అన్వేషించండి

Breaking News Live Telugu Updates:  పాడేరు ఘాట్ రోడ్డులో ప్రమాదం,15 మందికి గాయాలు

ఏపీ, తెలంగాణ సహా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నేటి బ్రేకింగ్ న్యూస్ అప్‌డేట్స్ ఇక్కడ పొందొచ్చు. ఈ లైవ్ బ్లాగ్ అప్ డేట్ అవుతుంటుంది. తాజా సమాచారం కోసం రీఫ్రెష్ చేస్తుండండి.

LIVE

Key Events
Breaking News Live Telugu Updates:  పాడేరు ఘాట్ రోడ్డులో ప్రమాదం,15 మందికి గాయాలు

Background

నైరుతి రుతుపవనాల ప్రభావంతో ఆదివారం ఏపీ, తెలంగాణలో పలు జిల్లాల్లో వర్షాలు కురిశాయి. కొన్ని చోట్ల తేలికపాటి జల్లులు కురవగా, మరికొన్ని చోట్ల ఓ మోస్తరు వర్షాలు పడ్డాయి. అల్పపీడన ద్రోణి సముద్ర మట్టంపై 3.1 కిలోమీటర్లు మరియు 5.8 కిలోమీటర్ల మధ్య ఉన్నదని భారత వాతావరణ కేంద్రం పేర్కొంది. నేటి నుంచి నాలుగు రోజులపాటు ఏపీలోని కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో వర్షాలు కురవనున్నాయి. రెండు రోజులపాటు తెలంగాణలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే ఛాన్స్ ఉంది. ఏపీలోని శ్రీకాకుళం, విజయనగరం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు, పార్వతీపురంమన్యం జిల్లాల్లో పలుచోట్ల పిడుగులు పడే అవకాశం ఉందని ఏపీ విపత్తల నిర్వహణ సంస్థ ఇటీవల హెచ్చరించింది. వర్షాల నేపథ్యంలో వాతావరణ శాఖ ఏపీ, తెలంగాణలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.

ఉత్తర కోస్తాంధ్ర, యానాంలో ఇలా..
ఉత్తర కోస్తాంధ్రయ యానాంలలో ప్రస్తుతం ఆకాశం మేఘావృతమై ఉంది. ఏపీలో నేటి నుంచి నాలుగు రోజులపాటు ఓ మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు అనేక కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. ఉభయ గోదావరి జిల్లాల్లో పీడనం బలపడి, కాకినాడ జిల్లాలోని తుని వైపు భారీగా వర్షాలు కురుస్తున్నాయి. విశాఖ నగరంలో, అనకాపల్లి, నర్సీపట్నంలోనూ వర్షాలు కురిసే అవకాశాలున్నాయి. ముఖ్యంగా పిడుగులు పడే అవకాశం ఉత్తర కోస్తాంధ్ర జిల్లాలకు అధికంగా ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. రేపు, ఎల్లుండి సైతం తెలికపాటి నుంచి ఓ మోస్తరు వర్ష సూచన ఉంది. కొన్నిచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడతాయని హెచ్చరించారు.

దక్షిణ కోస్తా, రాయలసీమలో ఇలా..
దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతానికి వర్ష సూచన సాధారణంగా ఉంది. ఉత్తర కోస్తాంధ్ర తరహాలో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు కురవవు. నేటి నుంచి నాలుగు రోజులపాటు నుంచి ఓ మోస్తరు వర్షాలు కురవనున్నాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. బాపట్ల​, గుంటూరు జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. మరోవైపున విజయవాడ, దివిసీమ, బందరు ప్రాంతాలకు వర్ష సూచన ఉంది. ఒకట్రెండు చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని అంచనా వేశారు. పల్నాడు, ప్రకాశం జిల్లాలో తేలికపాటి జల్లులు పడే ఛాన్స్ ఉంది. నంద్యాల​, కర్నూలు, కడప జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని అధికారులు పేర్కొన్నారు. కొన్ని జిల్లాల్లో నేటికి వర్షాలు మొదలుకాలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పొలం పనులు ఎప్పుడు మొదలుపెట్టాలే అర్థం కాని పరిస్థితి ఆ జిల్లాల రైతుల్లో నెలకొంది.

