అన్వేషించండి

AP Inter 2021 Results: ఏపీ ఇంటర్ సెకండియర్ ఫలితాలు విడుదల..

AP Inter 2021 Results: ఏపీ ఇంటర్మీడియట్ సెకండియర్ ఫలితాలు విడుదల అయ్యాయి. రాష్ట్ర విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ఫలితాలను విడుదల చేశారు. ఫీజు చెల్లించిన విద్యార్థులందరినీ పాస్ చేసినట్లు తెలిపారు. 

ఏపీ ఇంటర్మీడియట్ సెకండియర్ ఫలితాలు విడుదల అయ్యాయి. రాష్ట్ర విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ఫలితాలను విడుదల చేశారు. పదో తరగతి మార్కులకు 30 శాతం (అత్యధిక మార్కులు వచ్చిన 3 సబ్జెక్టుల సగటు).. ఇంటర్ ఫస్టియర్ మార్కులకు 70 శాతం వెయిటేజీతో మార్కులను కేటాయించినట్లు వెల్లడించారు. ఫీజు చెల్లించిన విద్యార్థులందరినీ పాస్ చేసినట్లు తెలిపారు. 
ఇంటర్ ఫస్టియర్‌లో ఫెయిలైన, పరీక్షలకు హాజరు కాకపోయిన విద్యార్థులందరినీ కూడా కనీస పాస్ మార్కులతో (35 శాతం) పాస్ చేసినట్లు మంత్రి తెలిపారు. మార్కులతో సంతృప్తి చెందని విద్యార్థులకు పరిస్థితి సద్దుమణిగాక పరీక్షలు నిర్వహిస్తామని ప్రకటించారు. మార్కుల కేటాయింపునకు సంబంధించి ఏర్పాటు చేసిన కమిటీ సూచనల మేరకు ఫలితాలను విడుదల చేశారు.  
ఫలితాలను ఈ వెబ్‌సైట్లలో చూడవచ్చు..
1. http://examsresults.ap.nic.in
2. http://bie.ap.gov.in 
3. https://results.bie.ap.gov.in/
4. https://results.apcfss.in/

5. http://www.manabadi.co.in/

సుప్రీంకోర్టు సూచనలతో..

తొలుత వెల్లడించిన షెడ్యూల్ ప్రకారం ఏపీలో మే 5 నుంచి 23వ తేదీ వరకు ఇంటర్ పరీక్షలు జరగాల్సి ఉంది. అయితే కోవిడ్ మహమ్మారి విజృంభిస్తోన్న నేపథ్యంలో దేశంలోని అన్ని రాష్ట్రాల్లో టెన్త్, ఇంటర్మీడియెట్ పరీక్షలను రద్దు చేశారు. అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాత్రం పరీక్షలను నిర్వహించి తీరతామనే ఉద్దేశంతోనే ముందుకుసాగింది. కానీ.. సుప్రీంకోర్టు పరీక్షల నిర్వహణకు సంబంధించి పలు ప్రశ్నలు సంధించింది. అనంతరం సుప్రీంకోర్టు సూచనలతో పరీక్షలను రద్దు చేస్తున్నట్లు జూన్ 25న ప్రకటించింది. 

హైపవర్ కమిటీ ఏర్పాటు..
అనంతరం ఫలితాలు వెల్లడికి సంబంధించి అనుసరించాల్సిన విధానంపై ప్రభుత్వం.. రిటైర్డ్ ఐఏఎస్ అధికారిణి ఛాయారతన్ నేతృత్వంలో హైపవర్ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ సూచనల మేరకు మార్కులను కేటాయించింది. ఇదిలా ఉండగా.. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో మొత్తం 10,32,469 మంది విద్యార్థులు ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల కోసం రిజిస్టర్ చేసుకున్నారు. వీరిలో ఇంటర్ మొదటి సంవత్సరం విద్యార్థులు 5,12,959 మంది కాగా.. సెకండియర్ విద్యార్థులు 5,19,510 మంది ఉన్నారు.
మార్కుల కేటాయింపు ఇలా.. 

  • పదో తరగతి, ఇంటర్ ఫస్టియర్‌లలో సాధించిన మార్కుల ఆధారంగా సెకండియర్ మార్కులను కేటాయించింది. సబ్జెక్టులవారీగా మార్కులతో పాటు మొత్తానికి సరాసరి గ్రేడ్ పాయింట్లను కేటాయించింది. 
  • ప్రస్తుతం ఇంటర్ సెకండియర్ ఫలితాల కోసం ఎదురు చూస్తున్న విద్యార్థులు 2019లో టెన్త్, 2020లో ఇంటర్ ఫస్టియర్ పరీక్షలు రాశారు. ఈ రెండింటినీ కలిపి సెకండియర్ మార్కులను ఖరారు చేయాలని కమిటీ నిర్ణయించింది. 
  • టెన్త్ మార్కులకు 30 శాతం వెయిటేజీ (అత్యధిక మార్కులు వచ్చిన 3 సబ్జెక్టుల సగటును పరిగణలోకి తీసుకుంటారు).. ఇంటర్ ఫస్టియర్‌తో పాటు సాధించిన అన్ని మార్కులను కలిపి 70 శాతం వెయిటేజీ తీసుకొని మొత్తం 100 శాతానికి మార్కులు కేటాయించింది. 
ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

