగేకొనసాగుతోంది. విశాఖ రైల్వే జోన్ అదిగో ఇదిగో అనికేంద్రం గడచిన మూడు నెలలలో ప్రకటనలు చేస్తున్నారు. తాజాగా విశాఖకు మరో వందే భారత్ రైలు మంజూరు చేసిన సందర్భంలో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు రైల్వే జోన్ మీద మళ్లీ ఊరించే ప్రకటన చేశారు. విశాఖ రైల్వేజోన్కు త్వరలోనే భూమిపూజ నిర్వహిస్తామని చెప్పారు. దానికి ఒక ముహూర్తం కూడా ఆయన ప్రకటించారు. దసరా పండుగ తరువాత పనులు ప్రారంభిస్తామని ప్రకటించారు. దీంతో పదేళ్ల ఎదురుచూపులకు దసరా తర్వాత ఐనా తమకు శుభవార్త వస్తుందా అని ఉత్తరాంధ్ర వాసులు ఆలోచిస్తున్నారు.

విశాఖకు రైల్వే జోన్ వస్తే తెన్నేటి కల సాకారం అవుతుందని అంటున్నారు. ఇక విశాఖపట్నం రైల్వే జోన్కు సంబంధించి రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ కూడా ఇదే విషయాన్ని వెల్లడించారు. త్వరలోనే రైల్వే జోన్ హెడ్ క్వార్టర్స్ పనులు ప్రారంభిస్తామని చెప్పారు. రైల్వే జోన్ కార్యాలయం కోసం టీడీపీ కూటమి విశాఖలో ఇప్పటికే 52 ఎకరాలను కేటాయించిన క్రమంలో ఇక కేంద్రానిదే ఆలస్యం అన్నట్లుగా పరిస్థితి ఉంది. ఈ సువిశాలమైన ప్రాంతంలోనే రైల్వే జోన్ ప్రధాన కార్యాలయం ఏర్పాటు చేస్తారని వినిపిస్తోంది.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

PM Vidya Laxmi Scheme: పేద విద్యార్థుల చదువుకు రూ.10 లక్షలు.. పీఎం విద్యాలక్ష్మి పథకం అర్హతలు, దరఖాస్తు విధానం ఇలా!
పేద విద్యార్థుల చదువుకు రూ.10 లక్షలు.. పీఎం విద్యాలక్ష్మి పథకం అర్హతలు, దరఖాస్తు విధానం ఇలా!
Viral News: 100 కిలోమీటర్లు సైకిల్ తొక్కుతూ వెళ్లిన బాలుడు.. అటు నుంచి రైలెక్కి రాయచూర్‌‌కు.. విషయం తెలిసిన పేరెంట్స్ షాక్
100 కిలోమీటర్లు సైకిల్ తొక్కుతూ వెళ్లిన బాలుడు.. అటు నుంచి రైలెక్కి రాయచూర్‌‌కు.. విషయం తెలిసిన పేరెంట్స్ షాక్
Kavitha And Sharmila: జగన్, కేటీఆర్‌లు ముందు పరిష్కరించుకోవాల్సింది కుటుంబ సమస్యలే - షర్మిల, కవితలు చీల్చే ఓట్లే శాసిస్తాయా?
జగన్, కేటీఆర్‌లు ముందు పరిష్కరించుకోవాల్సింది కుటుంబ సమస్యలే - షర్మిల, కవితలు చీల్చే ఓట్లే శాసిస్తాయా?
AP Police Holiday: ఏపీ పోలీసులకు శుభవార్త.. ఈ 2 రోజులు వారికి స్పెషల్ హాలిడే మంజూరు చేసిన ప్రభుత్వం
ఏపీ పోలీసులకు శుభవార్త.. ఈ 2 రోజులు వారికి స్పెషల్ హాలిడే మంజూరు చేసిన ప్రభుత్వం

