అన్వేషించండి

ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ సెంటర్ స్కాం - శ్రీకాంత్ అర్జాకు నోటీసులు

ఏపీ స్కిల్ డెవలప్‌ మెంట్ స్కామ్‌లో మరో మలుపు చోటు చేసుకుంది. శ్రీకాంత్ అర్జాకు సీఐడీ నోటీసులు జారీ చేసింది.

ఏపీ స్కిల్ డెవలప్‌ మెంట్ స్కామ్‌లో మరో మలుపు చోటు చేసుకుంది. శ్రీకాంత్ అర్జాకు సీఐడీ నోటీసులు జారీ చేసింది.
స్కిల్ డెవలప్ మెంట్ స్కాం...
ఏపీఎస్‌డీసీ ఎండీగా వ్యవహరించిన శ్రీకాంత్ అర్జాకు ఏపీ సీఐడీ నోటీసులు జారీ చేసింది. దాదాపు రూ.330 కోట్ల రూపాయల నిధులు దారి మళ్లించిన సూత్రధారులు ఎవరనే కోణంలో ఫోకస్‌ చేస్తున్నారు. అవినీతి సొమ్మును రాబట్టడమే తమ ప్రధాన లక్ష్యమని స్కిల్ డెవలప్ మెంట్ సెంటర్ చైర్మన్ అజయ్‌రెడ్డి చెబుతున్నారు.
ఏం జరుగుతుందో....
స్కిల్ డెవలప్‌ మెంట్ స్కామ్‌లో ఊహించని మలుపు చోటు చేసుకుంది.అదికారులకు నోటీసులు జారీ చేయటం పై ఉత్కంఠత ఏర్పడింది. 330 కోట్ల నిధులు దారిమళ్లించిన సూత్రధారులు
 ఎవరనే కోణంలో సీఐడీ దర్యాప్తు చేస్తున్న తరుణంలో ఇలాంటి నోటీసులు జారీ కావటం వెనుక ఉన్న అంతర్యం ఎంటనేది ప్రశ్నగా మారింది. ఆనాటి సంస్థ ఎండీ శ్రీకాంత్‌ అర్జాను విచారించాలని అధికారుల నిర్ణయం లో భాగంగానే ఆయనకు నోటీసులు జారీ చేశారని అంటున్నారు. అయితే ఇది ఇంతటితో ఆగుతుదా లేక మరెన్ని మలుపులు తీసుకుంటుందన్నది చర్చనీయాశంగా మారింది.
టీడీపీ కౌంటర్...
ఈ వ్యవహరం పై తెలుగు దేశం పార్టి ఎదురు దాడిని ప్రారంభించింది. ఏపీ సీఎం వైఎస్ జగన్‌ ప్రభుత్వం తెలుగు దేశం నాయకత్వం పై ఉద్దేశపూర్వకంగా ఆరోపణలు చేస్తోందని టీడీపీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం ఓకే చెప్పిన తర్వాతే.. సీమెన్స్‌కు ప్రభుత్వ వాటా సొమ్ము చెల్లించారని అచ్చెన్నాయుడు అంటున్నారు. ఏపీ ప్రభుత్వ వైఫల్యాల నుంచి ప్రజల దృష్టి మళ్లించే ప్రయత్నంలో భాగంగానే ఇలాంటి ట్రిక్స్ ను ఫాలో అవుతున్నారా అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఆయన ప్రశ్నించారు.
అసలు విషయం ఏంటంటే...
ఆంధ్రప్రదేశ్ విభజన తరవాత నూతన రాష్ట్రంగా ఏర్పాటు జరిగిన తరవాత అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హయాంలో సీమెన్స్‌తో కలిసి శిక్షణ ఇస్తామంటూ 3300 కోట్ల రూపాయల ప్రాజెక్టు చేపట్టారు. ఒప్పందం మేరకు ప్రభుత్వం 10శాతం చెల్లింపులు చేసింది. మిగతా 90 శాతం సీమెన్స్‌ చెల్లించకుండా.. సర్కార్‌ సొమ్మును సైతం షెల్‌ కంపెనీలకు మళ్లించారన్నది అభియోగం. ఎలైట్‌ కంప్యూటర్స్‌, స్కిల్లర్‌ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్‌, నాలెడ్జ్‌ పోడియం, ఈటీఏ- గ్రీన్స్‌, కేడన్స్‌ పార్టనర్‌ తదితర కంపెనీలకు 240 కోట్లు రూటింగ్‌ అయిందంటున్నారు సంస్థ ప్రస్తుత చైర్మన్ అజయ్‌రెడ్డి.
సీమెన్స్‌ ఓ ఇంటర్నేషనల్‌ కంపెనీ. తమ పేరుతో కొందరు మోసానికి పాల్పడ్డారని ఆ సంస్థ చెప్పిందని అజయ్‌రెడ్డి చెప్తున్నారు. ఈ ఆధారాల సాయంతో మరికొందరి అరెస్టులు తప్పవంటున్నారు. ప్రజల సొమ్మును తిరిగి రాబట్టడమే లక్ష్యమంటున్నారు.
సీమెన్స్ మాజీ ఉద్యోగి ద్వారా...
ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పోరేషన్ స్కాంలో ఇప్పటికే మరో అరెస్టు కూడా జరిగింది. సిమెన్స్ మాజీ ఉద్యోగి జీవీఎస్ భాస్కర్ ను సీఐడి అదుపులోకి తీసుకుందని చెబుతున్నారు. నోయిడాలో భాస్కర్ ను  అరెస్టు చేసి ట్రాన్సిట్ వారంట్ పై విజయవాడ కోర్టులో ప్రవేశపెట్టనున్నట్లు అదికార వర్గాలు చెబుతున్నాయి. సిమెన్స్ సంస్థ రూపొందించిన స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ప్రాజెక్టు ధరను కృత్రిమంగా పెంచడంలో భాస్కర్ కీలక పాత్ర పోషించాడనే ఆరోపణలు ఉన్నాయి. ప్రోగ్రామ్ అసలు ధర రూ. 58 కోట్లు కాగా, దానిని రూ.3,300కోట్లుగా ప్రభుత్వానికి చూపించాడు. అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రభుత్వంలోని పెద్దల సహాయంతో స్కిల్ డెవలప్మెంట్ కార్పోరేషన్ ప్రాజెక్టులో మోసాలకు పాల్పడ్డారని అభియోగం. రూ.3,300కోట్లను ప్రాజెక్టు ధరగా నిర్ణయించి ప్రభుత్వ వాటా కింద రూ.371కోట్లు అక్రమాలు జరిగాయనే ఆరోపణలు ఉన్నాయి.

