అన్వేషించండి

Breaking News Live Telugu Updates: మేడిగడ్డ బ్యారేజ్ లో మహారాష్ట్ర వాసి గల్లంతు 

ఏపీ, తెలంగాణ సహా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నేటి బ్రేకింగ్ న్యూస్ అప్‌డేట్స్ ఇక్కడ పొందొచ్చు. ఈ లైవ్ బ్లాగ్ అప్ డేట్ అవుతుంటుంది. తాజా సమాచారం కోసం రీఫ్రెష్ చేస్తుండండి.

LIVE

Key Events
Breaking News Live Telugu Updates: మేడిగడ్డ బ్యారేజ్ లో మహారాష్ట్ర వాసి గల్లంతు 

Background

రానున్న 48 గంటల్లో ఉత్తర అండమాన్‌కు ఆనుకొని తుపాను ఏర్పడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. రేపటికల్లా దీనిపై క్లారిటీ వస్తుందని పేర్కొంది. మరోవైపు నిన్నటి వరకు కొనసాగిన అల్పపీడనం పూర్తిగా బలహీన పడింది. దీని ప్రభావంతో రాయలసీమ, దక్షిణ కోస్తా ప్రాంతంలో వర్షాలు పడొచ్చని అంచనా వేస్తోంది. తమిళనాడులో కూడా వానలు పడొచ్చని తెలిపింది వాతావరణ శాఖ. దక్షిణ ఆంధ్రప్రదేశ్-ఉత్తర తమిళనాడు తీరాలకు ఆనుకుని నైరుతి బంగాళాఖాతం మీదుగా ఏర్పడిన అల్పపీడనం ఇప్పుడు దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ దానికి ఆనుకొని ఉన్న పొరుగు ప్రాంతాలపై ఉంది. బుధవారం వివిధ ప్రాంతాల్లో నమోదైన ఉష్ణోగ్రతల వివరాలు ఇలా ఉన్నాయి. కోస్తా ఆంధ్రప్రదేశ్: తడ (నెల్లూరుజిల్లా) 9సెం.మీ.: సూళ్లూరుపేట (నెల్లూరు జిల్లా ) 9సెం.మీ.; రాయలసీమ: సత్యవేడు (చిత్తూరు జిల్లా) 9సెం.మీ. అల్పపీడన ప్రభావంతో మధ్య భారతదేశంలోని అనేక ప్రాంతాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2-4゚C కంటే తక్కువగా నమోదు కానున్నాయి. రాబోయే 5 రోజుల్లో ఒడిశాలో కనిష్ట ఉష్ణోగ్రతలు 3-5⁰ C తగ్గే అవకాశం ఉంది. 

తెలంగాణలో వాతావరణం

తెలంగాణలో వాతావరణం పొడిగా ఉంటుంది. ఆకాశం మేఘావృతమై ఉంమటుంది. హైదరాబాద్‌లో పొగమంచు కురిసే అవకాశం ఉంది. గరిష్ట, కనిష్ట ఉష్ణోగ్రతలు వరుసగా 30 డిగ్రీలు, 21 డిగ్రీల మధ్య ఉండే ఛాన్స్ఉంది. ఈశాన్య దిశ నుంచి గాలులు, గంటకు నాలుగు నుంచి ఎనిమిది కిలోమీటర్ల వేగంతో వీయొచ్చు. తెలంగాణలోని దక్షిణ జిల్లాల్లో ఉరుములతో కూడిన తేలికపాటి  వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది. నవంబర్‌ 24, 25, 26 తేదీల్లో ఈ పరిస్థితి కనిపిస్తుందని అధికారులు ప్రకటించారు. 

