అన్వేషించండి

Guntur : గుంటూరులో విజృంభిస్తున్న డయేరియా - హెల్త్ ఎమర్జెన్సీ విధించాలని టీడీపీ డిమాండ్

Guntur : గుంటూరులో హెల్త్ ఎమర్జెన్సీ విధించాలని ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు డిమాండ్ చేశారు. డయోరియా మనుషుల ప్రాణాల్ని తీస్తోందన్నారు.

AP TDP president Achchennaidu demanded that health emergency be imposed in Guntur :  రాష్ట్రవ్యాప్తంగా ప్రజలకు అందని సురక్షిత తాగునీరు అందకపోవడంతో కలుషిత జలంతో డయేరియా బారిన పడుతున్నారని ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ప్రభుత్వం దృష్టికి తీసుకు వచ్చారు.  కలరా ప్రబలి ఆస్పత్రుల్లో చేరుతున్న రోగులు ప్రాణాలకు  ముప్పు ఏర్పడిందన్నారు.  యుద్ధప్రాతిపదికన సురక్షిత తాగునీరు అందించాలి, గుంటూరులో హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించాలని డిమాండ్ చేస్తూ సీఎం జగన్ కు బహిరంగ లేఖ రాశారు. 

గ్రామ పంచాయతీ నిధులు దారి మళ్లించడం, పారిశుద్ధ్య నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించడం, తాగునీటి పథకాలను సక్రమంగా నిర్వహించకపోవడం, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులను అర్ధాంతరంగా నిలిపేయడం వంటి చర్యలతో ప్రజల ఆరోగ్య పరిస్థితి గాల్లో దీపంలా మారిందని అచ్చెన్నాయుడు విమర్శించారు.  ప్రజలకు తాగునీరు సరఫరా చేయలేని పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం ఉండటం సిగ్గుచేటు కాదా? లక్షలాది మంది ఆస్పత్రులపాలవుతున్నా ఏమీ పట్టనట్టు అధికార యంత్రాంగం వ్యవహరించడం మీ ప్రభుత్వ పాలనా వైఫల్యం కాదా? అని ప్రశ్నించారు.  మీ నిర్లక్ష్యం వల్ల రాష్ట్రంలో సురక్షిత నీరు అందక ప్రజలు ప్రాణాలు కోల్పోతున్న విషయం మీకు తెలుసా ముఖ్యమంత్రి గారూ? ఇంతటి భయానక పరిస్థితులపై ఒక్కసారైనా మీరు స్పందించారా ? అని నిలదీశారు. 

కలుషిత నీటి సరఫరాతో గుంటూరులో డయేరియా బారిన పడి నలుగురు మృతిచెందారు. వందలమంది ఆస్పత్రుల పాలయ్యారు. అవే కలుషిత జలాల కారణంగా కలరా మహమ్మారి గుంటూరును వణికిస్తోంది. ముగ్గురికి కలరా సోకింది. ఇంతటి ప్రమాదక పరిస్థితులు తలెత్తితే చర్యలు తీసుకోవాల్సిన మంత్రి విడదల రజనీ అసలు విషయం బయటకు రాకుండా తొక్కిపెట్టడం ప్రజల ప్రాణాలతో చెలగాటమాడటమేనన్నారు.  గుంటూరు నగరంలో పలుచోట్ల తాగునీటి పైపులైన్లు మురుగునీటి కాల్వలను క్రాస్‌ చేస్తూ వెళుతున్నాయి. ఈ క్రమంలో పైపు లైన్లు పగిలిపోయి లీకేజీ కారణంగా తాగునీరు కలుషితమవుతోంది. నేటికీ ముగు నీటిలోనే మంచినీటి పైపు లైన్లు ఉన్నా అధికారులకు చీమకుట్టినట్టు లేదన్నారు. 

టీడీపీ హయాంలో నెలకోసారి వాటర్ ట్యాంక్ లు క్లీన్ చేసేవారు. కేంద్ర ప్రభుత్వ నిధులతో చేపట్టిన అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులు 90 శాతం మేర పూర్తయ్యాయి. మిగిలిన 10 శాతం పూర్తి చేసివుంటే నేడు హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించే పరిస్థితి వచ్చేది కాదు. ఆరోగ్యాంధ్రప్రదేశ్, ఆరోగ్య విప్లవం, ప్రజారోగ్యమే మా ధ్యేయమంటూ ప్రచారార్భాటం చేయడం వల్ల ప్రజల ప్రాణాలు నిలబడతాయా? మీరు అధికారంలో ఉండే ఈ నెల రోజుల్లోనైనా సక్రమంగా పనిచేయండి. రాజకీయ లబ్ధి కోసం విపక్షాలపై విమర్శలు చేయడం మానేసి ప్రజల ప్రాణాలను కాపాడటంపై దృష్టి పెట్టండి. డ్రైనీజీ వ్యవస్థను పునరుద్ధరించండి.  శుద్ధిచేసిన మంచినీటిని సరఫరా చేయండి. అస్వస్థతకు గురైన వారికి మెరుగైన వైద్య సేవలు అందించాలని లేఖలో డిమాండ్ చేశారు.                                               

 

