అన్వేషించండి

Chandrababu Notice : విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రి ఘటన, చంద్రబాబు, బోండా ఉమాకు మహిళా కమిషన్ నోటీసులు

Chandrababu Notice : టీడీపీ అధినేత చంద్రబాబు, మాజీ ఎమ్మెల్యే బోండా ఉమాకు మహిళా కమిషన్ నోటీసులు జారీ చేసింది. విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో జరిగిన ఘటనపై వివరణ ఇవ్వాలని కోరింది. ఈ నెల 27న విచారణకు హాజరుకావాలని కోరింది.

Chandrababu Notice : టీడీపీ అధినేత చంద్రబాబు, మాజీ ఎమ్మె్ల్యే బోండా ఉమామహేశ్వరరావుకు ఏపీ మహిళా కమిషన్‌ నోటీసులు జారీ చేసింది. విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రిలో మహిళా కమిషన్‌ ఛైర్‌పర్సన్‌ పద్మ పట్ల అగౌరవంగా ప్రవర్తించారని ఆరోపణలతో ఈ నోటీసులు ఇచ్చింది. ఈ నెల 27న విచారణకు హాజరుకావాలని ఆదేశాలు జారీ చేసింది. విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న అత్యాచార బాధితురాలని మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ శుక్రవారం పరామర్శించారు. అయితే ఈ సమయంలో టీడీపీ అధినేత చంద్రబాబు, మాజీ ఎమ్మె్ల్యే బోండా ఉమామహేశ్వరరావు, ఆ పార్టీ నేతలు ఆసుపత్రికి వచ్చారు. ఈ సమయంలో వాసిరెడ్డి పద్మ, చంద్రబాబుకు మధ్వ వాగ్వాదం జరిగింది. అనంతరం తనపై చంద్రబాబు, బోండా ఉమా అనుచిత వ్యాఖ్యలు చేశారని వాసిరెడ్డి పద్మ మీడియాతో మాట్లాడారు. 

Chandrababu Notice : విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రి ఘటన, చంద్రబాబు, బోండా ఉమాకు మహిళా కమిషన్ నోటీసులు

అసలేం జరిగిందంటే? 

ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు బాధితురాల్ని పరామర్శించేందుకు వెళ్లగా, అక్కడ ఏపీ మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ ఆయనకు ఎదురుపడ్డారు. సామాన్య మహిళకు ఏపీ ప్రభుత్వంలో రక్షణ లేకుండా పోయిందని, మీరు ఏం చేస్తున్నారంటూ వాసిరెడ్డి పద్మను చంద్రబాబు సూటిగా ప్రశ్నించారు. విజయవాడ సంఘటన ఏపీకే అవమానం అని వ్యాఖ్యానించారు. అమ్మాయి తండ్రి ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడం వల్లే ఈ దారుణం జరిగిందని చంద్రబాబు ఆరోపించారు. కోటి రూపాయాలు బాధితురాలి కుటుంబానికి పరిహారంగా చెల్లించేలా చూడాలని డిమాండ్ చేశారు. వాసిరెడ్డి పద్మను టీడీపీ కార్యకర్తలు అడ్డుకునే ప్రయత్నం చేయడంతో జీజీహెచ్‌లో ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి. విజయవాడ పాత ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్న గ్యాంగ్‌ రేప్ బాధితురాలిని ఆంధ్రప్రదేశ్ మహిళాకమిషనర్‌ ఛైర్‌పర్శన్ వాసిరెడ్డి పద్మ పరామర్శించారు. బాధితురాలితో మాట్లాడి ధైర్యం చెప్పారు. కచ్చితంగా నిందితులకు శిక్ష పడేలా చేస్తామన్నారు. ఫ్యామిలీ మెంబర్స్‌తో మాట్లాడిన ఆమె అండగా ఉంటామన్నారు. 

కరోనా డ్రామాలు అని టీడీపీ ఆరోపణలు

వాసి రెడ్డి పద్మ వచ్చిన సందర్భంగా విజయవాడ ప్రభుత్వాసుపత్రి వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. చంద్రబాబు వస్తున్నారని సమాచారం తెలిసిన తర్వాతే అధికార పార్టీ లీడర్లు మేల్కొన్నారని ఆరోపిస్తోంది టీడీపీ. ఇప్పటి వరకు నిందితులకు అండగా నిలిచిన అధికార పార్టీ లీడర్లు ఇప్పుడు బాధితురాలని పరామర్శించడం ఏంటని ప్రశ్నిస్తోంది టీడీపీ. వాసిరెడ్డి పద్మ పర్యటన అడ్డుకునేందుకు తీవ్రంగా ప్రయత్నించారు టీడీపీ శ్రేణులు. ఆమె రాకను తప్పుపట్టారు. కరోనా వచ్చిందని నిన్నంత డ్రామాలు ఆడిన వాసి రెడ్డి పద్మ ఇప్పుడు ఎలా ఆసుపత్రికి వచ్చారని ప్రశ్నిస్తోంది టీడీపీ. ఒక్కరోజులోనే కరోనా తగ్గిపోయిందా అంటూ నిలదీస్తోంది. చంద్రబాబు వస్తున్నారనే భయంతోనే బాధితురాలిని పరామర్శించారని దుయ్యబట్టారు. బాధితురాలిని వాసిరెడ్డి పద్మ పరామర్శించే సందర్భంలో గోబ్యాక్ వాసిరెడ్డి పద్మ అంటూ నినాదాలు చేశారు టీడీపీ శ్రేణులు. ఆమెకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Hyderabad Crime News: మాజీ భార్యే కిడ్నాప్ చేయించింది - అంబర్ పేట వ్యక్తి అపహరణ కేసులో ట్విస్ట్
మాజీ భార్యే కిడ్నాప్ చేయించింది - అంబర్ పేట వ్యక్తి అపహరణ కేసులో ట్విస్ట్
Vizag Glass Bridge: వైజాగ్ గ్లాస్ బ్రిడ్జ్ ఓపెనింగ్ ఇంకెప్పుడు ? నిర్మాణం పూర్తయినా ఎదురుచూపులు ఎందుకు?
వైజాగ్ గ్లాస్ బ్రిడ్జ్ ఓపెనింగ్ ఇంకెప్పుడు ? నిర్మాణం పూర్తయినా ఎదురుచూపులు ఎందుకు?
Karnataka doctor Murder case: డాక్టర్ భార్యను చంపిన డాక్టర్ కేసులో సంచలనం - నీకోసమే మర్డర్ చేశానంటూ లవర్స్‌కు భర్త మెసెజులు
డాక్టర్ భార్యను చంపిన డాక్టర్ కేసులో సంచలనం - నీకోసమే మర్డర్ చేశానంటూ లవర్స్‌కు భర్త మెసెజులు
BRS MLAs Disqualification Case: ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై విచారణ షెడ్యూల్ విడుదల, ఈ 6 నుంచి విచారణ
ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై విచారణ షెడ్యూల్ విడుదల, ఈ 6 నుంచి విచారణ
Advertisement

