అన్వేషించండి

Minister Ambati: అసెంబ్లీ ఎన్నికల ప్రచార 'సిత్రం' - టీ కాచి దోశలు వేసిన మంత్రి అంబటి రాంబాబు

AP Elections: ఏపీలో ఎన్నికల జోష్ మొదలైంది. నేతలు ప్రజలతో మమేకమవుతూ వారిని ఆకర్షిస్తున్నారు. మంత్రి అంబటి రాంబాబు బుధవారం ఓ టీ షాపులో టీ మాస్టర్ అవతారం ఎత్తారు.

Minister Ambati Rambabu Making Tea in Election Campaign: 'ఇప్పటి వరకూ నా పని నేను చేశాను. ఇక నుంచి పూర్తిగా మీరే పని చేయాలి. మనం చేసిన, చేసే మంచి పనులను ప్రజలకు వివరించండి.' ఇదీ మంగళవారం పార్టీ శ్రేణులకు సీఎం జగన్ (CM Jagan) చేసిన దిశా నిర్దేశం. ఆయన ఆదేశాలకు అనుగుణంగా మంత్రులు, పార్టీ నేతలు, అభిమానులు, కార్యకర్తలు.. తమ పని ప్రారంభించారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో 'వై నాట్ 175' అనే సీఎం జగన్ నినాదాన్నే తమ లక్ష్యంగా మార్చుకుంటూ ప్రజలతో మమేకమయ్యేందుకు సిద్ధమవుతున్నారు. తాజాగా, మంత్రి అంబటి రాంబాబు (Ambati Rambabu) తనదైన శైలిలో ఎన్నికల ప్రచారానికి సిద్ధమయ్యారు. పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో (Sattenapalli) ఉదయం పర్యటించారు. ఈ సందర్భంగా స్థానిక ఐదు లాంతర్ల సెంటర్ లోని ఓ షాపులో టీ మాస్టర్ అవతారం ఎత్తి స్వయంగా టీ తయారు చేశారు. అలాగే, మరో టిఫిన్ షాపులో దోశలు వేశారు. స్థానిక ప్రజలు, విద్యార్థులతో మాట్లాడారు. వారి సమస్యలను తెలుసుకున్నారు. అంతా కలియతిరిగి ప్రభుత్వ పథకాలు, పొందిన లబ్ధిని అందరికీ వివరించారు. మంత్రి ప్రచారంతో వైసీపీ శ్రేణుల్లో ఫుల్ జోష్ నెలకొంది. ఎన్నికల్లో వైసీపీ విజయం ఖాయమనే ధీమా వ్యక్తం చేస్తున్నారు.

'ఓటర్లను కలవండి'

ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి క్యాడర్ కు సీఎం జగన్ మంగళవారం కీలక సూచనలు చేశారు. 'మీ బూత్ కమిటీల పరిధిలో ఉన్న ఓటర్లను ఎన్నికల లోపు కనీసం ఐదారు సార్లు కలవండి. మనం చేసిన, చేసే మంచి పనులు చెప్పండి. బూత్ స్థాయిలో పార్టీని వీలైనంత తొందరగా యాక్టివేట్ చెయ్యాలి. సోషల్ మీడియాలో పార్టీ క్యాడర్ క్రియాశీలకంగా వ్యవహరించాలి' అని దిశానిర్దేశం చేశారు. తమ తమ బూత్ కమిటీల పరిధిలో ఉన్న ఓటర్లను ఎన్నికల లోపు ఐదుసార్లు కలవాలని సూచించారు. వైసీపీ ప్రభుత్వ పథకాలను, పనులను ప్రజలకు వివరించాలని చెప్పారు. మేము సిద్ధం.. బూత్ సిద్ధం వర్క్ షాప్ లో సీఎం జగన్.. వైసీపీ నేతలకు ఎన్నికల ప్రచారంపై  రూట్ మ్యాప్ ఇచ్చారు. రానున్న 45 రోజులు అత్యంత కీలకం అని సీఎం జగన్ అన్నారు.

ఇప్పటివరకు నేను నా పని చేశాను, ఇక నుంచి పూర్తిగా మీరే పని చేయాలని సీఎం జగన్ ఆదేశించారు. అభ్యర్థుల ఎంపిక దాదాపు పూర్తైందని.. ఒకటి రెండు చోట్ల చిన్న చిన్న మార్పులు తప్ప.. ఇంఛార్జీలే అభ్యర్థులుగా ఉంటారని స్పష్టం చేశారు. వైసీపీ నేతలంతా ప్రజల్లోకి వెళ్లాలని.. రానున్న రోజుల్లో ఏ వ్యూహంతో ముందుకెళ్లాలి? ఎన్నికలను ఏ విధంగా ఎదుర్కోవాలి? అన్న దానిపై సుదీర్ఘ సమావేశంలో శ్రేణులకు నిర్దేశించారు. ఈ క్రమంలో జగన్ వ్యూహాలకు అనుగుణంగా పార్టీ నేతలు ఎన్నికల ప్రచారానికి సిద్ధమవుతున్నారు. నిరంతరం ప్రజల్లోనే ఉండేలా ప్రణాళికలు రచిస్తున్నారు. వారితో మమేకమవుతూ సమస్యలు తెలుసుకుంటున్నారు.

