అన్వేషించండి

Breaking News Live Updates: ముగిసిన హుజూరాబాద్, బద్వేల్ ఉప ఎన్నికల ప్రచారం.. మూగబోయిన మైకులు..

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సహా దేశ వ్యాప్తంగా అక్టోబరు 27న జరిగే తాజా వార్తలు ఎప్పటికప్పుడు ఇక్కడ చూడొచ్చు. ఈ లైవ్ బ్లాగ్ అప్ డేట్ అవుతూ ఉంటుంది. తాజా సమాచారం కోసం ఈ పేజీని రీఫ్రెష్ చేస్తూ ఉండండి.

LIVE

Key Events
Breaking News Live Updates: ముగిసిన హుజూరాబాద్, బద్వేల్ ఉప ఎన్నికల ప్రచారం.. మూగబోయిన మైకులు..

Background

కడప జిల్లా బద్వేలు ఉపఎన్నిక ప్రచారానికి నేటితో తెర పడనుంది. నియోజకవర్గంలో రాజకీయం మరింత ఆసక్తికరంగా మారింది. 15 మంది అభ్యర్థులు బరిలో ఉన్నప్పటికీ వైసీపీ, బీజేపీ మధ్య పోటీ నెలకొంది. అధికార పార్టీ నుంచి డాక్టర్ సుధ, భాజపా నుంచి పనతల సురేష్.. పోటీలో ఉన్నారు. రెండు పార్టీలు మరింతమంది కీలకనేతలను రంగంలోకి దించాయి. వైకాపా అభ్యర్థి తరఫున మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, సురేష్, ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి, ఎమ్మెల్యే రోజా సభలు నిర్వహిస్తూ ఓట్ల వేటలో నిమగ్నమయ్యారు.

హుజురాబాద్ లో పార్టీలు గెలుపు కోసం ఒకరిపై ఒకరు ఎత్తులు వేసుకుంటూ కాక రేపుతున్నారు. ‘దళిత బంధు’పై ఈటల రాజేందర్ ఎన్నికల సంఘానికి రాసినట్లుగా ఓ లేఖ వైరల్‌గా మారింది. ‘హుజురాబాద్ ఉపఎన్నిక కోసం టీఆర్ఎస్ రూ. 700 కోట్లు ఖర్చు పెడుతోంది, వివిధ పథకాల పేరుతో రూ.వేల కోట్లు గుమ్మరిస్తోంది. అందువల్ల ‘దళిత బంధు’ ఇతర పథకాలు ఆపేలా ఆదేశాలివ్వండి’ అంటూ ఈ నెల 24వ తేదీన ఈసీకి ఈటల రాసినట్లుగా ఓ లేఖ సోషల్‌ మీడియాలో వైరల్ అవుతోంది.

ఈ లేఖపై బీజేపీ, ఈటల అనచరులు మండిపడుతున్నారు. టీఆర్ఎస్ నేతలే ఫేక్ లెటర్ సృష్టించి ఈటలపై తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ నేతలు తీవ్రంగా ఆరోపిస్తున్నారు.  కౌంటర్ గా  బీజేపీ కూడా అది ఫేక్ లెటర్ అంటూ మరో లేఖని, అందులో ఉన్న విషయాలను  పేర్కొంది. దీనికి సంబంధించి పూర్తి వివరాలను గమనిస్తే అందులో పేర్కొన్న పిన్ కోడ్ జగిత్యాల జిల్లాలోని ఒక మండలానికి చెందిందని అలాంటప్పుడు అది హైదరాబాద్ కి చెందిన అడ్రస్ ఎలా అవుతుందని సదరు వివరణలో బీజేపీ పేర్కొంది. అంతేకాకుండా ఆ లేఖపై ఎలాంటి అధికారిక ముద్ర లేకపోవడం కూడా అనుమానాలకు తావిస్తోందని బీజేపీ ఐటీ విభాగం పేర్కొంది.