వీడియోలు

SRH Bowling Disaster vs PBKS IPL 2026 | SRH బౌలింగ్ వైఫల్యంపై ఫ్యాన్స్ ఫైర్
Ayush Mhatre Retired Out IPL 2026 | సీఎస్కే మేనేజ్మెంట్ పై విమర్శల వర్షం
Sanju Samson Salute Celebration | కోచ్ కోసం సంజూ శాంసన్ సెల్యూట్
CSK vs DC IPL 2026 Sanju Samson Century | సంజూ శాంస‌న్ ఫాస్టెస్ట్ సెంచ‌రీ
IPL 2026 CSK vs DC Highlights | బోణీ కొట్టిన చెన్నై

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Strait of Hormuz: హర్మూజ్‌పై భారత్‌కు ఇరాన్ ప్రభుత్వం గుడ్‌న్యూస్.. టోల్ ఛార్జీలతో పాటు రాకపోకలపై కీలక ప్రకటన
హర్మూజ్‌పై భారత్‌కు ఇరాన్ ప్రభుత్వం గుడ్‌న్యూస్.. టోల్ ఛార్జీలతో పాటు రాకపోకలపై కీలక ప్రకటన
Kavitha And Sharmila: జగన్, కేటీఆర్‌లు ముందు పరిష్కరించుకోవాల్సింది కుటుంబ సమస్యలే - షర్మిల, కవితలు చీల్చే ఓట్లే శాసిస్తాయా?
జగన్, కేటీఆర్‌లు ముందు పరిష్కరించుకోవాల్సింది కుటుంబ సమస్యలే - షర్మిల, కవితలు చీల్చే ఓట్లే శాసిస్తాయా?
Praful Hinge Social Media : ఒకే మ్యాచ్‌తో ప్రఫుల్‌కు ఫుల్ క్రేజ్‌ !మైదానంలో వికెట్ల వేటతో సోషల్ మీడియాలో ఫాలోవర్స్ సునామీ!
ఒకే మ్యాచ్‌తో ప్రఫుల్‌కు ఫుల్ క్రేజ్‌ !మైదానంలో వికెట్ల వేటతో సోషల్ మీడియాలో ఫాలోవర్స్ సునామీ!
Tamil Nadu Assembly Elections: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో జయలలిత, కరుణానిధిలదే కీలక పాత్ర - ఏఐతో మాయ చేస్తున్న పార్టీలు!
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో జయలలిత, కరుణానిధిలదే కీలక పాత్ర - ఏఐతో మాయ చేస్తున్న పార్టీలు!
DOST Notification 2026: తెలంగాణలో డిగ్రీ ప్రవేశాల షెడ్యూల్ విడుదల.. ఈ 15 నుంచి దోస్త్ రిజిస్ట్రేషన్లు ప్రారంభం
తెలంగాణలో డిగ్రీ ప్రవేశాల షెడ్యూల్ విడుదల.. ఈ 15 నుంచి దోస్త్ రిజిస్ట్రేషన్లు ప్రారంభం
Sudigali Sudheer : సుడిగాలి సుధీర్‌తో దీపిక పిల్లి లాక్ అయిందా?.. అసలు మ్యాటర్ ఏంటంటే?
సుడిగాలి సుధీర్‌తో దీపిక పిల్లి లాక్ అయిందా?.. అసలు మ్యాటర్ ఏంటంటే?
AP Sarpanch Elections: 5 ఏళ్ల తర్వాత సర్పంచ్ ఎన్నికల విజేతను తేల్చిన కోర్ట్.. కోనసీమలో అనూహ్య పరిణామం
5 ఏళ్ల తర్వాత సర్పంచ్ ఎన్నికల విజేతను తేల్చిన కోర్ట్.. కోనసీమలో అనూహ్య పరిణామం
What Is Quantum Computer: నేడే ఏపీలో క్వాంటం కంప్యూటర్ ప్రారంభం.. దీనివల్ల కలిగే ప్రయోజనాలు ఇవే
నేడే ఏపీలో క్వాంటం కంప్యూటర్ ప్రారంభం.. దీనివల్ల కలిగే ప్రయోజనాలు ఇవే
Embed widget