సిమెన్స్ సంస్థతో ప్రభుత్వం కుదుర్చుకున్న ఎంవోయూలోని అంశాలను సైతం భాస్కర్ పూర్తిగా మార్చేశాడని అంటున్నారు. రూ.3,300 కోట్ల ప్రాజెక్టులో ప్రభుత్వ వాటా కింద 371కోట్లు ఇవ్వాల్సి ఉండగా.. ప్రైవేటు సంస్థలు మిగిలన వ్యయం భరించాలి. ప్రైవేటు వాటా డబ్బుకు సంబంధించి ఎంవోయూలో ఎలాంటి ప్రస్తావన లేకుండా.. కేవలం ప్రభుత్వం వాటా రూ.371 కోట్ల వర్క్ ఆర్డర్ ను విడుదల చేసేందుకు భాస్కర్ అనధికార చర్యలకు పాల్పడ్డారని కూడ ప్రచారం జరుగుతోంది.

టాప్ హెడ్ లైన్స్

AP JAC Demand: ఏపీ ప్రభుత్వంపై ఉద్యోగుల ఆగ్రహం - పీఆర్‌సీ, ఐఆర్‌కై ఏపీ జేఏసీ ఉద్యమ శంఖారావం - సచివాలయంలో నిరసనలకు రెడీ
ఏపీ ప్రభుత్వంపై ఉద్యోగుల ఆగ్రహం - పీఆర్‌సీ, ఐఆర్‌కై ఏపీ జేఏసీ ఉద్యమ శంఖారావం - సచివాలయంలో నిరసనలకు రెడీ
Anantapur Crime News: అనంతపురంలో భయంకరమైన ఘటన - కూతురిపై కన్నేశాడని ప్రియుడి మర్మాంగం కోసేసిన మహిళ
అనంతపురంలో భయంకరమైన ఘటన - కూతురిపై కన్నేశాడని ప్రియుడి మర్మాంగం కోసేసిన మహిళ
PV Sunil Kumar Letter to CBI: డిప్యూటీ స్పీకర్ RRRపై సీబీఐకి మాజీ సీఐడీ చీఫ్ లేఖ - సాక్ష్యాల తారుమారు, బెదిరింపులు పై పీవీ సునీల్ కుమార్ సంచలన ఫిర్యాదు!
డిప్యూటీ స్పీకర్ RRRపై సీబీఐకి మాజీ సీఐడీ చీఫ్ లేఖ - సాక్ష్యాల తారుమారు, బెదిరింపులు పై పీవీ సునీల్ కుమార్ సంచలన ఫిర్యాదు!
Anna Lezhneva : పవన్ బాటలోనే అన్నా కొణిదెల - వన్యప్రాణుల దత్తత
పవన్ బాటలోనే అన్నా కొణిదెల - వన్యప్రాణుల దత్తత