టీడీపీ అధినేత చంద్రబాబుకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఫోన్..
టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఫోన్ చేశారు. ఏపీలో ప్రస్తుత పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. ముందుగా నిర్ణయించిన కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ మీటింగ్ ఉండడంతో కలవడం కుదరలేదని హోం శాఖ పేషీ అధికారులు చంద్రబాబు టీమ్‌కు సమాచారం అందించడంతో టీడీపీ అధినేత నిన్న సాయంత్రం ఢిల్లీ నుంచి తిరిగొచ్చేశారు. అయితే తాను జమ్మూకాశ్మీర్‌లో ఉండటంతో కలవటం కుదరలేదని చంద్రబాబుకు ఫోన్ కాల్ ద్వారా షా తెలిపినట్లు సమాచారం. ఏపీలో గంజాయి దందా, టీడీపీ కార్యాలయాలు, టీడీపీ నేతలపై జరిగిన దాడులను అమిత్ షాకు వివరించారు. 

19:10 PM (IST)  •  27 Oct 2021

ముగిసిన హుజూరాబాద్, బద్వేల్ ఉప ఎన్నికల ప్రచారం.. మూగబోయిన మైకులు

హజూరాబాద్, బద్వేల్ ఉప ఎన్నికల ప్రచారం బుధవారం రాత్రి 7 గంటలకు ముగిసింది. దాంతో మైకులు మూగబోయాయి. ప్రధాన పార్టీల ప్రచారం హోరాహోరీగా సాగింది. హుజూరాబాద్‌లో మొత్తం 30 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో ఉండగా, రెండు ఈవీఎంలు ఉపయోగిస్తున్నారు. ఒక దాంట్లో 16, మరో దాంట్లో 16 మంది అభ్యర్థులకు ఓటు వేయవచ్చు. ఈ నెల 30న హుజూరాబాద్ పోలింగ్ జరగనుండగా.. నవంబర్ 2న ఫలితాలు ప్రకటిస్తారు. బద్వేల్ ఎన్నికల బరిలో 15 మంది అభ్యర్థులు ఉన్నారు.

18:08 PM (IST)  •  27 Oct 2021

కామారెడ్డి జిల్లాలో ఫుడ్ పాయిజన్.. 50 మంది విద్యార్థులకు అస్వస్థత

కామారెడ్డి జిల్లా బిర్కూర్ మండల కేంద్రంలో ఫుడ్ పాయిజన్ కావడంతో 50 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. మండల కేంద్రంలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో బుధవారం మధ్యాహ్నం భోజనం తిన్న తరువాత విద్యార్థులు అస్వస్థతకు గురికావడంతో వారిని వెంటనే 108 అంబులెన్స్‌లో బాన్సువాడలోని ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి ఆసుపత్రికి వెళ్లి విద్యార్థులను పరామర్శించారు. విద్యార్థుల తల్లిదండ్రులతో మాట్లాడి ధైర్యం చెప్పారు. మెరుగైన వైద్యం అందేలా చూడాలని అధికారులను ఆదేశించారు.

16:08 PM (IST)  •  27 Oct 2021

ఆదిలాబాద్ ఉర్సు ఉత్సవాల్లో ఉద్రిక్తత.. ఇద్దరు మృతి, ముగ్గురి పరిస్థితి విషమం

ఇచ్చోడ మండలంలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఆదిలాబాద్ జిల్లా ఉర్సు ఉత్సవాల్లో గుండాలలో ఉద్రిక్తత తలెత్తింది. ఉర్సు డీజే విషయంలో గొడవ మొదలైనట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు ఇద్దరు చనిపోగా, మరో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. మొత్తం 10 మందికి గాయాలు కాగా, సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇద్దరు ఎస్పీలు, ముగ్గురు డీఎస్పీలు సహా 350 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు.

15:35 PM (IST)  •  27 Oct 2021

టీడీపీ అధినేత చంద్రబాబుకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఫోన్..

టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఫోన్ చేశారు. ఏపీలో ప్రస్తుత పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. ముందుగా నిర్ణయించిన కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ మీటింగ్ ఉండడంతో కలవడం కుదరలేదని హోం శాఖ పేషీ అధికారులు చంద్రబాబు టీమ్‌కు సమాచారం అందించడంతో టీడీపీ అధినేత నిన్న సాయంత్రం ఢిల్లీ నుంచి తిరిగొచ్చేశారు. అయితే తాను జమ్మూకాశ్మీర్‌లో ఉండటంతో కలవటం కుదరలేదని చంద్రబాబుకు ఫోన్ కాల్ ద్వారా షా తెలిపినట్లు సమాచారం. ఏపీలో గంజాయి దందా, టీడీపీ కార్యాలయాలు, టీడీపీ నేతలపై జరిగిన దాడులను అమిత్ షాకు వివరించారు. 