హెచ్చరిక: వర్షాలతో రైతుల పంట, ధాన్యానికి నష్టం జరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అన్నదాతలను హెచ్చరించింది. భారీ వర్షం కురుస్తున్న సమయంలో ఇళ్ల నుంచి బయటకు రావొద్దని ప్రజలకు హెచ్చరించారు. వర్షపు నీళ్లు నిలిచిపోయే చోట ఉండకూడదు. వైర్లు, విద్యుత్ స్తంభాలకు దూరంగా ఉండాలని సూచించారు. అరటి తోటలకు నష్టం కలిగే అవకాశం ఉందని పేర్కొన్నారు. చెట్ల కింద నిల్చోకుండా సురక్షిత మైన చోట ఉండాలని ప్రజలను హెచ్చరించారు.

తెలంగాణలో వర్షాలు
రాష్ట్రంలో జూన్ 28 వరకు వర్షాలు కురవనున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ఇటీవల ప్రకటించింది. ముఖ్యంగా ఆదిలాబాద్, కొమరం భీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాలలో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. కొన్ని జిల్లాలలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడతాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. వర్షాల నేపథ్యంలో వాతావరణ కేంద్రం ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కొన్ని చోట్ల పడతాయని పేర్కొంది. నేటి ఉదయం సిరిసిల్ల, కరీంనగర్, జగిత్యాల, పెద్దపల్లి, వరంగల్ అర్బన్, వరంగల్ రూరల్, కొత్తగూడెం, ఖమ్మం, సిద్దిపేట, మెదక్, సంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లో పలు చోట్ల ఓ మోస్తరు వర్షాలు కురవనున్నాయని వాతావరణ శాఖ తెలిపింది.

20:07 PM (IST)  •  27 Jun 2022

 పాడేరు ఘాట్ రోడ్డులో ప్రమాదం,15 మందికి గాయాలు

అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు ఘాట్ రోడ్డులో ప్రమాదం జరిగింది. 12వ మైలురాయి సమీపంలో సోమవారం బొలేరో వాహనం అదుపుతప్పి లోయలో బోల్తాపడింది. ఈ ఘటనలో పెదబయలు మండలం అరడకోట పంచాయతీ చుట్టుమెట్ట, కాగువలస గ్రామస్తులు 15 మంది గాయపడగా ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. వారిని పాడేరు జిల్లా ఆసుపత్రికి తరలించి వైద్యసేవలు అందిస్తున్నారు. విశాఖపట్నం ఆర్కే బీచ్ వద్ద జరగనున్న బీఎస్పీ ఉత్తరాంధ్ర బహుజన చైతన్య సభకు వెళుతుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది.

17:16 PM (IST)  •  27 Jun 2022

విజయవాడలోని ఓ ప్రైవేట్ కాలేజీలో స్వల్ప అగ్ని ప్రమాదం 

విజయవాడ బందర్ రోడ్ లోని ప్రైవేట్ కాలేజీ స్టోర్ రూంలో షార్ట్ సర్క్యూట్ వల్ల స్వల్ప అగ్నిప్రమాదం జరిగింది. అగ్నిమాపక సిబ్బందికి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. సమాచారం అందుకున్న డీసీపీ విశాల్ గున్ని, పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. విద్యార్థులను సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు పోలీసులు. పోలీస్, ఫైర్ అధికారుల తక్షణ స్పందనతో పెను ప్రమాదం తప్పింది. 

17:16 PM (IST)  •  27 Jun 2022

విజయవాడలోని ఓ ప్రైవేట్ కాలేజీలో స్వల్ప అగ్ని ప్రమాదం 

విజయవాడ బందర్ రోడ్ లోని ప్రైవేట్ కాలేజీ స్టోర్ రూంలో షార్ట్ సర్క్యూట్ వల్ల స్వల్ప అగ్నిప్రమాదం జరిగింది. అగ్నిమాపక సిబ్బందికి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. సమాచారం అందుకున్న డీసీపీ విశాల్ గున్ని, పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. విద్యార్థులను సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు పోలీసులు. పోలీస్, ఫైర్ అధికారుల తక్షణ స్పందనతో పెను ప్రమాదం తప్పింది. 

