అన్వేషించండి

AP Salaries : కొత్త ఏడాదీ లేటే - ఏపీలో ఇంకా పడని జీతాలు, పెన్షన్లు!

AP Govt Employees Salaries : ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులకు కొత్త ఏడాది చేతిలో డబ్బులు లేకుండా అయిపోయింది. ఒకటో తారీఖున పడాల్సిన జీతాలు ఈ సారి 5వ తేదీ తర్వాతే అందే అవకాశం ఉందంటున్నాయి అధికార వర్గాలు.

AP Govt Employees Salaries : ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరోసారి జీతాలు లేటయ్యాయి. పెన్షనర్లదీ అదే కథ. ఒకటో తారీఖున అందాల్సిన జీతాలు ఈ సారి 5వ తేదీ తర్వాతే అందవొచ్చు అంటున్నాయి అధికారవర్గాలు. దీనికి సాంకేతిక కారణాలను సమస్యగా చూపుతున్నాయి. అయితే ఉద్యోగ సంఘ వర్గాలు మాత్రం ఏపీ ఖజానాలో డబ్బు లేకపోవడం వల్లే అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. 

ఉగాది నాడూ జీతాలు రాలేదాయే:

సాధారణంగా ఏ నెల అయినా ఒకటి లేదా రెండో తారీఖుల్లో సెలవు లేదా పండుగ లాంటిది వస్తే అంతకు ఒకరోజు ముందే జీతాలు జమ చేస్తూ ఉంటుంది. అయితే ఏపీలో మాత్రం ఈ పద్ధతి వేరేగా ఉంటూ వస్తుంది. సంక్షేమ పథకాల అమలుకు తోడు అపుల భారంతో ఉన్న ఏపీలో రాబడికి పెడుతున్న ఖర్చుకు మధ్య పొంతన కుదరడం లేదని ఆర్ధిక నిపుణులు చెబుతూ వస్తున్నారు. గతంలో వరుసగా ప్రతీ నెలా జీతాలు లేటవ్వడంతో ఉద్యోగులు గగ్గోలు పెట్టారు. అయితే గత కొన్నినెలలుగా జీతాలు టైముకే ఇస్తూ వచ్చిన ప్రభుత్వం ఈ నెల మాత్రం మళ్లీ పాత పంథాకే వచ్చింది. ఈ నెల 5వ తారీఖు తర్వాతనే జీతాలు పెన్షన్లు పడే అవకాశం ఉందంటున్నాయి ట్రెజరీ వర్గాలు. దానితో ఈ ఏడాది తెలుగు సంవత్సరాది చేతిలో డబ్బు లేకుండానే వెళ్లిపోయింది అంటున్నాయి ఉద్యోగ వర్గాలు. 

సాంకేతికే సమస్యలే కారణం : ప్రభుత్వం 

అయితే జీతాలు ఆలస్యం అవ్వడానికి సాంకేతికంగా ఏర్పడ్డ సమస్యలే కారణం అంటున్నాయి అధికార వర్గాలు. ఎప్పుడూ జీతాలు ప్రాసెస్ చేసే SAP ప్లాట్ ఫామ్ ను మార్చి వేరే ప్రోగ్రామింగ్ ద్వారా బిల్లులు అప్లోడ్ చెయ్యడంతో అవి రిటర్న్ అయ్యాయని వారు చెప్పుకొస్తున్నారు. కొత్తగా రూపొందించిన సాఫ్ట్ వేర్ RBIకు అనుసంధానం కాకపోవడంతోనే జీతాలు, పెన్షన్లకు చెందిన బిల్లులు వెనక్కు వచ్చేశాయని ఆర్థికశాఖ వర్గాల కథనం. అందుకే మరోసారి బిల్లులన్నింటినీ సబ్మిట్ చెయ్యాలని ట్రెజరీని కోరడంతో ఆలస్యం అయిందనీ మరో ఒకటి రెండు రోజుల్లో జీతాలు ఉద్యోగుల ఖాతాల్లో జమ కావొచ్చని చెబుతున్నాయి అధికార వర్గాలు. దానికి తోడు ఉగాది, ఆదివారం అంటూ సెలవులు రావడాన్ని కూడా ఒక కారణంగా ప్రభుత్వం చూపుతోంది. 

