అన్వేషించండి

Guntur : గుంటూరులో విజృంభిస్తున్న డయేరియా - హెల్త్ ఎమర్జెన్సీ విధించాలని టీడీపీ డిమాండ్

Guntur : గుంటూరులో హెల్త్ ఎమర్జెన్సీ విధించాలని ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు డిమాండ్ చేశారు. డయోరియా మనుషుల ప్రాణాల్ని తీస్తోందన్నారు.

AP TDP president Achchennaidu demanded that health emergency be imposed in Guntur :  రాష్ట్రవ్యాప్తంగా ప్రజలకు అందని సురక్షిత తాగునీరు అందకపోవడంతో కలుషిత జలంతో డయేరియా బారిన పడుతున్నారని ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ప్రభుత్వం దృష్టికి తీసుకు వచ్చారు.  కలరా ప్రబలి ఆస్పత్రుల్లో చేరుతున్న రోగులు ప్రాణాలకు  ముప్పు ఏర్పడిందన్నారు.  యుద్ధప్రాతిపదికన సురక్షిత తాగునీరు అందించాలి, గుంటూరులో హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించాలని డిమాండ్ చేస్తూ సీఎం జగన్ కు బహిరంగ లేఖ రాశారు. 

గ్రామ పంచాయతీ నిధులు దారి మళ్లించడం, పారిశుద్ధ్య నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించడం, తాగునీటి పథకాలను సక్రమంగా నిర్వహించకపోవడం, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులను అర్ధాంతరంగా నిలిపేయడం వంటి చర్యలతో ప్రజల ఆరోగ్య పరిస్థితి గాల్లో దీపంలా మారిందని అచ్చెన్నాయుడు విమర్శించారు.  ప్రజలకు తాగునీరు సరఫరా చేయలేని పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం ఉండటం సిగ్గుచేటు కాదా? లక్షలాది మంది ఆస్పత్రులపాలవుతున్నా ఏమీ పట్టనట్టు అధికార యంత్రాంగం వ్యవహరించడం మీ ప్రభుత్వ పాలనా వైఫల్యం కాదా? అని ప్రశ్నించారు.  మీ నిర్లక్ష్యం వల్ల రాష్ట్రంలో సురక్షిత నీరు అందక ప్రజలు ప్రాణాలు కోల్పోతున్న విషయం మీకు తెలుసా ముఖ్యమంత్రి గారూ? ఇంతటి భయానక పరిస్థితులపై ఒక్కసారైనా మీరు స్పందించారా ? అని నిలదీశారు. 

కలుషిత నీటి సరఫరాతో గుంటూరులో డయేరియా బారిన పడి నలుగురు మృతిచెందారు. వందలమంది ఆస్పత్రుల పాలయ్యారు. అవే కలుషిత జలాల కారణంగా కలరా మహమ్మారి గుంటూరును వణికిస్తోంది. ముగ్గురికి కలరా సోకింది. ఇంతటి ప్రమాదక పరిస్థితులు తలెత్తితే చర్యలు తీసుకోవాల్సిన మంత్రి విడదల రజనీ అసలు విషయం బయటకు రాకుండా తొక్కిపెట్టడం ప్రజల ప్రాణాలతో చెలగాటమాడటమేనన్నారు.  గుంటూరు నగరంలో పలుచోట్ల తాగునీటి పైపులైన్లు మురుగునీటి కాల్వలను క్రాస్‌ చేస్తూ వెళుతున్నాయి. ఈ క్రమంలో పైపు లైన్లు పగిలిపోయి లీకేజీ కారణంగా తాగునీరు కలుషితమవుతోంది. నేటికీ ముగు నీటిలోనే మంచినీటి పైపు లైన్లు ఉన్నా అధికారులకు చీమకుట్టినట్టు లేదన్నారు. 

టీడీపీ హయాంలో నెలకోసారి వాటర్ ట్యాంక్ లు క్లీన్ చేసేవారు. కేంద్ర ప్రభుత్వ నిధులతో చేపట్టిన అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులు 90 శాతం మేర పూర్తయ్యాయి. మిగిలిన 10 శాతం పూర్తి చేసివుంటే నేడు హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించే పరిస్థితి వచ్చేది కాదు. ఆరోగ్యాంధ్రప్రదేశ్, ఆరోగ్య విప్లవం, ప్రజారోగ్యమే మా ధ్యేయమంటూ ప్రచారార్భాటం చేయడం వల్ల ప్రజల ప్రాణాలు నిలబడతాయా? మీరు అధికారంలో ఉండే ఈ నెల రోజుల్లోనైనా సక్రమంగా పనిచేయండి. రాజకీయ లబ్ధి కోసం విపక్షాలపై విమర్శలు చేయడం మానేసి ప్రజల ప్రాణాలను కాపాడటంపై దృష్టి పెట్టండి. డ్రైనీజీ వ్యవస్థను పునరుద్ధరించండి.  శుద్ధిచేసిన మంచినీటిని సరఫరా చేయండి. అస్వస్థతకు గురైన వారికి మెరుగైన వైద్య సేవలు అందించాలని లేఖలో డిమాండ్ చేశారు.                                               

