అన్వేషించండి

AP Inter 2021 Results: ఏపీ ఇంటర్ సెకండియర్ ఫలితాలు విడుదల..

AP Inter 2021 Results: ఏపీ ఇంటర్మీడియట్ సెకండియర్ ఫలితాలు విడుదల అయ్యాయి. రాష్ట్ర విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ఫలితాలను విడుదల చేశారు. ఫీజు చెల్లించిన విద్యార్థులందరినీ పాస్ చేసినట్లు తెలిపారు. 

ఏపీ ఇంటర్మీడియట్ సెకండియర్ ఫలితాలు విడుదల అయ్యాయి. రాష్ట్ర విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ఫలితాలను విడుదల చేశారు. పదో తరగతి మార్కులకు 30 శాతం (అత్యధిక మార్కులు వచ్చిన 3 సబ్జెక్టుల సగటు).. ఇంటర్ ఫస్టియర్ మార్కులకు 70 శాతం వెయిటేజీతో మార్కులను కేటాయించినట్లు వెల్లడించారు. ఫీజు చెల్లించిన విద్యార్థులందరినీ పాస్ చేసినట్లు తెలిపారు. 
ఇంటర్ ఫస్టియర్‌లో ఫెయిలైన, పరీక్షలకు హాజరు కాకపోయిన విద్యార్థులందరినీ కూడా కనీస పాస్ మార్కులతో (35 శాతం) పాస్ చేసినట్లు మంత్రి తెలిపారు. మార్కులతో సంతృప్తి చెందని విద్యార్థులకు పరిస్థితి సద్దుమణిగాక పరీక్షలు నిర్వహిస్తామని ప్రకటించారు. మార్కుల కేటాయింపునకు సంబంధించి ఏర్పాటు చేసిన కమిటీ సూచనల మేరకు ఫలితాలను విడుదల చేశారు.  
ఫలితాలను ఈ వెబ్‌సైట్లలో చూడవచ్చు..
1. http://examsresults.ap.nic.in
2. http://bie.ap.gov.in 
3. https://results.bie.ap.gov.in/
4. https://results.apcfss.in/

5. http://www.manabadi.co.in/

సుప్రీంకోర్టు సూచనలతో..

తొలుత వెల్లడించిన షెడ్యూల్ ప్రకారం ఏపీలో మే 5 నుంచి 23వ తేదీ వరకు ఇంటర్ పరీక్షలు జరగాల్సి ఉంది. అయితే కోవిడ్ మహమ్మారి విజృంభిస్తోన్న నేపథ్యంలో దేశంలోని అన్ని రాష్ట్రాల్లో టెన్త్, ఇంటర్మీడియెట్ పరీక్షలను రద్దు చేశారు. అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాత్రం పరీక్షలను నిర్వహించి తీరతామనే ఉద్దేశంతోనే ముందుకుసాగింది. కానీ.. సుప్రీంకోర్టు పరీక్షల నిర్వహణకు సంబంధించి పలు ప్రశ్నలు సంధించింది. అనంతరం సుప్రీంకోర్టు సూచనలతో పరీక్షలను రద్దు చేస్తున్నట్లు జూన్ 25న ప్రకటించింది. 

హైపవర్ కమిటీ ఏర్పాటు..
అనంతరం ఫలితాలు వెల్లడికి సంబంధించి అనుసరించాల్సిన విధానంపై ప్రభుత్వం.. రిటైర్డ్ ఐఏఎస్ అధికారిణి ఛాయారతన్ నేతృత్వంలో హైపవర్ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ సూచనల మేరకు మార్కులను కేటాయించింది. ఇదిలా ఉండగా.. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో మొత్తం 10,32,469 మంది విద్యార్థులు ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల కోసం రిజిస్టర్ చేసుకున్నారు. వీరిలో ఇంటర్ మొదటి సంవత్సరం విద్యార్థులు 5,12,959 మంది కాగా.. సెకండియర్ విద్యార్థులు 5,19,510 మంది ఉన్నారు.
మార్కుల కేటాయింపు ఇలా.. 