మల్లారెడ్డి ఇంట్లో ఐటీ దాడులు

 మంత్రి మల్లారెడ్డి ఇంటిపై ఐటీ దాడులు జరుగుతున్న విషయం అందరికీ తెలిసిందే. అయితే ఇదే విషయమై మంత్రి మల్లారెడ్డి, ఐటీ అధికారులు ఒకరిపై ఒకరు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదులు చేసుకున్నారు. అయితే తమ అధికారిని మంత్రి బంధించారని ఐటీ అధికారులు ఫిర్యాదు చేశారు. అలాగే తాము సేకరించిన డాక్యుమెంట్లను మంత్రి మల్లారెడ్డి చించి పడేశారని, తమ ల్యాప్ టాప్ ను కూడా బలవంతంగా లాక్కున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఐటీ అధికారులు తమపై దాడి చేసి బలవంతంగా తప్పుడు లెక్కలతో తమ సంతకం తీసుకున్నారని మల్లారెడ్డి ఫిర్యాదు చేశారు. తన కుమారుడిని కూడా కొట్టినట్లు చెబుతున్నారు. ఐటీ శాఖ అధికారులు చేసిన ఫిర్యాదును దుండిగల్ పోలీస్ స్టేషన్ కు అధికారులు ట్రాన్స్ ఫర్ చేశారు. మరోవైపు మల్లారెడ్డికి చెందిన ఆఫీస్‌లు, ఇళ్లలు, బంధువులు, రక్తసంబంధీకుల ఇళ్లు, ఆఫీసుల్లో తనిఖీలు ముగిశాయి. తనిఖీల్లో దొరికిన నగదు, ఇతర ఆస్తులపై వివరణ ఇచ్చేందుకు ఐటీ కార్యాలయానికి రావాలని పిలుపునిచ్చింది. మంత్రి మల్లారెడ్డితోపాటు ఇద్దరు కుమారులు, అల్లుడు రాజశేఖర్ రెడ్డి, వియ్యంకుడు లక్ష్మా రెడ్డికి ఐటీ శాఖ నోటీసులు అందజేసింది. సోమవారం ఐటీ కార్యాలయం ముందు విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో తెలిపింది.

21:09 PM (IST)  •  24 Nov 2022

Warangal: క్షణికావేశంలో కుటుంబం ఆత్మహత్యాయత్నం, భార్యభర్తలు మృతి

వరంగల్ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. క్షణికావేశంలో ఓ కుటుంబం ఆత్మహత్యకు యత్నించింది. ఈ ఘటనలో భార్యభర్తలు మృతి చెందగా.. కొడుకు పరిస్థితి విషమంగా ఉంది. వరంగల్ నగరంలోని గిర్మాజిపేట్ బొడ్రాయికి చెందిన నవధాన్ (33), స్రవంతి (28) భార్యాభర్తలు. వీరికి ఇద్దరు కొడుకులు. నవధన్ గోల్డ్ స్మిత్‌గా పనిచేస్తున్నాడు. కుటుంబ కలహాల కారణంగా గురువారం భార్యాభర్తలు నవధాన్, స్రవంతి, పెద్ద కొడుకు విషం తాగారు. దీంతో నవధాన్, స్రవంతి మృతి చెందగా.. పెద్ద కొడుకు పరిస్థితి విషమంగా ఉంది. వెంటనే అతడిని వరంగల్ ఎంజీఎం‌కు తరలించారు.

19:43 PM (IST)  •  24 Nov 2022

Anakapally District: అనకాపల్లి జిల్లాలో తప్పిన పెను ప్రమాదం

అనకాపల్లి జిల్లా నక్కపల్లి వద్ద 16వ నెంబర్ జాతీయ రహదారిపై స్కూల్ బస్సును లారీ వెనక నుంచి ఢీకొన్న ప్రమాద సమయంలో బస్సులో 60 మంది చిన్నారులు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. బ్రేక్ ఫైల్ అవ్వటం వల్లనే ప్రమాదం జరిగినట్లుగా పోలీసులు ప్రాథమిక అంచనా వేస్తున్నారు.

18:05 PM (IST)  •  24 Nov 2022

Telangana Assembly: డిసెంబరులో తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు, ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని మంత్రులకు సీఎం ఆదేశాలు

అభ్యుదయ పథంలో నడుస్తున్న తెలంగాణ రాష్ట్రంపై కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం విధిస్తున్న అనవసర ఆంక్షల వల్ల 2022 -23 ఆర్థిక సంవత్సరానికి తెలంగాణకు సమకూరవలసిన ఆదాయంలో 40 వేల కోట్ల రూపాయలకు పైగా తగ్గుదల చోటుచేసుకున్నది. ఇటువంటి చర్యలతో తెలంగాణ అభివృద్ధిని ముందుకు సాగకుండా కేంద్రం అడ్డుకట్ట వేస్తున్నది. ఈ విషయాన్ని రాష్ట్ర ప్రజలకు సవివరంగా తెలియజేసేందుకు డిసెంబర్ నెలలో వారం రోజుల పాటు శాసనసభ సమావేశాలు నిర్వహించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నిర్ణయించారు. ఈ దిశగా చర్యలు తీసుకోవాలని ఆర్థిక మంత్రి హరీశ్ రావును, శాసన సభ వ్యవహారాల మంత్రి ప్రశాంత్ రెడ్డిని సీఎం కేసీఆర్ ఆదేశించారు.