టాప్ హెడ్ లైన్స్

Kadapa Crime News: యువతి విషయంలో వివాదం.. యువకుడిని హత్య చేసిన ఇద్దరు మైనర్లు.. కడప జిల్లా మైదుకూరులో దారుణం
యువతి విషయంలో వివాదం.. యువకుడిని హత్య చేసిన ఇద్దరు మైనర్లు.. కడప జిల్లా మైదుకూరులో దారుణం
Chandrababu 4.0 PR Strategy: చంద్రబాబు 4.0'లో మారిన పీఆర్ మార్క్ - మోదీ వ్యూహంతో రీ-పొజిషనింగ్ - అంతా వైరల్ కంటెంటే!
చంద్రబాబు 4.0'లో మారిన పీఆర్ మార్క్ - మోదీ వ్యూహంతో రీ-పొజిషనింగ్ - అంతా వైరల్ కంటెంటే!
AP Legislative Council MLC Elections: కూటమికి ఎమ్మెల్సీల పంట - వచ్చే 3 ఏళ్లలో 30 పదవులు - ఆశావహులందరికీ చాన్స్ ?
కూటమికి ఎమ్మెల్సీల పంట - వచ్చే 3 ఏళ్లలో 30 పదవులు - ఆశావహులందరికీ చాన్స్ ?
Rains In AP And Telangana: భారీ వర్షాలతో తెలంగాణలో 10 జిల్లాలకు ఎల్ల్ అలర్ట్, ఏపీలో ఈ ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు
భారీ వర్షాలతో తెలంగాణలో 10 జిల్లాలకు ఎల్ల్ అలర్ట్, ఏపీలో ఈ ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు

వీడియోలు

Ashes Test Match To Be Hosted In India? | ఇండియాలో 'యాషెస్' టెస్ట్ మ్యాచ్?
Serial Actress Preethi Srinivas Real Life Facts | సీరియల్ నటి ప్రీతి శ్రీనివాస్ రియల్ లైఫ్ సీక్రెట్స్
Vaibhav Suryavanshi Creates World Record | 15 ఏళ్ల వయసులో వైభవ్ సూర్యవంశీ వరల్డ్ రికార్డ్
PM Modi Gains 10 Lakh Followers In 12 Hours | పీఎం మోదీ సోషల్ మీడియాలో రికార్డ్
PM Modi Midnight Statement on Paper Leak | పేపర్ లీకేజీలపై మోదీ అర్ధరాత్రి ప్రకటన

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
GHMC Indiramma Housing Scheme: KCR డబుల్ బెడ్‌రూం ఇళ్ల ఫార్ములాతోనే కాంగ్రెస్ ఇందిరమ్మ బెట్ - దరఖాస్తులతో ఓట్లు రాలుతాయా?
డబుల్ బెడ్‌రూం ఇళ్ల ఫార్ములాతోనే కాంగ్రెస్ ఇందిరమ్మ బెట్ - దరఖాస్తులతో ఓట్లు రాలుతాయా?
NEET UG పేపర్‌ లీక్‌ కేసులో సీబీఐ ఛార్జిషీట్ దాఖలు, 13 మంది నిందితుల పేర్లు ఇవే! 
NEET UG పేపర్‌ లీక్‌ కేసులో సీబీఐ ఛార్జిషీట్ దాఖలు, 13 మంది నిందితుల పేర్లు ఇవే! 
AP Legislative Council MLC Elections: కూటమికి ఎమ్మెల్సీల పంట - వచ్చే 3 ఏళ్లలో 30 పదవులు - ఆశావహులందరికీ చాన్స్ ?
కూటమికి ఎమ్మెల్సీల పంట - వచ్చే 3 ఏళ్లలో 30 పదవులు - ఆశావహులందరికీ చాన్స్ ?
Jubilee Hills CI Suspension: ఫిర్యాదు చేయడానికి వచ్చిన మహిళను వీడియోలతో బ్లాక్ మెయిల్! జూబ్లీహిల్స్ సీఐపై సస్పెన్షన్‌ వేటు
ఫిర్యాదు చేయడానికి వచ్చిన మహిళను వీడియోలతో బ్లాక్ మెయిల్! జూబ్లీహిల్స్ సీఐపై సస్పెన్షన్‌ వేటు
Rains In AP And Telangana: భారీ వర్షాలతో తెలంగాణలో 10 జిల్లాలకు ఎల్ల్ అలర్ట్, ఏపీలో ఈ ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు
భారీ వర్షాలతో తెలంగాణలో 10 జిల్లాలకు ఎల్ల్ అలర్ట్, ఏపీలో ఈ ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు
కొత్త టయోటా హైలక్స్‌ వచ్చేసింది.. 360 డిగ్రీ కెమెరా, 204hp డీజిల్‌ ఇంజిన్‌తో అదిరిపోయే పికప్‌
2026 టయోటా హైలక్స్‌ లాంచ్‌.. కొత్త లుక్‌, కొత్త ఫీచర్లతో మీ ఆదాయానికి మరింత ఊపు
Revanth Reddy HYDRA Comments: అధికారి నియామకం ప్రభుత్వ విచక్షణాధికారమన్న రేవంత్ - హైకోర్టు ఆదేశాల ప్రకారం రంగనాథ్‌ను తొలగించేందుకు సిద్ధంగా లేరా?
అధికారి నియామకం ప్రభుత్వ విచక్షణాధికారమన్న రేవంత్ - హైకోర్టు ఆదేశాల ప్రకారం రంగనాథ్‌ను తొలగించేందుకు సిద్ధంగా లేరా?
AP Mee Mart: ఆంధ్రప్రదేశ్‌లోని ఈ జిల్లాల్లో రాబోతున్న
ఆంధ్రప్రదేశ్‌లోని ఈ జిల్లాల్లో రాబోతున్న "మీ మార్ట్"- ఈ క్వార్టర్‌లోనే వెయ్యి స్టోర్‌లు ప్రారంభించనున్న ప్రభుత్వం!‌
Embed widget