  • పదో తరగతి, ఇంటర్ ఫస్టియర్‌లలో సాధించిన మార్కుల ఆధారంగా సెకండియర్ మార్కులను కేటాయించింది. సబ్జెక్టులవారీగా మార్కులతో పాటు మొత్తానికి సరాసరి గ్రేడ్ పాయింట్లను కేటాయించింది. 
  • ప్రస్తుతం ఇంటర్ సెకండియర్ ఫలితాల కోసం ఎదురు చూస్తున్న విద్యార్థులు 2019లో టెన్త్, 2020లో ఇంటర్ ఫస్టియర్ పరీక్షలు రాశారు. ఈ రెండింటినీ కలిపి సెకండియర్ మార్కులను ఖరారు చేయాలని కమిటీ నిర్ణయించింది. 
  • టెన్త్ మార్కులకు 30 శాతం వెయిటేజీ (అత్యధిక మార్కులు వచ్చిన 3 సబ్జెక్టుల సగటును పరిగణలోకి తీసుకుంటారు).. ఇంటర్ ఫస్టియర్‌తో పాటు సాధించిన అన్ని మార్కులను కలిపి 70 శాతం వెయిటేజీ తీసుకొని మొత్తం 100 శాతానికి మార్కులు కేటాయించింది. 
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Thalliki Vandanam Scheme: ఆంధ్రప్రదేశ్‌లో తల్లికి వందనం పథకానికి 78 లక్షల మంది అర్హులు! ఈ ప్రక్రియ పూర్తి చేసిన వారి ఖాతాల్లోనే నగదు జమ!  
ఆంధ్రప్రదేశ్‌లో తల్లికి వందనం పథకానికి 78 లక్షల మంది అర్హులు! ఈ ప్రక్రియ పూర్తి చేసిన వారి ఖాతాల్లోనే నగదు జమ!  
Kailasagir iTrishul: కైలాసగిరిపై ఆధ్యాత్మిక శోభ - 65 అడుగుల భారీ త్రిశూలం ఆవిష్కరణ.. విశాఖ పర్యాటకానికి కొత్త ఆకర్షణ! వీడియో
కైలాసగిరిపై ఆధ్యాత్మిక శోభ - 65 అడుగుల భారీ త్రిశూలం ఆవిష్కరణ.. విశాఖ పర్యాటకానికి కొత్త ఆకర్షణ! వీడియో
Gun Fire At Railway Station: నిడుబ్రోలు రైల్వే స్టేషన్ వద్ద ఉద్రిక్తత.. దొంగలపై కాల్పులు జరిపిన ఆర్పీఎఫ్, జీఆర్పీ పోలీసులు
నిడుబ్రోలు రైల్వే స్టేషన్ వద్ద ఉద్రిక్తత.. దొంగలపై కాల్పులు జరిపిన ఆర్పీఎఫ్, జీఆర్పీ పోలీసులు
Jagan towards Congress: మోదీపై ఘాటు విమర్శలు - వైసీపీ రూట్ మార్చిందా? కాంగ్రెస్ వైపు జగన్ చూపు?
మోదీపై ఘాటు విమర్శలు - వైసీపీ రూట్ మార్చిందా? కాంగ్రెస్ వైపు జగన్ చూపు?

వీడియోలు

“నా లవర్ మెసేజ్‌లు చదివారు”.. యానాంలో యువకుడి హైడ్రామా!
Sachin Amuzed: కర్రల కారును చూసి సచిన్ ఫిదా.. రోడ్డు పక్కన పిల్లాడిని పలకరించిన క్రికెట్ లెజెండ్
Krunal Pandya Injury: గాయపడినా.. RCBని గెలిపించేవరకూ పోరాటం ఆపని కృణాల్ పాండ్యా
Telangana Politics: మరో స్థాయికి వెళ్లిన బూతుల పంచాయతీ.. కంట్రోల్ తప్పిన పొలిటీషియన్స్
MahuaMoitra: మహువా మొయిత్రాకు షాక్.. చోర్ అంటూ నినాదాలు|