17:50 PM (IST)  •  24 Nov 2022

Telangana Assembly: డిసెంబరులో తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు డిసెంబరు నెలలో నిర్వహించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. ప్రధానంగా ఈ సమావేశాలు కేంద్ర ప్రభుత్వ తీరును ఎండగట్టేందుకు సాగనున్నాయి. అసెంబ్లీ వేదికగా కేంద్రం తీరును తప్పుబట్టాలని నిర్ణయించారు.

17:03 PM (IST)  •  24 Nov 2022

మేడిగడ్డ బ్యారేజ్ లో మహారాష్ట్ర వాసి గల్లంతు 

జయశంకర్ భూపాలపల్లి జిల్లా అంబటి పెళ్లిలోని మేడిగడ్డ బ్యారేజ్ వద్ద మహారాష్ట్రలోని అంకిసా గ్రామానికి చెందిన ముగ్గురు ప్రమాదానికి గురైయ్యారు. గగ్గూరి మధుకర్(27), చౌల సమ్మయ్య(21) తోట సమ్మయ్య(21) ముగ్గురు వ్యక్తులు మేడిగడ్డ బ్యారేజ్ లో పడపోయారు. చేపల వేటకు పడవతో బ్యారేజీ గేట్ల దగ్గరలో వలవేసి చేపలు పడుతుండగా  ప్రమాదవశాత్తు వరద పోటు ఎక్కువయినట్టు సమాచారం. వల పట్టుకుని గగ్గూరి మధుకర్, చోళ సమ్మయ్య ఇద్దరూ బయటికి రాగా తోట సమ్మయ్య అనే వ్యక్తి గల్లంతయ్యాడు. అతని కొరకు గాలింపు చర్యలు చేపట్టారు పోలీసులు.  

Load More
New Update
Advertisement

టాప్ హెడ్ లైన్స్

IPL Schedule 2025: ఐపీఎల్ షెడ్యూల్ వచ్చేసింది.. వచ్చేనెల 22 నుంచి స్టార్ట్.. ఉప్పల్ స్టేడియంలో 9 మ్యాచ్ లు
ఐపీఎల్ షెడ్యూల్ వచ్చేసింది.. వచ్చేనెల 22 నుంచి స్టార్ట్.. ఉప్పల్ స్టేడియంలో 9 మ్యాచ్ లు
Kishan Reddy : ఏడాదికే కాంగ్రెస్ పై అసంతృప్తి.. ఇక వచ్చేది బీజేపీనే - తెలంగాణకు రూ. 10 లక్షల కోట్లు : కిషన్ రెడ్డి
ఏడాదికే కాంగ్రెస్ పై అసంతృప్తి.. ఇక వచ్చేది బీజేపీనే - తెలంగాణకు రూ. 10 లక్షల కోట్లు : కిషన్ రెడ్డి
Who Is Mastan Sai: ఐఐటీలో బీటెక్ నుంచి డ్రగ్స్ పెడ్లర్, బ్లాక్ మెయిలర్ వరకు.. ఎవరీ మస్తాన్ సాయి, అతడి బ్యాక్‌గ్రౌండ్ ఏంటీ?
ఐఐటీలో బీటెక్ నుంచి డ్రగ్స్ పెడ్లర్, బ్లాక్ మెయిలర్ వరకు.. ఎవరీ మస్తాన్ సాయి, అతడి బ్యాక్‌గ్రౌండ్ ఏంటీ?
Sai Pallavi: 'జాతీయ అవార్డు అందుకోవాలని ఎంతో ఆశగా ఉంది' - సాయిపల్లవి అమ్మమ్మ చీర సెంటిమెంట్ నెరవేరుతుందా?
'జాతీయ అవార్డు అందుకోవాలని ఎంతో ఆశగా ఉంది' - సాయిపల్లవి అమ్మమ్మ చీర సెంటిమెంట్ నెరవేరుతుందా?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