TGPSC Group 1 Results Cancel: టీజీపీఎస్సీకి ఎదురుదెబ్బ.. గ్రూప్ 1 ఫలితాలు రద్దు చేసిన హైకోర్టు, ఇదెక్కడి ట్విస్ట్!
టీజీపీఎస్సీకి ఎదురుదెబ్బ.. గ్రూప్ 1 ఫలితాలు రద్దు చేసిన హైకోర్టు, ఇదెక్కడి ట్విస్ట్!
PK Vs Revanth:  రేవంత్ రెడ్డిపై పగబట్టిన ప్రశాంత్ కిషోర్ - వదిలేది లేదని హెచ్చరిక - అసలేం జరిగిందంటే?
రేవంత్ రెడ్డిపై పగబట్టిన ప్రశాంత్ కిషోర్ - వదిలేది లేదని హెచ్చరిక - అసలేం జరిగిందంటే?
Pawan Kalyan News: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సినిమాల్లో నటించవచ్చా? పిటిషన్ విచారణ వాయిదా వేసిన హైకోర్టు
పవన్ కళ్యాణ్ సినిమాల్లో నటించవచ్చా? పిటిషన్ విచారణ వాయిదా వేసిన హైకోర్టు
Allu Business Park Controversy: అల్లు ఫ్యామిలీకి మరో షాక్... జీహెచ్‌ఎంసీ నుంచి నోటీసులు - కేసు ఏమిటంటే?
అల్లు ఫ్యామిలీకి మరో షాక్... జీహెచ్‌ఎంసీ నుంచి నోటీసులు - కేసు ఏమిటంటే?
Advertisement

వీడియోలు

Nandamuri Balakrishna Rings The Bell At NSE | నేషనల్ స్టాంక్ ఎక్స్ఛేంజ్ గంట కొట్టిన బాలయ్య | ABP Desam
Space Time and Space Fabric Explained | ఐన్ స్టైన్ ఎంత జీనియస్సో ప్రూవ్ అయిన సందర్భం | ABP Desam
Rohit Virat in Australia ODI Series | ఆస్ట్రేలియా సిరీస్ లో రో-కో ?
South Africa vs England ODI | సౌతాఫ్రికా ఘోర పరాజయం
India Won Hockey Asia Cup 2025 | హాకీ ఆసియా కప్ విజేతగా భారత్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
TGPSC Group 1 Results Cancel: టీజీపీఎస్సీకి ఎదురుదెబ్బ.. గ్రూప్ 1 ఫలితాలు రద్దు చేసిన హైకోర్టు, ఇదెక్కడి ట్విస్ట్!
టీజీపీఎస్సీకి ఎదురుదెబ్బ.. గ్రూప్ 1 ఫలితాలు రద్దు చేసిన హైకోర్టు, ఇదెక్కడి ట్విస్ట్!
PK Vs Revanth:  రేవంత్ రెడ్డిపై పగబట్టిన ప్రశాంత్ కిషోర్ - వదిలేది లేదని హెచ్చరిక - అసలేం జరిగిందంటే?
రేవంత్ రెడ్డిపై పగబట్టిన ప్రశాంత్ కిషోర్ - వదిలేది లేదని హెచ్చరిక - అసలేం జరిగిందంటే?
Pawan Kalyan News: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సినిమాల్లో నటించవచ్చా? పిటిషన్ విచారణ వాయిదా వేసిన హైకోర్టు
పవన్ కళ్యాణ్ సినిమాల్లో నటించవచ్చా? పిటిషన్ విచారణ వాయిదా వేసిన హైకోర్టు
Allu Business Park Controversy: అల్లు ఫ్యామిలీకి మరో షాక్... జీహెచ్‌ఎంసీ నుంచి నోటీసులు - కేసు ఏమిటంటే?
అల్లు ఫ్యామిలీకి మరో షాక్... జీహెచ్‌ఎంసీ నుంచి నోటీసులు - కేసు ఏమిటంటే?
Tirupati-Shirdi Train: తిరుపతి-షిర్డీ మధ్య ప్రతి రోజూ ట్రైన్- చంద్రబాబు ప్రతిపాదనకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ 
తిరుపతి-షిర్డీ మధ్య ప్రతి రోజూ ట్రైన్- చంద్రబాబు ప్రతిపాదనకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ 
Kajal Aggarwal Accident News: నేను బ్రతికే ఉన్నాను... చావలేదు - ఫేక్ న్యూస్‌పై కాజల్ అగర్వాల్ క్లారిటీ
నేను బ్రతికే ఉన్నాను... చావలేదు - ఫేక్ న్యూస్‌పై కాజల్ అగర్వాల్ క్లారిటీ
Andhra Pradesh Latest News: కాకినాడ పోర్టులో 17,293 మెట్రిక్ టన్నుల యూరియా - చంద్రబాబు కీలక ఆదేశాలు- దర్నాకు సిద్ధమైన వైసీపీ 
కాకినాడ పోర్టులో 17,293 మెట్రిక్ టన్నుల యూరియా - చంద్రబాబు కీలక ఆదేశాలు- దర్నాకు సిద్ధమైన వైసీపీ 
AP IPS Transfer: టీటీడీ ఈవోగా అనిల్ కుమార్ సింఘాల్ - ఏపీలో సీనియర్ అధికారుల బదిలీలు -పూర్తి డీటైల్స్
టీటీడీ ఈవోగా అనిల్ కుమార్ సింఘాల్ - ఏపీలో సీనియర్ అధికారుల బదిలీలు -పూర్తి డీటైల్స్
Embed widget