అన్వేషించండి

Margadarsi Case : రిజిస్ట్రార్ ఆఫ్ చిట్స్‌కు మాత్రమే సోదాలు చేసే చాన్స్ - మార్గదర్శి కేసులో ఏపీ హైకోర్టు కీలక ఉత్తర్వులు

మార్గదర్శి చిట్ ఫండ్స్‌లో సీఐడీ సోదాలు చేయవద్దని ఏపీ హైకోర్టు ఆదేశించింది. చిట్స్ రిజిస్ట్రార్ తనిఖీలు చేయాల్సి వస్తే 46-ఎ నిబంధన అనుసరించాలని ఉత్తర్వులు జారీ చేసింది.


Margadarsi Case :   మార్గదర్శి ఆఫీసుల్లో చట్టం ప్రకారం రిజిస్ట్రార్ ఆఫ్ చిట్స్ మాత్రమ తనిఖీలు చేయాలని.. అది కూడా ఆఫీసు పని వేళల్లోనే చేయాలని హైకోర్టు ఆదేశించింది. సీఐడీతో పాటు ఇతర శాఖల అధికారులు తనిఖీలు చేయకూడదని స్పష్టం చేసంది.  చిట్స్ రిజిస్ట్రార్ తనిఖీలు చేయాల్సి వస్తే   46-ఎ నిబంధన అనుసరించాలని ఉత్తర్వులు జారీ చేసింది.  రోజువారీ కార్యకలాపాలకు ఆటంకం కల్పించవద్దని హైకోర్టు ఉత్తర్వులు వెలువరించింది.  చందాదారులకు ఫోన్ చేసి వేధింపులు, బెదిరింపులకు పాల్పడకూడదని హైకోర్టు తెలిపింది. మార్గదర్శి చిట్‌ ఫండ్స్‌లో వివిధ ప్రభుత్వ శాఖలు తాజాగా తనిఖీలు చేయడాన్ని మార్గదర్శి యాజమాన్యం హైకోర్టులో సవాల్ చేసింది. ఈ పిటిషన్‌పై వాదనల అనంతరం తీర్పును రిజర్వ్ చేసిన హైకోర్టు తీర్పును వెలువరించింది. 

ఏపీ ప్రభుత్వం మొత్తం 37 శాఖల్లో ప్రస్తుతం చేస్తున్న తనిఖీలను సవాల్ చేస్తూ మార్గదర్శి అధీకృత సంతకందారు పి.రాజాజీ దాఖలు చేసిన పిటిషన్‌ను జస్టిస్ ఎన్.జయసూర్య నేతృత్వంలోని సింగిల్ జడ్జి బెంచ్   విచారించింది. మార్గదర్శి తనిఖీల్లో సీఐడీ, స్టాంపులు, నిబంధనలు తదితర అధికారులు పాల్గొన్నారు.  తనిఖీల పేరుతో మార్గదర్శి ఉద్యోగులకు విధుల నిర్వహణలో అధికారులు అడ్డంకులు కల్పిస్తున్నారని మార్గదర్శి తరపు న్యాయవాదులు వాదనల సందర్భంగా కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.   రిజిస్ట్రార్, డిప్యూటీ రిజిస్ట్రార్ మరియు అసిస్టెంట్ రిజిస్ట్రార్ మాత్రమే శాఖలను తనిఖీ చేయడానికి , రికార్డులను ధృవీకరించడానికి అధికారం కలిగి ఉన్నారని కోర్టు దృష్టికి తీసుకెల్లారు.                                   

చిట్ ఫండ్ చట్టంలోని సెక్షన్ 46 (ఎ) ప్రకారం రికార్డులను తనిఖీ చేసే అధికారం రిజిస్ట్రార్‌కు ఉందని ప్రభుత్వం కూడా వాదించింది.  మార్గదర్శి శాఖల్లో పనికి అంతరాయం కలిగిందన్న ఆరోపణల్లో ఎలాంటి నిజం లేదని ప్రభుత్వ  న్యాయవాది  సుమన్ కోర్టుకు తెలిపారు.    శాఖలకు తనిఖీకి సంబంధించిన ముందస్తు సమాచారం ఏమైనా ఇస్తున్నారా, పనివేళలకు మించి తనిఖీ కొనసాగుతుందా అని కోర్టు ప్రశ్నించింది.  సోమవారం  ఇరుపక్షాల వాదనలను విన్న తర్వాత, కోర్టు తన తీర్పును రిజర్వ్ చేస్తున్నట్లు ప్రకటించింది మరియు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసే వరకు శాఖలను తనిఖీ చేయవద్దని మరియు రికార్డులను ధృవీకరించవద్దని అధికారులకు సూచించాలని ప్రభుత్వ ప్లీడర్‌కు మౌఖిక ఆదేశాలు ఇచ్చింది. బుధవారం ఈ మేరకు తీర్పు ప్రకటించింది.               

