Breaking News Live Updates: బాణసంచా తయారీ కేంద్రంలో అగ్నిప్రమాదం.. ఐదుగురు సజీవదహనం
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సహా దేశ వ్యాప్తంగా అక్టోబరు 26న జరిగే తాజా వార్తలు ఎప్పటికప్పుడు ఇక్కడ చూడొచ్చు. ఈ లైవ్ బ్లాగ్ అప్ డేట్ అవుతూ ఉంటుంది. తాజా సమాచారం కోసం ఈ పేజీని రీఫ్రెష్ చేస్తూ ఉండండి.

Background
దిల్లీలో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. ఓల్డ్ సీమాపురిలో మూడంతస్తుల భవనం పై ఫ్లోర్లో మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో నలుగురు సజీవదహనమయ్యారు. మృతులను హౌరీ లాల్, రీనా, అషు, రాధికగా గుర్తించారు. ఘటనపై సమాచారం అందుకున్న అగ్నిమాపక దళాలు.. హుటాహుటిన తరలి వచ్చి.. మంటలను ఆర్పేశాయి.
బాణసంచా తయారీ కేంద్రంలో అగ్నిప్రమాదం.. ఐదుగురు సజీవదహనం
బాణసంచా తయారీ కేంద్రంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. తమిళనాడులోని కళ్లకురిచిలోని శంకరాపురం బాణసంచా కేంద్రంలో జరిగిన ఈ ప్రమాదంలో నలుగురు సజీవదహనం కాగా, మరో 10 మంది వరకు కార్మికులు మంటల్లో చిక్కుకున్నట్లు సమాచారం. ఫైర్ ఇంజన్లు ఘటనా స్థలానికి చేరుకుని మంటల్ని ఆర్పే ప్రయత్నం చేస్తున్నాయి.
కర్నూలులో రూ.3 లక్షల విలువైన తెలంగాణ మద్యం పట్టివేత
వినూత్న రీతిలో అక్రమంగా మద్యం తరలిస్తున్న ఓ వాహనాన్ని కర్నూలు సెబ్ టాస్క్ ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. తెలంగాణ నుంచి ఏపీకి తరలిస్తున్న రూ.3 లక్షల విలువైన తెలంగాణ మద్యాన్ని తరలిస్తున్న వాహనాన్ని సీజ్ చేసినట్లు కర్నూలు సెబ్ అధికారి భరత్ నాయక్ తెలిపారు. కర్నూలు ఆర్టీవో చెక్ పోస్ట్ వద్ద దాడుల్లో రూ.3 లక్షల విలువ చేసే 732 మద్యం బాటిల్స్ పట్టుకున్నామన్నారు. తెలంగాణ నుంచి ఏపీకి అక్రమంగా తరలిస్తున్న ఓ వ్యక్తి అరెస్టు చేసి వాహనాలను సీజ్ చేశారు. అక్రమ మద్యం రవాణా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని సెబ్ అధికారి భరత్ హెచ్చరించారు.





