15:45 PM (IST)  •  27 Jun 2022

మహారాష్ట్ర డిప్యూటీ స్పీకర్ నోటీసులపై సుప్రీంకోర్టు తాత్కాలిక స్టే  

ఏక్నాథ్ షిండేతో పాటు మరో 15 మంది శివసేన తిరుగుబాటు ఎమ్మెల్యేలపై డిప్యూటీ స్పీకర్ నరహరి జిర్వాల్ జారీ చేసిన అనర్హత నోటీసులపై సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది. తిరుగుబాటు ఎమ్మెల్యేలు దాఖలు చేసిన పిటిషన్లపై సుప్రీంకోర్టు విచారణ చేసింది. డిప్యూటీ స్పీకర్, మహారాష్ట్ర శాసనసభ కార్యదర్శి, కేంద్ర ప్రభుత్వం, ఇతరులకు సుప్రీంకోర్టు నోటీసులు  జారీ చేసింది. ఏక్‌నాథ్ షిండే, తిరుగుబాటు ఎమ్మెల్యేలకు డిప్యూటీ స్పీకర్ జారీ చేసిన అనర్హత నోటీసుపై జులై 11, సాయంత్రం 5.30 గంటలలోపు సమాధానమిచ్చేందుకు సుప్రీంకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. డిప్యూ్టీ స్పీకర్ నోటీసులపై తాత్కాలికంగా స్టే ఇచ్చింది సుప్రీంకోర్టు. 

13:15 PM (IST)  •  27 Jun 2022

Karimnagar: అగ్నిపథ్‌ కు వ్యతిరేకంగా కరీంనగర్ లో సత్యాగ్రహ దీక్ష

  • అగ్నిపథ్ ని రద్దు చేయాలని కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కరీంనగర్ లోని గీతాభవన్ చౌరస్తా వద్ద సత్యగ్రహ దీక్ష
  • హాజరైన మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్, కాంగ్రెస్ శ్రేణులు
  • ప్రధాని‌ మోదీ సైనిక వ్యవస్థను ప్రైవేటు పరం చేస్తున్నారంటూ ఆగ్రహం,
  • వ్యవస్థను నిర్వీర్యం చెయ్యాలని అగ్నిపథ్ తీసుకువచ్చారు - పొన్నం
  • అగ్నిపథ్ ని రద్దు చెయ్యాలని‌ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సత్యగ్రహ దీక్ష చేస్తున్నాం
  • వెంటనే అగ్నిపథ్ ని రద్దు చెయ్యాలి - పొన్నం
  • హైదరాబాద్ పర్యటనకి వచ్చే ప్రధాని మోదీకి శాంతియుతంగా నిరసన తెలియజేస్తాం - పొన్నం
12:54 PM (IST)  •  27 Jun 2022

Police Vehicle Overturned: యాదాద్రి జిల్లాలో పోలీసు వాహనం బోల్తా.. 8మందికి గాయాలు

పోలీసుల వాహనం బోల్తా పడటంతో ఎనిమిది మంది గాయపడ్డారు. ఈ ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ మండలం కొండమడుగు మెట్టు సమీపంలోని సోమవారం జరిగింది. హైదరాబాద్‌లోని తెలంగాణ పోలీస్ ట్రైనింగ్ సెంటర్ నుంచి పోలీసు వాహనం వరంగల్‌కు బయలుదేరగా.. ఎయిమ్స్ వద్ద జాతీయ రహదారిపై బీబీనగర్ వద్దకు రాగానే ముందు వెళ్తున్న వాహనాన్ని ఓవర్‌టేక్‌ చేయబోయి అదుపు తప్పి బోల్తా పడింది. ప్రమాద సమయంలో వాహనంలో 8 మంది ఉన్నారు.  బీబీనగర్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలిస్తున్నారు.

12:07 PM (IST)  •  27 Jun 2022

YS Jagan Srikakulam Tour: సీఎం జగన్ పర్యటనతో శ్రీకాకుళం జిల్లాలో ప్రయాణికులకు ఇబ్బందులు

ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పర్యటనతో శ్రీకాకుళం జిల్లాలో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇతర ప్రాంతాల నుంచి శ్రీకాకుళం వచ్చిన వారికి శ్రీకాకుళం ఔట్ కట్స్ లో బస్సులు నిలిపివేయడంతో నాలుగు కిలోమీటర్లు నడుచుకొని చేరుకోవడం చాలా ఇబ్బందిగా ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పట్నంలో ఇలాంటి బహిరంగసభలు పెట్టేటప్పుడు మాలాంటి ప్రయాణికులను ఇంత ఇబ్బంది పెట్టడం సరైనది కాదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎక్కడికక్కడ పోలీసులు బారికేడ్లు పెట్టడంతో వాహనాలకు అనుమతి లేకపోవడంతో లగేజ్ లు మోసుకుంటూ నడుచుకుని వెళ్లడం చాలా కష్టంగా ఉంది శ్రీకాకుళంలో ట్రాఫిక్ ఆంక్షలు పెట్టినప్పటికీ.. పట్నం చిన్నది కావడంతో ఇరుకు రోడ్ల వల్ల లోపలకి వాహనాలు అనుమతించడం కష్టమవుతుందని పోలీసులు చెబుతున్నారు. వికలాంగులు సైతం పోలీస్ చెక్ పోస్ట్ వద్ద ఉండిపోతున్నారు.

