అన్వేషించండి

AP Inter 2021 Results: ఏపీ ఇంటర్ సెకండియర్ ఫలితాలు విడుదల..

AP Inter 2021 Results: ఏపీ ఇంటర్మీడియట్ సెకండియర్ ఫలితాలు విడుదల అయ్యాయి. రాష్ట్ర విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ఫలితాలను విడుదల చేశారు. ఫీజు చెల్లించిన విద్యార్థులందరినీ పాస్ చేసినట్లు తెలిపారు. 

ఏపీ ఇంటర్మీడియట్ సెకండియర్ ఫలితాలు విడుదల అయ్యాయి. రాష్ట్ర విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ఫలితాలను విడుదల చేశారు. పదో తరగతి మార్కులకు 30 శాతం (అత్యధిక మార్కులు వచ్చిన 3 సబ్జెక్టుల సగటు).. ఇంటర్ ఫస్టియర్ మార్కులకు 70 శాతం వెయిటేజీతో మార్కులను కేటాయించినట్లు వెల్లడించారు. ఫీజు చెల్లించిన విద్యార్థులందరినీ పాస్ చేసినట్లు తెలిపారు. 
ఇంటర్ ఫస్టియర్‌లో ఫెయిలైన, పరీక్షలకు హాజరు కాకపోయిన విద్యార్థులందరినీ కూడా కనీస పాస్ మార్కులతో (35 శాతం) పాస్ చేసినట్లు మంత్రి తెలిపారు. మార్కులతో సంతృప్తి చెందని విద్యార్థులకు పరిస్థితి సద్దుమణిగాక పరీక్షలు నిర్వహిస్తామని ప్రకటించారు. మార్కుల కేటాయింపునకు సంబంధించి ఏర్పాటు చేసిన కమిటీ సూచనల మేరకు ఫలితాలను విడుదల చేశారు.  
ఫలితాలను ఈ వెబ్‌సైట్లలో చూడవచ్చు..
1. http://examsresults.ap.nic.in
2. http://bie.ap.gov.in 
3. https://results.bie.ap.gov.in/
4. https://results.apcfss.in/

5. http://www.manabadi.co.in/

సుప్రీంకోర్టు సూచనలతో..

తొలుత వెల్లడించిన షెడ్యూల్ ప్రకారం ఏపీలో మే 5 నుంచి 23వ తేదీ వరకు ఇంటర్ పరీక్షలు జరగాల్సి ఉంది. అయితే కోవిడ్ మహమ్మారి విజృంభిస్తోన్న నేపథ్యంలో దేశంలోని అన్ని రాష్ట్రాల్లో టెన్త్, ఇంటర్మీడియెట్ పరీక్షలను రద్దు చేశారు. అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాత్రం పరీక్షలను నిర్వహించి తీరతామనే ఉద్దేశంతోనే ముందుకుసాగింది. కానీ.. సుప్రీంకోర్టు పరీక్షల నిర్వహణకు సంబంధించి పలు ప్రశ్నలు సంధించింది. అనంతరం సుప్రీంకోర్టు సూచనలతో పరీక్షలను రద్దు చేస్తున్నట్లు జూన్ 25న ప్రకటించింది. 

హైపవర్ కమిటీ ఏర్పాటు..
అనంతరం ఫలితాలు వెల్లడికి సంబంధించి అనుసరించాల్సిన విధానంపై ప్రభుత్వం.. రిటైర్డ్ ఐఏఎస్ అధికారిణి ఛాయారతన్ నేతృత్వంలో హైపవర్ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ సూచనల మేరకు మార్కులను కేటాయించింది. ఇదిలా ఉండగా.. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో మొత్తం 10,32,469 మంది విద్యార్థులు ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల కోసం రిజిస్టర్ చేసుకున్నారు. వీరిలో ఇంటర్ మొదటి సంవత్సరం విద్యార్థులు 5,12,959 మంది కాగా.. సెకండియర్ విద్యార్థులు 5,19,510 మంది ఉన్నారు.
మార్కుల కేటాయింపు ఇలా.. 

  • పదో తరగతి, ఇంటర్ ఫస్టియర్‌లలో సాధించిన మార్కుల ఆధారంగా సెకండియర్ మార్కులను కేటాయించింది. సబ్జెక్టులవారీగా మార్కులతో పాటు మొత్తానికి సరాసరి గ్రేడ్ పాయింట్లను కేటాయించింది. 
  • ప్రస్తుతం ఇంటర్ సెకండియర్ ఫలితాల కోసం ఎదురు చూస్తున్న విద్యార్థులు 2019లో టెన్త్, 2020లో ఇంటర్ ఫస్టియర్ పరీక్షలు రాశారు. ఈ రెండింటినీ కలిపి సెకండియర్ మార్కులను ఖరారు చేయాలని కమిటీ నిర్ణయించింది. 
  • టెన్త్ మార్కులకు 30 శాతం వెయిటేజీ (అత్యధిక మార్కులు వచ్చిన 3 సబ్జెక్టుల సగటును పరిగణలోకి తీసుకుంటారు).. ఇంటర్ ఫస్టియర్‌తో పాటు సాధించిన అన్ని మార్కులను కలిపి 70 శాతం వెయిటేజీ తీసుకొని మొత్తం 100 శాతానికి మార్కులు కేటాయించింది. 
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Pithapuram Politics: పిఠాపురం శాశ్వ‌త ఎమ్మెల్యేగా ప‌వ‌న్‌ కళ్యాణ్.. ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ వ్యాఖ్యలకు కారణమిదే!
పిఠాపురం శాశ్వ‌త ఎమ్మెల్యేగా ప‌వ‌న్‌ కళ్యాణ్.. ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ వ్యాఖ్యలకు కారణమిదే!
Rains In AP, Telangana: ఏపీ, తెలంగాణలో నేటి నుంచి వర్షాలు, కొన్నిచోట్ల వడగళ్ల వానలు! పిడుగుల వార్నింగ్
ఏపీ, తెలంగాణలో నేటి నుంచి వర్షాలు, కొన్నిచోట్ల వడగళ్ల వానలు! పిడుగుల వార్నింగ్
ఏపీలో LPG కనెక్షన్ల తాజా పరిస్థితిపై కీలక ప్రకటన విడుదల చేసిన ప్రభుత్వం
ఏపీలో LPG కనెక్షన్ల తాజా పరిస్థితిపై కీలక ప్రకటన విడుదల చేసిన ప్రభుత్వం
Deputy CM Pawan Kalyan: గిరిపుత్రుల గడపకు ఉప ముఖ్యమంత్రి - అల్లూరి జిల్లాలో పవన్ కళ్యాణ్ ‘మాటా-మంతి’
గిరిపుత్రుల గడపకు ఉప ముఖ్యమంత్రి - అల్లూరి జిల్లాలో పవన్ కళ్యాణ్ ‘మాటా-మంతి’