వీడియోలు

New Champions in 2025 | కొత్త ఛాంపియన్స్‌‌ ఇయర్‌గా 2025
Kuldeep Yadav in India vs Australia T20 Series | టీ20 సిరీస్ నుంచి కుల్దీప్ అవుట్
Shree Charani in Women's ODI World Cup 2025 | విజృంభించిన ఆంధ్రా అమ్మాయి
South Africa Losing 4 World Cups in 2 Years | 4 ఐసీసీ ఫైనల్స్‌లో ఓటమి
Kavitha Janambata Interview | ఆదిలాబాద్ జిల్లాలో కవిత జనం బాట వెనుక మతలబు ఇదేనా.? | ABP Desam
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hyderabad Crime News: మాజీ భార్యే కిడ్నాప్ చేయించింది - అంబర్ పేట వ్యక్తి అపహరణ కేసులో ట్విస్ట్
మాజీ భార్యే కిడ్నాప్ చేయించింది - అంబర్ పేట వ్యక్తి అపహరణ కేసులో ట్విస్ట్
Vizag Glass Bridge: వైజాగ్ గ్లాస్ బ్రిడ్జ్ ఓపెనింగ్ ఇంకెప్పుడు ? నిర్మాణం పూర్తయినా ఎదురుచూపులు ఎందుకు?
వైజాగ్ గ్లాస్ బ్రిడ్జ్ ఓపెనింగ్ ఇంకెప్పుడు ? నిర్మాణం పూర్తయినా ఎదురుచూపులు ఎందుకు?
Karnataka doctor Murder case: డాక్టర్ భార్యను చంపిన డాక్టర్ కేసులో సంచలనం - నీకోసమే మర్డర్ చేశానంటూ లవర్స్‌కు భర్త మెసెజులు
డాక్టర్ భార్యను చంపిన డాక్టర్ కేసులో సంచలనం - నీకోసమే మర్డర్ చేశానంటూ లవర్స్‌కు భర్త మెసెజులు
BRS MLAs Disqualification Case: ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై విచారణ షెడ్యూల్ విడుదల, ఈ 6 నుంచి విచారణ
ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై విచారణ షెడ్యూల్ విడుదల, ఈ 6 నుంచి విచారణ
Constable Kanakam Series Season 2 : 'వేర్ ఈజ్ చంద్రిక?'... ఆన్సర్ రెడీ - 'కానిస్టేబుల్ కనకం' సిరీస్ సీజన్ 2 వచ్చేస్తోంది!
'వేర్ ఈజ్ చంద్రిక?'... ఆన్సర్ రెడీ - 'కానిస్టేబుల్ కనకం' సిరీస్ సీజన్ 2 వచ్చేస్తోంది!
Road Accidents in AP and Telangana: వణుకు పుట్టిస్తున్న వరుస రోడ్డు ప్రమాదాలు.. ఏపీ, తెలంగాణలో తాజాగా 4 చోట్ల యాక్సిడెంట్స్
వణుకు పుట్టిస్తున్న వరుస రోడ్డు ప్రమాదాలు.. ఏపీ, తెలంగాణలో తాజాగా 4 చోట్ల యాక్సిడెంట్స్
2025 Hyundai Venue కొత్త వెర్షన్‌లో ఏం మారింది? పాత వెన్యూతో పోలిస్తే ఎలాంటి తేడాలు కనిపిస్తాయి?
Hyundai Venue New vs Old: ఏ మోడల్‌ లుక్‌ బాగుంది?
Hyderabad Drugs Party: గచ్చిబౌలిలో మరో డ్రగ్ పార్టీ భగ్నం.. 12 మంది అరెస్ట్, మరోచోట డాక్టర్ల ఇంట్లో డ్రగ్స్ స్వాధీనం!
గచ్చిబౌలిలో మరో డ్రగ్ పార్టీ భగ్నం.. 12 మంది అరెస్ట్, మరోచోట డాక్టర్ల ఇంట్లో డ్రగ్స్ స్వాధీనం!
Embed widget