ఆర్ధిక సంవత్సర ముగింపు కూడా కారణమే 

మార్చి నెల ముగింపు సందర్బంగా ప్రభుత్వంపై బిల్లుల చెల్లింపు కోసం ఒత్తిడి ఉంటుంది. ఖజానాలో ఉన్న కొన్ని నిధులనూ వాటికోసం చెల్లించారని తెలుస్తోంది. అదే విధంగా సర్పంచుల ఖాతాల్లోని పంచాయితీల నిధులూ వాడేశారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అలాగే RBI ఇచ్చే వేస్ అండ్ మీన్స్ వెసులుబాటు నిధులు రెండు వేల కోట్లనూ ప్రభుత్వం ఖర్చు పెట్టేసింది అంటున్నారు.  ఈ నేపథ్యంలో ప్రస్తుతం జీతాలు ఇవ్వాలంటే అప్పు కోసం వెళ్లాలి అంటున్నారు ఆర్థిక నిపుణులు. కొత్త ఆర్థిక సంవత్సరం మొదలైంది కాబట్టి కేంద్ర ఆర్ధిక శాఖ కొత్త అప్పులకు రాష్ట్రాలకు అనుమతి ఇస్తుంది. దానిని ఉపయోగించుకొని కొత్త అప్పుల కోసం ఏపీ రెడీ అవుతుందని అవి వస్తే జీతాలు చెల్లించాలని చూస్తుందని కథనాలు వస్తున్నాయి. లేదా బాండ్లను తాకట్టుపెట్టాలంటే మాత్రం మంగళవారం వరకూ ఆగాల్సి ఉంటుంది. అదే గనుక జరిగితే జీతాలు అందాలంటే 5వ తేదీ దాటిపోవాల్సి ఉంటుంది. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

National Commission for Men: మగవాళ్ల కష్టాలను అర్థం చేసుకున్న రాజ్యసభ ఎంపీ - పురుషుల కమిషన్ కోసం ప్రైవేటు బిల్లు - సాటి మగ ఎంపీలు ఆమోదిస్తారా?
మగవాళ్ల కష్టాలను అర్థం చేసుకున్న రాజ్యసభ ఎంపీ - పురుషుల కమిషన్ కోసం ప్రైవేటు బిల్లు - సాటి మగ ఎంపీలు ఆమోదిస్తారా?
PM Modi: తెలుగు రాష్ట్రాల బీజేపీ ఎంపీలకు ప్రధాని మోదీ క్లాస్ - పని చేయడం లేదని అసంతృప్తి - టార్గెట్లు ఇచ్చి పంపారుగా!
తెలుగు రాష్ట్రాల బీజేపీ ఎంపీలకు ప్రధాని మోదీ క్లాస్ - పని చేయడం లేదని అసంతృప్తి - టార్గెట్లు ఇచ్చి పంపారుగా!
IndiGo: సాధారణంగా ఇండిగో సర్వీసులు - టైమ్ ప్రకారమే ఫ్లైట్లు - సంక్షోభం ముగిసినట్లేనా?
సాధారణంగా ఇండిగో సర్వీసులు - టైమ్ ప్రకారమే ఫ్లైట్లు - సంక్షోభం ముగిసినట్లేనా?
Fake liquor case: తెలుగుదేశం పార్టీ బహిష్కృత నేత జయచంద్రారెడ్డి అరెస్ట్ -ములకలచెరువు నకిలీ మద్యం కేసులో కీలక మలు
తెలుగుదేశం పార్టీ బహిష్కృత నేత జయచంద్రారెడ్డి అరెస్ట్ -ములకలచెరువు నకిలీ మద్యం కేసులో కీలక మలుపు