11:23 AM (IST)  •  27 Jun 2022

Killi Krupa Rani: కేంద్ర మాజీ మంత్రి కిల్లి కృపారాణికి ఘోర పరాభవం

 కేంద్ర మాజీ మంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షురాలు కిల్లి కృపారాణికి ఘోర పరాభవం..
అవమానం భరించలేనంటూ ఆవేదన వ్యక్తం చేసిన కిల్లి కృపారాణి
 కృష్ణదాస్ బ్రతిమిలాడిన నేను రాను అంటూ భీష్మించుకుని  కూర్చున్న కృపారాణి
ప్రోటోకాల్ లో తన పేరు ఉన్నప్పటికీ నన్ను రానివ్వకుండా కావాలనే చేశారంటూ ఆవేదన
పార్టీ కోసం కష్టపడుతుంటే కనీసం విలువ ఇవ్వలేదు
శ్రీకాకుళం జిల్లాలో సీఎం టూర్ కార్యక్రమంలో ప్రోటోకాల్ వెహికల్ పెట్టకపోవడంతో వైదోలిగిన కేంద్ర మాజీ మంత్రి కృపారాణి

10:41 AM (IST)  •  27 Jun 2022

Konark Express: కోణార్క్ ఎక్స్‌ప్రెస్ రైలులో మంటలు

ముంబయి నుంచి భువనేశ్వర్ కు వెళ్తున్న కోణార్క్ ఎక్స్ ప్రెస్ రైలులో మంటలు చెలరేగాయి. ఏసీ బోగీల్లోంచి పొగలు రావడంతో రైలును డోర్నకల్ స్టేషన్ లో నిలిపివేశారు. అక్కడ రైల్వే సిబ్బంది వెంటనే అక్కడికి చేరుకొని మరమ్మతులు ప్రారంభించారు. సదరు పొగలు వచ్చిన బోగీని తప్పించి, మిగతా రైలుకు అనుమతించారు. ఈ ఘటన ఎలా జరిగిందన్న అంశంపై రైల్వే అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.

09:55 AM (IST)  •  27 Jun 2022

Musi River: మూసీ ప్రాజెక్టు 3 గేట్లు ఎత్తివేత

నల్గొండ జిల్లాలో మూసీ ప్రాజెక్టు నిండుకుండలా మారింది. హైదరాబాద్‌లో కురుస్తున్న వర్షాలకు ప్రాజెక్టు నిండింది. దీంతో మూసీ ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టానికి చేరువైంది సోమవారం ఉదయం 6 గంటలకు అధికారులు ప్రాజెక్టు 3, 7, 10వ నంబర్ గేట్లను ఎత్తారు. ప్రస్తుతం ప్రాజెక్టులోకి 1242.79 క్యూసెక్కుల నీరు వస్తుండగా, 1999.74క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 645 అడుగులు కాగా ప్రస్తుతం 644.61 అడుగుల వద్ద నీటిమట్టం దగ్గర ఉంది. నిల్వ సామర్థ్యం 4.46 టీఎంసీలు. ఇప్పుడు 4.36 టీఎంసీల నీరు నిల్వ ఉంది. మూసీ ప్రాజెక్టు గేట్లు ఎత్తడంతో ప్రజలు చూడడానికి వస్తున్నారు. ప్రాజెక్టు పరిధిలోని రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Load More
New Update
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Narayanpet News: బిడ్డ సమాధి వద్దే పడుకున్న తండ్రి - కన్నీళ్లు పెట్టించే ఘటన, ఎక్కడంటే?
బిడ్డ సమాధి వద్దే పడుకున్న తండ్రి - కన్నీళ్లు పెట్టించే ఘటన, ఎక్కడంటే?
CM Jagan : చంద్రబాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కి పోతాం - నంద్యాల సభలో ఏపీ ప్రజలకు జగన్ విజ్ఞప్తి !
చంద్రబాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కి పోతాం - నంద్యాల సభలో ఏపీ ప్రజలకు జగన్ విజ్ఞప్తి !
YouTube Videos Delete: ఇండియన్ యూట్యూబర్లకు గూగుల్ షాక్ - ఏకంగా 22 లక్షల వీడియోలు డిలీట్!
ఇండియన్ యూట్యూబర్లకు గూగుల్ షాక్ - ఏకంగా 22 లక్షల వీడియోలు డిలీట్!
TSGENCO Exams: జెన్‌కోలో ఏఈ, కెమిస్ట్‌ నియామక పరీక్షలు వాయిదా - కొత్త షెడ్యూలు ఎప్పుడంటే?
జెన్‌కోలో ఏఈ, కెమిస్ట్‌ నియామక పరీక్షలు వాయిదా - కొత్త షెడ్యూలు ఎప్పుడంటే?
Advertisement
Advertisement
Advertisement
for smartphones
and tablets