MLC Elections ఏపి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటర్లను ప్రలోభపెడుతున్న ఆధారాలు చూపిన శ్రీరాజ్Deputy CM Pawan Kalyan South India Temples Full Video | పవన్ తిరిగిన దక్షిణాది ఆలయాలు ఇవే | ABPDy CM Pawan Kalyan మురుగన్ ఆలయంలో ప్రత్యేక పూజలు | Tamil Nadu | ABP DesamKiran Royal Laxmi Comments On Pawan Kalyan | కిరణ్ రాయల్ వెనుక పవన్ ! | ABP DESAM

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IPL Schedule 2025: ఐపీఎల్ షెడ్యూల్ వచ్చేసింది.. వచ్చేనెల 22 నుంచి స్టార్ట్.. ఉప్పల్ స్టేడియంలో 9 మ్యాచ్ లు
ఐపీఎల్ షెడ్యూల్ వచ్చేసింది.. వచ్చేనెల 22 నుంచి స్టార్ట్.. ఉప్పల్ స్టేడియంలో 9 మ్యాచ్ లు
Kishan Reddy : ఏడాదికే కాంగ్రెస్ పై అసంతృప్తి.. ఇక వచ్చేది బీజేపీనే - తెలంగాణకు రూ. 10 లక్షల కోట్లు : కిషన్ రెడ్డి
ఏడాదికే కాంగ్రెస్ పై అసంతృప్తి.. ఇక వచ్చేది బీజేపీనే - తెలంగాణకు రూ. 10 లక్షల కోట్లు : కిషన్ రెడ్డి
Who Is Mastan Sai: ఐఐటీలో బీటెక్ నుంచి డ్రగ్స్ పెడ్లర్, బ్లాక్ మెయిలర్ వరకు.. ఎవరీ మస్తాన్ సాయి, అతడి బ్యాక్‌గ్రౌండ్ ఏంటీ?
ఐఐటీలో బీటెక్ నుంచి డ్రగ్స్ పెడ్లర్, బ్లాక్ మెయిలర్ వరకు.. ఎవరీ మస్తాన్ సాయి, అతడి బ్యాక్‌గ్రౌండ్ ఏంటీ?
Sai Pallavi: 'జాతీయ అవార్డు అందుకోవాలని ఎంతో ఆశగా ఉంది' - సాయిపల్లవి అమ్మమ్మ చీర సెంటిమెంట్ నెరవేరుతుందా?
'జాతీయ అవార్డు అందుకోవాలని ఎంతో ఆశగా ఉంది' - సాయిపల్లవి అమ్మమ్మ చీర సెంటిమెంట్ నెరవేరుతుందా?
Stampedes in Railway Stations: రైల్వేస్టేషన్​లో తొక్కిసలాట ఇదే మొదటిసారి కాదు.. గతంలో ఎన్నో విషాదాలు!
రైల్వేస్టేషన్​లో తొక్కిసలాట ఇదే మొదటిసారి కాదు.. గతంలో ఎన్నో విషాదాలు!
Jayalalitha Assets: 1.2 కిలోల వడ్డానం, 1.5 కిలోల ఖడ్గం.. చెన్నైకి చేరిన జయలలిత 27 కిలోల బంగారం
1.2 కిలోల వడ్డానం, 1.5 కిలోల ఖడ్గం.. చెన్నైకి చేరిన జయలలిత 27 కిలోల బంగారం
Yashasvi Jaiswal:  ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీకి టీమిండియా ప్లేయర్ దూరం.. గాయం కారణంగా స్వదేశంలో..
ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీకి టీమిండియా ప్లేయర్ దూరం.. గాయం కారణంగా స్వదేశంలో..
New Delhi Railway Station Stampede: ఢిల్లీలో తొక్కిసలాటపై రైల్వే శాఖ కీలక నిర్ణయం, విచారణ కమిటీ ఏర్పాటు
ఢిల్లీ రైల్వేస్టేషన్లో తొక్కిసలాటపై రైల్వే శాఖ కీలక నిర్ణయం, విచారణ కమిటీ ఏర్పాటు
Embed widget

We use cookies to improve your experience, analyze traffic, and personalize content. By clicking "Allow All Cookies", you agree to our use of cookies.