వీడియోలు

నేడు భారత్, సౌతాఫ్రికా మధ్య రెండో టీ20.. బ్యాటింగే డౌటు!
రోహిత్ ఒక్కటే చెప్పాడు.. నా సెంచరీ సీక్రెట్ అదే!
ఆళ్లు మగాళ్లురా బుజ్జె! రోకోకి ప్రశంసలు.. గంభీర్‌కి చురకలు!
అప్పుడు కోహ్లీ.. ఇప్పుడు రోహిత్.. 2025లో 2019 రిపీట్
North Pole vs South Pole | ధృవాల గురించి ఈ విషయాలు తెలుసుకుంటే షాక్ అయిపోతారు | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
National Commission for Men: మగవాళ్ల కష్టాలను అర్థం చేసుకున్న రాజ్యసభ ఎంపీ - పురుషుల కమిషన్ కోసం ప్రైవేటు బిల్లు - సాటి మగ ఎంపీలు ఆమోదిస్తారా?
మగవాళ్ల కష్టాలను అర్థం చేసుకున్న రాజ్యసభ ఎంపీ - పురుషుల కమిషన్ కోసం ప్రైవేటు బిల్లు - సాటి మగ ఎంపీలు ఆమోదిస్తారా?
PM Modi: తెలుగు రాష్ట్రాల బీజేపీ ఎంపీలకు ప్రధాని మోదీ క్లాస్ - పని చేయడం లేదని అసంతృప్తి - టార్గెట్లు ఇచ్చి పంపారుగా!
తెలుగు రాష్ట్రాల బీజేపీ ఎంపీలకు ప్రధాని మోదీ క్లాస్ - పని చేయడం లేదని అసంతృప్తి - టార్గెట్లు ఇచ్చి పంపారుగా!
IndiGo: సాధారణంగా ఇండిగో సర్వీసులు - టైమ్ ప్రకారమే ఫ్లైట్లు - సంక్షోభం ముగిసినట్లేనా?
సాధారణంగా ఇండిగో సర్వీసులు - టైమ్ ప్రకారమే ఫ్లైట్లు - సంక్షోభం ముగిసినట్లేనా?
Fake liquor case: తెలుగుదేశం పార్టీ బహిష్కృత నేత జయచంద్రారెడ్డి అరెస్ట్ -ములకలచెరువు నకిలీ మద్యం కేసులో కీలక మలు
తెలుగుదేశం పార్టీ బహిష్కృత నేత జయచంద్రారెడ్డి అరెస్ట్ -ములకలచెరువు నకిలీ మద్యం కేసులో కీలక మలుపు
One Fast Every Month: ప్రతి నెలా ఒక ఉపవాసం - ఢిల్లీలో అంతర్జాతీయ ప్రజాసంక్షేమ సదస్సు - పిలుపునివ్వనున్న బాబా రాందేవ్
ప్రతి నెలా ఒక ఉపవాసం - ఢిల్లీలో అంతర్జాతీయ ప్రజాసంక్షేమ సదస్సు - పిలుపునివ్వనున్న బాబా రాందేవ్
Rivaba Jadeja : టీమిండియా ఆటగాళ్లు విదేశీ టూర్లకు వెళ్లి తప్పుడు పనులు చేస్తారు; రవీంద్ర జడేజా భార్య రీవాబా సంచలన కామెంట్స్
టీమిండియా ఆటగాళ్లు విదేశీ టూర్లకు వెళ్లి తప్పుడు పనులు చేస్తారు; రవీంద్ర జడేజా భార్య రీవాబా సంచలన కామెంట్స్
YSRCP Leader Pinnelli Ramakrishna Reddy: జంట హత్య కేసులో కోర్టులో లొంగిపోయిన వైసీపీ నేతలు పిన్నెల్లి సోదరులు
జంట హత్య కేసులో కోర్టులో లొంగిపోయిన వైసీపీ నేతలు పిన్నెల్లి సోదరులు
Mohan Lal : దిలీప్ మూవీలో మలయాళ స్టార్ మోహన్ లాల్ - నెట్టింట తీవ్ర విమర్శలు... అసలు రీజన్ ఏంటంటే?
దిలీప్ మూవీలో మలయాళ స్టార్ మోహన్ లాల్ - నెట్టింట తీవ్ర విమర్శలు... అసలు రీజన్ ఏంటంటే?
Embed widget