వీడియోలు

Pawan Kalyan Paderu Tour | పాడేరులో పర్యటించి గిరిజనులతో గడిపిన పవన్ కళ్యాణ్ | ABP Desam
Yuvraj Singh Mentoring Rishabh Pant | స్పైడీ రిషభ్ పంత్ కు అండగా యువరాజ్ సింగ్ | ABP Desam
RCB Acquisition Race | కోహ్లీ కోసం 17వేల కోట్లు పెట్టడానికైనా ఆ సంస్థ సిద్ధం | ABP Desam
Salman Agha Run out Controversy | బాల్ ఇద్దామనుకున్నాడు..రనౌట్ అయిపోయాడు | ABP Desam
MS Dhoni Crafting Bat | ధోని క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదుగా | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pithapuram Politics: పిఠాపురం శాశ్వ‌త ఎమ్మెల్యేగా ప‌వ‌న్‌ కళ్యాణ్.. ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ వ్యాఖ్యలకు కారణమిదే!
పిఠాపురం శాశ్వ‌త ఎమ్మెల్యేగా ప‌వ‌న్‌ కళ్యాణ్.. ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ వ్యాఖ్యలకు కారణమిదే!
Rains In AP, Telangana: ఏపీ, తెలంగాణలో నేటి నుంచి వర్షాలు, కొన్నిచోట్ల వడగళ్ల వానలు! పిడుగుల వార్నింగ్
ఏపీ, తెలంగాణలో నేటి నుంచి వర్షాలు, కొన్నిచోట్ల వడగళ్ల వానలు! పిడుగుల వార్నింగ్
ఏపీలో LPG కనెక్షన్ల తాజా పరిస్థితిపై కీలక ప్రకటన విడుదల చేసిన ప్రభుత్వం
ఏపీలో LPG కనెక్షన్ల తాజా పరిస్థితిపై కీలక ప్రకటన విడుదల చేసిన ప్రభుత్వం
Lavanya Tripathi : టార్గెట్ చేసి వేధించారు - ఒంటరిగా రూంలో కూర్చుని ఏడ్చేశా... మెగా కోడలి లైఫ్‌లో షాకింగ్ ఘటన
టార్గెట్ చేసి వేధించారు - ఒంటరిగా రూంలో కూర్చుని ఏడ్చేశా... మెగా కోడలి లైఫ్‌లో షాకింగ్ ఘటన
కానిస్టేబుల్ ఆత్మహత్యాయత్నం ఓ డ్రామా.. వాస్తవాలను వెల్లడించిన హైదరాబాద్ పోలీస్ శాఖ
కానిస్టేబుల్ ఆత్మహత్యాయత్నం ఓ డ్రామా.. వాస్తవాలను వెల్లడించిన హైదరాబాద్ పోలీస్ శాఖ
Jeevan Reddy To joins BRS: బీఆర్ఎస్‌లో చేరే యోచనలో కాంగ్రెస్ సీనియర్ నేత - ఫిరాయింపు ఎమ్మెల్యేతో పొసగకపోవడం వల్లే!
బీఆర్ఎస్‌లో చేరే యోచనలో కాంగ్రెస్ సీనియర్ నేత - ఫిరాయింపు ఎమ్మెల్యేతో పొసగకపోవడం వల్లే!
GoldJewelry: బంగారం కొనే ముందు ఈ నక్షత్రాలు చూడండి! శుభ ఫలితాలనిచ్చే ముహూర్తాలు, రహస్యాలు తెలుసుకోండి!
బంగారం కొనే ముందు ఈ నక్షత్రాలు చూడండి! శుభ ఫలితాలనిచ్చే ముహూర్తాలు, రహస్యాలు తెలుసుకోండి!
Deputy CM Pawan Kalyan: గిరిపుత్రుల గడపకు ఉప ముఖ్యమంత్రి - అల్లూరి జిల్లాలో పవన్ కళ్యాణ్ ‘మాటా-మంతి’
గిరిపుత్రుల గడపకు ఉప ముఖ్యమంత్రి - అల్లూరి జిల్లాలో పవన్ కళ్యాణ్ ‘మాటా-మంతి’
Embed widget