 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Ind vs Nz 3rd ODI: ఒక మార్పుతో బరిలోకి దిగిన గిల్ సేన.. ఇండోర్‌లో తమ రికార్డు కాపాడుకుంటుందా?
ఒక మార్పుతో బరిలోకి దిగిన గిల్ సేన.. ఇండోర్‌లో తమ రికార్డు కాపాడుకుంటుందా?
AR Rahman Vs Kangana Ranaut: ఏఆర్ రెహమాన్‌పై విమర్శలు గుప్పించిన కంగనా రనౌత్... నన్ను కలవలేదు, అంత ద్వేషమా?
ఏఆర్ రెహమాన్‌పై విమర్శలు గుప్పించిన కంగనా రనౌత్... నన్ను కలవలేదు, అంత ద్వేషమా?
NTR Vardhanti: ఎన్టీఆర్ 30వ వర్థంతి.. ఎన్టీఆర్ ఘాట్ వద్ద మంత్రి లోకేష్, కల్యాణ్ రామ్ నివాళులు
ఎన్టీఆర్ 30వ వర్థంతి.. ఎన్టీఆర్ ఘాట్ వద్ద మంత్రి లోకేష్, కల్యాణ్ రామ్ నివాళులు
Hyderabad Crime News: హైదరాబాద్‌లో సైబర్ మోసం.. 5 వేలు లాభం చూపించి, ఐటీ ఉద్యోగికి రూ. 2.9 కోట్లు ఎగనామం
హైదరాబాద్‌లో సైబర్ మోసం.. 5 వేలు లాభం చూపించి, ఐటీ ఉద్యోగికి రూ. 2.9 కోట్లు ఎగనామం

వీడియోలు

Nara Lokesh Tribute to NTR on Death Anniversary | ఎన్టీఆర్ కు నివాళి అర్పించిన లోకేష్
Vande Bharat Sleeper Train Started | పచ్చ జెండా ఊపి వందేభారత్ స్లీపర్ ను ప్రారంభించిన ప్రధాని మోదీ | ABP Desam
WPL 2026 RCB vs GG Highlights | హ్యాట్రిక్ కొట్టిన బెంగళూరు!
Ashwin about India vs New Zealand | టీమ్ సెలక్షన్ పై అశ్విన్ ఘాటు వ్యాఖ్యలు
Manoj Tiwari about Rohit Sharma Captaincy | రోహిత్ కెప్టెన్సీపై మాజీ క్రికెటర్ సంచలన వ్యాఖ్యలు

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Ind vs Nz 3rd ODI: ఒక మార్పుతో బరిలోకి దిగిన గిల్ సేన.. ఇండోర్‌లో తమ రికార్డు కాపాడుకుంటుందా?
ఒక మార్పుతో బరిలోకి దిగిన గిల్ సేన.. ఇండోర్‌లో తమ రికార్డు కాపాడుకుంటుందా?
AR Rahman Vs Kangana Ranaut: ఏఆర్ రెహమాన్‌పై విమర్శలు గుప్పించిన కంగనా రనౌత్... నన్ను కలవలేదు, అంత ద్వేషమా?
ఏఆర్ రెహమాన్‌పై విమర్శలు గుప్పించిన కంగనా రనౌత్... నన్ను కలవలేదు, అంత ద్వేషమా?
NTR Vardhanti: ఎన్టీఆర్ 30వ వర్థంతి.. ఎన్టీఆర్ ఘాట్ వద్ద మంత్రి లోకేష్, కల్యాణ్ రామ్ నివాళులు
ఎన్టీఆర్ 30వ వర్థంతి.. ఎన్టీఆర్ ఘాట్ వద్ద మంత్రి లోకేష్, కల్యాణ్ రామ్ నివాళులు
Hyderabad Crime News: హైదరాబాద్‌లో సైబర్ మోసం.. 5 వేలు లాభం చూపించి, ఐటీ ఉద్యోగికి రూ. 2.9 కోట్లు ఎగనామం
హైదరాబాద్‌లో సైబర్ మోసం.. 5 వేలు లాభం చూపించి, ఐటీ ఉద్యోగికి రూ. 2.9 కోట్లు ఎగనామం
Rafale Fighter Jets: భారత్‌లో తయారుకానున్న రాఫెల్ ఫైటర్ జెట్స్.. విదేశాలకు ఎగుమతితో ఎలైట్ క్లబ్‌లోకి
భారత్‌లో తయారుకానున్న రాఫెల్ ఫైటర్ జెట్స్.. విదేశాలకు ఎగుమతితో ఎలైట్ క్లబ్‌లోకి
Shefali Jariwala Death Reason: చేతబడి వల్లే నా భార్య మరణించింది... అజ్ఞాతవాసి, సర్కారు వారి పాట విలన్
చేతబడి వల్లే నా భార్య మరణించింది... అజ్ఞాతవాసి, సర్కారు వారి పాట విలన్
IND vs NZ 3rd ODI: కీలకమైన మూడో వన్డేలో పరుగుల వర్షమే.. పిచ్ రిపోర్ట్, IND vs NZ ప్లేయింగ్ XI అంచనా
కీలకమైన మూడో వన్డేలో పరుగుల వర్షమే.. పిచ్ రిపోర్ట్, IND vs NZ ప్లేయింగ్ XI అంచనా
CM Revanth Reddy: ఖమ్మంలో కీలక అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి
ఖమ్మంలో కీలక అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి
Embed widget