వీడియోలు

RR vs DC Match Highlights IPL 2024: ఆఖరి ఓవర్ లో అదరగొట్టిన ఆవేశ్, దిల్లీపై రాజస్థాన్ విజయంYS Jagan vs Sunitha | YS Viveka Case: ప్రొద్దుటూరు సభలో జగన్ కామెంట్స్ కు వివేకా కుమార్తె కౌంటర్Karimnagar Young Voters Opinion Poll Elections: కరీంనగర్ యువ ఓటర్లు ఏమంటున్నారు? వారి ఓటు ఎవరికి..?YSRCP Varaprasad | Pathapatnam: వైసీపీ ఎమ్మెల్యే రెడ్డి శాంతిపై రెబెల్ తులసీ వరప్రసాద్ ఫైర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Narayanpet News: బిడ్డ సమాధి వద్దే పడుకున్న తండ్రి - కన్నీళ్లు పెట్టించే ఘటన, ఎక్కడంటే?
బిడ్డ సమాధి వద్దే పడుకున్న తండ్రి - కన్నీళ్లు పెట్టించే ఘటన, ఎక్కడంటే?
CM Jagan : చంద్రబాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కి పోతాం - నంద్యాల సభలో ఏపీ ప్రజలకు జగన్ విజ్ఞప్తి !
చంద్రబాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కి పోతాం - నంద్యాల సభలో ఏపీ ప్రజలకు జగన్ విజ్ఞప్తి !
YouTube Videos Delete: ఇండియన్ యూట్యూబర్లకు గూగుల్ షాక్ - ఏకంగా 22 లక్షల వీడియోలు డిలీట్!
ఇండియన్ యూట్యూబర్లకు గూగుల్ షాక్ - ఏకంగా 22 లక్షల వీడియోలు డిలీట్!
TSGENCO Exams: జెన్‌కోలో ఏఈ, కెమిస్ట్‌ నియామక పరీక్షలు వాయిదా - కొత్త షెడ్యూలు ఎప్పుడంటే?
జెన్‌కోలో ఏఈ, కెమిస్ట్‌ నియామక పరీక్షలు వాయిదా - కొత్త షెడ్యూలు ఎప్పుడంటే?
BRS Mews : సైలెంట్‌గా పార్టీ మారిపోక కేసీఆర్‌కు చెప్పేందుకు వెళ్లిన కేకే - అప్పుడేమయిందంటే ?
సైలెంట్‌గా పార్టీ మారిపోక కేసీఆర్‌కు చెప్పేందుకు వెళ్లిన కేకే - అప్పుడేమయిందంటే ?
Suriya 44 Update: క్రేజీ అప్‌డేట్‌ - అప్పుడే మరో స్టార్‌ డైరెక్టర్‌ని లైన్లో పెట్టిన సూర్య, ‌ఆసక్తి పెంచుతున్న పోస్టర్‌‌
క్రేజీ అప్‌డేట్‌ - అప్పుడే మరో స్టార్‌ డైరెక్టర్‌ని లైన్లో పెట్టిన సూర్య, ‌ఆసక్తి పెంచుతున్న పోస్టర్‌‌
Inter Summer Holidays: ఇంటర్ కాలేజీలకు మార్చి 30 నుంచి వేసవి సెలవులు - కళాశాలల రీఓపెనింగ్ ఎప్పుడంటే?
ఇంటర్ కాలేజీలకు మార్చి 30 నుంచి వేసవి సెలవులు - కళాశాలల రీఓపెనింగ్ ఎప్పుడంటే?
Sivaji Raja: పవన్ కళ్యాణ్ నా ఆఫీస్‌కు వచ్చి గొడవ చేశాడు, అడిగే స్టేజ్ దాటిపోయింది - శివాజీ రాజా
పవన్ కళ్యాణ్ నా ఆఫీస్‌కు వచ్చి గొడవ చేశాడు, అడిగే స్టేజ్ దాటిపోయింది - శివాజీ రాజా
Embed widget