వీడియోలు

Minor Apologises to PM Modi | పీఎంపై వ్యాఖ్యలకు క్షమాపణ కోరిన మైనర్
Modi on abuses by youth | ఆవేదన చెందా కానీ కోపంలేదు 'దారి తప్పిన వారిని సరైన దారిలో నడిపిద్దాం
Jasprit Bumrah Fitness Cleared For Tests | ఫిట్‌నెస్ టెస్ట్ పాసైన జస్ప్రీత్ బుమ్రా
Serial Actress Vandana Gollu Real Life Story | బుల్లితెర నటి వందన గొల్లు రియల్ లైఫ్ స్టోరీ
Will Shami Play World Cup 2027? | గంగూలీ ప్లాన్ రిపీట్ చేయనున్న గిల్ ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
NEET UG Counselling 2026 షెడ్యూల్ విడుదల.. ఆగస్టు 5న ప్రారంభం కానున్న రిజిస్ట్రేషన్లు- ఈ డాక్యుమెంట్స్ తప్పనిసరి
NEET UG Counselling 2026 షెడ్యూల్ విడుదల.. ఆగస్టు 5న ప్రారంభం కానున్న రిజిస్ట్రేషన్లు
Revanth Reddy On Uppal Nalla Cheruvu: ఉప్పల్ నల్లచెరువుకు జలకళ.. హైడ్రాపై సీఎం రేవంత్ రెడ్డి ప్రశంసలు
ఉప్పల్ నల్లచెరువుకు జలకళ.. హైడ్రాపై సీఎం రేవంత్ రెడ్డి ప్రశంసలు
Liquor Shops Closed: మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. హైదరాబాద్‌లో 2 రోజులపాటు వైన్స్ షాపులు, బార్ల మూసివేత
మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. హైదరాబాద్‌లో 2 రోజులపాటు వైన్స్ షాపులు, బార్ల మూసివేత
CWG Boxing Gold: రింగ్ లో పంచ్ ల వర్షం.. గ్లాస్గో గేమ్స్ లో జైస్మిన్, ప్రీతి మైండ్ బ్లాకింగ్ గోల్డ్ మెడల్స్, బాక్సింగ్ లో పతకాల పంట!
రింగ్ లో పంచ్ ల వర్షం.. గ్లాస్గో లో జైస్మిన్, ప్రీతికి గోల్డ్ మెడల్స్- బాక్సింగ్ లో పతకాల పంట!
Telangana Police Jobs 2026: తెలంగాణ పోలీస్ ఉద్యోగాల భర్తీ- దరఖాస్తుల తేదీలు, పోస్టుల పూర్తి వివరాలు
తెలంగాణ పోలీస్ ఉద్యోగాల భర్తీ- దరఖాస్తుల తేదీలు, పోస్టుల పూర్తి వివరాలు
Anantapur Crime News: అనంతపురంలో భయంకరమైన ఘటన - కూతురిపై కన్నేశాడని ప్రియుడి మర్మాంగం కోసేసిన మహిళ
అనంతపురంలో భయంకరమైన ఘటన - కూతురిపై కన్నేశాడని ప్రియుడి మర్మాంగం కోసేసిన మహిళ
PV Sunil Kumar Letter to CBI: డిప్యూటీ స్పీకర్ RRRపై సీబీఐకి మాజీ సీఐడీ చీఫ్ లేఖ - సాక్ష్యాల తారుమారు, బెదిరింపులు పై పీవీ సునీల్ కుమార్ సంచలన ఫిర్యాదు!
డిప్యూటీ స్పీకర్ RRRపై సీబీఐకి మాజీ సీఐడీ చీఫ్ లేఖ - సాక్ష్యాల తారుమారు, బెదిరింపులు పై పీవీ సునీల్ కుమార్ సంచలన ఫిర్యాదు!
PM Modi At Bhogapuram Airport: ఉత్తరాంధ్ర ప్రగతికి నూతన శకం.. స్వర్ణాంధ్ర విజన్‌కు మైలురాయి భోగాపురం ఎయిర్‌పోర్ట్: ప్రధాని మోదీ
ఉత్తరాంధ్ర ప్రగతికి నూతన శకం.. స్వర్ణాంధ్ర విజన్‌కు మైలురాయి భోగాపురం ఎయిర్‌పోర్ట్: ప్రధాని మోదీ
Embed widget