హైకోర్టు ఆదేశాలతో ఇక సీఐడీ మార్గదర్శి కేసులో జోక్యం చేసుకునే అవకాశం ఉండదని భావిస్తున్నారు. ఇప్పటి వరకూ సీఐడీనే ఈ కేసులో యాక్టివ్ గా ఉంటోంది. ఖాతాదారులతో ఫిర్యాదులు చేయించాలని తామే ప్రోత్సహిస్తున్నామని సీఐడీ చీఫ్ సంజయ్ గత ఆదివారం నిర్వహించిన ప్రెస్ మీట్ లో చెప్పారు. ఖాతాదారులతో మాట్లాడుతున్నట్లుగా కూడా చెప్పడంతో.  ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే వేధిస్తోందని.. కోర్టులో మార్గదర్శి తరపు లాయర్లు వాదించారు. ఇప్పటికే చిట్ గ్రూపులు నిలిపివేస్తామన్న నోటీసులను.. తెలంగాణ హైకోర్టు నిలుపుదల చేసింది. 

 

 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

AP MLA son arrested in drug case: హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
India News: ఈ పరిస్థితుల్లో వెనిజులాకు వెళ్లవద్దు.. పౌరులకు భారత ప్రభుత్వం అడ్వైజరీ
ఈ పరిస్థితుల్లో వెనిజులాకు వెళ్లవద్దు.. పౌరులకు భారత ప్రభుత్వం అడ్వైజరీ
Bhogapuram Airport: భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
Constable Kanakam Season 2 : వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...

వీడియోలు

Indian Team Announced for Nz ODI Series | న్యూజిలాండ్ వన్డే సిరీస్ కు భారత జట్టు ప్రకటన | ABP Desam
పక్కటెముక విరగ్గొట్టుకున్నాడు.. షాక్‌లో గుజరాత్ ఫ్యాన్స్
ముస్తాఫిజుర్‌ ఐపీఎల్ ఆడితే మ్యాచ్‌లు జరగనివ్వం: షారూఖ్‌కు హిందూ సంఘాల వర్నింగ్
2026లో భారత్, పాకిస్తాన్ ఎన్నిసార్లు తలపడతాయంటే..
టీ20 వరల్డ్ కప్ ఎవ్వరూ చూడరు: మాజీ ప్లేయర్ అశ్విన్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP MLA son arrested in drug case: హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
India News: ఈ పరిస్థితుల్లో వెనిజులాకు వెళ్లవద్దు.. పౌరులకు భారత ప్రభుత్వం అడ్వైజరీ
ఈ పరిస్థితుల్లో వెనిజులాకు వెళ్లవద్దు.. పౌరులకు భారత ప్రభుత్వం అడ్వైజరీ
Bhogapuram Airport: భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
Constable Kanakam Season 2 : వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
CM Revanth Reddy: జూరాల నుంచి రోజుకు 2 టీఎంసీల నీటిని మళ్లించి, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు నిర్మాణం
జూరాల నుంచి రోజుకు 2 టీఎంసీల నీటిని మళ్లించి, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు నిర్మాణం
Priyanka Gandhi Son Engagement: గాంధీ కుటుంబంలో పెళ్లి వేడుక.. వధువు ధరించే చీరకు ఉన్న ఈ ప్రత్యేకత తెలుసా !
గాంధీ కుటుంబంలో పెళ్లి వేడుక.. వధువు ధరించే చీరకు ఉన్న ఈ ప్రత్యేకత తెలుసా !
Tata Sierra వర్సెస్ Kia Seltos.. మిడ్ సైజ్ లో ఏ SUV బెటర్, కొనేముందు ఇవి తెలుసుకోండి
Tata Sierra వర్సెస్ Kia Seltos.. మిడ్ సైజ్ లో ఏ SUV బెటర్, కొనేముందు ఇవి తెలుసుకోండి
Telangana Assembly: శ్రీధర్ బాబు సీఎం సీట్లో కూర్చోవాలి - మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు పొగడ్తల వర్షం
శ్రీధర్ బాబు సీఎం సీట్లో కూర్చోవాలి - మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు పొగడ్తల వర్షం
Embed widget