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Thalliki Vandanam Scheme: ఆంధ్రప్రదేశ్‌లో తల్లికి వందనం పథకానికి 78 లక్షల మంది అర్హులు! ఈ ప్రక్రియ పూర్తి చేసిన వారి ఖాతాల్లోనే నగదు జమ!  
ఆంధ్రప్రదేశ్‌లో తల్లికి వందనం పథకానికి 78 లక్షల మంది అర్హులు! ఈ ప్రక్రియ పూర్తి చేసిన వారి ఖాతాల్లోనే నగదు జమ!  
LPG Subsidy New Rules: ఎల్పీజీ వినియోగదారులకు బిగ్ అలర్ట్! ఆ మెసేజ్ వచ్చిందా 7 రోజుల్లో మీ సబ్సిడీ పోయినట్టే!
ఎల్పీజీ వినియోగదారులకు బిగ్ అలర్ట్! ఆ మెసేజ్ వచ్చిందా 7 రోజుల్లో మీ సబ్సిడీ పోయినట్టే!
NEET Paper Leak: రద్దు అయిన నీట్ యూజీ 2026 రీ ఎగ్జామ్‌ ఎప్పుడంటే?  మళ్లీ ఫీజు చెల్లించాలా? పాత హాల్‌టికెట్‌ ఉంటే చాలా?
రద్దు అయిన నీట్ యూజీ 2026 రీ ఎగ్జామ్‌ ఎప్పుడంటే?  మళ్లీ ఫీజు చెల్లించాలా? పాత హాల్‌టికెట్‌ ఉంటే చాలా?
TamilNadu Politics: అన్నాడీఎంకే చీలిక క్రెడిట్ విజయ్‌కే -30 మంది ఎమ్మెల్యేలతో భేటీ - బలపరీక్షలో మద్దతుగా ఓటేయడం ఖాయమే !
అన్నాడీఎంకే చీలిక క్రెడిట్ విజయ్‌కే -30 మంది ఎమ్మెల్యేలతో భేటీ - బలపరీక్షలో మద్దతుగా ఓటేయడం ఖాయమే !
Bandi Bhageerath case: కేసు కొట్టి వేయండి..మధ్యంతర బెయిల్ ఇవ్వండి - హైకోర్టులో బండి కుమారుడి పిటిషన్
కేసు కొట్టి వేయండి..మధ్యంతర బెయిల్ ఇవ్వండి - హైకోర్టులో బండి కుమారుడి పిటిషన్
Chiranjeevi: బాసూ... ఆ గ్రేస్ ఏంటి? హ్యాండ్సమ్ లుక్కేంటి? - మెగాస్టార్ చిరంజీవి లేటెస్ట్ ఫోటోషూట్
బాసూ... ఆ గ్రేస్ ఏంటి? హ్యాండ్సమ్ లుక్కేంటి? - మెగాస్టార్ చిరంజీవి లేటెస్ట్ ఫోటోషూట్
Liquor Shops Ban: ఆ మద్యం దుకాణాలు మూసివేయాలి.. సీఎం విజయ్ సంచలన నిర్ణయం, 2 వారాలు గడువు
ఆ మద్యం దుకాణాలు మూసివేయాలి.. సీఎం విజయ్ సంచలన నిర్ణయం, 2 వారాలు గడువు
Gun Fire At Railway Station: నిడుబ్రోలు రైల్వే స్టేషన్ వద్ద ఉద్రిక్తత.. దొంగలపై కాల్పులు జరిపిన ఆర్పీఎఫ్, జీఆర్పీ పోలీసులు
నిడుబ్రోలు రైల్వే స్టేషన్ వద్ద ఉద్రిక్తత.. దొంగలపై కాల్పులు జరిపిన ఆర్పీఎఫ్, జీఆర్పీ పోలీసులు
Embed widget