14:36 PM (IST)  •  27 Oct 2021

కాంగ్రెస్ అభ్యర్థి వెంకట్ అందర్నీ కలిశాడు.. ప్రజలు మా వెంటే ఉన్నారు: భట్టి విక్రమార్క

కాంగ్రెస్ అభ్యర్థి వెంకట్ ప్రతి గ్రామంలోని విద్యార్థులు, నిరుద్యోగ యువతీయువకులు, రైతులు, ఇలా అన్ని వర్గాల ప్రజలను ప్రత్యక్షంగా కలిశాడని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. కాంగ్రెస్ పార్టీ సైతం ప్రతి మండలానికి ఇన్ ఛార్జీలను తీసుకుని పెద్ద ఎత్తున పని చేశారని చెప్పారు. హుజూరాబాద్ నియోగజకవర్గంలోని ప్రజలంతా అభివృద్ధి గురించి ఆలోచిస్తున్నారని, కాంగ్రెస్ వెంట ప్రజలు ఉన్నారని భట్టి విక్రమార్క పేర్కొన్నారు.

13:15 PM (IST)  •  27 Oct 2021

మద్యం డిపోలో భారీ అగ్నిప్రమాదం

ఆదిలాబాద్ జిల్లాలో  మద్యం డిపోలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఉట్నూరు క్రాస్‌రోడ్‌లోని ఐఎంఎల్‌డీ మద్యం డిపోలో షార్ట్ సర్క్యూట్ అయింది. మద్యం డిపోలో మంటలు వేగంగా చుట్టుముట్టి భారీగా అగ్ని ప్రమాదం సంభవించింది. కోట్ల రూపాయల మేరకు ఆస్తినష్టం జరిగి ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు.

13:12 PM (IST)  •  27 Oct 2021

హుజూరాబాద్ లో కవర్ల కలకలం..రూ.6 వేల నుంచి రూ.10 వేల వరకు..!

హుజూరాబాద్​ ఉపఎన్నికల నేపథ్యంలో నియోజకవర్గంలో కవర్లు కలకలం రేపుతున్నాయి. కవర్లు అందుకున్న ఓటర్లు... కవర్లలో ఉన్న డబ్బు చూసి అవాక్కవుతున్నారు. రూ.6వేల నుంచి రూ.10 వేల వరకు కవర్లలో ఉన్నట్టు స్థానికులు చెబుతున్నారు.  నేటితో ప్రచార ఘట్టం ముగియనున్న నేపథ్యంలో... తెరమీదకు వచ్చిన కవర్ల పంపిణీ చర్చనీయాంశంగా మారింది.

Load More
New Update
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Hyderabad News: సంతానం కోసం గరుడ ప్రసాదం వితరణ - చిలుకూరు బాలాజీ ఆలయ మార్గంలో భారీగా ట్రాఫిక్ జాం
సంతానం కోసం గరుడ ప్రసాదం వితరణ - చిలుకూరు బాలాజీ ఆలయ మార్గంలో భారీగా ట్రాఫిక్ జాం
Heavy Temparatures: నిప్పుల గుండంలా తెలుగు రాష్ట్రాలు - ఈ జిల్లాల్లో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు
నిప్పుల గుండంలా తెలుగు రాష్ట్రాలు - ఈ జిల్లాల్లో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు
Lok Sabha Election 2024: తమిళనాడులో ఓటు హక్కు వినియోగించుకున్న సినీ, రాజకీయ ప్రముఖులు
Lok Sabha Election 2024: తమిళనాడులో ఓటు హక్కు వినియోగించుకున్న సినీ, రాజకీయ ప్రముఖులు
Lok Sabha Election 2024: ఇది కదా ప్రజాస్వామ్యం గొప్పదనం, వీళ్లే అసలు సిసలు సెలెబ్రిటీలు
Lok Sabha Election 2024: ఇది కదా ప్రజాస్వామ్యం గొప్పదనం, వీళ్లే అసలు సిసలు సెలెబ్రిటీలు
Advertisement
Advertisement
Advertisement
for smartphones
and tablets