Also Read: సీఎం జగన్‌ వ్యాఖ్యలతో ఆ నేతలు హ్యాపీ! ఇంతకీ ఏమన్నారంటే?

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

AP MLA son arrested in drug case: హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
Telangana Assembly: శ్రీధర్ బాబు సీఎం సీట్లో కూర్చోవాలి - మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు పొగడ్తల వర్షం
శ్రీధర్ బాబు సీఎం సీట్లో కూర్చోవాలి - మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు పొగడ్తల వర్షం
Pawan Kalyan: పార్టీ పెట్టడానికి తెలంగాణే స్ఫూర్తి - యువత రాజకీయాల్లోకి రావాలి - కొండగట్టులో పవన్ పిలుపు
పార్టీ పెట్టడానికి తెలంగాణే స్ఫూర్తి - యువత రాజకీయాల్లోకి రావాలి - కొండగట్టులో పవన్ పిలుపు
Constable Kanakam Season 2 : వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...

వీడియోలు

పక్కటెముక విరగ్గొట్టుకున్నాడు.. షాక్‌లో గుజరాత్ ఫ్యాన్స్
ముస్తాఫిజుర్‌ ఐపీఎల్ ఆడితే మ్యాచ్‌లు జరగనివ్వం: షారూఖ్‌కు హిందూ సంఘాల వర్నింగ్
2026లో భారత్, పాకిస్తాన్ ఎన్నిసార్లు తలపడతాయంటే..
టీ20 వరల్డ్ కప్ ఎవ్వరూ చూడరు: మాజీ ప్లేయర్ అశ్విన్
INSV Kaundinya Explained | INSV కౌండిన్య స్పెషాలిటి తెలుసా ?

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP MLA son arrested in drug case: హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
Telangana Assembly: శ్రీధర్ బాబు సీఎం సీట్లో కూర్చోవాలి - మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు పొగడ్తల వర్షం
శ్రీధర్ బాబు సీఎం సీట్లో కూర్చోవాలి - మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు పొగడ్తల వర్షం
Pawan Kalyan: పార్టీ పెట్టడానికి తెలంగాణే స్ఫూర్తి - యువత రాజకీయాల్లోకి రావాలి - కొండగట్టులో పవన్ పిలుపు
పార్టీ పెట్టడానికి తెలంగాణే స్ఫూర్తి - యువత రాజకీయాల్లోకి రావాలి - కొండగట్టులో పవన్ పిలుపు
Constable Kanakam Season 2 : వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
India Squad For NZ ODI Series: న్యూజిలాండ్ వన్డే సిరీస్‌కు జట్టును ప్రకటించిన BCCI, శ్రేయాస్ అయ్యర్ ఎంట్రీ.. వారిద్దరూ ఔట్
న్యూజిలాండ్ వన్డే సిరీస్‌కు జట్టును ప్రకటించిన BCCI, శ్రేయాస్ అయ్యర్ ఎంట్రీ.. వారిద్దరూ ఔట్
Amaravati houses ready: అమరావతిలో అధికారులు, ప్రజాప్రతినిధుల ఇళ్లకు తుది మెరుగులు - ఏప్రిల్‌లో కేటాయిస్తామని మంత్రి నారాయణ ప్రకటన
అమరావతిలో అధికారులు, ప్రజాప్రతినిధుల ఇళ్లకు తుది మెరుగులు - ఏప్రిల్‌లో కేటాయిస్తామని మంత్రి నారాయణ ప్రకటన
JEE Advanced Exam 2026: జేఈఈ అడ్వాన్స్‌డ్ ఎగ్జామ్ డేట్ ఫిక్స్.. రిజిస్ట్రేషన్ చివరి తేదీ, రూల్స్ పూర్తి వివరాలు
జేఈఈ అడ్వాన్స్‌డ్ ఎగ్జామ్ డేట్ ఫిక్స్.. రిజిస్ట్రేషన్ చివరి తేదీ, రూల్స్ పూర్తి వివరాలు
8th Pay Commission: కేంద్ర ఉద్యోగుల జీతం ఎప్పుడు పెరుగుతుంది? 8వ వేతన సంఘం సిఫార్సులపై ఉత్కంఠ
కేంద్ర ఉద్యోగుల జీతం ఎప్పుడు పెరుగుతుంది? 8వ వేతన సంఘం సిఫార్సులపై ఉత్కంఠ
Embed widget