వీడియోలు

Annamalai Reaction 1000Crores Google Pay | కోయంబత్తూరులో డీఎంకే వెయ్యికోట్లు పంచిందా..? | ABP DesamRohit Sharma on Impact Player | IPL 2024 లో ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ పై హిట్ మ్యాన్ గుస్సా | ABP DesamLoksabha Elections 2024 | Tamil Nadu సహా 21రాష్ట్రాల్లో మొదలైన పోలింగ్ పండుగ | ABP DesamPBKS vs MI Toss Coin in IPL 2024 | కెమెరా మెన్ ఫోకస్ కరో ఫోకస్ కరో అన్నట్లుగా ఐపీఎల్ లో టాస్ లైవ్ షో

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hyderabad News: సంతానం కోసం గరుడ ప్రసాదం వితరణ - చిలుకూరు బాలాజీ ఆలయ మార్గంలో భారీగా ట్రాఫిక్ జాం
సంతానం కోసం గరుడ ప్రసాదం వితరణ - చిలుకూరు బాలాజీ ఆలయ మార్గంలో భారీగా ట్రాఫిక్ జాం
Heavy Temparatures: నిప్పుల గుండంలా తెలుగు రాష్ట్రాలు - ఈ జిల్లాల్లో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు
నిప్పుల గుండంలా తెలుగు రాష్ట్రాలు - ఈ జిల్లాల్లో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు
Lok Sabha Election 2024: తమిళనాడులో ఓటు హక్కు వినియోగించుకున్న సినీ, రాజకీయ ప్రముఖులు
Lok Sabha Election 2024: తమిళనాడులో ఓటు హక్కు వినియోగించుకున్న సినీ, రాజకీయ ప్రముఖులు
Lok Sabha Election 2024: ఇది కదా ప్రజాస్వామ్యం గొప్పదనం, వీళ్లే అసలు సిసలు సెలెబ్రిటీలు
Lok Sabha Election 2024: ఇది కదా ప్రజాస్వామ్యం గొప్పదనం, వీళ్లే అసలు సిసలు సెలెబ్రిటీలు
Tillu Square OTT: ఓటీటీలో పాన్‌ ఇండియాగా వస్తున్న 'టిల్లు స్క్వేర్‌' - రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌, ఆ రోజు నుంచే స్ట్రీమింగ్‌!
ఓటీటీలో పాన్‌ ఇండియాగా వస్తున్న 'టిల్లు స్క్వేర్‌' - రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌, ఆ రోజు నుంచే స్ట్రీమింగ్‌!
Mahesh Babu SSMB29: క్రేజీ అప్‌డేట్‌, దుబాయ్‌ నుంచి వచ్చేసిన మహేష్‌, రాజమౌళి - ఇక షూటింగ్‌ అప్‌డేటేనా?
క్రేజీ అప్‌డేట్‌, దుబాయ్‌ నుంచి వచ్చేసిన మహేష్‌, రాజమౌళి - ఇక షూటింగ్‌ అప్‌డేటేనా?
Eesha Rebba Birthday : ఈ తెలుగు అందానికి ముప్పై నాలుగు ఏళ్లు.. ఈషా రెబ్బా బర్త్​డే స్పెషల్ ఫోటోలు చూశారా?
ఈ తెలుగు అందానికి ముప్పై నాలుగు ఏళ్లు.. ఈషా రెబ్బా బర్త్​డే స్పెషల్ ఫోటోలు చూశారా?
Tariff: జూన్‌ నుంచి ఫోన్‌లో మాట్లాడాలంటే వణికి పోవాల్సిందే! ఎన్నికల తర్వాత పడే మొదటి ఎఫెక్ట్ ఇదే!
జూన్‌ నుంచి ఫోన్‌లో మాట్లాడాలంటే వణికి పోవాల్సిందే! ఎన్నికల తర్వాత పడే మొదటి ఎఫెక్ట్ ఇదే!
Embed widget